ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ గత కొద్ది రోజులుగా ఎక్కువగా వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతున్న సాంకేతిక పరిజ్ఞానం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ). దీనివల్ల ఉపాధి అవకాశాలు తగ్గుతాయని, మానవాళికి ముప్పుగా మారుతుందని పలువురు నిపుణులు ఇప్పటికే వెల్లడించారు. ఇదంతా ఒకవైపు.
మరో వైపు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో అద్భుతాలు క్రియేట్ చేయగలమని అంటున్నారు. ఏఐ టూల్స్ ను ఉపయోగించి, చాలా మంది ఇప్పటికే అద్భుతమైన ఫోటోలను క్రియేట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఏఐ ఎడిట్ ట్రెండ్ కొనసాగుతోంది. తాజాగా ఒక స్టార్ హీరో ఫోటోను ఏఐ టూల్ తో క్రియేట్ చేశారు. ఆ హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం..
ఇటీవల కాలంలో ఏఐ టూల్స్ ను ఉపయోగించి, దేవుళ్ళ ఫోటోలను, సినీ సెలబ్రిటీల ఫొటోలను ఎడిట్ చేసి, సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అవి క్షణాల్లో వైరల్ గా మారుతున్నాయి. నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా ప్రముఖ విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్ శ్రీనివాస్ మోహన్ ఆకాశం, సముద్రం, పడవలతో కూడిన ఫోటోని టాలీవుడ్ స్టార్ హీరో ముఖంలా రూపొందించారు. ఆ హీరో మరెవరో కాదు, యంగ్ టైగర్ ఎన్టీఆర్.
ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ‘దేవర’ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వికపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం కోస్తా ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కుతోంది. తాజాగా శ్రీనివాస్ మోహన్ రెండు ఫోటోలను ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు.
ఆ పోస్ట్ కు ప్లేయింగ్ విత్ ఏఐ ఇల్యూజన్ టూల్ అని పెట్టాడు. సముద్ర తీరాన ఉన్న పడవలతో ఎన్టీఆర్ ఫేస్ ను డిజైన్ చేశాడు. క్షణాల్లోనే ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ ఫోటోలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. మాస్, టెర్రిఫిక్ వంటి పదాలు సరిపోవేమో దేవర అని కామెంట్స్ చేస్తున్నారు. ‘ఫోటోలే ఇంత ఇంట్రెస్టింగ్ గా ఉంటే మూవీ ఏ రేంజ్ లో ఉంటుంది?’ అని నెట్టింట్లో అభిమానులు చర్చించుకుంటున్నారు.
Playing with Ai illusion tool. @tarak9999 pic.twitter.com/sOLl05lcqE
— Srinivas Mohan (@srinivas_mohan) September 21, 2023

తెలుగు స్టార్ హీరోల సినిమాలకి రీరిలీజ్ లో మంచి రెస్పాన్స్ వస్తూ ఉండటంతో ఫ్యాన్స్ స్పెషల్ షోలుగా రీరిలీజ్ చేయడం మొదలుపెట్టారు. తెలుగులో డబ్ అయిన సినిమాలకు కూడా రీరిలీజ్ లో రెస్పాన్స్ వచ్చింది. కోలీవుడ్ హీరో సూర్య నటించిన సూర్య సన్నాఫ్ కృష్ణన్, ధనుష్ నటించిన రఘువరన్ బీటెక్ సినిమాలకు రీరిలీజ్ లో అద్భుతమైన ఆదరణ వచ్చింది. దాంతో ఈ రోజు కల్ట్ క్లాసిక్ 7జి బృందావన్ కాలనీ రీరిలీజ్ చేశారు.
2004 లో రిలీజ్ అయిన ఈ చిత్రానికి సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో రవికృష్ణ, సోనియా అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటించారు. సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మూవీతో పాటు, అందులోని సాంగ్స్ కు అప్పటి యూత్ ఫిదా అయ్యారు. తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన ఈ మూవీ తెలుగులోనూ సంచలన విజయాన్ని సాధించింది.
కల్ట్ క్లాసిక్ మూవీగా నిలిచిన ఈ సినిమాని ఇప్పటికి టీవీలలో ప్రసారం అయితే చూడటానికి ఇష్టపడతారు. 7జి బృందావన్ కాలనీ రీరిలీజ్ కోసం మూవీ యూనిట్ ప్రమోషన్లు చేసింది. హీరోయిన్ సోనియా అగర్వాల్ తో పాటు చిత్ర యూనిట్ ప్రెస్ మీట్లు కూడా నిర్వహించారు. ఇక ఈ మూవీ రీరిలీజ్ పై నెట్టింట్లో పలు మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఆ మీమ్స్ ను మీరు చూసేయండి..
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
సూపర్ స్టార్ రజినీకాంత్, రమ్యకృష్ణ, తమన్నా, ప్రధాన పాత్రలలో నటించిన సినిమా జైలర్. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఆగస్టు 10న విడుదల అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. భారీ కలెక్షన్స్ రాబట్టింది. రజినీకాంత్ కెరీర్లో ఎన్నో చిత్రాలలో నటించారు. అయితే జైలర్లో రజనీకాంత్ హీరోగా కాకుండా తండ్రి పాత్రలో నటించి ఆశ్చర్యపరిచారు.
ఈ మూవీలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్ అతిథి పాత్రలో నటించి, మెప్పించారు. అయితే దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ మూవీని తెలుగు టాప్ హీరోతో తెరకెక్కించాలని అనుకున్నారట. ఆ హీరో మరెవరో కాదు, మెగాస్టార్ చిరంజీవి.
నెల్సన్ బీస్ట్ మూవీ సమయంలో మెగాస్టార్ చిరంజీవికి జైలర్ కథను చెప్పాడట. కథ చిరంజీవి బాగా నచ్చిందట. కానీ ఇటువంటి స్టోరీలో ఫ్యాన్స్ తనను చూడగలరా? రీ ఎంట్రీ నుండి కమర్షియల్ చిత్రాలే చేస్తున్నాను. ఈ టైమ్ లో ఇటువంటి స్టోరీతో రిస్క్ అని జైలర్ మూవీ చెయ్యడానికి నిరాకరించారంట. ఆ తరువాత నెల్సన్ ఈ స్టోరీని రజినీకాంత్ ని చెప్పడం, ఆయనకీ బాగా నచ్చడంతో వెంటనే ఒప్పుకున్నారు. జైలర్ మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యి, అక్కడ కూడా రికార్డులను క్రియేట్ చేస్తోంది.
హీరోయిన్ అమీ జాక్సన్ 2010 లో రిలీజ్ అయిన ‘మద్రాసపట్టినం’ అనే తమిళ మూవీతో హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ మూవీ విజయం సాధించడంతో వరుస అవకాశాలు వచ్చాయి. తక్కువ కాలంలోనే క్రేజ్, స్టార్ డమ్ సంపాదించుకుంది. ఐ, 2.ఓ, తేరి లాంటి సినిమాలలో నటించింది. ఆ తరువాత ఎవడు మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. కనిపించింది కొంతకాలం అయినా వరుసగా స్టార్ హీరోలతో నటించింది.
రజినికాంత్, విజయ్ దళపతి, విక్రమ్, ధనుష్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో నటించింది. 2018లో రిలీజ్ అయిన కన్నడ మూవీ ‘ది విలన్’ లో శివ రాజ్కుమార్, సుదీప్లతో కలిసి అమీ జాక్సన్ నటించింది. శంకర్ చిత్రాలలో నటించింది. కానీ అవి అంతగా కలిసిరాలేదు. రోబో 2.0 తరువాత ఆమె సినిమాలకు దూరం అయ్యింది. కానీ తన వ్యక్తిగత జీవితంతో పెళ్లి అవకుండానే తల్లి కావడం, అతనితో బ్రేకప్, మళ్లీ లవ్ లో పడటం లాంటి వాటితో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యింది.
కొడుకుతో, తన లవర్ తో సంతోషంగా గడుపుతోంది. వాటికి సంబంధించిన ఫోటోలను తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. చాలా కాలం తరువాత ‘మిషన్ చాప్టర్ 1: అచ్చమ్ ఎన్బతు ఇల్యాయే’ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీలో అరుణ్ విజయ్ హీరో గా నటిస్తున్నారు. తాజాగా అమీ లండన్ ఫ్యాషన్ వీక్లో రెడ్ కలర్ దుస్తుల్లో హాజరైంది. దానికి సంబంధించిన ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. అందులో ఆమె లుక్ కనిపించి అందరికి షాక్ ఇచ్చింది. వాటిని చూసిన నెటిజెన్లు కామెంట్స్ పెడుతున్నారు.
భారత్ టెర్రరిస్ట్ గా ప్రకటించిన ఖలిస్తాన్ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ జూన్ 18న బ్రిటిష్ కొలంబియాలో ఒక గురుద్వార్ బయట హత్య చేయబడ్డాడు. ఇద్దరు వ్యక్తులు హర్దీప్ సింగ్ నిజ్జర్ పై కాల్పులు జరపడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. అయితే నిజ్జర్ ను ఇండియాకు చెందిన ప్రభుత్వ ఏజెన్సీలే మర్డర్ చేశాయని, ఈ హత్య పై దర్యాప్తు జరపబోతున్నామని కెనడా పిఎం జస్టిన్ ట్రూడో ఇటీవల ప్రకటించారు.
ట్రూడో చేసిన ఆరోపణలను ఇండియా తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో కెనడాలో ఉన్న భారత రాయబారిని కెనడా, ఇండియాలో ఉన్న కెనడా రాయబారిని భారత్ దేశం విడిచి వెళ్లిపోవాలని ఆర్డర్ వేశాయి. గురువారం నుంచి కెనడా దేశస్థులు ఇండియా రావడానికి వీసాల జారిని నిలిపివేస్తున్నట్లు భారత్ ప్రకటించింది.
మరోవైపు ఖలిస్థానీ అనుకూల సంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్ భారతీయులకు హెచ్చరికలు జారీ చేసింది. కెనడాలో నివసించే హిందువులు వెంటనే భారత్ కు వెళ్లిపోవాలని హెచ్చరికలు చేసింది. కెనడాలోని హిందువులకు ఒక అల్టిమేటంను కూడా జారీ చేసింది. బుధవారం నాడు రాత్రి కెనడాలో జరిగిన గ్యాంగ్ వార్ లో పంజాబ్ కు చెందిన గ్యాంగ్ స్టర్ సుఖ్దూల్ సింగ్ అలియాస్ సుఖా దునెకె చనిపోయాడు. ఈ నేపథ్యంలోనే కెనడా వీసాలను నిలిపివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
అతడే శ్రీమన్నారాయణ, 777 చార్లీ సినిమాల ద్వారా తెలుగువారికి చేరువైన కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి. లేటెస్ట్ గా ఆయన నటించిన ‘సప్త సాగర దాచే ఎల్లో’ కన్నడలో సంచలన విజయం సాధించింది. ఈ మూవీని ‘సప్త సాగరాలు దాటి’ టైటిల్ తో తెలుగులో రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీ ప్రేమకథతో తెరకెక్కింది. రక్షిత్ శెట్టి హీరోగా నటించగా, రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటించి, మెప్పించింది.
రుక్మిణీ న్యాచురల్ లుక్స్కి కన్నడ యువత ఫిదా అయ్యింది. ఈ మూవీ పోస్టర్స్, పాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ మూవీతో రుక్మిణీకి కన్నడ ఇండస్ట్రీలో పెద్ద సినిమాలలో అవకాశాలు వచ్చాయి. రుక్మిణీ వసంత్ గురించి నెటిజెన్లు నెట్టింట్లో తెగ వెతుకుతున్నారు. రుక్మిణి వసంత్ 1994లో కర్ణాటకలోని బెంగళూరులో డిసెంబరు 10న జన్మించింది. ఆమె తండ్రి కల్నల్ వసంత్ వేణుగోపాల్. భారతదేశ అత్యున్నత సైనిక పురస్కారం అశోక చక్రను కర్నాటకలో పొందిన తొలి వ్యక్తిగా నిలిచారు.
ఆమె బెంగళూరులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆ తరువాత లండన్ రాయల్ అకాడమీ ఆఫ్ డ్రమాటిక్ ఆర్ట్స్ లో పట్టా పొందింది. ఆ తరువాత కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టి, 2019లో బీర్బల్ ట్రైలాజీ కేసు 1′ హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టింది. ఈ ఏడాది రిలీజ్ అయిన సప్త సాగర దాచే ఎల్లో ఆమె రెండవ సినిమా. ఇక త్వరలో తెలుగు ఆడియెన్స్ ముందుకు రానుంది. ఆమె నటన, లుక్స్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటే తెలుగులో కూడా పాపులారిటీ వస్తుంది. మరి సప్త సాగరాలు దాటి మూవీతో రుక్మిణీ వసంత్ ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
1. విజయ్ ఆంటోనీ:
2. అమీర్ ఖాన్:
3. కాజోల్:
4. గోవిందా:
5. ప్రకాష్ రాజ్:
6. ప్రభుదేవా:
7. శిల్పాశెట్టి:
తిరుమల నడక దారిలో పలు చోట్ల అమర్చిన కెమెరాల సహాయంతో చిరుతల కదలికల్ని అధికారులు గమనిస్తూ ఉన్నారు. చిరుతలను పట్టుకోవడం కోసం పలు చోట్ల ట్రాప్ ఏర్పాటు చేశారు. అలా ఐదు చిరుతలను పట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో చిరుత పులి, అలిపిరి నడక దారిలో లక్ష్మీ నరసింహా స్వామి గుడి, 2,850వ మెట్టు వద్ద చిన్నారి లక్షిత పై దాడి చేసిన స్థలంలోనే చిక్కినట్టు తెలుస్తోంది. అధికారులు రెండున్నర నెలల్లో ఆరు చిరుతలను పట్టుకున్నారు.
ఈ చిరుత పులిని కూడా తిరుపతి జూకు తరలించారు. గత వారం రోజులుగా ఈ చిరుత కదలికలను కెమెరాల ద్వారా గమనిస్తూ ట్రాప్ చేశామని అటవీశాఖ ఆఫీసర్లు తెలిపారు. ఈ చిరుతతో ఇప్పటివరకు మొత్తం 6 చిరుతల్ని బంధించారు. వీటిని తిరుపతి జూకు అటవీశాఖ ఆఫీసర్లు తరలించారు. అయితే 3 చిరుతల్ని అధికారులు అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ప్రస్తుతం జూలో 3 చిరుతలు ఉన్నాయని తెలుస్తోంది.
తిరుమల నడక దారిలోనే కాకుండా, చిరుత సంచారం తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలో, తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో కనిపించడం కలకలం సృష్టించింది. సోమవారం నాడు మధ్యాహ్న సమయంలో ఘాట్ రోడ్డులో భక్తులు చిరుతను చూసి వణికిపోయారు. వెంటనే వారు టీటీడీ ఆఫీసర్లకు సమాచారం అందించారు. ఇక ఎస్వీ యూనివర్శిటీలో చిరుత కనిపించింది. దానిని సీసీ కెమెరా ద్వారా గుర్తించారు.
కర్ణాటక రాష్ట్రంలోని ఎన్నో థియేటర్లు ఉన్నాయి. వాటిలో ప్రసిద్ది చెందిన థియేటర్లలో బెంగళూరులోని మరతహళ్లి రోడ్ లో ఉన్న తులసి థియేటర్ ఒకటి. ఈ థియేటర్ ప్రారంభించి దాదాపు యాబై సంవత్సరాలు అవుతోంది. ఎన్నో వేల సినిమాలు ఇక్కడ ప్రదర్శితం అయ్యాయి. ఇప్పటిదాకా లక్షలాది ప్రేక్షకులు ఈ థియేటర్ లో సినిమాలు చూసి ఆనందించించారు. ఇందులో కేవలం కన్నడ సినిమాలు మాత్రమే కాకుండా వందల సంఖ్యలో తమిళ మరియు తెలుగు సినిమాలు ప్రదర్శితం అయ్యాయి.
కన్నడ ప్రేక్షకులు తమ సినిమాలు ఈ థియేటర్ లో చూసి ఎంత ఆనందిస్తారో, అదే విధంగా కర్ణాటకలో నివసించే తెలుగువారు కూడా తులసి థియేటర్ లో తెలుగు సినిమాలను చూసి ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా తెలుగు స్టార్ హీరోల సినిమాలను చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తారు. కొన్ని నెలల క్రితం రీరిలీజ్ అయిన తెలుగు సినిమాలకు వెళ్ళిన ఆడియెన్స్ సెలెబ్రేట్ చేసుకున్నారు. వాటికి సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి.
అయితే ఎన్నో ఏళ్ల నుండి ఉన్న తులసి థియేటర్ ను శాశ్వతంగా మూసి వేశారు. దానికి కారణం అక్కడి భూమి విలువ 5 రెట్లు పెరగడమే అని తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన కర్నాటక ప్రజలు, అక్కడ ఉండే తెలుగు, తమిళ వాళ్ళు కూడా ఈ థియేటర్ తో తమకి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా ద్వారా వారి అభిప్రాయాన్ని షేర్ చేస్తున్నారు. ఈ థియేటర్ ని బాగా మిస్ అవుతామని కామెంట్స్ చేస్తున్నారు.
పూర్వకాలంలో వివాహ వ్యవస్థ లేదు. స్త్రీ, పురుషులు స్వతంత్రంగా జీవించేవారట. మహాభారతంలో వివాహం ఎలా వచ్చింది అనే కథ ఉంది. ఉద్దాలక మహర్షి కొడుకు శ్వేతకేతు మహర్షి. ఒకసారి ఆయన తన ఆశ్రమంలో ఉండగా, అప్పుడే అక్కడికి వచ్చిన ఒక పురుషుడు తన తల్లి చెయ్యి పట్టుకున్నాడు. అది చూసిన శ్వేతకేతు మహర్షికి ఆగ్రహం వచ్చింది. అయితే ఈ నియమం పూర్వ కాలం నుంచి వస్తోందని అతనికి తండ్రి ఉద్దాలక మహర్షి తెలిపారు.
శ్వేతకేతు మహర్షి ఈ నియమాన్ని వ్యతిరేకిస్తూ, ఇలా జీవించడం జంతువులలా జీవించడం వంటిదే అని, భార్య భర్తకు విధేయంగా ఉండే విధంగా వివాహ ధర్మాలను రూపొందించాడు. వివాహం తర్వాత వేరే పురుషుడి వద్దకు వెళ్లే భార్యకు పాపం వస్తుందని, అదేవిధంగా భార్యను వదిలి పర స్త్రీల దగ్గరికి వెళ్లే పురుషుడు పాప ఫలితాన్ని పొందాల్సి వస్తుందని తెలిపాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు కొనసాగుతున్న దాంపత్య వ్యవస్థకు శ్వేతకేతు మహర్షి రూపొందించిన వివాహ ధర్మాలే మూలమని చెబుతుంటారు.
చరిత్ర ప్రకారం, ప్రపంచంలో 4 శతాబ్దాల కన్నా ముందు, దాదాపు 4,350 ఏళ్ల క్రితం మెసొపొటేమియాలో తొలిసారిగా వివాహం జరిగినట్లు ఆధారాలున్నాయని తెలుస్తోంది. మెసొపొటేమియాలో స్త్రీ, పురుషులు మొదటిసారిగా పెళ్లి వేడుకను జరుపుకున్నారట.