సీనియర్ నటి తులసి తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఒకప్పుడు హీరోయిన్ గా రాణించిన తులసి, సెకండ్ ఇన్నింగ్స్ లో టాప్ హీరోల చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతున్నారు.
ఇక ఇప్పటి స్టార్ హీరోలకు అమ్మ క్యారెక్టర్ లో నటిస్తూ, తెలుగు ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్నారు. ప్రభాస్ కు మదర్ గా డార్లింగ్ సినిమాలో తులసి చేసిన పాత్రకు ఎంత గుర్తింపు వచ్చిందో తెలిసిందే. అయితే తాజాగా హీరో నాని పెట్టిన ఇన్ స్టా పోస్ట్ కు సీనియర్ నటి తులసి కామెంట్ చేసింది. దీని పై నెటిజెన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
నటి తులసి బాలనటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆమె తల్లి, సావిత్రి, అంజలి దేవిలకు స్నేహితురాలు. వారు తరచూ తులసి ఇన్డీటికి వస్తుండేవారు. ఆ క్రమంలో తులసికి బాలనటిగా అవకాశం వచ్చింది. ఆమె చాలా సినిమాలలో బాలనటిగా నటించారు. శంకారాభరణం సినిమాతో తులసి మంచి గురింపు వచ్చింది. జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ముద్ద మందారం మూవీతో హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత నాలుగు స్థంబాలాట, శుభలేఖ, మంత్రిగారి వియ్యంకుడు, ప్రేమించు పెళ్ళాడు వంటి సినిమాలలో సెకండ్ హీరోయిన్ గా నటించింది.
శుఖలేఖ మూవీ సూపర్ హిట్ అయ్యి, శుభలేఖ సుధాకర్, తులసిల పెయిర్ కు మంచి పేరు వచ్చింది. దాంతో అదే తరహాలో తులసికి వరుస అవకాశాలు వచ్చాయి. అలా సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణం రాజు, శోభన్ బాబు, మురళీమోహన్, చంద్రమోహన్, రాజేంద్రప్రసాద్ వంటి హీరోల సినిమాలలో నటించి ఆకట్టుకున్నారు. ఆమె తెలుగులో మాత్రమే కాకుండా మలయాళ, తమిళ చిత్రాలలో కూడా నటించారు. పెళ్లి చేసుకున్న తరువాత సినిమాలకు దూరం అయ్యారు.
2010 లో ప్రభాస్ హీరోగా నటించిన డార్లింగ్ మూవీతో రీఎంట్రీ ఇచ్చిన తులసి, స్టార్ హీరోలకు తల్లి పాత్రలూ చేస్తూ, బిజీ బిజీగా ఉన్నారు. తులసి కెరీర్ లో దాదాపు 700 పైగా చిత్రాలలో నటించారు. తాజాగా ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లు పూర్తయ్యాయి అని హీరో నాని పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ కి నటి తులసి కామెంట్ సెక్షన్ లో “నాని నేను నటి తులసి (నేను లోకల్) నన్ను మీ తల్లిగా భావించి, మీలాంటి అద్భుతమైన నటుడితో కలిసి పనిచేసే అవకాశం ఇవ్వండి” అని రాసుకొచ్చింది. తులసి అలా ఆడగడంతో కొందరు ఆమెని పొగుడ్తున్నారు. కానీ కొందరు మీరు ఇలా అడగడం ఏంటి అని కామెంట్స్ చేస్తున్నారు.
https://www.instagram.com/p/CwzAqY-Rx5N/?igshid=NjZiM2M3MzIxNA%3D%3D
Also Read: MARK ANTONY REVIEW : “విశాల్, SJ సూర్య” కి ఈ సినిమాతో హిట్ పడినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

ఆసియా కప్ లో ఆడుతున్న క్రికెటర్ల రెమ్యునరేషన్ వారి వారి జట్ల మ్యాచ్లలో ఆటగాళ్ల ప్రదర్శనపై ఆధారపడి ఉంటుంది. అంటే ఒక జట్టు ఎన్ని మ్యాచ్లు ఆడింది. అందులో ఒక క్రికెటర్ ఎన్ని మ్యాచ్లు ఆడాడు అనే విషయాన్ని పరిగణలోకి తీసుకుంటారు. ఈ రెండింటి మీద మ్యాచ్ ఫీజు అనేది ఆధారపడి ఉంటుంది. ఒక ప్లేయర్ మ్యాచ్లో ఆడనట్లయితే ఆ ప్లేయర్ ఆ మ్యాచ్ కు పారితోషికం అందుకోలేరు.
ఆసియా కప్లో ఇండియా కనీసం 5 మ్యాచ్లు ఆడుతుందని అంచనా. దాన్ని బట్టి అన్ని మ్యాచ్ లు ఆడే క్రికెటర్లు కనీసం 30 లక్షల రూపాయలు సంపాదిస్తారు. ఇక ఫైనల్ మ్యాచ్ లో ఆడిన క్రికెటర్ల సంపాదన మరింతగా పెరుగుతుంది. బోర్డ్ కాంట్రాక్ట్ ప్రకారం ఆసియా కప్ టోర్నీ ఆధారిత ఫీజు కాకుండా, కాంట్రాక్ట్ ప్రకారం ఇండియన్ క్రికెటర్లు శాలరీ పొందుతారు.
సాధారణంగా బీసీసీఐ క్రికెటర్లను A+, A, B, C గ్రేడ్లుగా విభజిస్తుంది. A+ కేటగిరీలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా లాంటి టాప్ ప్లేయర్స్ ఉన్నారు. వారి ఏడాది శాలరీ రూ. 7 కోట్లు. ఆర్ అశ్విన్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, మహ్మద్ షమీ, అక్షర్ పటేల్ లాంటి గ్రేడ్ ఏ ప్లేయర్స్ ఏడాది శాలరీ రూ.5 కోట్లు ఉంటుంది.
మాధవి లత ‘నచ్చావులే’ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 2008లో రిలీజ్ అయిన ఈ మూవీ విజయం సాధించింది. దాంతో ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి. అలా మాధవి నాని హీరోగా నటించిన స్నేహితుడా మూవీలో హీరోయిన్ గా నటించింది. ఆ తరువాత అరవింద్-2 మూవీలో నటించింది. అయితే ఆమె తొలిసారి నటించిన మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన అతిథి. ఈ మూవీలో హీరోయిన్ అమృతా రావ్ ఫ్రెండ్ గా నటించింది. ఆమె తెలుగులోనే కాకుండా కోలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించారు.
మాధవి లత 2018 లో రాజకీయాల్లో అడుగుపెట్టింది. బిజెపి పార్టీలో జాయిన్ అయ్యింది. సినిమాలకు ప్రస్తుతం ఉన్న మాధవి లత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ తో టచ్లో ఉంటూ, తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను తరచూ పోస్ట్ చేస్తూ ఉంటుంది. అయితే నెటిజెన్లు ఆమెను తరచూ ఆమె పెళ్లి గురించి ప్రశ్నలు అడుగుతుంటారు.
ఈ క్రమంలోనే తాజాగా ఒక నెటిజెన్ మాధవి లత పై కామెంట్ చేశారు. ఆ కామెంట్ పై బాధపడిన, మాధవి ‘‘పెళ్లి పెటాకులు లేక కొవ్వెక్కి బలిసి కొట్టుకుంటున్నావ్ అన్నాడు. అందుకే వాడికి జవాబు చెప్తున్నా’’ అని ఒక వీడియోను ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది.
పిజ్జా 3 మూవీలో అశ్విన్ కాకుమాను, పవిత్ర మరిముత్తు జంటగా నటించారు. మోహన్ గోవింద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ మూవీ కథ విషయానికి వస్తే, నలన్ (అశ్విన్ కకుమాను) ఒక ఫేమస్ రెస్టారెంట్ కు ఓనర్. అతను కయల్ (పవిత్ర) ను ప్రేమిస్తాడు. ఆమె యాప్ డెవలపర్ గా వర్క్ చేస్తుంటుంది. నలన్ కయల్ తో పెళ్లి గురించి ఆమె అన్నయ్య ప్రేమ్ (గౌరవ్ నారాయణన్) పోలీసు అధికారితో మాట్లాడగా, అతను నలన్ అవమానిస్తాడు.
నలన్ రెస్టారెంట్లో కొన్ని వింత సంఘటనలు జరగడం మొదలవుతాయి. నలన్ కు తెలిసిన వ్యక్తులు వరసగా చనిపోతుంటారు. వాటికి కారణం చిన్న ఈజిప్ట్ మమ్మీ బొమ్మ. వరుస మరణాలకు, ఈ బొమ్మకు ఉన్న సంబంధం ఏమిటి? ఆ బొమ్మలో ఉన్న ఆత్మ వారిని చంపడానికి కారణం ఏమిటి ? చివరకు ఏం జరిగింది? అనేది మిగిలిన కథ.
అశ్విన్ కకుమాను ఇప్పటికే చాలా సినిమాలలో నటించి యాక్టర్ గా సత్తాను చాటుకున్నాడు. పలు హారర్ చిత్రాలలో నటించిన అశ్విన్ ఈ మూవీలో కూడా ఆకట్టుకున్నాడు. పిజ్జా 3 రొటీన్ హారర్ రివెంజ్ మూవీ. తమిళంలోనే యావరేజ్ గా నిలిచిన మూవీని తెలుగులో విడుదల చేశారు. ఇప్పటికే తెలుగు ఆడియెన్స్ ఇలాంటివి ఎన్నో చూశారు. దాంతో ఈ మూవీ చూస్తున్నప్పుడు తరువాత వచ్చే సీన్ సులభంగా ఊహించగలరు. హర్రర్ మూవీ అయినా అంతగా భయపెట్టలేదు. డబ్బింగ్ క్వాలిటీ బాగుంది.



మెగా కోడలు ఆనే ట్యాగ్ బరువైన బాధ్యతతో కూడినది అని చెప్పవచ్చు. ఆమె ఏం చేసిన మెగాఫ్యాన్స్ ను దృష్టిలో ఉంచుకుని చేయాల్సి ఉంటుంది. అందువల్ల కాబోయే మెగా కోడలు లావణ్యాత్రిపాఠి తన కెరీర్ విషయంలో జాగ్రత్తగా, అడుగులేస్తున్నారు. నిశ్చితార్థం తరువాత లావణ్య సినిమాలు చేయడం తగ్గించుకున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ లో ఒక మూవీ తప్ప ప్రస్తుతం ఆమె చేతిలో సినిమాలు లేవు. అయితే గతంలో ఒక స్టోరీ నచ్చడంతో ఒక వెబ్ సిరీస్ కి లావణ్య ఓకే చెప్పారట. ‘స్కైలాబ్’ మూవీ డైరెక్టర్ విశ్వక్ ఖండేరావ్ ఆ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ వెబ్ సిరీస్ లో హీరోయిన్ పాత్ర బోల్డ్గా ఉంటుందని, ఇంటిమేట్ సీన్స్ కూడా చేయాల్సి ఉంటుందట. దాంతో లావణ్య ఆ వెబ్సిరీస్ మేకర్స్ కి తాను ఆ పాత్ర చేయలేనని, వేరే హీరోయిన్ ను చూసుకోమని చెప్పిందంట. నిశ్చితార్థం తర్వాత మెగా ఫ్యామిలీ కోడల్ని. ఇలాంటి వాటిలో నటించడం సరి కాదని అన్నారట. ఈ క్రమంలోనే సెలెక్టివ్గా కొన్ని మూవీ ఆఫర్లను కూడా రిజెక్ట్ చేసిందని వార్తలు వస్తున్నాయి.
కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మెగా ఫ్యామిలీ సమక్షంలో జూన్లో నిశ్చితార్థం చేసుకున్నారు. అధికారికంగా పెళ్లి ఎక్కడ అనేది అనౌన్స్ చేయకపోయినా, నవంబర్లో ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ జరుగబోతుందని ప్రచారాలు వినిపిస్తున్నాయి. వెడ్డింగ్ తరువాత హైదరాబాద్లో గ్రాండ్ గా రిసెప్షన్ ఉంటుందని టాక్.
ఆదివారం నాడు ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచ్ ఉంది కాబట్టి అందులో ఆడే ప్లేయర్స్ కు బంగ్లాదేశ్ తో జరిగే మ్యాచ్ లో రెస్ట్ ఇవ్వాలని మేనేజ్మెంట్ అనుకుంటోంది. అందువల్ల శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ లాంటి ఆటగాళ్లు బంగ్లాదేశ్ తో జరిగే మ్యాచ్ లో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. బుమ్రా ఫైనల్స్ కోసం విశ్రాంతి తీసుకోవచ్చు. సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్ లో ఆడే ఛాన్స్ ను పొందవచ్చు.
రోహిత్ శర్మ పేస్ బౌలర్లను పొదుపుగా వాడాడు. బుమ్రాను ఫిట్గా ఉంచడం కోసం పాక్ పై ఐదు5 ఓవర్లు, శ్రీలంక పై 7 ఓవర్లు వరకే బౌలింగ్ చేయించాడు. ఇక మహ్మద్ సిరాజ్ కు రెండు మ్యాచ్ల్లో 10 ఓవర్లు వరకు బౌలింగ్ చేయించాడు. దాంతో వీరికి విశ్రాంతి అవసరం లేదు. కానీ ఆల్రౌండర్ అయిన హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి ఇవ్వాలని మేనేజ్మెంట్ అనుకుంటోంది. అతను బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్తో అలసిపోతున్నాడు. కాబట్టి విశ్రాంతి ఇవ్వాలని భావిస్తోంది.





గద్వాలకు చెందిన శివ సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యాడు. శివ పాడే సాంగ్స్ కొద్ది రోజులుగా ఇన్ స్టాగ్రామ్ రీల్స్, మీమ్స్, ట్రోల్స్ లో హల్చల్ చేస్తున్నాయి. అతని పాటలను నెటిజెన్లు విపరీతంగా ట్రోల్స్ చేశారు. అలా శివ బాగా పాపులర్ అయ్యాడు. ఆ వ్యక్తిని శ్రీదేవీ డ్రామా కంపెనీ లేటస్ట్ ఎపిసోడ్ కు తీసుకువచ్చారని ప్రోమో ద్వారా తెలుస్తోంది.
అయితే శివతో వేదిక పైన పాట పాడించారు. అతని ప్రతిభను గుర్తించి, అవకాశం ఇచ్చారనుకోవచ్చు. కానీ శివ పాట పాడుతుంటే, ఇంద్రజ, హీరోయిన్ రేఖ, శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోగ్రామ్ లోని మిగతా వారంత పగలబడి మరి నవ్వారు. ఈ ప్రోమో చూసిన నెటిజెన్లు అతన్ని ఈ ప్రోగ్రామ్ కు తీసుకువచ్చి మరీ పరువు తీయడం ఏంటని కామెంట్స్ చేస్తున్నారు.
ఇప్పటివరకు సోషల్ మీడియాలోను వారు మాత్రమే ట్రోల్ చేశారు. ఇక ఇప్పుడు టెలివిజన్ ఆడియెన్స్ ముందుకు తీసుకువచ్చి పరువు తీసేస్తున్నారని అంటున్నారు. పాడుతుంటే అంతగా నవ్విన ఇంద్రజ ఆ తరువాత ‘నీలో పాడగలను అనే ధైర్యం ఉంది. అందుకే ఇక్కడకు దాకా వచ్చావు, అని మాట్లాడింది. కానీ నవ్వే వారిని మాత్రం ఆపలేదని ప్రోమో చూసిన వారు కామెంట్స్ చేస్తున్నారు.