తమ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలసుకోవాలనే ఇంట్రెస్ట్ చాలా మందికి ఉంటుంది. రానున్న రోజుల్లో తాము ఏ స్థానంలో ఉంటాము? ఉద్యోగం,పెళ్లి, జీవితంలో స్థిరపడడం లాంటి విషయాల గురించి తెలుసు కోవడానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.
ఈ విషయంలో జ్యోతిష్య శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే జ్యోతిష్య శాస్త్రంలో చాలా రకాల పద్ధతులు ఉన్నాయి. వాటిలో హస్త సాముద్రికము కూడా ఒకటి. హస్త సాముద్రికము అనగా అరచేతిలో ఉండే రేఖల ఆధారంగా భవిష్యత్తును అంచనా వేస్తారు. ఈ హస్తసాముద్రికంను విశ్వసించేవారు చాలా మంది ఉంటారు. వారిలో సాధారణ పౌరులే కాకుండా ప్రముఖులు కూడా ఉన్నారు.
అరచేతిలో గీతాలు రకరకాలుగా ఉంటాయి. వీటితో పాటు గుర్తులు కూడా ఉంటాయి. అయితే అర చేతిలో రేఖల మధ్య ‘ఎక్స్’ (X) ఆకారంలో గుర్తు ఉంటే వారికి లైఫ్ లో తిరుగు ఉండదంట. ఇలాంటి గుర్తు ప్రపంచం మొత్తంలో 5 శాతం మందికి మాత్రమే ఉంటుందట. అరచేతిలో ఎక్స్ ఆకారంలో గుర్తు ఉండడం వల్ల కలిగే ఫలితాల గురించి ఇప్పుడు చూద్దాం..
అర చేతిలో ఎక్స్ గుర్తు ఉన్నవారు అత్యంత ప్రతిభావంతులుగా ఉంటారట. ఆ వ్యక్తి సక్సెస్ బాటలో నడవడమే కాక ఇతరులను కూడా ఆ మార్గంలో నడిపిస్తారట. ఈ గుర్తు కలిగిన వ్యక్తులు ప్రపంచాన్ని కూడా జయిస్తారని సైంటిస్టులు చెబుతున్నారు. ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ ది గ్రేట్ అర చేతిలో ఈ ఎక్స్ గుర్తు ఉండేదట. అలాగే అలెగ్జాండర్ తన అరచేతి రేఖలను బలంగా నమ్మేవారంట. మాస్కోలో ఉండే హెచ్టీఐ యూనివర్సిటి సైంటిస్టులు చాలా మంది చేతి రేఖల పై పరిశోధనలు చేశారు.
అమెరికా మాజీ ప్రెసిడెంట్ అబ్రహం లింకన్ కు, రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ కు అర చేతిలో ఎక్స్ గుర్తు ఉండేదని సైంటిస్టులు తెలియజేశారు. పరిశోధనల ప్రకారం రెండు అర చేతుల్లో ఎక్స్ గుర్తు ఉంటే వారు జీనియస్ అని, బలవంతులుగా ఉండడంతోపాటు ఇతర వ్యక్తులను తేలికగా అంచనా వేయగలరట. అలాగే వీరిని మోసం చేయడం చాలా కష్టం. ఎక్స్ గుర్తు ఉన్నవారు శారీరకంగా, మానసికంగా శక్తివంతులుగా ఉంటారట. ఈ వ్యక్తులు పేరు ప్రతిష్టలు, సమాజంలో చాలా గౌరవం ఉంటుందని సదరు పరిశోధకులు చెబుతున్నారు.
Also Read: చేతిలో ఉండే రేఖలు మారతాయా..? ఎప్పుడు ఒకేలా ఉంటాయా? ఒకవేళ మారితే.. దాని అర్ధమేంటి..?

ప్రముఖ మలయాళ నటుడు హీరోగా నటించిన సినిమా ‘ఇరట్టా’. థియేటర్లలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. హీరోయిన్ అంజలి కీలక పాత్రలో నటించింది. కథ విషయానికి వస్తే, కేరళలో వాగమన్ అనే ఊరిలో ఉన్న పోలీస్ స్టేషన్లో జరిగే ఒక కార్యక్రమానికి మినిస్టర్ అతిథిగా వస్తుండడంతో పోలీసులు ఏర్పాట్లు చేస్తుంటారు. ఇంతలో తుపాకీ పేలిన సౌండ్ రావడంతో అందరూ అక్కడికి వెళ్ళి చూస్తారు. అక్కడ ఏఎస్ఐ వినోద్ (జోజు జార్జి) చనిపోయి ఉంటాడు.
ఎవరు వినోద్ చంపారో తెలియదు. దాంతో పోలీస్ స్టేషన్ ను లాక్ చేసి, అక్కడ ఉన్నవారిని బయటకు వెళ్లనియకుండా చేసి, విచారిస్తూ ఉంటారు. వినోద్ చనిపోయిన సంగతి వినోద్ కవల సోదరుడు అయిన డీఎస్పీ ప్రమోద్ (జోజు జార్జి సెకండ్ రోల్) కు తెలుస్తుంది. వెంటనేప్రమోద్ అక్కడికి చేరుకుంటాడు? ఇంతకీ వినోద్ను చంపింది ఎవరు? ప్రమోద్, వినోద్ లు మధ్య గొడవ ఏంటి ? మాలిని (అంజలి) ఎవరు? అనేది మిగతా కథ.
రోజు పేపర్ లో కానీ, న్యూస్ లో కానీ కొన్ని డిస్టర్బింగ్ ఇన్సిడెంట్స్ చూస్తుంటాము. దర్శకుడు రోహిత్ ఎంజీ కృష్ణన్ అలాంటి వార్తలలో ఒక పాయింట్ తీసుకుని, ఆ పాయింట్ చుట్టూ క్రైమ్ థ్రిల్లర్ ను రాసుకున్నారు. పోలీస్ స్టేషన్లో వినోద్ చనిపోయే సీన్తోనే మూవీ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత పోలీసులు అనుమానితులను విచారించగా, ఒక్కొక్కొరు వినోద్తో వారికున్న గొడవల గురించి చెప్పడం. ఫ్లాష్బ్యాక్ తో వినోద్ హత్య వెనుక కారణాలను రివీల్ చేయడం ఆకట్టుకుంటుంది.
ఆఖరికి వినోద్ను ప్రమోద్ హత్య చేసినట్లుగా అనుమానించడంతో ప్రమోద్ ఆ కేసును ఛాలెంజింగ్గా తీసుకుంటాడు. ప్రమోద్ మిస్టరీని చేధించే సన్నివేశాలను డైరెక్టర్ ఊహలకు అందని విధంగా రాసుకున్నారు. జోజో జార్జ్ ఈ మూవీని నిర్మించారు. డ్యూయల్లో రోల్లో జోజు జార్జ్ నట విశ్వరూపం చూపించాడు. అంజలికి ఒక్క డైలాగ్ ఉండదు. మిగిలినవారు తమ పాత్రకు తగ్గట్టు నటించారు. రెగ్యులర్ గా వచ్చే క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలతో పోలిస్తే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ను అందించే సినిమా. క్లైమ్యాక్స్ లో ట్విస్ట్ మాత్రం ఆడియెన్స్ మనసుల నుండి సులభంగా పోదు.
చంద్రయాన్ 3 సక్సెస్ అయినందుకు రెబల్ స్టార్ ప్రభాస్ తన సోషల్ మీడియా ఖాతాలో ఇస్రోను అభినందించాడు. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో ప్రభాస్ ఇస్రోను ట్యాగ్ చేశాడు. దాంతో దేశవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులలో జోష్ మొదలైంది. ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాల్లో తమ సంతోషాన్ని తెలుపుతున్నారు. అయితే ప్రభాస్ అభిమానులు అక్కడికే పరిమితం కాకుండా చంద్రయాన్ 3 మిషన్ విజయాన్ని ప్రభాస్ నటిస్తున్న సలార్ తో లింక్ చేస్తున్నారు.
చంద్రయాన్ 3 విజయం కావడం ప్రభాస్ సలార్ మూవీకి కి కలిసి వస్తుందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. దానికి కారణం ఏమిటంటే 2019 జులైలో చంద్రయాన్ 2 లాంచ్ అయ్యింది, కానీ విఫలం అయ్యింది. అదే ఏడాది ఆగస్ట్ లో రిలీజ్ అయిన సాహో మూవీ కూడా నిరాశ పరిచింది. చంద్రయాన్ 3 సక్సెస్ అయ్యింది. సలార్ కూడా ఇదే ఏడాది రిలీజ్ కానుండడంతో ఈ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి హిట్ అవుతుందని సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.
సలార్ మూవీకి కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. సలార్ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక ఈ మూవీ సెప్టెంబర్ లో విడుదల కానుంది. ఆదిపురుష్ వంటి డిజాస్టర్ మూవీ తర్వాత ఈ చిత్రం రిలీజ్ అవుతుండడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ మూవీ భారీ విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నారు.
ప్రజ్ఞానంద పూర్తి పేరు రమేష్బాబు ప్రజ్ఞానంద. తమిళనాడులోని చెన్నైలో ప్రజ్ఞానంద 2005లో ఆగస్టు 10 న జన్మించారు. అతని తండ్రి పేరు రమేష్బాబు. ఆయన టీఎన్ఎస్సీ బ్యాంక్లో బ్రాంచ్ మేనేజర్గా పనిచేస్తున్నారు. ప్రజ్ఞానంద తల్లి పేరు నాగలక్ష్మి. ఆమె గృహిణి. అతనికి ఒక అక్క ఉంది. ఆమె పేరు వైశాలి. ఆమె ఉమెన్ గ్రాండ్ మాస్టర్ మరియు ఇంటర్నేషనల్ మాస్టర్.
ప్రజ్ఞానంద ఐదేళ్ల నుంచి చెస్ ఆడుతున్నాడు. మొదట్లో చెస్ అంటే ఆసక్తిలేనప్పటికి, అతని ఫ్యామిలీ సహాయంతో చెస్ నేర్చుకుని, అనేక పోటీలలో పాల్గొని విజయం సాధించాడు. ఏడేళ్ల వయసులోనే ప్రజ్ఞానంద ప్రపంచ యూత్ చెస్ ఛాంపియన్షిప్ను గెలుచుకున్నాడు. ఈ విజయం ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ ఎచెక్స్ మాస్టర్ అనే బిరుదును వచ్చేలా చేసింది. 2015లో ఛాంపియన్షిప్ లో అండర్-10 కేటగిరీలో కూడా విజేతగా నిలిచాడు. 10ఏళ్ల వయస్సులో ప్రజ్ఞానంద చెస్ లో అతి చిన్న వయస్కుడైన అంతర్జాతీయ మాస్టర్గా పేరు సంపాదించాడు.
ప్రజ్ఞానంద 2016లో చెస్ లో అతి చిన్న వయస్కుడైన ‘ఇంటర్నేషనల్ మాస్టర్’ గా చరిత్ర సృష్టించాడు. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ ఎచెక్స్ గేమ్లో అసాధారణ నైపుణ్యాన్ని ప్రదర్శించే ప్లేయర్స్ కి ‘ఇంటర్నేషనల్ మాస్టర్’ బిరుదును ఇస్తారు. చరిత్రలో ఈ బిరుదును సాధించిన అతి పిన్న వయస్కుడైన ఇండియన్ గా కూడా ప్రజ్ఞానంద నిలిచాడు.
18 ఏళ్ల ప్రజ్ఞానంద ప్రపంచకప్ చెస్ టోర్నీలో ఫైనల్ లో ప్రస్తుత ప్రపంచ చెస్ ఛాంపియన్ అయిన మాగ్నస్ కార్ల్సెన్ తో పోటీపడ్డాడు. ఈ గేమ్లో ప్రజ్ఞానంద తెల్ల పావులతో ఆడాడు. 35 ఎత్తుల అనంతరం రిజల్ట్ తేలే ఛాన్స్ లేకపోవడంతో వీరిద్దరూ ‘డ్రా’కు అంగీకరించారు. ఈ మాగ్నస్ కార్ల్సెన్ పై విజయం సాధించి, ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించడానికి అతి చేరువలో ఉన్నాడు.
1. ఎస్ సోమ్నాథ్ భారతి – ఇస్రో సంస్థ ఛైర్మన్:
3. కె కల్పన – చంద్రయాన్-3 డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్:
5. ఎమ్ శంకరన్ – డైరెక్టర్, URSC:
చంద్రయాన్ 3 సుమారు 41 రోజుల పాటు భూమి నుండి చంద్రుడి వైపు ప్రయాణించి ల్యాండర్ మాడ్యూల్ ‘విక్రమ్’ ఆగస్టు 23 సాయంత్రం 6.04 గంటలకు జాబిల్లి పై అడుగుపెట్టింది. చందమామ పై అడుగిడాలనే భారత్ ఎన్నో ఏళ్ల కల సాకారం అయ్యింది. చంద్రయాన్-3 వల్ల దేశానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

సూపర్ స్టార్ రజనీకాంత్ లేటెస్ట్ సినిమా ‘జైలర్’. బాక్సాఫీస్ దగ్గర రికార్డులు బ్రేక్ చేస్తోంది. ఈ మూవీ ఆగస్టు 10న థియేటర్లలో రిలీజ్ అయ్యి, తమిళంలోనే కాకుండా తెలుగులోనూ రజనీకాంత్ సినిమా రికార్డులు సృష్టించింది. ఈ మూవీలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మలయాళ స్టార్ మోహన్లాల్, బాలీవుడ్ యాక్టర్ జాకీష్రాఫ్ కీలక పాత్రలో నటించారు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతాన్ని అందించారు. జైలర్ మూవీతో రజనీకాంత్ చాలా సంవత్సరాల తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు. దీంతో ‘తలైవా ఈజ్ బ్యాక్’ అని రజనీ ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు.
అయితే ఈ మూవీ గురించి తాజాగా ప్రముఖ దర్శకుడు ప్రవీణ్ గాంధీ మాట్లాడుతూ రజినికాంత్ ఈ మూవీలో చెప్పిన డైలాగ్ ఆయన జీవితానికి సంబంధించినదే అని చెప్పారు. క్లైమాక్స్ సీన్లో రజిని తన కుమారుడితో ఏదైనా చెప్పాలని ఉందా నాన్న? అంటూ పదేపదే అడిగే సీన్ ఉంటుంది. ఆ సమయంలో రజినికాంత్ రియల్ లైఫ్ లో బాధను చూపిస్తుందని అన్నారు. ఇది డైలాగ్ మాత్రమే కాదు.
ఆయన జీవితం అని ఆ డైలాగ్ చెప్పే సమయంలో రజనీకాంత్ కి కుమార్తె ఐశ్వర్య మరియు ధనుష్ గుర్తుకు వచ్చి ఉంటారని అన్నారు. ధనుష్, ఐశ్వర్య విడాకులు రాత్రికి రాత్రే తీసుకున్న డిసిషన్ కాదు. దీని గురించి రజనీ తన కుమార్తెను నేరుగా అడగలేరు. అందువల్ల ఆయన ‘ఈ నాన్నగారితో ఏదైనా చెప్పాలా అంటూ ఐశ్వర్యను చాలాసార్లు అడిగారు’ అంటూ ప్రవీణ్ గాంధీ వెల్లడించారు.
గత వారం యోగి మూవీని రీరిలీజ్ చేశారు. థియేటర్లు ఈ మూవీలోని ‘ఓరోరి యోగి’ పాటకు ఓ రేంజ్ లో ఊగిపోయాయి. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో ఈ ట్యూన్ ఒరిజినల్ కన్నడ పాట కూడా నెట్టింట్లో ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చింది. దాంతో తెలుగు సాంగ్ నే ఒరిజినల్ సాంగ్ అని అనుకున్నారు. తెలుగు పాటను కన్నడ సినిమా వాళ్ళు కాపీ చేశారనుకున్నారు.
అయితే ఆ సాంగ్ కన్నడలోనే ముందుగా వచ్చింది. కన్నడలో స్టార్ హీరో శివ రాజ్ కుమార్ హీరోగా నటించిన ‘జోగి’ మూవీ 2005 లో రిలీజ్ అయ్యి, బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ సినిమాలోని లవ్ సాంగ్ ట్యూన్నే తెలుగువాళ్ళు కాపీ చేశారు. కన్నడలో మూవీలో హీరోహీరోయిన్ల మధ్య వచ్చిన మంచి లవ్ సాంగ్ ను తెలుగులో ఐటం సాంగ్గా తెరకెక్కించారు.
ఇంత మంచి సాంగ్ ను ఐటం సాంగ్గా మార్చారు కదరా? అని నెటిజెన్లు ఈ పాట పై ట్రోల్స్ చేస్తున్నారు. దీనిపై మీమ్స్ కూడా ట్రెండ్ అవుతున్నాయి. కన్నడ ఒరిజినల్ పాట ప్రస్తుతం తెలుగు పాట కన్నా ఎక్కువగానెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. అంతటా కన్నడ సాంగ్ నే వినిపిస్తోంది. ఈ సాంగ్ పై తీసిన రీల్స్, షార్ట్స్ తో కన్నడ పాట ట్రెండింగ్ లోకి వచ్చింది.
కల్యంపూడి రాధాకృష్ణ రావు బళ్లారిలోని తెలుగు కుటుంబంలో జన్మించిన పదిమంది సంతానంలో ఎనిమిదవ వాడు. రావు తండ్రి పోలీసు ఇనస్పెక్టరు. ఆయన నూజివీడు, నందిగామలో చదివారు. ఆ తరువాత వైజాగ్ లో స్కూల్ ఫైనల్ నుంచి డిగ్రీ వరకు చదువుకున్నారు. ఆయన ప్రతి క్లాస్ లో మొదటి ర్యాంక్ తెచ్చుకున్నారు. ఆ తరువాత ఆంధ్రా యూనివర్శిటీ నుండి గణితశాస్త్రంలో ఎం.ఎస్సి పట్టా పొందాడు. అక్కడి నుండి కలకత్తా వెళ్ళిన రావు 1943లో కలకత్తా యూనివర్సిటీ నుండి గణాంకశాస్త్రంలో మాస్టర్స్ పూర్తి చేశారు.
ప్రపంచవ్యాప్తంగా గణాంకశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ తొలిసారి పొందిన అతికొద్ది మందిలో రావు ఒకరిగా నిలిచారు. ఆయన యూనివర్శిటీ మొదటి ర్యాంకు సాధించారు. అదే సంస్థలో లెక్చరర్ గా చేరారు. అలాగే ఉద్యోగిగా పరిశోధనలు మొదలుపెట్టారు. వాటిలో భాగంగానే ఆయనకు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పరిశోధనలు కొనసాగించే ఛాన్స్ ను పొందారు. ఆయన రీసెర్చ్ చేసిన అంశాలతో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్ వారు రావు రచనను రిలీజ్ చేశారు. అప్పటికి రావు వయస్సు 26 ఏళ్లు మాత్రమే.
965లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని కింగ్స్ కాలేజీ నుండి పిహెచ్ డి పట్టా పొందాడు. రావు కేంబ్రిడ్జ్లోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ మరియు ఆంత్రోపోలాజికల్ మ్యూజియంలో పనిచేశాడు. ఆ తరువాత రావు ఇండియాకి తిరిగి వచ్చి స్టాటిస్టిక్స్ శాఖను స్థాపించారు. ఆ తరువాత ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్గా, మరియు ఎన్నో ముఖ్యమైన పదవులను చేపట్టిన రావు, ఎన్నో సత్కారాలు అందుకున్నాడు.
1968లో పద్మభూషణ్, 2001లో పద్మవిభూషణ్ బిరుదు అందుకున్నారు. 2002లో ప్రెసిడెంట్ జార్జ్ డబ్ల్యూ బుష్ చేతుల మీదుగా ‘నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్’ ను అందుకున్నాడు. 2017లో స్టాటిస్టిక్స్లో అంతర్జాతీయ బహుమతిని అందుకున్నాడు. రావు బ్లాక్వెల్ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశారు. జన్యుశాస్త్రం, జీవావరణ శాస్త్రం మరియు సామాజిక శాస్త్రాలతో సహా అనేక అనువర్తిత సమస్యల పై పనిచేశాడు. భారతదేశంలో నమూనా సర్వే పద్ధతుల అభివృద్ధిలో కూడా ప్రధాన పాత్ర పోషించాడు.
నిర్మాత ఎస్కేఎన్ చదువుకునే రోజుల నుండి మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమానిగా ఎంతో యాక్టివ్ గా ఉండటంతో ఎస్కేఎన్ అల్లు శిరీష్ పిలిపించి మరి అల్లు అర్జున్ కి పరిచయం చేశాడు. ఆ సమయంలో ఎన్నో కష్టాలు పడి, దొరికిన జాబ్ చేస్తూ, ఆ తరువాత హీరోలకు పిఆర్ చేసి, చివరకు ప్రొడ్యూసర్ గా మారాడు. ఇటీవల బేబీ మూవీతో విజయాన్ని అందుకున్న ఎస్కేఎన్, ప్రొడ్యూసర్ గా కన్నా, మెగా ఫ్యాన్ గానే ఎక్కువగా కనిపిస్తుంటాడు.
సందర్భం వచ్చిన ప్రతిసారి ఆయన చిరంజీవి పై ఉన్న అభిమానాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో నిన్న మెగాస్టార్ చిరంజీవి సందర్భంగా పుట్టినరోజు ఏర్పాటు చేసిన ఈవెంట్ లో చిరంజీవి గురించి మాట్లాడుతూ ఆయన పై తనకున్న అభిమానంతో ఎస్కేఎన్ మాట్లాడారు. మామూలుగానే ఎస్కేఎన్ పంచులతో ప్రేక్షకులని అలరిస్తాడనే విషయం తెలిసిందే. ఈ మెగా ఈవెంట్ లో అదే స్థాయిలో స్పీచ్ ఇచ్చాడు. ఈ క్రమంలో భోళా శంకర్ ప్లాప్ గురించి చేసిన కామెంట్స్ అందరినీ ఆశ్చర్యపోయేలా చేశాయి.
“బాస్ రీఎంట్రీ తరువాత మునుపెన్నడూ లేనంత అందంగా కనిపించిన సినిమా భోళా శంకర్. దాన్ని కూడా మనం నిలబెట్టుకోలేకపోయామంటే ఫస్ట్ రీజన్ మనమే. ఎవరో ఏదో చెప్తే వారి ట్రాప్ లో పడి ఫ్యాన్స్ ఈ మూవీని ప్లాప్ డిజాస్టర్ చేసుకున్నారు అన్నట్టుగా ఎస్కేఎన్ మాట్లాడారు. ఈ కామెంట్స్ పై మెగా అభిమానులు కూడా కాస్త అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. అభిమాన స్టార్ ఏం చేసినా వీరాభిమానులకు నచ్చుతుంది. కేవలం అభిమానులకు మాత్రమే కాదు అయితే నచ్చాల్సింది ఆడియెన్స్ కూడా అని నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.