మనలో ఎక్కువ మంది కుటుంబ సభ్యులు ఉన్న ఇళ్లల్లో రాత్రి పూట కచ్చితం గా ఎంతో కొంత అన్నం మిగిలిపోతూ ఉంటుంది. మరీ కొంచం ఐతే పర్లేదు ఎవరికైనా ఇచ్చేస్తాం.. కానీ.. చాలా ఎక్కువ ఉండిపోయినపుడు.. దానిని మరుసటి రోజు తింటూ ఉంటాం. సద్ది అన్నం తినడం మంచిదే అయినా.. దానిని గది ఉష్ణోగ్రతలో ఎక్కువ సేపు ఉంచడం మంచిది కాదు.

అన్నం వండిన రెండు మూడు గంటలలోపు తినేయడం ఉత్తమం. ఒకవేళ అలా కుదరకపోతే ఆ అన్నాన్ని ఫ్రిడ్జ్ లో ఉంచేసుకుని మరుసటి రోజు తినవచ్చు. గది ఉష్ణోగ్రత లో ఎక్కువ సేపు అన్నాన్ని ఉంచడం వలన బాక్టీరియా చేరుతుంది. అలాగే.. వేడి గా అన్నం తినాలని అనుకుంటే.. ఒకసారి వేడి చేసుకుని తింటే పరవాలేదు. మళ్ళీ మళ్ళీ వేడి చేసుకుని తినడం కూడా అంత ఆరోగ్యకరం కాదు.





RO వాటర్ ప్యూరిఫైయర్:
UV వాటర్ ప్యూరిఫైయర్:
UF వాటర్ ప్యూరిఫైయర్:
ఇక వీటిలో ఏది ఉపయోగించాలి అనేది మనం వాడే వాటర్ క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఏ వాటర్ ప్యూరిఫైయర్ ఉపయోగించాలో తెలుసుకోవాలంటే మీ వాటర్ యొక్క TDS అంటే టోటల్ డిసాల్వ్డ్ సాలీడ్స్ యొక్క వాల్యూని తెలుసుకోవాలి. మీ వాటర్ TDS 100 – 300 ఉంటే UV, UF వాటర్ ప్యూరిఫైయర్ వాడొచ్చు. TDS 300 – 500 ఉంటే UV, UF వాటర్ ప్యూరిఫైయర్ వాడొచ్చు. ఇక TDS 500- 2000 ఉంటే తప్పనిసరిగా RO వాటర్ ప్యూరిఫైయర్ ఉపయోగించాలని చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి.




ఫుడ్ కు ఫేమస్ అయిన హైదరాబాద్ లో ఇటీవల కాలంలో స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ లు బాగా పెరిగిపోయాయి. ఆ ఫుడ్ కి రోజు రోజుకి అభిమానులు పెరిగిపోటున్నారు. రోడ్డు పక్కన మంచి రుచికరమైన ఫుడ్ దొరకడం, అది కూడా చాలా తక్కువ ధరకు లభిస్తుండడంతో వాటి దగ్గరకి జనాలు క్యూ కడుతున్నారు. ఇందుకు ఉదాహరణగా కుమారి ఆంటీ పేరు చెప్పుకోవచ్చు. ఆమె ఫుడ్ బిజినెస్ తో చాలా ఫేమస్ అయ్యింది. ప్రస్తుతం ఏక్కడ చూసిన ఆమె గురించిన వార్తలే కనిపిస్తున్నాయి. అయితే అదే ప్రాంతంలో అనురాధ ఆంటీ ఫుడ్ బిజినెస్ చేస్తున్నారు.
ఆమె స్టాల్ లో టేస్టీ దాల్ రైస్, గోబీ రైస్, గోంగూర రైస్, జీరా రైస్, టమాటా రైస్, పెరుగన్నం అందుబాటులో ఉన్నాయి. ఇక నాన్ వెజ్ లో మటన్, చికెన్, లివర్, ఫిష్, తలకాయ, ఫ్రాన్స్ వంటి కర్రీస్ ఉంటాయి. వెజ్ ప్లేట్కు 80 రూపాయలు కాగా, రైస్ అన్లిమిటెడ్ గా ఉంది. చికెన్ కర్రీ రూ.120 (అన్లిమిటెడ్ వైట్ రైస్/ బగారా రైస్ ),చికెన్ ఫ్రై రూ.150 (అన్లిమిటెడ్ వైట్ రైస్/ బగారా రైస్), మటన్ కర్రీ –రూ.200 (అన్లిమిటెడ్ వైట్ రైస్/ బగారా రైస్), లివర్ కర్రీతో రైస్ 150 రూపాయలు, ప్రాన్స్ కర్రీతో రైస్ 150 రూపాయలు, ఫిష్ కర్రీతో రైస్ 150 రూపాయలు,కాగా నాన్ వెజ్ ఐటమ్స్ అన్నింటితో కలిపి తీసుకుంటే 450 రూపాయలు.
ఆమె వద్ద రోజుకు మూడు వందల మంది దాకా ఫుడ్ తింటారు. ఆ లెక్కన ఒక్కోక్కరికి యావరేజ్ గా రూ. 100 చొప్పున రోజుకు 30000 వస్తుంది. ఖర్చులన్ని పోగా 10 వేల రూపాయల వరకు మిగిలే ఛాన్స్ ఉంది. ఈ విధంగా చూస్తే నెలకు మూడు లక్షల దాకా ఆమెకు లాభం వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. తక్కువ ధరకు వందల మందికి ఆహారం అందిస్తున్న ఇలాంటి మహిళలను అందరు మెచ్చుకుంటున్నారు.
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, ప్రియమణి నటించిన ‘నెరు’ మూవీ ఇటీవల ఓటీటీలో రిలీజ్ అయ్యి, తెలుగు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ మూవీ డిసెంబర్ 21 న రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దృశ్యం దర్శకుడు జీతూ జోసెఫ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో కీలక పాత్ర సారా మహమ్మద్. ఈ పాత్ర చుట్టే కథ తిరుగుతుంది. చూపు లేని అమ్మాయి పాత్రలో అనశ్వర రాజన్ అద్భుతంగా నటించింది. ఆమె నటనకు ప్రశంసల వర్షం కురుస్తోంది.
కంప్లీట్ స్టార్ గా పేరుగాంచిన మోహన్ లాల్ తో నటించడం అంత సులభమైన విషయం కాదు. అయితే అనశ్వర పాత్ర మోహన్ లాల్ తో పాటు ట్రావెల్ అవుతూ ప్రేక్షకుల దృష్టిని తన వైపుకు మళ్లించడంలో విజయం సాధించింది. అందువల్లే ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆమె ఎవరా అంటూ నెటిజెన్లు ఆరా తీస్తున్నారు. ఆమె కేరళలో ‘కరివెల్లూర్’ అనే టౌన్ లో 2002లో సెప్టెంబరు 8న జన్మించింది. అక్కడే పెరిగింది.
అనశ్వర 2017లో ‘ఉదాహరణం సుజాత’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. 2019 లో తన్నీర్ మథన్ దినంగల్ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. పలు చిత్రాలలో నటించి, ఫాలోయింగ్ ను పెంచుకుంది. మలయాళ యంగ్ హీరోలకు మొదటి ఆప్షన్ గా నిలిచింది. యారియాన్ 2 మూవీతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. నెరు మూవీతో తెలుగు ఆడియెన్స్ కు పరిచయం అయ్యింది. ఈ చిత్రం ప్రస్తుతం ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’ లోస్ట్రీమింగ్ అవుతోంది.


తెలుగు సీరియల్స్ లో టాప్ రేటింగ్ తెచ్చుకున్న సీరియల్ గుప్పెడంత మనసు. కార్తీక దీపం లాంటి సీరియల్ టో పోటీ పడిన ఈ సీరియల్ తక్కువ సమయంలోనే ప్రేక్షకాదరణ పొందింది. సీరియల్ లోని హీరోహీరోయిన్లకు ధీటుగా జగతి మేడం పాత్రలో జ్యోతి రాయ్ ఆకట్టుకున్నారు. తన కట్టు బొట్టు, హుందాతనంతో ఆడియెన్స్ ని ఫిదా చేశారు. అయితే ఈ పాత్ర మరణించింది. ఆమె లేని సీరియల్ ని ఆడియెన్స్ చూడలేకపోతున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే జ్యోతి రాయ్ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫహోటవలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ ని అలరిస్తోంది.
సీరియల్ చాలా హుందాగా ఉండే జ్యోతి రాయ్ నెట్టింట్లో మాత్రం గ్లామర్, హాట్ ఫోటోలతో హల్చల్ చేస్తోంది. ఆ మధ్య పర్సనల్ విషయాలతో వైరల్ అయ్యింది. ప్రస్తుతం ప్రెట్టీ గర్ల్ అనే వెబ్ సిరీస్ తో పాటు, పలు కన్నడ చిత్రాలలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. సీరియల్ లో తల్లి పాత్ర చేసిన జ్యోతి బయట ట్రెండీ వేర్స్ ధరించి, యంగ్ గా కనిపిస్తుంది. ఆమె ఏజ్ ఎంత అని అభిమానులు చాలా రోజుల నుండి అడుగుతూ ఉన్నారు.
తాజాగా అభిమనులతో చిట్ చాట్ చేసిన జ్యోతి రాయ్ ని ‘మీ ఏజ్ ఎంతో చెప్పగలరా’ అని అడుగగా, పాన్ కార్డ్ లో పుట్టిన తేదీని చూపించింది. అందులో 1994లో జన్మించినట్టు ఉంది. అంటే జ్యోతి ఏజ్ 30 సంవత్సరాలే కావడంతో షాక్ అవుతున్నారు. తల్లి పాత్ర చేయడంతో ఆమె వయసు ఎక్కువగా ఉంటుందని భావించారు. ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది.

