మెగాస్టార్ చిరంజీవి సినిమాలపై ఇష్టంతో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని.. స్వయం కృషితో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్నారు. ప్రాణం ఖరీదు సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకులకు నటుడిగా పరిచయమయ్యారు. కెరీర్ మొదట్లో హీరోగా విలన్ గా, చిన్న చిన్న అతిధి పాత్రల్లో , నలుగురు హీరోల్లో ఒకడిగా ఇలా తనకు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. తనదైన నటన, డాన్సులతో కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు.
అయితే చిరంజీవి ఇంకా నటుడుగా ఎదుగుతున్న సమయంలోనే అంటే.. సినిమాల్లో అడుగు పెట్టిన రెండేళ్లకే టాలీవుడ్ హాస్య నటుడు అల్లు రామలింగయ్య కూతురు సురేఖతో వివాహం జరిగింది. చిరంజీవి కష్టపడే తత్వాన్ని అప్పట్లోనే గుర్తించిన అల్లు రామలింగయ్య తన కుమార్తె సురేఖ ను చిరంజీవికి ఇచ్చి 20వ తేదీ ఫిబ్రవరి 1980లో పెళ్లి చేశారు. వీరి పెళ్లి మద్రాస్ లో జరిగింది.

అయితే గతం లో ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న చిరంజీవి తన పెళ్లి నాటి సంగతులను పంచుకున్నారు. ” సురేఖను నాకు ఇచ్చి పెళ్లి చేసే విషయం లో అల్లు రామ లింగయ్య గారు చాల విషయాలు ఆరా తీశారు. అప్పుడే ఇండస్ట్రీ లో ఎదుగుతున్న నాకు పెళ్లి పై ఆసక్తి లేదు. కానీ నన్ను ఈ పెళ్ళికి ఒప్పించారు. మా వివాహం కుదిరాక కూడా నేను సురేఖతో ఎక్కువ మాట్లాడలేదు.” అని చిరు చెప్పుకొచ్చారు.

అలాగే పెళ్లి సమయం లో కూడా పెద్ద హడావుడే జరిగింది అని చిరంజీవి వెల్లడించారు. ‘ఆ టైమ్లో నేను నూతన్ ప్రసాద్తో కలిసి ‘తాతయ్య ప్రేమలీలలు’ సినిమా చేస్తున్నా అప్పుడు షూటింగ్ నుంచి నేరుగా రావడంతో చిరిగిన బట్టల తోనే తాళి కట్టాను.’ అని చిరు తెలిపారు.

అయితే చిరు పెళ్లి అయ్యి 42 సంవత్సరాలు పూర్తయ్యాయి. వీరికి ముగ్గురు పిల్లలు. కేవలం హీరోనే కాకుండా స్వచ్ఛంద కార్యక్రమాలను చిరంజీవి ప్రారంభించారు. రక్తదానం, నేత్రదానం కార్యక్రమాలకు స్వీకారం చుట్టారు. అలాంటి ఎన్నో ఘనతలు సాధించిన మన మెగాస్టార్ పెళ్లి పత్రిక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరు కూడా ఆనతి పెళ్లి పత్రికని చూడండి.


































అయితే తాజాగా విడుదలైన సినిమాలకి కాకుండా ఎప్పుడో విడిపోయిన సినిమాల్లో కూడా ఈ తప్పులను చూపిస్తూ సోషల్ మీడియాలో ఆడేసుకుంటున్నారు. అయితే రీసెంట్ గా సర్కారు వారి పాట మూవీలో కీర్తి సురేష్ మహేష్ బాబు దగ్గర 25000 డాలర్లు అప్పు తీసుకుంటుంది. కానీ మహేష్ బాబు మాత్రం పదివేల డాలర్లు అప్పు ఇచ్చాను అని తిరిగి ఇవ్వాలని అంటాడు. ఇక దర్శకుడు లాజిక్ మిస్ అవడంతో నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

మలయాళ నటుడు మరియు నిర్మాత అయిన కుంచాకో బోబన్ నటించిన ‘నా తాన్ కేస్ కొడు’ అనే సినిమా 2022 లో ఆగస్ట్ 11న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంది. కమర్షియల్ గాను హిట్ గా నిలిచింది. 5 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం 50 కోట్లను వసూల్ చేసింది. ఈ చిత్రం ఏనాట గా హిట్ అయ్యింది అంటే బాలీవుడ్ చిత్రాలైన అమీర్ ఖాన్, లాల్ సింగ్ చద్దా మరియు అక్షయ్ కుమార్ రక్షా బంధన్ చిత్రాల స్క్రీన్ కౌంట్ను తగ్గించి, ఆ థియేటర్లను ఈ చిత్రం మరిన్ని షోలను వేశారు.
ఈ చిత్ర కథ విషయానికి వస్తే చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ బ్రతికే దొంగ కోజుమ్మల్ రాజీవ్ కూలీ పని చేసే తమిళ అమ్మాయి దేవిని ఇష్టపడతాడు. ఆమె కోసం దొంగతనాలు మానేసి, కూలీగా మారుతాడు. ఆమె ఇంట్లో కలిసి ఉండాలని అనుకుంటారు. ఈ క్రమంలో ఒకరోజు గుడి లో జరిగే భజనకు వెళ్లి తిరిగి వస్తుండగా వేగంగా వస్తున్న ఆటో ను నుండి తప్పించుకుందేనందుకు, పక్కనే ఉన్న ఇంటి గోడ దూకడంతో అక్కడి పెంపుడు కుక్కలు కరుస్తాయి.
వాటి అరుపులకు లేచిన ఇంట్లో వారు అతడి పై దొంగతనం ఆరోపణలు చేస్తారు. ఆ ఇల్లు ఎమ్మెల్యేది కావడంతో పోలీసులు వెనటనే అరెస్ట్ చేస్తారు. కేసు కొరత్కు వెళ్తుంది. కోర్టులో, రాజీవ్ తనకు తెలిసిన పోలీసుగా మారిన న్యాయవాది సహాయంతో తన కేసును తనే స్వయంగా వాదించి, సాక్ష్యాలను తెస్తానని వాగ్దానం చేస్తాడు. అతను సాక్ష్యాలను ఎలా సంపాదించాడు. కోర్టులో ఎలా నిర్దోషి అని నిరూపించుకున్నాడనేది మిగతా స్టోరీ.
ఈ చిత్రాన్ని దర్శకుడు రతీష్ బాలకృష్ణన్ పొదువాల్ చెప్పాలను కున్న పాయింట్ ను చక్కగా, చాలా సహజంగా తెర పై చూపించాడు. కామెడీ సన్నివేశాలు, కుంచాకో బోబన్ నటన ఈ సినిమాకి హైలెట్ గా నిలిచింది. హీరోయిన్ గా గాయత్రీ శంకర్ నటించారు. డాన్ విన్సెంట్ ఈ మూవీకి సంగీతాన్ని సమకూర్చారు




