నాగార్జున తాజా చిత్రం నా సామిరంగా.. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ అవ్వడం కోసం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన హీరోయిన్ ని చిత్ర యూనిట్ పరిచయం చేసింది. ఆమె మరెవరో కాదు అమిగోస్ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన హీరోయిన్ గా నటించిన ఆషికా రంగనాథ్. కన్నడలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఆషికా రంగనాథ్ కి తెలుగులో రెండవది ఈ సినిమా.

నా సామిరంగ సినిమాతో విజయ్ బిన్ని దర్శకుడిగా తెలుగులోకి డెబ్యూ ఇచ్చారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్తో నా సామిరంగ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. కాగా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
తాజాగా మరో క్యారెక్టర్ను ఇంట్రడ్యూస్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే ఆ పోస్టర్ లో ఉన్న హీరోయిన్ మరెవరో కాదు మిర్నా మీనన్.అయితే ఈ సినిమాలో మిర్నా మీనన్ అల్లరి నరేష్ సరసన నటించనుంది. కాగా తాజాగా విడుదల చేసిన ఆ పోస్టర్లో మిర్నా మీనన్ చీరకట్టుకుని, పద్ధతిగా బొట్టు పెట్టుకుని, మెడలో మల్లెపూలతో అచ్చమైన పల్లెటూరి అమ్మాయిగా ఎంతో అందగా కనిపించింది. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతోంది. మిర్నా మీనన్ జైలర్ సినిమాలో రజినీకాంత్ కోడలిగా నటించారు.

వైఎస్ఆర్ బయోపిక్ గా వచ్చిన యాత్ర మూవీలో వైఎస్ఆర్ గా మలయాళ స్టార్ మమ్ముట్టి నటించారు. ఈ మూవీ 2019 ఫిబ్రవరి 8న రిలీజ్ అయ్యింది. ఇక ఇప్పుడు వై.ఎస్.జగన్ బయోపిక్ గా తెరకెక్కుతున్న యాత్ర 2ను సైతం ఈ ఏడాది అదే డేట్ కి రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీలో వైఎస్ జగన్ పాత్రలో తమిళ హీరో జీవా నటిస్తున్నారు. యాత్ర2 లో కూడా మమ్ముట్టి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గా కనిపిస్తున్నారు.
తాజాగా ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ లో వైఎస్ జగన్ పాలిటిక్స్ లోకి రావటానికి కారణాన్ని ఎమోషనల్ చూపించారు. జగన్ ఓదార్పు యాత్ర, వైఎస్ఆర్ డైరీ వంటివి చూపించారు. అయితే టీజర్ లో అందరినీ ఆకట్టుకుంది వైఎస్ఆర్ డైరీ. సగం కాలిన ఆ డైరీలోని ఓ పేజీలో ‘ఆరోగ్య శ్రీ బీమా ఇవ్వాలి.. కేంద్ర నిధులు రావాలి’ అని ఉంది. అలా తన డైరీలో ఆరోగ్య శ్రీ బీమా గురించి రాసుకోవడం చిన్న విషయం కాదు.
ప్రజల గురించి ఎంత ఆలోచించి ఉంటే తప్ప వైఎస్ రాజశేఖర్ రెడ్డి డైరీలో రాసుకోరు. జీవిత ధ్యేయం అయితే కానీ ఎవరు డైరీలో అలా రాసుకోరు అని అంటున్నారు. టీజర్ లో డైరీ కొంచెం కాలిపోయినట్టుగా కనిపిస్తోంది. దాన్ని ఎవరైనా కాల్చరా? లేదా ఏదైనా ప్రమాదం జరిగి కాలినట్టుగా కనిపిస్తుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూశారు. ఆ టైమ్ లో ఈ డైరీ దొరికిందా? అనేది మూవీ రిలీజ్ అయితే కానీ తెలీదు.
ఇప్పుడు ఆ సినిమా వివరాలు, విశేషాలు ఎందుకంటారా అక్కడికే వస్తున్నాం ఈ సినిమాలో హీరోగా దీపక్ నటించాడు. కాగా హీరోయిన్ గా కంచికౌల్ నటించింది. ముస్లిం అమ్మాయిగా నటించి యువత మనసు కొల్లగొట్టింది ఈ భామ. మొదటి సినిమాతోనే మంచి హిట్ కొట్టింది. ఆ తర్వాత ఫ్యామిలీ సర్కస్, మా అశోక్ గాడి లవ్ స్టోరీ, శివరామరాజు వంటి సినిమాల్లో నటించింది.కానీ ఆ తరువాత ఎందుకో అనుకున్నంత సక్సెస్ ని సాధించలేకపోయింది.







