బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన హీరోగా నటించిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. బాలీవుడ్ లో ఎన్నో రికార్డులు సృష్టించారు. బుల్లితెర పై ఎంట్రీ ఇచ్చిన అమీర్ ఖాన్ సంచలనం సృష్టించారు.
అమీర్ ఖాన్ సత్యమేవ జయతే అనే టాక్ షోను కూడా నిర్వహించారు. 2012 లో ప్రారంభం అయిన ఈ షో 2014 వరకు కొనసాగింది. ఈ షో అనేక సామాజిక సమస్యల గురించి వెలుగులోకి తీసుకొచ్చి, వాటి పై చర్చలు జరిపారు. అయితే ఈ టాక్ షో అర్ధాంతరంగా ఆపేశారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ బుల్లితెర పై సత్యమేవ జయతే అనే టాక్ షోతో ఎంట్రీ ఇచ్చాడు. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా, సామాజిక సమస్యల పై రియాలిటీ టాక్ షోను మొదలుపెట్టాడు. సత్యమేవ జయతే మొదటి సీజన్ 2012లో మే 6న ప్రసారం అయ్యింది. ఈ షో డీడీ నేషనల్, స్టార్ వరల్డ్ తో పాటుగా మొత్తం పది ఛానెల్స్ లో ప్రసారం అయ్యింది. ఈ షోలో భారతదేశంలో ప్రబలంగా ఉన్న ఆడపిల్లల భ్రూణహత్యలు, పిల్లల లైంగిక వేధింపులు, అత్యాచారం, పరువు హత్యలు, గృహ హింస లాంటి సున్నితమైన సామాజిక సమస్యల పై దృష్టి సారించింది.
అంటరానితనం, వివక్ష, ప్రత్యామ్నాయ లైంగికతలను అంగీకరించడం, విషపురుషత్వం, మద్యపానం మరియు నేర రాజకీయాల మెడికల్ మాఫియా గురించి ఈ షోలో చర్చించారు. యువత వారి లక్ష్యాలను సాధించడానికి, ప్రేక్షకులను ప్రోత్సహించడానికి గొప్ప విజయాలు సాధించి, గుర్తింపు పొందని వ్యక్తులను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ షో సాగింది. పౌరులకు వారి దేశం గురించిన సమాచారంలో సాధికారత కల్పించడం మరియు చర్య తీసుకోవాలని వారిని కోరడం కూడా దీని లక్ష్యం. ఈ షో హిందీ, బెంగాలీ, మలయాళం, మరాఠీ, తమిళం, తెలుగు లాంటి 8 భాషలలో ఏకకాలంలో ప్రసారం చేయబడింది. అందరికి రీచ్ కావడానికి వీలుగా ఇంగ్లీష్ లో సబ్ టైటిల్స్ ప్రసారం చేశారు.
ఈ షో మూడు సీజన్లను పూర్తి చేసుకుంది. సత్యమేవ జయతే మొదటి సీజన్ కు 165 దేశాల నుండి బిలియన్ డిజిటల్ ఇంప్రెషన్లను పొందింది. పలు దేశాలలో వ్యూయర్స్ నుండి ప్రతిస్పందనలతో, మిలియన్ల మంది ప్రజలు ఈ షోకు మద్దతు ఇచ్చారు. రెండో సీజన్ను 600 మిలియన్ల మంది ఇండియన్స్ చూశారు. అయితే ఈ షో కొన్ని కారణాల వల్ల ఆపేశారు. ఎందుకనేది తెలినప్పటికి సమాజంలో జరిగే ఎన్నో విషయాల గురించి ఈ షో మాట్లాడింది. ఈ షోకి మరిన్ని సీజన్స్ వస్తే బాగుంటుంది అని అందరూ అనుకుంటున్నారు.
Also Read: ఎవరు ఈ పక్కింటి కుర్రాడు… ఇతని అసలు పేరేంటి..? ఏ కారణంతో అరెస్టు చేశారు..?

‘ఓ మై బేబీ’ సాంగ్ రిలీజ్ అయినప్పటి నుండి గుంటూరు కారం యూనిట్ మీద మహేష్ ఫ్యాన్స్ ట్రోల్ చేయడం దానిపై పాట రచయిత రామజోగయ్య శాస్త్రి ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్ట్ చేయడంతో ఆన్ లైన్ వార్ మొదలు అయ్యింది. ఈ నేపథ్యంలో రామజోగయ్య శాస్త్రి సోషల్ మీడియా అకౌంట్ కూడా డిలీట్ చేసారు. ఈ ట్రోలింగ్ పై నిర్మాత నాగవంశీ రెస్పాండ్ కావడం మరింత హాట్ టాపిక్ కి దారి తీసింది. ఆ తరువాత ఆ పోస్ట్ డిలీట్ చేసాడు. ఇలా ఇద్దరు వెనక్కి తగ్గడానికి కారణం సూపర్ స్టార్ మహేష్ బాబు క్షమాపణ చెప్పడమే అంటూ ఒక పోస్ట్ నెట్టింట్లో వైరల్ అయ్యింది.
ఆ పోస్ట్ లో “నాగవంశీ తన ట్వీట్లను తొలగించాడు. అతను ఫ్యాన్స్ గురించి ఫాల్స్ స్టేట్మెంట్స్ చేశాడు. మహేష్బాబు చిత్ర యూనిట్ ఫ్యాన్స్ పై సోషల్ మీడియాలో ఉపయోగించిన భాషతో అప్ సెట్ అయ్యాడు. అది చాలా తప్పు అనేలా చెప్పారు. మహేష్ అన్నకి తన ఫ్యాన్స్ అంటే ఎంత పిచ్చి అనేది అర్దమైందా? వర్క్ తో మాట్లాడదాము, ఇంప్రెస్ చేద్దాము. వాళ్ళు చెప్పారు అంటే వూరికే చెప్పరు. ఏదైనా అని ఉంటే నా తరుపున క్షమించండి, రామజోగయ్య గారు, తిరిగి వర్క్ కు రండి. నెక్ట్స్ పాట అదిరిపోయేలా రాయండి అనేలా చెప్పారంట.
ప్రొడక్షన్ హౌస్ మరియు నిర్మాతలు తెలుసుకోవలసిన విషయం, ఎండ్ ఆఫ్ ద డే అభిమానులే అంతా, వాళ్లకోసమే సినిమాలు తీసేది అనే స్టేట్మెంట్ ఉంటుంది ఏ హీరో నుండి అయినా, అట్లాంటిది వారిని జడ్జ్ చేయవద్దు. మీ చెత్త ప్రవర్తన వల్ల మా హీరో మాకు సారీ ఫిల్ అవడం మాకు ఇష్టం ఉండదు. మా అన్నయ సినిమా అండి.సెలెబ్రేషన్స్ మేము చేసుకుంటాము అంటే అర్ధం, సెలెబ్రేషన్స్ చేసేలా సాంగ్స్ ఇవ్వాలి అని, బలవంతంగా రుద్దడం కాదు. ఓవర్ ఆల్ గా ఇక్కడితో పంచాయితీ అయిపొయింది. అదిరిపోయే కంటెంట్ మీరు మాకు ఇవండి. దాన్ని నెక్స్ట్ లెవల్ సెలెబ్రేషన్స్ మేము చూసుకుంటాము” అని చెప్పుకొచ్చారు.
రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం యానిమల్. ఈ చిత్రంలో బాబీ డియోల్, అనిల్ కపూర్, త్రిప్తి దిమ్రి, శక్తికపూర్, బబ్లూ పృథ్విరాజ్ కీలక పాత్రలలో నటించారు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా రిలీజ్ అయ్యి, సంచలన విజయం సాధిచింది. రూ. 760 కోట్ల పైగా సాధించి, పలు రికార్డులను బ్రేక్ చేసింది. ఈ మూవీలో నటించిన త్రిప్తి దిమ్రి లాంటివారికి మంచి గుర్తింపు లభించింది. ఆమె ఓవర్ నైట్ లో స్టార్ గా మారిన విషయం తెలిసిందే. ఈ మూవీలో నర్స్ పాత్రలో హిందీ సీరియల్ నటి దీప్తి పాటిల్ నటించారు.
దీప్తి పాటిల్ ముంబైలో పంజాబీ కుటుంబంలో పుట్టి పెరిగింది. ప్రస్తుతం ముంబైలో నివసిస్తోంది. ఆమె యాక్టింగ్ కెరీర్ 2018లో పాపులర్ స్టార్ ప్లస్ షో అయిన “యే హై మొహబ్బతేన్” తో ప్రారంభం అయ్యింది. ఆ షోతో బ్రేక్ రావడంతో అవకాశాలు వచ్చాయి. అలా రామన్ అకా కరణ్ పటేల్ యొక్క నర్సుగా. ఆమె సుమారు 20 ఎపిసోడ్లలో నటించింది. “యే రిష్టే హై ప్యార్ కే” ద్వారా గుర్తింపును తెచ్చుకుంది.
ఆ తరువాత దీప్తి పాటిల్ పలు పౌరాణిక మరియు క్రైమ్ షోలలో నటించింది. అలా గుర్తింపు తెచ్చుకున్న దీప్తి పాటిల్ డైరెక్టర్ సందీప్ వంగా యనిమాల్ మూవీలో రణబీర్ కపూర్, రష్మిక ఇంట్లో ఉండే నర్స్ క్యారెక్టర్ కు తీసుకున్నారు. ఈ మూవీతో ఆమె పాపులర్ అయ్యారు. దీప్తి పాటిల్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ, తరచూ తనకు సంబడనహించి ఫోటోలు, రీల్స్ ను షేర్ చేస్తుంటారు. ఆమెను ఇన్ స్టాగ్రామ్ లో 36 k కు పైగా ఫాలోవర్లు ఉన్నారు.
1. ప్రభాస్:
2. విక్టరీ వెంకటేష్:
3. సూర్య:
4. అజిత్:
5. విక్రమ్:
6. జయం రవి:
7. దళపతి విజయ్:
ఈ జంట కోలీవుడ్ హిట్ పెయిర్స్ లో ఒకరిగా నిలిచారు. త్రిష, విజయ్ నటించిన సినిమాలు గిల్లి, కురువి, తిరుపాచి. ఆది మరియు లియో.
ఈమె ఒక బ్రాహ్మణ ఫ్యామిలిలో జన్మించింది. ఆమె తండ్రి దీపనాథ్ సేన్, తల్లి బెంగాలీ నటి సుచిత్రా సేన్. ఈమె షిల్లాంగ్ లోని లోరెటో కాన్వెంట్లో, కోల్కాతాలోని లోరెటో హౌస్లో చదువుకుంది. చిన్నప్పటి నుండి తల్లి సుచిత్రా సేన్ తో కలిసి సినిమా షూటింగ్ లకు వెళ్లడంతో ఆమెకు నటన పై ఆసక్తి కలిగింది. ఆమె ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వాలి అనుకున్నప్పుడు చాలా మంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆమె పెళ్లి, పిల్లలు అయిన తరువాత సినిమాలలో యాక్టింగ్ ప్రారంభించింది.
మూన్ మూన్ సేన్ నటిగా మారక ముందు మోడల్గా చేశారు. ఎన్నో వాణిజ్య ప్రకటనలలో నటించి అనేక వివాదాలకు కారణమైంది. 1984లో ఆమె అనిల్ కపూర్ నటించిన ‘ఆనంద్ బహర్’ చిత్రంతో బాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఈ మూవీకి ముందు ఆమె అనేక బెంగాలీ సినిమాలలో నటించింది. అప్పటికే తల్లి అయిన ఆమె ఎక్కువగా గ్లామర్ పాత్రలలో నటించడం వల్ల , ఒక వర్గం ఆడియెన్స్ మరియు సినీ క్రిటిక్స్ నుండి విమర్శలకు గురి అయ్యింది. హిందీలో అగ్ర నటులతో నటించింది.
ఆమె 1986లో సిరివెన్నెల చిత్రంతో తెలుగులోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో హీరోకు తన కళ్లను దానం చేసే జ్యోతిర్మయి పాత్రలో ఆమె అద్భుతంగా నటించారు. ఆ మూవీకి నంది అవార్డ్ కూడా అందుకుంది. ఆ తరువాత, 1987లో అక్కినేని నాగార్జునతో మజ్ను సినిమాలో నటించింది.
ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం అందుకుంది. ఆమె ఎన్ని భాషలలొ నటించిన బెంగాలీ చిత్రాలలో కొనసాగారు. ఆమె చివరిగా 2019 రిలీజ్ అయిన ‘భోబిష్యోటర్ భుట్’ అనే చిత్రంలో కనిపించింది. మూన్ మూన్ సేన్ ఇద్దరు కుమార్తెలు రైమా సేన్, రియా సేన్ లు యాక్టింగ్ నే కెరీర్ గా ఎంచుకున్నారు.








ప్రస్తుతం కేంద్ర మంత్రిగా సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న స్మృతి అంత తేలికగా ఈ స్థాయికి రాలేదు. ఆమె లైఫ్ లో చాలా కష్టపడ్డారు. స్మృతి డిల్లీలో జన్మించారు. ఆమె తండ్రి పంజాబీ, తల్లి బెంగాలీ. వారు ప్రేమ వివాహం చేసుకున్నారు. పెద్దలు అంగీకరించకపోవడంతో బయటకొచ్చి వివాహం చేసుకున్నారు. దక్షిణ దిల్లీ శివార్లలో నివసించేవారు. చేతిలో డబ్బు లేకపోవడంతో వారు పశువుల కొట్టాన్ని చూసుకునే పని చేసేవారు. స్మృతి అక్కడే జన్మించింది. ఆమెకు ఇద్దరు చెల్లెల్లు ఉన్నారు. పేదరికం వల్ల చదువుకుంటూనే కొన్ని బాధ్యతలు ఆమె మోయాల్సి వచ్చింది.
పదవ తరగతి చదివేటప్పుడు చిన్న చిన్న జాబ్స్ చేస్తూ ఉండేది. ఆ తరువాత ఇంటర్మీడియట్ పాస్ అయినా, ఆర్థిక పరిస్థితులు వల్ల కాలేజీ మానేసి, దూరవిద్యలో చదవడం ప్రారంభించింది. తన ఫ్యామిలీ ఆర్ధికంగా సాయం చేయడానికి, ఢిల్లీలో బ్యూటీ ప్రొడక్ట్స్ ని మార్కెటింగ్ చేయడం మొదలుపెట్టింది. అయితే ఆ టైమ్ లో ఫ్రెండ్ సలహాతో మిస్ ఇండియా పోటీలకు తన ఫోటోను పంపారు. 1998లో మిస్ ఇండియాకు ఎంపికయ్యారు. అయితే, ఆమె తండ్రి అందులో పాల్గొనడానికి ఒప్పుకోలేదు. అయితే ఆమె తల్లి కష్టపడి డబ్బు సర్దుబాటు చేసి స్మృతిని ఆ పోటీకి పంపింది. స్మృతి ఫైనల్స్కు వెళ్ళిన ఆమె గెలవలేకపోయారు.
ఆ డబ్బును తల్లికి ఇవ్వడం కోసం స్మృతి జాబ్ కోసం వెతకడం మొదలుపెట్టింది. అయితే ఆమె ప్రయత్నాలు ఫలించలేదు. కొన్ని రోజుల ఒక ప్రకటనలో ఛాన్స్ వచ్చింది. దాని ద్వారా టీవీలో రెండు మూవీ ప్రోగ్రామ్స్ కు యాంకరింగ్ ఛాన్స్ లభించింది. వీటిని చూసిన శోభా కపూర్ తన కుమార్తె ఏక్తా కపూర్ కు స్మృతిని పరిచయం చేసింది. అలా స్మృతికి ‘క్యోకీ సాస్ బీ కభీ బహూ థీ’ అనే టెలివిజన్ సీరియల్ లో తులసి పాత్రకు సెలెక్ట్ అయ్యింది. ఆ సీరియల్ ఆమె లైఫ్ ని మలుపు తిప్పింది. 8 ఏళ్ళ పాటు స్మృతి ఆ సీరియల్ లో కనిపించింది. టీవీ యాక్టర్లకు ఇచ్చే అత్యుత్తమ అవార్డు అయిన ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డు ఆమె వరసగా 5 సార్లు అందుకుని హిస్టరీ క్రియేట్ చేసింది.
ఆ తరువాత ఒక నిర్మాణ సంస్థ స్థాపించి పలు సీరియల్స్ నిర్మించింది. 2001లో పార్సీ బిజినెస్ మెన్ జుబిన్ ఇరానీని పెళ్లి చేసుకోవడంతో స్మృతి ఇరానీగా పాపులర్ అయ్యారు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. స్మృతి తాత ఆర్ఎస్ఎస్ లో పని చేసేవాడు. దాంతో స్మృతి చిన్నప్పటి నుంచే అందులో సభ్యురాలుగా ఉంది. నిర్మాతగా ఉన్నపుడే ఆమె రాజకీయాలలో అడుగుపెట్టింది. 2003లో బిజెపిలో జాయిన్ అయ్యింది. ఆ పార్టీలో వివిధ స్థాయిలలో పార్టీ కోసం కృషి చేసిన పనిచేసిన స్మృతి ఇరానీ 2014 లో మోది గవర్నమెంట్ లో మానవ వనరుల శాఖకు మంత్రి అయ్యింది. అప్పటి నుండి పలు శాఖలలో మంత్రిగా పనిచేశారు.