సాధారణంగా మన సౌత్ హీరోలు ఎక్కడికి వెళ్లినా కూడా చాలా సింపుల్ గా వెళ్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇటీవల మహేష్ బాబు కూడా యానిమల్ ఈవెంట్ కి అలాగే చాలా సింపుల్ గా వెళ్లారు. మహేష్ బాబు మామూలుగానే ఏ ఫంక్షన్ కి అయినా కూడా ఇంతే సింప్లిసిటీతో వెళ్తారు. తన ఈవెంట్స్ కి కూడా ఇలాగే హాజరు అవుతారు.
ఇది మహేష్ బాబు ఎన్నో సంవత్సరాల నుండి చేస్తున్నారు. ఎన్ని ట్రెండ్స్ మారినా కూడా మహేష్ బాబు మాత్రం ఇలాగే సింపుల్ గా ఉన్నారు. అంతకుముందు సుధీర్ బాబు కూడా ఒక ఇంటర్వ్యూలో చెబుతూ మహేష్ బాబు ఎక్కువగా రెండు, మూడు కలర్స్ మాత్రమే ఎక్కువ వాడుతారు అని, తన వార్డ్ రోబ్ లో కేవలం కొన్ని బట్టలు మాత్రమే ఉంటాయి అని చెప్పారు.

అయితే మహేష్ బాబు నిన్న యానిమల్ ఈవెంట్ కి వేసుకు వచ్చిన టీషర్ట్ మాత్రం ప్రస్తుతం చర్చల్లో నిలిచింది. చాలా సింపుల్ గా వచ్చేసారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దాంతో అసలు ఈ షర్ట్ ఎక్కడ దొరుకుతుంది అంటూ సోషల్ మీడియాలో అందరూ వెతకడం మొదలుపెట్టారు. చివరికి దొరికింది. ఈ షర్ట్ గివెంచి బ్రాండ్ తయారు చేశారు. చాలా సింపుల్ గా ఉంది అని అందరూ అనుకుంటున్నారు. కానీ ధర మాత్రం అలా లేదు. ఈ షర్ట్ ధర అక్షరాలా 47 వేల రూపాయలు. మీరు విన్నది కరెక్టే. దీని ధర వందలు కాదు వేలు. అది కూడా 47 వేలు.

సాధారణంగా సెలబ్రిటీలు అందరూ కూడా బ్రాండెడ్ వస్తువులని, బ్రాండెడ్ దుస్తులని వాడుతారు కాబట్టి అవి చూడడానికి మామూలుగా అనిపించినా కూడా ధర మాత్రం ఒక రేంజ్ లో ఉంటుంది. ఇంక సెలబ్రిటీలు కాబట్టి వారి లైఫ్ స్టైల్ అలాగే ఉంటుంది. దాంతో ఇదేంటి ఇంత సింపుల్ గా వచ్చేసారు అని అనుకున్న వాళ్ళు అందరూ కూడా ఈ ధర చూసిన తర్వాత షాక్ అవుతున్నారు. ఇంకా సినిమాల విషయానికి వస్తే మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా తర్వాత రాజమౌళితో ఒక సినిమా చేస్తారు.
ALSO READ : రిలీజ్ అయిన ఏడాది తర్వాత సడెన్ గా ఓటిటి లోకి వచ్చిన ఈ సినిమా చూశారా? మంచి ఫీల్ గుడ్ మూవీ…!


















ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ లో తండ్రి కొడుకుల సెంటిమెంట్ హైలైట్ గా నిలిచింది. ఆడియెన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ ట్రైలర్ చూసిన తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఒక తెలుగు మూవీలా అనిపించింది. ఆ మూవీలో హీరో వెంకటేష్ హీరోగా నటించారు. అదే ధర్మచక్రం. ఈ మూవీకి సురేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. 1996 లో రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీలో గిరీష్ కర్నాడ్ వెంకటేష్ తండ్రి పాత్రలో నటించారు. ఆ సినిమా కూడా తండ్రీ, కుమారుల రిలేషన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది.
ధర్మచక్రంలో వెంకటేష్ అగ్రెసివ్, యారిగెంట్ యాటిట్యూడ్తో కనిపిస్తాడు. ఇక యానిమల్ మూవీలో కూడా రణ్బీర్ కపూర్ కూడా అలాగే కనిపించడంతో సందీప్ రెడ్డి ధర్మచక్రం సినిమా నుండే యావిమల్ స్టోరీ లైన్ను తీసుకున్నారంటూ సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. కాపీ, లేదా ఇన్స్పిరేషన్ అనేది తెలియదు కానీ సందీప్ రెడ్డి దొరికిపోయారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.