అంకుశం రామిరెడ్డి గురించి 90ల తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో విలన్ గా రామిరెడ్డి ఏ రేంజ్ లో ప్రేక్షకులను కనికట్టు చేశారంటే ‘అంకుశం’ మూవీ తరువాత ఆయనను చూస్తేనే తిట్టు కునేవారంట.
ఇక అమ్మోరు మూవీలో చూసిన తరువాత ఆడవాళ్ళు రామిరెడ్డిని చూస్తేనే భయపడేవారంట. అంతగా తన నటనతో విలనిజానికి కొత్త అర్థాన్ని ఇచ్చిన నటుడు రామిరెడ్డి. కానీ రియాల లైఫ్ లో రామిరెడ్డికి చాలా నిర్మలమైన వ్యక్తిగా పేరుంది. తెలుగులోనే కాదు బాలీవుడ్ ను ఏలిన యాక్టర్ రామిరెడ్డి.
రామిరెడ్డి టాలీవుడ్ లో అంకుశం సినిమా ద్వారా నట జీవితాన్ని మొదలుపెట్టారు. ఈ మూవీలో ‘స్పాట్ పెడుతా’ అనే ఒక్క డైలాగ్తో ఆడియెన్స్ భయపడేలా చేశారు. దాంతో ఆయన పేరు అంకుశం రామిరెడ్డిగా మారింది. అసలు పేరు గంగసాని రామిరెడ్డి, ఆ మూవీ తరువాత వరుసగా అవకాశాలు రావడంతో అప్పట్లో ఉన్న స్టార్ హీరోలందరితోనూ నటించారు. రామి రెడ్డి ఇండియాలోని అన్ని భాషల సినిమాలలో నటించారు.
1959లో జనవరి 1న జన్మించిన రామిరెడ్డి కెరీర్ మొదట్లో సినిమాల వైపు దృష్టి సారించలేదు. జర్నలిస్ట్ కావాలనే ఉద్దేశ్యంతో హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజంలో గ్రాడ్యుయేషన్ చేశారు. అది పూర్తి కాగానే ఒక వార్తాపత్రికలో జర్నలిస్ట్గా చేరారు. అందులో భాగంగా సినీ సెలెబ్రెటీల ఇంటర్వ్యూలను రామిరెడ్డి తీసుకునేవారు. ఆ క్రమంలో రామిరెడ్డి ఒకసారి ప్రముఖ డైరెక్టర్ కోడి రామకృష్ణ ఇంటర్వ్యూ కోసం వెళ్లారు. అప్పుడు రామిరెడ్డి ప్రతిభను చూసి ముగ్ధుడైన కోడి రామకృష్ణ తను తీయబోయే సినిమాలో రామిరెడ్డికి విలన్ క్యారెక్టర్ ఇచ్చారు.
అలా వీరిద్దరి కాంబోలో వచ్చిన మూవీనే అంకుశం. ఈ మూవీ రిలీజ్ అయ్యి, బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ మూవీనే రామిరెడ్డి కెరీర్ కి టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. ఈ మూవినే బాలీవుడ్ లో ప్రతిబంధ్ టైటిల్ తో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రీమేక్ చేశారు. ఆ మూవీలో కూడా విలన్ గా రామిరెడ్డి నటించాడు. అక్కడ ప్రతిబంద్ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీతో చిరంజీవి కంటే విలన్ గా నటించిన రామిరెడ్డి యాక్టింగ్ బాలీవుడ్ ఇండస్ట్రీ ఫిదా అయింది. దాంతో బాలీవుడ్ లో రామిరెడ్డి భారీగా అవకాశాలు వచ్చాయి.
90వ దశకంలో, బాలీవుడ్లో రామిరెడ్డి పాపులర్ ఫేస్గా నిలిచారు. తెలుగు, హిందీలో నటిస్తూనే రామిరెడ్డి ఇతర భాషల్లో కూడా నటించి మెప్పించారు. అలా ఆయన కెరీర్ మొత్తంలో దాదాపు 250కి పైగా చిత్రాలలో నటించారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో అమ్రిష్ పూరి, ప్రేమ్ చోప్రా, డానీ డెంజోంగ్పా,అమ్జాద్ ఖాన్, గుల్షన్ గ్రోవర్ వంటి విలన్లకు ఏ విధంగా తీసిపోని అరుదైన యాక్టర్ అయిన రామిరెడ్డి జీవితం మాత్రం అర్ధాంతరంగా ముగిసిపోయింది.
రామిరెడ్డి చివరి వరకు తన నటనతో ఆడియెన్స్ ని అలరించాలని కోరుకున్నారు. కానీ 2010లో ఆయన ఆరోగ్యం క్షీణించడం మొదలుపెట్టింది. కాలేయ క్యాన్సర్తో ఉందని వైద్యులు గుర్తించి, రామిరెడ్డికి తెలిపారు. రోజురోజుకు ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. ఆఖరి రోజుల్లో అయితే రామిరెడ్డి గుర్తుపట్టలేని విధంగా మారిపోయారు. చివరికి 2011 లో ఏప్రిల్ 14న 52 ఏళ్ల వయసులో రామిరెడ్డి కన్నుమూశారు.
చనిపోయే కొద్ది రోజుల ముందు నుండే భార్య, పిల్లలు ఏమవుతారనే ఆలోచనతో ఆయన నరకం అనుభవించారని రామిరెడ్డి సన్నిహితులు చెబుతుంటారు. రామిరెడ్డికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారని తెలుస్తోంది. ఆయన కుమారుడు ప్రస్తుతం తండ్రి రామిరెడ్డి పేరుతో స్వీట్ షాప్ నడుపుకుంటూ జీవిస్తున్నారని తెలుస్తోంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా విడుదల అవుతుందంటే అభిమానులు ఎలా సంబరాలు జరుపుకుంటారో తెలిసిందే. ఒకవైపు వర్షం పడుతున్నప్పటికీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమాత్రం తగ్గడం లేదు. థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ జాతర చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల దగ్గర అర్ధరాత్రి నుంచే ఫ్యాన్స్ సంబరాలు ప్రారంభం అయ్యాయి.
పవన్ కళ్యాణ్, మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తొలిసారి కలిసి నటించిన చిత్రం బ్రో. ఈ మూవీ తమిళ హిట్ సినిమా వినోదయ సిత్తంకు రీమేక్ గా తెరకెక్కింది. ఒరిజినల్ మూవీతో పోలిస్తే తెలుగు నెటీవీటికి తగ్గట్టుగా చాలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతాన్ని అందించారు. ఈ మూవీలో కేతిక శర్మ, ప్రియా వారియర్, రోహిణి కీలక పాత్రలలో నటించారు.
ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాని మీమ్స్ శాసిస్తున్నాయి. గతంలో వెస్ట్రన్ కంట్రీస్ లోనే ఈ ట్రెండ్ ఉండేది. ప్రస్తుతం ఇండియాలో కూడా మీమ్స్ బాగా పెరిగిపోతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయ్యే చిత్రాల పై కూడా ఫన్నీ మీమ్స్ చేసి నెటిజన్లు నెట్టింట్లో సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రిలీజ్ అయిన బ్రో మూవీ రిలీజ్ పై కూడా నెట్టింట్లో పలు మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా చూసేయండి..
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.






ఈ షో తొలి సీజన్ కి జూనియర్ ఎన్టీఆర్, రెండవ సీజన్ కి హీరో నానిలు హోస్ట్ గా చేశారు. ఆ తరువాత సీజన్స్ కి కింగ్ నాగార్జున హోస్ట్ గా కొనసాగుతున్నారు. ఇప్పటివరకు 6 సీజన్లు పూర్తికాగా, ఏడవ సీజన్ త్వరలోనే మొదలు కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రోమో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఏడవ సీజన్ లో పాల్గొనే కంటెస్టెంట్స్ లిస్ట్ అని సోషల్ మీడియాలో ఒక వార్త షికారు చేస్తోంది.
ఆ లిస్ట్ ప్రకారం, బిగ్ బాస్ సీజన్ 7 లో ఈటివి ప్రభాకర్, యాంకర్ నిఖిల్, ఢీ కొరియోగ్రాఫర్ పండు, సింగర్ మోహన భోగరాజు, టిక్ టాక్ దుర్గారావు జంట, హీరో సాయిరోనక్, యాంకర్ విష్ణుప్రియ, జబర్దస్త్ వర్ష, సీరియల్ నటి శోభా శెట్టి లతో ఇప్పటికే ఒప్పందాలు జరిగినట్లుగా సమాచారం. మొత్తం 21 కంటెస్టెంట్స్ లో లీక్ అయ్యింది ఈ పది పేర్లు మాత్రమే.
మిగిలిన కంటెస్టెంట్స్ పేర్లు మరికొన్ని రోజుల్లో రివీల్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అగ్రిమెంట్ల విషయంలో కొంత జాప్యం జరుగుతున్నందున స్టార్ మా ఛానెల్ కూడా షో ఎప్పటి నుంచి మొదలుపెడతారనే విషయం చెప్పడం లేదు. ప్రస్తుతానికి సెప్టెంబర్ ఫస్ట్ వీక్ టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇటీవలే బిగ్ బాస్ టీమ్ కి ఏపీ హై కోర్టు నోటీసులు పంపిన విషయం తెలిసిందే.



















