సూపర్ టాక్ తో బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న మలయాళ మూవీ 2018. కేరళలో సంభవించిన వరదల నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమా మళయాలంలో ఇప్పటివరకు 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. రీసెంట్ గా మిగతా భాషల్లో కూడా విడుదలై సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకుంటుంది. ఆల్రెడీ తెలుగులో 5 రోజుల్లో 5 కోట్లకు పైగా రాబట్టి హిట్ అనిపించుకుంది.
అయితే ఈ సినిమా ఓటీటీ విషయంలో అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను కొన్న సోనీ లివ్.. ఈ సినిమాను డిజిటల్ ప్రీమియర్గా అందుబాటులోకి అతి త్వరలో తీసుకువస్తుంది. దీనికి సంబంధించిన సోనీలివ్ ఓ ప్రకటన కూడా చేసింది. ఈ సినిమాను సోనిలీవ్ జూన్ 07న తీసుకువస్తున్నట్లు ప్రకటించింది.

మలయాళంలో ఈసినిమా విడుదలై ఈ రోజుకి 26 రోజులు అవుతుంది. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మరో ఎనిమిది రోజుల్లో ఓటిటి లోకి రావాల్సివుంది. అన్ని భాషలకు గాను ఈసినిమా డిజిటల్ రైట్స్ ను సోనీ లివ్ సొంతం చేసుకుంది.దాంతో సోనీ లివ్ జూన్ 7న ఈసినిమాను స్ట్రీమింగ్ లోకి తీసుకురావడానికి సిద్దమవుతుంది.

గురువారం జరిగిన 2018 సక్సెస్మీట్లో ఈ సినిమా తెలుగు ఓటీటీ రిలీజ్ డేట్పై అల్లు అరవింద్తో పాటు బన్సీవాస్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. మినిమం రెండు వారాల గ్యాప్ ఉంటే బాగుండేదని పేర్కొన్నారు. అయితే థియేటర్లలో విడుదలైన పది రోజుల్లోనే 2018 తెలుగు వెర్షన్ ఓటీటీలో రిలీజ్ కానుంది. ఇప్పటికీ ప్రతిరోజు కోటికిపైగా కలెక్షన్స్ రాబడుతూ ట్రేడ్ వర్గాలను విస్మయపరుస్తోంది ఈ చిత్రం.

2018 మూవీలో టోవినో థామస్, వినీత్ శ్రీనివాసన్, కుంచకో బోబన్, లాల్, అపర్ణ బాలమురళి కీలక పాత్రలను పోషించారు. గత నెలలో మలయాళంలో రిలీజైన మూవీ 160 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. మలయాళ సినీ చరిత్రలో అత్యధిక కలెక్షన్స్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది. 2018లో వచ్చిన కేరళ వరదల నేపథ్యంలో సర్వైవల్ థ్రిల్లర్గా దర్శకుడు జూడ్ ఆంథోనీ జోసెఫ్ ఈ సినిమాను తెరకెక్కించారు.
Also read: “విరూపాక్ష” సినిమాలో అసలు పాయింట్ మర్చిపోయారుగా..? అది ఏంటంటే..?








































తొలివలపు అనే మూవీతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన స్నేహ, ఆ తరువాత ప్రియమైన నీకు, హనుమాన్ జంక్షన్, వెంకీ, సంక్రాంతి, శ్రీరామదాసు, సన్నాఫ్ సత్యమూర్తి వంటి ఎన్నో చిత్రాలలో నటించి గుర్తింపును సొంతం చేసుకుంది. ఇప్పటికీ స్నేహకు ఆడియెన్స్ లో క్రేజ్ ఎక్కువగానే ఉంది. ఇండస్ట్రీలో కొనసాగుతూ తన వయసుకు తగ్గ క్యారెక్టర్ లో నటిస్తూ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటుంది. స్నేహ తమిళ నటుడు ప్రసన్న ను పెళ్లి చేసుకుంది. ఈ జంటకి పాప మరియు బాబు ఉన్నారు.
ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నటి స్నేహ మాట్లాడుతూ తన తల్లిదండ్రులకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు అని అన్నారు. కుమార్తెలలో తాను చివరి దానినని, తన బామ్మ తనకు బదులు కుమారుడు పుట్టాలని కోరుకుందని తెలిపింది. కూతురు పుట్టేసారికి ఆమె తన ముఖాన్ని 3 రోజుల వరకు చూడడానికి కూడా ఇష్టపడలేదని స్నేహా చెప్పుకొచ్చింది.
బాల్యంలో తాగే నీళ్లు పక్కనే ఉన్నా సోదరులకు వాటిని తామే ఇవ్వాల్సి వచ్చేదని, అదేం పద్దతి అని అడిగితే మేము మగవాళ్ళం అని, ఆడపిల్లలు కాబట్టి ఇంటి పనులు మీరే చేయాలని చెప్పేవారని అన్నారు. తన పెద్ద అన్నయ్య ముఖ్యంగా తనను చాలా ఇబ్బందులకు గురి చేసేవాడని, పనులు అన్ని తననే చేయమని ఆర్డర్ వేసేవాడని స్నేహ వెల్లడించారు.
ఇప్పటికే ఈ సినిమా పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. గతంలో రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ సినిమా పై మరింత ఆసక్తిని పెంచింది. సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంతా వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్న టైటిల్ తో పాటుగా ఈ మూవీ నుండి ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. దీనిని చూస్తుంటే మూవీ దుమ్ము లేపడం పక్కా అన్నట్టుగా ఉంది. మహేష్ బాబు మాస్ స్ట్రైక్ బాక్సాఫీస్ ని ఈసారి గట్టిగానే ఢీ కొట్టేట్టు ఉందని అంటున్నారు. గుంటూరు మిర్చి కారం ఎంత ఘాటు ఉంటుందో గ్లింప్స్ తో శాంపిల్ చూపించారు.
పోకిరి మూవీలో సిగరెట్ తాగుతూ కనిపించిన ప్రిన్స్, ఈ మూవీలో మళ్ళీ సిగరెట్ తో ఊర మాస్ గా కనిపించారని ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు. ఈ గ్లింప్స్ లో ఫైట్ సీన్ కనిపించింది. అయితే తాజా వినిపిస్తున్న టాక్ ప్రకారం ఆ ఫైట్ ఎపిసోడే ఈ సినిమాకు మేజర్ హైలైట్ కానుందని తెలుస్తోంది.
ఈ చిత్రాన్నిఎస్ రాధాకృష్ణ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తుండగా, శ్రీలీల కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి జనవరి 13న రిలీజ్ చేయనున్నారు.