స్టార్ హీరోయిన్ సమంత నటించిన పీరియాడికల్ మూవీ శాకుంతలం. భారీ అంచనాల మధ్య ఏప్రిల్14న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్గా నిలిచింది. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ పాన్ ఇండియా సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది.
‘గుణ టీం వర్క్స్’ ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై నీలిమ గుణ, దిల్ రాజు కలిసి ఈ సినిమాలో మలయాళ నటుడు దేవ్ మోహన్ ప్రధాన పాత్రలో నటించారు. అలాగే అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించింది. అయితే తాజాగా ఆ మూవీ గురించి తన యూట్యూబ్ ఛానల్లో పరుచూరి గోపాలకృష్ణ రివ్యూ ఇచ్చారు.

శకుంతల పాత్రలో సమంత అద్భుతంగా నటించారని విశ్లేషించిన పరుచూరి గోపాలకృష్ణ… గుణశేఖర్ కథను రాసిన విధానం, సినిమాను తెరకెక్కించిన విధానం బాగున్నాయన్నారు. అయితే సెకండ్ హాఫ్ వల్లే సినిమా క్లిక్ కాలేకపోయి ఉండొచ్చని అన్నారు. శకుంతల గర్భం దాల్చిన తర్వాత భర్త దుష్యంతుడిని కలవడం కోసం రాజ్యానికి వెళ్లడం.. అక్కడ ఆమెను అవమానించడం రాళ్లతో కొట్టడం వంటి సన్నివేశాలు సినిమాలో బాగా చూపించారు అని ఆయన అన్నారు.

శకుంతల, దుష్యంతులు కలుస్తారా? లేదా? అనే ఆసక్తి ఫస్టాఫ్లో ప్రేక్షకుల్లో క్రియేట్ చేశారు. కానీ సెకండాఫ్లో ఉంగరాన్ని చూసిన వెంటనే రాజుకు గతం గుర్తుకురావడం.. వంటి సీన్లు అంత ప్రభావంతం గా లేవని అన్నారు పరుచూరి. ఇదే సినిమాకు పెద్ద మైనస్ అయ్యిందని ఆయన అభిప్రాయ పడ్డారు. దుర్వాసుడిగా మోహన్ బాబు, సమంత, దేవ్ మోహన్ అద్భుతంగా నటించారు అని ఆయన అన్నారు.

మహాభారతం నేపథ్యం లో వచ్చిన అనేక కథలు సూపర్ హిట్స్ అందుకున్నాయని అన్నాడు. కానీ కొన్ని పొరపాట్ల కారణం గా శాకుంతలం మూవీ ప్లాప్ అయ్యిందని ఆయన అన్నారు. ఇక మంచి కథలను మర్చి పోతున్న రోజుల్లో సొంత డబ్బును రిస్క్ చేసి ఈ సినిమాను చేసినందుకు గుణశేఖర్ గట్స్ కు హ్యాట్సాఫ్ అంటూ పొగిడారు పరుచూరి గోపాల కృష్ణ.







శాంతిప్రియ 1987లో తమిళ చిత్రం ‘ఎంగ ఊరు పట్టుకారన్’ తో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. భానుప్రియ స్టార్ హీరోయిన్ గా చేసిన దర్శకుడు వంశీ శాంతి ప్రియని ‘మహర్షి’ అనే చిత్రంలో హీరోయిన్ గా తీసుకున్నాడు. తెలుగులో ఇదే ఆమెకు మొదటి చిత్రం. ఆయన తీసిన మహర్షి సినిమా అంతగా ఆడకపోయినా, ఆ సినిమాలోని పాటలు మాత్రం ఇప్పటికీ చెవుల్లో మారుమోగుతున్నాయి. శాంతి ప్రియ ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు.
దాంతో ఆమె తమిళ సినిమాల్లోను ఆ తరువాత ఎక్కువగా హిందీ సినిమాల్లో నటించింది. బాలీవుడ్ లో ఎక్కువ పాపులారిటీ పొందింది. దాంతో ఆమెను హిందీ నటిగానే పరిగణిస్తారు. శాంతి ప్రియ ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత అయిన వి శాంతారామ్ మనవడు సిద్ధార్థ్ రేను ప్రేమించి 1992లో పెళ్లి చేసుకున్నారు. సిద్ధార్థ్ కూడా బాలీవుడ్లో కొన్ని సినిమాల్లో నటించాడు. ఈ జంటకి ఇద్దరు కుమారులు. అయితే పెళ్లి తర్వాత కొన్ని విషయాల్లో శాంతి, సిద్ధార్థ్ల మధ్య గొడవలు జరిగేవని తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించింది.
శాంతి ప్రియ మాట్లాడుతూ భర్త చనిపోయే ముందు కూడా మాకు చాలా గొడవలు జరిగాయని, అప్పటికి పెద్ద అబ్బాయి వయసు 10 ఏళ్లు, చిన్న బాబు వయసు 4 ఏళ్లు. తన భర్త చనిపోయే కూడా ఇద్దరికీ గొడవ జరిగిందని, ఒక విషయం మాట్లాడాలని పిలవగా, తను వెళ్లలేదని, ఆ తరువాత భోజన సమయంలో తింటూ ఉండగానే వెనక్కి పడి మరణించారని తెలిపారు. సిద్ధార్థ్ మరణం తర్వాత మళ్ళీ తన పిల్లల కోసం నటించడం ప్రారంభించింది. అప్పటి నుండి ఆమె చాలా హిందీ సీరియల్స్లో నటిస్తూ, తన పిల్లలను పెంచింది.

























