సినిమాల్లో నటించే వాళ్ళకి బయట ఎలాంటి గుర్తింపు ఉంటుందో అందరికీ తెలుసు. సినిమాల్లో నటించే వాళ్ళకి మాత్రమే కాకుండా సెలబ్రిటీ స్టేటస్ ఉన్న ప్రతి వ్యక్తికి బయట ఏదో ఒక రకమైన గుర్తింపు ఉంటుంది. ఆ సెలబ్రిటీ స్టేటస్ తో ఆ వ్యక్తులు కూడా ఎన్నో పనులు చేస్తూ ఉంటారు. వారికంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఉంటుంది.
వారు ఆ బ్రాండ్ ని ప్రజలకి తెలపాలి అనుకుంటూ ఉంటారు. వ్యాపార రంగంలో ఉన్న ఎంతో మంది కూడా ఈ సెలబ్రిటీల బ్రాండ్ ని వారి పబ్లిసిటీ కోసం, వారి సంస్థ ప్రమోట్ అయ్యేలాగా చేస్తూ ఉంటారు. అలా చాలామంది సెలబ్రిటీలు ఎన్నో ఉత్పత్తులకు పబ్లిసిటీ చేశారు. సెలబ్రిటీ స్టేటస్ ఉన్న స్టార్ హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒకరు. మహేష్ బాబు ఇప్పటివరకు ఎన్నో ప్రకటనలలో నటించారు.

మహేష్ బాబు అంతకుముందు బయట ఎక్కువగా కనిపించేవారు కాదు. దాంతో ఫ్యాన్స్ అందరూ కూడా మహేష్ బాబు ఈవెంట్స్ లో కూడా కనిపిస్తే బాగుండు అనుకునేవారు. తర్వాత మెల్లగా సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూలకి రావడం మొదలుపెట్టారు. ఇప్పుడు మహేష్ బాబు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటున్నారు. అయితే మహేష్ బాబు జీ తెలుగులో ఇటీవల జరిగిన ఒక డాన్స్ ప్రోగ్రాంకి అతిధిగా వచ్చారు. మహేష్ బాబు జీ తెలుగుతో ఒప్పందం చేసుకున్నారు. భాగంగానే మహేష్ బాబు జీ తెలుగులో ప్రసారం అయ్యే కొన్ని ప్రోగ్రామ్స్ కి అతిథిగా వస్తారు అనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఛానల్ కి బ్రాండ్ అంబాసిడర్ అయిన కారణంగా మహేష్ బాబు ఈ ఈవెంట్స్ కి వస్తారు. అంతే కాకుండా ఈ ఛానల్ లో ఒక సీరియల్ ప్రోమోలో కూడా మహేష్ బాబు కనిపించారు. దీనిపై చాలా నెగిటివ్ కామెంట్స్ రావడం మొదలయ్యాయి. మహేష్ బాబు అంతకుముందు కూడా జీ తెలుగుకి సంబంధించి ఇలాంటి ఒక ప్రమోషన్ చేశారు. ఆ ప్రమోషన్ వీడియోలో కొన్ని సీరియల్స్ ని ప్రమోట్ చేశారు. ఇప్పుడు కూడా అలాగే చేశారు. అసలు మహేష్ బాబు రేంజ్ ఏంటి ఇలా సీరియల్స్ లో రావడం ఏంటి అని చాలామంది కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు.

అయితే స్టార్ హీరోలు ప్రోగ్రామ్స్ కి రావడం కొత్త ఏమీ కాదు. అల్లు అర్జున్ కూడా పుష్ప సినిమా విడుదల అయిన తర్వాత ఢీ డాన్స్ షోకి అతిథిగా వచ్చారు. ఇంకా చాలామంది హీరోలు కూడా అలాగే డాన్స్ షోలకి, లేదా ఇతర షోలకి అతిథిగా వెళ్లడం జరుగుతూనే ఉంది. అయితే మిగిలిన హీరోలు చేసినప్పుడు లేనిది కేవలం మహేష్ బాబు చేస్తూ ఉంటే ఎందుకు అందరికీ అంత తప్పు చేస్తున్నట్టు అనిపిస్తుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. అలాగే ఈ హీరోలు అందరూ కూడా వారి బ్రాండ్ తో ఎన్నో ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ ఉంటారు.

మహేష్ బాబు అలాగే ఒక ఒక ప్రముఖ పాన్ తయారుచేసే కంపెనీకి చెందిన ఉత్పత్తిని ప్రమోట్ చేశారు. అది ఒక ఫ్లేవర్డ్ యాలకులు. అందులో ఎటువంటి హానికర పదార్థాలు ఉండదు. కానీ ఈ విషయాన్ని పక్కన పెట్టి మహేష్ బాబు ఒక సమయంలో బాలీవుడ్ గురించి మాట్లాడినప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కొంత మంది నార్త్ ఇండియన్ నెటిజన్లు మహేష్ బాబు పాన్ మసాలా వంటి ఉత్పత్తులను ప్రమోట్ చేశారు అంటూ కామెంట్ చేశారు. అంతేకాకుండా సీరియల్ కి స్టార్ హీరోలు ప్రమోట్ చేయడం తెలుగులో మాత్రమే కొత్త. బాలీవుడ్ లో షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్ వంటి పెద్ద పెద్ద స్టార్ హీరోలు ఎన్నో సీరియల్స్ ప్రమోట్ చేశారు.

ఇప్పుడు కూడా వారి సినిమాలు ఏమైనా విడుదల ఉంటే సీరియల్స్ ప్రమోట్ చేయడం మాత్రమే కాకుండా, సీరియల్ లో ఒక ఎపిసోడ్ లో కూడా కనిపిస్తూ ఉంటారు. ఇది తెలుగులో మాత్రమే కొత్త. దాంతో, “మహేష్ బాబు ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. అలాంటి విషయాలకి అభినందించాల్సింది పోయి ఇలా నెగిటివ్ కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు” అని అంటున్నారు. అంతేకాకుండా, “షోస్ కి రావడం అంతకుముందు చాలామంది తెలుగు స్టార్ హీరోలు చేశారు కదా? కేవలం మహేష్ బాబుని మాత్రమే ఎందుకు అంటున్నారు?” అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి.
















ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అఫిషియల్ గా ‘దేవర’ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూసినప్పటి నుండి ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు. టైటిల్ చాలా బాగుందని, తారక్ కి సెట్ అవుతుందని ఆనందపడుతున్నారు. అయితే ఈ మూవీ స్టోరీ గురించి వార్తలు వినిపిస్తున్నాయి. వాటి ప్రకారం ఈ చిత్రంలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని సమాచారం. అయితే ఈ చిత్రంలో యంగ్ ఎన్టీఆర్ క్యారెక్టర్ నిడివి తక్కువగా ఉంటుందంట. ఆ పాత్ర తండ్రి పేరే దేవర ( ఎన్టీఆర్) అని తెలుస్తోంది.
ఇక సినిమా కథ మొత్తం దేవర పాత్ర చుట్టూ తిరుగుతుందని, మూవీలో ఎక్కువ భాగం దేవరనే ఉంటాడంట. అయితే ఈ చిత్రంలో జాహ్నవి కపూర్ తండ్రి దేవర పక్కన హీరోయిన్ గా నటిస్తుందా? లేదా యంగ్ ఎన్టీఆర్ కి హీరోయిన్ గా నటిస్తుందా అనేది తెలీదు. జాహ్నవి కపూర్ ఒకవేళ యంగ్ ఎన్టీఆర్ కి జంటగా చేస్తే, సినిమాలో జాన్వీ కపూర్ తక్కువ టైం ఉంటే మూవీకి మైనస్ ఏమైనా అవుతుందా అని నెటిజనులు అనుకుంటున్నారు. ఎన్టీఆర్ రోల్ ఈ మూవీలో డబల్ అయితే జాన్వీ కపూర్ ఏ పాత్రకి హీరోయిన్ గా చేస్తుందనేది తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఆతృత పడుతున్నారు.
ఇదిలా ఉండగా కొరటాల శివ దేవర పాత్రను అద్భుతంగా షూట్ చేస్తున్నాడట. సముద్రం ఒడ్డున జీవించేవారికి అండగా ఉండి, ధైర్యాన్ని ఇచ్చే పాత్ర దేవర అని టాక్. పోస్టర్ లో కనిపిస్తున్న ఎన్టీఆర్ ఫోజు ఇంటర్వెల్ బ్యాంగ్ అని అంటున్నారు. ఇక ఈ మూవీలో మొదట్లో యంగ్ ఎన్టీఆర్ కనిస్తారని, ఆ తర్వాత తండ్రి ‘దేవర’ క్యారెక్టర్ ను పరిచయం చేస్తాడట. ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశాలలో విలన్స్ సముద్రం తీరాన ఉన్న పేదవారిని హింసిస్తుంటారట.
ఆ సమయంలో దేవర పాత్ర ఎంట్రీ ఇచ్చి, అందరిని తరిమి తరిమి చంపుతాడంట. అలా చంపే క్రమంలో దేవర పై రక్తం పడుతుందని, రక్తంతో అలాగే నిలబడి ఉన్న స్టిల్ తోనే విరామం వస్తుందని నెటిజనులు ఎవరికి నచ్చిన కథను వాళ్ళు చెప్తున్నారు. ఈ మూవీ ఒక రేంజ్ లో ఉంటుందని ఫ్యాన్స్ అంచనాలు వేస్తున్నారు.











తారక్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘దేవర’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఏడాది డిసెంబర్ వరకు పూర్తి కానుందని తెలుస్తోంది. ఇక తారక్ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చే చిత్రం 2024 మార్చి నెల నుండి ప్రారంభం కానుందని సమాచారం. ఈ విషయం పై మేకర్స్ నుండి అధికారి ప్రకటన వచ్చింది. తారక్ పాన్ ఇండియా చిత్రాలలో పాన్ ఇండియా దర్శకుల చిత్రాలలో నటిస్తున్నారు.
తారక్ బాలీవుడ్ వార్2 చిత్రంలో నటిస్తున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే ఎన్టీఆర్ పుట్టినరోజున బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ విషెస్ తెలుపుతూ చేసిన ట్వీట్ ద్వారా ఎన్టీఆర్ వార్ 2 లో నటిస్తున్నట్టుగా క్లారిటీ వచ్చేసింది. దీంతో ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కాంబో నెక్స్ట్ రేంజ్ లో ఉంటుందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు మాస్ ఆడియెన్స్ తో పాటుగా యూత్ లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎన్టీఆర్ నెగిటివిటీని ఏమాత్రం పట్టించుకోకుండా కెరీర్ లో ముందుకెళ్తున్నారు. 


































