Superstar Krishna: సూపర్ స్టార్ కృష్ణ కొద్ది రోజుల క్రితం కన్నుమూసిన విషయం అందరికి తెలిసిందే. ఆయన మృతి కుటుంబ సభ్యులతో పాటు అభిమానులను దుఖంలోకి నెట్టింది. ఆయన లేరనే విషయాన్ని జీర్ణించుకోలేక కుమారుడు మహేష్ బాబు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. ఆయనకి ఇది కోలుకోలేని దెబ్బ అనే చెప్పాలి.
ఒకే ఏడాది ముగ్గురిని కోల్పోయిన మహేష్ తట్టుకోలేకపోతున్నారు. ఈ ఏడాది అన్నను, తల్లిని, తండ్రిని కోల్పోవడాన్ని మహేష్ బాబుకి తీరని బాధే. మహేష్ కు చిన్నాన్న ఆదిశేషగిరిరావు తోడుగా ఉన్నారు. ఆదిశేషగిరిరావు తన అన్న అయిన కృష్ణతో 70 ఏళ్లపాటు కలిసి ప్రయాణం చేసారు. ఆదిశేషగిరిరావు సైతం అన్నయ్య లేరనే నిజాన్ని నమ్మలేక బాధపడుతున్నారు. వైద్యులు కృష్ణకు గుండెపోటుతో మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయ్యిందని చెప్పారు. దాని కోసం వైద్యం చేస్తున్నామని చెప్పారు. అయితే ఆరోగ్యంగా ఉన్న ఆయనకు అంత హఠాత్తుగా ఆయన ఆరోగ్యం ఎందుకు క్షీణించింది అని అంతా అనుకుంటున్నారు. మీడియాలోనూ వార్తలు వస్తున్నాయి. దీంతో సూపర్ స్టార్ కృష్ణ చనిపోవడానిక ముందు అసలు ఏం జరిగింది అనే ప్రశ్నలు వినిపిస్తూనే ఉన్నాయి.
కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు ఈ విషయం గూర్చి వివరణ ఇచ్చారు. కృష్ణ చనిపోవడానికి ముందు ఎలా ఉన్నారు. తనతో ఏం మాట్లాడారు,ఆ తర్వాత ఏమైంది అని ఆదిశేషగిరి రావు చెప్పారు. కృష్ణ చనిపోయిన ముందురోజు ఆదివారం,ఆరోజున పొద్దునే ఆదిశేషగిరి రావు కృష్ణ దగ్గరకు వెళ్లారట. కృష్ణతో రెండు గంటలకు పైగా గడిపారంట, ఆ సమయంలో కృష్ణ చిన్నప్పటి సంగతులు చాలా చెప్పారని, సైకిల్ పై ఇద్దరూ సినిమాలకెళ్లిన రోజులను గుర్తు చేసుకున్నారట. ఆ మాటలు మాట్లాడుతూ ఇద్దరూ బాగా నవ్వుకున్నారని, సినిమాల గురించి చర్చించుకున్నారు. ఆ సమయంలో కృష్ణలో ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేవని ఆదిశేషగిరి రావు చెప్పారు. కృష్ణ ఆ సమయంలో చాలా హుషారుగా కనిపించారని, ఇంట్లోనే భోజనం చేసి వెళ్లమని కృష్ణ అడిగినప్పటికీ, వేరే వాళ్లను భోజనానికి ఇంటికి రమ్మన్నని చెప్పాను. అయితే ఇంకోసారి లంచ్కి రా అని అన్నారు. ఆ తరువాత ఇంటికి వచ్చేశానని ఆదిశేషగిరిరావు తెలిపారు.
ఆదివారం రోజు రాత్రి భోజనం చేసి నిద్రపోయిన తరువాత అన్నయ్యకి 12.30కి గుండెపోటు వచ్చిందని చెప్పారు. అన్నయ్యకు గురకపెట్టే అలవాటు ఉంది. గదిలో నుండి గురక శబ్దం వినిపించకపోయేసరికి అన్నయ్య అవసరాలు చూసుకునే కుర్రాడికి అనుమానం వచ్చి పల్స్ చెక్ చేసి, ఏదో తేడాగా అనిపించేసరికి ఫోన్ చేశాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లమని, ఆ తర్వాత నేను వెళ్లా. కానీ అన్నయ్యకి గుండెపోటు వచ్చి అప్పటికే ముప్పైనిమిషాలు అవడంతో అవయవాల మీద ఆ ప్రభావం పడింది. రక్త ప్రసరణ కూడా ఆగిపోయింది. వైద్యులు 30 గంటలకు పైగా వైద్యం చేశారు.అయిన కూడా ఫలితం లేకపోయిందని ఆదిశేషగిరిరావు తెలిపారు.
Filmy Adda
8 సంవత్సరాల ముందు ఎవరూ పట్టించుకోని “షార్ట్ ఫిల్మ్” ట్వీట్… ఇప్పుడు “డైరెక్టర్” అయ్యాక వైరల్ అవుతోంది..! సక్సెస్ అంటే ఇదేనేమో.?
దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ ఇటీవల తమిళంలో విడుదలైన ‘లవ్ టుడే’ తో విజయం సాధించాడు. ప్రేక్షకులు రొటీన్ సినిమాలను దూరం పెట్టేస్తున్నారు. కంటెంట్ బావుంటే చాలు, హీరోతో ఎవరు అని చూడకుండా సినిమాను ప్రేక్షకులు హిట్ చేస్తున్నారు.
అలా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చిన చిత్రమే ‘లవ్ టుడే’. ఇప్పటి యువత సెల్ ఫోన్స్ మీద ఎలా ఆధారపడుతున్నారు. ఎలా అడిక్ట్ అయిపోతున్నారు. ఒకవేళ ఒకరి సెల్ ఫోన్స్లో సీక్రెట్స్ మరొకరి తెలిసినపుడు ఎలాంటి గొడవలు వస్తాయి అనే కాన్సెప్ట్ తో తీశారు.అంతేకాకుండా ప్రదీప్ రంగనాథన్ ఈ మూవీలో హీరోగా అరంగేట్రం కూడా చేశాడు. ఇదే మూవీ ఈరోజు తెలుగులో విడుదలైంది.

ప్రదీప్ రంగనాథన్ ఇంతకు ముందు షార్ట్ ఫిల్మ్స్ తీసాడు. వాటిలో ఒకటి అప్పా లాక్, ఈ షార్ట్ ఫిల్మ్స్ ఆధారంగానే లవ్ టుడే సినిమాని తీశాడు. అయితే అప్పట్లో అంటే ఎనిమిది సంవత్సరాలకు ముందు తాను తీసిన షార్ట్ ఫిల్మ్ ను చూడాల్సిందిగా నటుడు ప్రేమ్ జీ అమరన్ ని అడిగాడు.

అయితే అతను ఆ ట్వీట్ కి అప్పడు సమాధానం ఇవ్వలేదు. ‘లవ్ టుడే’ విడుదలై విజయం పొందిన తరువాత సమాధానం ఇచ్చాడు. అయితే దర్శకుడు ప్రదీప్ రంగనాథన్కి, ప్రేమ్ జీ అమరన్ ఎనిమిదేళ్లు ఆలస్యంగా ఇచ్చిన సమాధానం వైరల్ అవుతోంది.

అంతేకాకుండా దర్శకుడి గురించి మరింత తెలుసుకోవడానికి నెటిజన్లు ప్రదీప్ రంగనాథన్ పాత సోషల్ మీడియా పోస్ట్లను చూస్తున్నారు. సినిమాపై అతనికున్న ప్రేమ గురించి తెలుసుకుంటున్నారు. ప్రదీప్ రంగనాథన్ ట్వీట్లలో సినీ తారలను దర్శకత్వం చేసే అవకాశం కోసం అభ్యర్దించారు. ఇప్పుడా పాత ట్వీట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇక ‘లవ్ టుడే’ని ప్రదీప్ రంగనాథన్ ఐదేళ్లు ముందు రాసుకున్న అప్పా లాక్ అనే షార్ట్ ఫిల్మ్ ఆధారంగా తీశారు. నేటి కాలం యువత సెల్ ఫోన్స్ కి ఎలా అడిక్ట్ అయిపోతున్నారు. ప్రేమికులకి ఒకరి సెల్ ఫోన్స్లో సీక్రెట్స్ మరొకరి తెలిస్తే ఎలాంటి గొడవలు వస్తాయి అనేదాన్ని కామెడీ కోణంలో చూపించారు.

ఎవరైనా మన నుండి ఒక విషయాన్ని దాచి పెడుతున్నారంటే వాళ్లు తప్పు చేసినట్టు కాదని చక్కగా చూపించారు. ఈ సినిమాకి సంగీతం మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా అందించారు.
ఒక సినిమాకి తమన్, దేవిశ్రీ ప్రసాద్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?
ఓ సినిమాకు హీరో దర్శకుడితో పాటు మ్యూజిక్ కూడా అంతే ముఖ్యం. సంగీతం సరిగ్గా ఉంటేనే సినిమా హిట్ అవుతుంది. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు అంటే.. దేవిశ్రీ ప్రసాద్, తమన్. వీరిద్దరూ గత కొంతకాలం గా టాలీవుడ్ ని ఏలుతున్నారు. వారు మ్యూజిక్ అందించిన చిత్రాలన్నీ సూపర్ హిట్ అవుతుండటం తో వారి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.
రాక్స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన నుంచి ఒక పాట విడుదలైదంటే.. యూట్యూబ్లో రికార్డు క్రియేట్ చేయాల్సిందే. అంతలా తన మ్యూజిక్తో మెస్మరైజ్ చేస్తాడు డీఎస్సీ. కేవలం ఆయన అందించిన సంగీతంతోనే సూపర్ హిట్ అయినా సినిమాలు చాలా ఉన్నాయి. అందుకే ఆయనకు టాలీవుడ్లో చాలా డిమాండ్ ఉంది. సాధారణంగా దేవిశ్రీ ఒక్కో సినిమాకు రూ.3కోట్లు తీసుకుంటారని సమాచారం. కానీ రానున్న చిత్రానికి ఏకంగా రూ. 5 కోట్లు రెమ్యునరేషన్గా తీసుకుంటున్నట్లు సమాచారం.

మరోవైపు థమన్ ఏడాదికి 15 సినిమాల వరకు చేస్తున్నాడు. అతడు మ్యూజిక్ ఇచ్చిన మూవీ అన్ని సూపర్ హిట్స్ అవుతున్నాయి. గతేడాది సంక్రాంతికి విడుదలైన క్రాక్ సినిమాలో తమన్ సంగీతం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఇక మొన్నటికి మొన్న అఖండ సినిమా విజయంలో 50 శాతం థమన్ ఒక్కడే తీసుకున్నాడు. మొన్నటి వరకు లక్షల్లోనే ఉన్న ఈయన పారితోషికం ఇప్పుడు కోట్లలోకి వెళ్లిపోయింది. చిన్న సినిమాలకు తక్కువగానే తీసుకుంటున్నాడు థమన్. పెద్ద సినిమాల వరకు మాత్రం బాగానే వసూలు చేస్తున్నాడు. ఇప్పుడు పెద్ద సినిమాలకు ఈయన 1.50 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

అయితే తాజాగా వీరిద్దరూ రిలీజ్ చేసిన స్టార్ హీరోల సాంగ్స్ వచ్చాయి. జనాల్లోకి సూపర్ గా వెళ్తున్నాయి కానీ, ట్రోల్స్ కూడా అలాగే వస్తున్నాయి. దీంతో ఇద్దరు మ్యూజిక్ డైరక్టర్లు తప్ప పెద్ద సినిమాలకు వేరే ఆప్షన్ లేదా అంటూ నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఈ కాపీ ట్యూన్ లు అందించేందుకు స్టార్ హోటళ్లలో ఖరీదైన అకామిడేషన్లు, కోట్ల కొద్దీ రెమ్యూనిరేషన్లు వీరికి అవసరమా అంటూ ప్రశ్నిస్తున్నారు.
స్టార్ హీరోలు పబ్లిక్ లో కనపడినప్పుడు వారి ప్రతీ విషయం స్కానింగ్ కు గురి అవుతుంది. వారు ఏ రంగు చొక్కా వేసుకున్నారు..వాళ్లు థరించిన వాచ్ ఖరీదు ఎంత…వాళ్లు వేసుకొచ్చిన కారు కథేంటి ఇలా.. అందుకే వాళ్ళు బయటకి వచ్చిన ప్రతిసారి ఎంతో పర్ఫెక్ట్ గా వస్తారు. బట్ కొన్ని సార్లు మాత్రం వాళ్ల సినిమాల్లో లుక్స్ బయటపడకుండా జాగ్రత్తలు వహిస్తారు కూడా.
అయితే ప్రస్తుతం అందరూ ప్రభాస్ గురించి, తన ఆహార్యం గురించి చర్చించుకుంటున్నారు. ప్రభాస్ ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్ కే, ఆదిపురుష్ చిత్రాలు చేస్తున్నాడు. అయితే గత కొంత కాలంగా ప్రభాస్ తన లుక్స్ విషయం, లో ఫాన్స్ ని నిరుత్సాహ పరుస్తూనే ఉన్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ తన ఫిజిక్ కోల్పోయి అభిమానులకు షాక్ ఇచ్చాడు.

ఒకప్పుడు హండ్సమ్ హంక్ అనిపించుకున్న ప్రభాస్.. ఈ మధ్య తన ఫిజిక్ ని గాలికి వదిలేసినట్లు ఉందని.. డార్లింగ్ ముఖంలో మునుపటి కళ కనిపించడం లేదని నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్స్ చేశారు. అలానే ఎల్లప్పుడూ ప్రభాస్ తన హెయిర్ ని కవర్ చేస్తూ క్యాప్ పెట్టుకోవడంపైనా గట్టిగానే నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి.

ఇటీవల లెజెండరీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ కి నివాళులు అర్పించడానికి వచ్చినప్పుడు కూడా ప్రభాస్ తన హెయిర్ ని బ్లాక్ క్యాప్ తో కవర్ చేసి కనిపించాడు. దీంతో ప్రభాస్ హెయిర్ కి ఏమైంది? ఎందుకు ఎప్పుడూ కవర్ చేసుకొని కనిపిస్తున్నాడు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రానున్న సినిమాల్లోని లుక్స్ బయటపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడా.. లేక హెయిర్ ఊడిపోవడం వల్ల ట్రీట్మెంట్ ఏమైనా తీసుకుంటున్నాడా.. అని డార్లింగ్ ఫాన్స్ ఆందోళన పడుతున్నారు.

మొత్తం మీద ప్రభాస్ హెయిర్ బాండ్ పెట్టుకోవడం మీద గట్టిగానే చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ప్రభాస్ క్యాప్ లేకుండా కనిపించినప్పుడు మాత్రమే ఈ అనుమానాలన్నీ పటాపంచలవుతాయి.
కంగారుపడి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు..! కృష్ణ, “విజయ నిర్మల” ని పెళ్లి చేసుకున్నప్పుడు… “ఇందిరా దేవి” ఏమన్నారంటే..?
ప్రముఖ నటుడు సూపర్ స్టార్ కృష్ణ గారు ఆరోగ్య సమస్యల కారణంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. గతేడాది కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా కృష్ణ మొదటి భార్య, మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవి సైతం అనారోగ్యంతో కన్నుమూశారు.
ఇందిరాదేవి గారు చనిపోయిన కొద్ది రోజులకే కృష్ణ గారు కూడా చివరి శ్వాస విడిచారు. ఇప్పుడు వారి లైఫ్ కు సంబంధించిన ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి.

కృష్ణ విజయ నిర్మల పెళ్లి గురించి కూడా ఇప్పుడు ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. కృష్ణ కి మొదట భార్య అయిన ఇందిరా ఉండగానే విజయ నిర్మల తో రెండో వివాహం చేసుకున్నారు. మరి అసలు ఎందుకు కృష్ణ ఇలా చేసారు..? కారణం ఏమిటి..?, ఈ సంగతి తెలిసిన కుటుంబ సభ్యులు ఏం అన్నారు అనేది కృష్ణ గారి తమ్ముడు శేషగిరి రావు చెప్పారు.

ఈ విషయం తెలిసాక వారి అమ్మ నాగ రత్నమ్మ గారు మాత్రం కోప్పడ్డారట. కానీ ఇందిరా మాత్రం ఏం అనలేదు. కంగారు పడి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అని శేషగిరి రావు చెప్పారు. ‘సాక్షి’ సినిమా అప్పుడు వీళ్ళ మధ్య ప్రేమ పుట్టిందట. దానితో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. విజయ నిర్మలకి ఇది వరకే వివాహం అయ్యిందిట. నరేష్ కి కూడా ఆమె జన్మనిచ్చారు. అయితే కృష్ణ, విజయ నిర్మలకి మాత్రం ఎవరు పుట్టలేదని కృష్ణ గారి తమ్ముడు శేషగిరి రావు చెప్పారు.
అప్పుడు “పూజ” … ఇప్పుడు “రష్మిక”..? సడన్ గా ఈ “మార్పు” ఎందుకు వచ్చింది..?
సినీ పరిశ్రమ ఎప్పటికప్పుడు టాలెంట్ ఉన్నవారిని అందలం ఎక్కిస్తూనే ఉంటుంది. కెరీర్ మొదట్లో ఎన్నో ప్లాప్స్ వచ్చిన వాళ్ళను కూడా స్టార్ నటులను చేస్తుంది. దానికి వారికీ కావాల్సింది మంచి బ్రేక్ ఇచ్చే సినిమా. అటువంటి సినిమాలను, బ్రేక్ ఇచ్చిన వాళ్ళను ఎప్పటికి మర్చిపోరు . కానీ ప్రస్తుతం కొందరు హీరోయిన్లు తమకు బ్రేక్ ఇచ్చిన వాళ్ళని అవమానిస్తున్నట్లు మాట్లాడటం కామన్ అయిపోయింది.
ఇటీవల రష్మిక మందన్న ఒక ఇంటర్వ్యూ లో చేసిన కొన్ని వ్యాఖ్యలు, ఆమె ప్రవర్తన చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. పుష్ప తర్వాత బాలీవుడ్లో వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది రష్మిక. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న రష్మిక, తాను ఎలా సినీ ఇండస్ట్రీ లోకి ప్రవేశించిందో చెప్పింది. అయితే ఇక్కడ ఆమె కాంతార డైరెక్టర్ రిషబ్ శెట్టి గురించి కానీ, కిరిక్ పార్టీ హీరో హీరో రక్షిత్ శెట్టి గురించి కానీ మాట్లాడకుండా.. అప్పుడు ఒక ప్రొడక్షన్ హౌస్ నుంచి నాకు కాల్ వచ్చింది అని అంటూ రెండు చేతులు పైకి ఎత్తి ఫింగర్స్ క్రాస్ చేసి ఓ రకమైన సైగలతో ఆమె చెప్పుకొచ్చింది.

అయితే ఆమె కెరీర్ బిల్డ్ అవ్వడానికి అంత సూపర్ హిట్ ఇచ్చిన రిషబ్ శెట్టి పేరును పలకడానికి రష్మిక మందన్న ఇష్టపడలేదనేది వీడియోలో స్పష్టంగా కనిపించింది.

ఇలాగే ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్న పూజ హెగ్డే కూడా గతం లో ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. కెరీర్ మొదట్లో ప్లాప్ లతో సతమతమైన పూజ.. తర్వాత స్టార్ హీరోయిన్ అయ్యింది. కానీ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ..దక్షిణాది ప్రేక్షకులపై నోరు పారేసుకుంది. ఇక్కడ ప్రేక్షకులకు నాభి, నడుము, తొడలు అంటే బాగా ఇష్టపడతారని… అల వైకుంఠపురములో కాళ్లను హైలట్ చేసి చూపించడం కూడా దీనిలో భాగమే అని అన్నారు.

దీంతో ప్రస్తుతం హీరోయిన్ల ప్రవర్తనపై నెటిజన్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. తమకు బ్రేక్ ఇచ్చి, స్టార్స్ ని చేసిన వాళ్లనే.. స్టార్డం రాగానే అవమానించేలా మాట్లాడుతున్నారు అని కామెంట్స్ చేస్తున్నారు. ఇటువంటి ప్రవర్తన వారికి ఎప్పటికీ మంచిది కాదు అని ఫాన్స్ ఫైర్ అవుతున్నారు.
watch video :
https://twitter.com/MNVGowda/status/1594705931488694277
హిట్ మొదటి భాగం అందరికీ నచ్చేసింది. ఈ సినిమా లో విశ్వక్సేన్, రుహాని శర్మ జంటగా నటించారు. అయితే ఒక కేసు ఇన్వెస్టిగేషన్ ఈ సినిమా లో జరుగుతూ ఉంటుంది. ఈ కథ నడుస్తుంది. హిట్ ఫస్ట్ కేస్ 2020 లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు సెకండ్ పార్ట్ రానుంది.
ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. నాని ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ కూడా తాజాగా విడుదలైంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ ట్రైలర్ గురించి మాట్లాడుకుంటున్నారు.

ట్రైలర్ ఇంత బాగుంటే మరి సినిమా ఇంకెంత బాగుంటుందని అంతా అనుకుంటున్నారు. పైగా చాలా మంది ప్రేక్షకులు ఈ సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అయితే అడవి శేషు కి ఈ సినిమా ద్వారా ఎక్కువ రెమ్యునరేషన్ వస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న అడవి శేషు కి నాని ఎక్కువ రెమ్యునరేషన్ ని ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే ఇక పారితోషం విషయానికి వస్తే…. అడవి శేషు కి హిట్ సినిమా ద్వారా ఐదు కోట్ల నుంచి ఆరు కోట్ల రెమ్యూనిరేషన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ రెండవ తేదీన ఈ సినిమా భారీ స్థాయి లో విడుదల కాబోతోంది. సినిమా అయితే అదిరిపోయేలానే కనపడుతోంది. పైగా ఇప్పటికే ప్రేక్షకులు ఎక్స్పక్టేషన్స్ భారీగా పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాల వరకు ఉంటుందా లేదా అనేది చూడాల్సి ఉంది.
“ఇదేంటి… ఒసేయ్ రాములమ్మ పాట లాగా ఉంది..?” అంటూ… వీర సింహా రెడ్డి “జై బాలయ్య” సాంగ్ పై 15 మీమ్స్..!
బాలయ్య హీరోగా రాబోతున్న పవర్ ఫుల్ ఏక్షన్ ఎంటర్టైనర్ వీరసింహారెడ్డి. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ 107వ సినిమాగా ఈ మూవీ రూపొందుతోంది. ఈ మూవీ నుంచి వస్తున్న అప్ డేట్స్ అంచనాలను పెంచేస్తూ ఉన్నాయి. ఇటీవల ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేసి నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పించారు మేకర్స్. ప్రతిష్ఠాత్మక మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కుతున్న వీరసింహారెడ్డి చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.
వీర సింహారెడ్డి సినిమాలో బాలకృష్ణకు జోడిగా శ్రుతి హాసన్ నటిస్తోంది. కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు.అలాగే వరలక్ష్మీ శరత్కుమార్ కీలక పాత్రలో నటిస్తోంది. వీరితో పాటు రవిశంకర్, హానీ రోజ్ తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

అయితే ఈ రోజు ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ రూపంలో జై బాలయ్య సాంగ్ విడుదల చేసారు. అయితే ఈ సాంగ్ నందమూరి అభిమానుల్లో జోష్ పెంచింది. ఈ సాంగ్ను కరీముల్లా ఆలపించారు. బాలయ్య ఇమేజ్కు తగ్గ లిరిక్స్తో ఆడియన్స్కు గూజ్ బంప్స్ తెప్పించారు రామజోగయ్య శాస్త్రి. ఈ పాటలో మెడలో బంగారు చైన్లు, చేతికి వాచ్, వైట్ అండ్ వైట్ డ్రెస్లో బాలకృష్ణ లుక్ అదిరిపోయింది. ఇక స్టైలిష్ గాగుల్స్తో ఆయన వేసిన స్టెప్పులు అభిమానులకు కనులవిందుగా అనిపించాయి.
మరో వైపు థమన్ మరోసారి కాపీ ట్యూన్ కొట్టాడంటూ ట్రోల్స్ కూడా చేస్తున్నారు. గతంలో విజయశాంతి చేసిన ‘ఒసేయ్ రాములమ్మ” చిత్రం టైటిల్ సాంగ్ లా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. అదే ట్యూన్ కాపీ చేసి జై బాలయ్యకు పెట్టారంటూ థమన్ పై అటాక్ చేస్తున్నారు. దీంతో ఈ ఇష్యూ పై నెట్టింట మీమ్స్ వైరల్ అవుతున్నాయి.. వాటిపై ఓ లుక్కేయండి..
#1

#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
రష్మిక మందన్న ఇటు టాలీవుడ్ సినిమాలు మాత్రమే కాకుండా శాండిల్వుడ్, బాలీవుడ్ లో కూడా నటిస్తోంది. అక్కడ కూడా ప్రేక్షకులని ఫిదా చేసేస్తోంది ఈ బ్యూటీ. పైగా తిరుగులేని పాపులారిటీని కూడా రష్మిక సంపాదించుకుంది. రష్మిక పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్ర లో బాగా నటించింది. తెలుగు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యేలా వుంది ఆ పాత్ర.
ఇప్పుడు పుష్ప 2 లో కూడా ఈమె నటించనుంది. అయితే రష్మిక మందన్న కి సంబంధించి ఓ న్యూస్ ఇప్పుడు అందరిని అవాక్ అయ్యేలా చేస్తోంది.

ఇంతకీ అసలు ఏం జరిగింది అనేది చూస్తే.. కన్నడ చిత్ర పరిశ్రమ రష్మిక మందన్న ని పర్మినెంట్ గా బ్యాన్ చేయడం జరిగింది. దీనితో రష్మిక కన్నడ సినిమాలు ఇక నుండి చేయలేదట. ఎందుకు కన్నడ చిత్ర పరిశ్రమ రష్మిక మందన్న ని పర్మినెంట్ గా బ్యాన్ చేసారంటే..? రష్మిక కన్నడ సినిమాలపై గౌరవం లేకుండా ఎక్కువ సార్లు మాట్లాడింది. అలా ఆమె మాట్లాడడం మూలన కర్ణాటక థియేటర్ ఓనర్లు, డిస్ట్రిబ్యూటర్లు పర్మినెంట్ గా ఆమె ని కన్నడ సినిమాల నుండి బ్యాన్ చేయాలని ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇంకా దీనిపై అధికారికంగా ప్రకటించలేదు.

కానీ త్వరలోనే ఈ విషయాన్ని ప్రకటిస్తున్నట్లు తెలుస్తోంది. ”కన్నడ సినిమాల్లో రష్మిక మందన్న ని అధికారికంగా బ్యాన్ చేసారని..ఈమె కన్నడ సినిమాల పైన గౌరవం లేకుండా మాట్లాడడం వలనే బ్యాన్ చేసారని”… ట్విట్టర్ లో రివ్యూలు ఇచ్చే ఉమైర్ సంధు ట్విట్ చేశాడు. అంతే కాకుండా కొంత మంది ట్విట్టర్ యూజర్లు కూడా ఈ విషయం పైన ట్వీట్స్ చేస్తున్నారు. ఈ ఎఫెక్ట్ కొన్ని సినిమాల పైన పడే అవకాశం వుంది. రష్మిక ఇలా చేయడం వలన కన్నడ లో ‘వారిసు’, ‘పుష్ప 2’ సినిమాలను రిలీజ్ చెయ్యమని… అడ్డుకుంటామని అంటున్నారు. హిందీలోని ఓ మీడియా సంస్థకు ఈ భామ ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో ఫస్ట్ ఛాన్స్ ని ఇచ్చిన నిర్మాణ సంస్థ పేరు చెప్పలేదు. రెండు చేతులతో ‘సో కాల్డ్ ప్రొడక్షన్ హౌస్’ అని ఆమె సైగ చేశారట. దీని వలనే కోపం వచ్చింది వాళ్లకి.
#RashmikaMandanna officially “ BANNED ” in Kannada Movies due to disrespect Kannada movies !!!
— Umair Sandhu (@UmairSandu) November 24, 2022
స్టార్ హీరోయిన్ సమంత నటించిన లేటెస్ట్ మూవీ ‘యశోద’. శ్రీదేవి మూవీస్ పై నిర్మించిన ఈ చిత్రానికి హరి-హరీష్ దర్శకత్వం వహించారు. నవంబర్ 11 న విడుదలైన ఈ చిత్రం డీసెంట్ హిట్ గా నిలిచింది. అయితే ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీ లో విడుదల అవుతుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
డిసెంబర్ రెండో వారం లో ఈ చిత్రం ఓటీటీ లోకి రానుందని వార్తలు వచ్చాయి. అయితే ఈ లోపే యశోద మేకర్స్ కి ఊహించని దెబ్బ తగిలింది. యశోద సినిమా ఓటీటీ విడుదలపై స్టే విధిస్తూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.

తమ హాస్పిటల్ విశ్వసనీయతకు భంగం కలిగేలా యశోద సినిమాను చిత్రీకరించారని పేర్కొంటూ ఇవా ఐవీఎఫ్ ప్రైవేటు హాస్పిటల్ యాజమాన్యం పిటిషన్ దాఖలు చేసింది. సినిమాలో తమ హాస్పిటల్ పేరును చూపించారని.. దీనివల్ల తమ ప్రతిష్ఠకు భంగం కలిగిందని హాస్పిటల్ యాజమాన్యం పేర్కొంది. వాదనలు నమోదు చేసుకున్న కోర్టు.. డిసెంబర్ 19 వరకు సినిమాను ఓటీటీలో విడుదల చేయరాదని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు సినిమా నిర్మాతలకు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణ డిసెంబర్ 19 న ఉంటుందని పేర్కొంది.

అయితే సినిమా విడుదలై ఇన్ని రోజులు అయినా ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయని సదరు ఆస్పత్రి యాజమాన్యం.. ఇప్పుడు పిటిషన్ వెయ్యడం ఏంటని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. సినిమా ట్రైలర్ మొదలు అన్నిటిలోను ఈ విషయాలను స్పష్టంగా చెప్పింది మూవీ యూనిట్. కానీ అప్పుడెందుకు వారు అడ్డుకోలేదని ప్రశ్నిస్తున్నారు. మరి కోర్ట్ తదుపరి విచారణ తర్వాత ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.
