మూవీస్, టెలివిజన్ సిరీస్లకు సంబంధించిన సమాచారానికి IMDb ప్రపంచవ్యాప్తంగా పాపులర్. ఈ రేటింగ్స్ కి ప్రపంచ వ్యాప్తంగా అందరు వేల్యూ ఇస్తారు. అయితే గత కొంతకాలం గా ఇండియన్ మూవీ డేటాబేస్ వెబ్సైట్ లో తెలుగు చిత్రాలు మంచి రేటింగ్స్ ని నమోదు చేస్తున్నాయి. ముఖ్యంగా చిన్న సినిమాలు ఊహించిన రేంజ్ లో సక్సెస్ అయ్యాయి. అలాగే కొన్ని పాన్ ఇండియా సినిమాలు కూడా భారీ స్థాయిలో బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అందుకున్నాయి.
అయితే టాప్ రేటింగ్స్ సాధించిన సినిమాల సంగతి పక్కన పెడితే..ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ లో తక్కువ రేటింగ్స్ సాధించిన తెలుగు చిత్రాలేవో ఇప్పుడు చూద్దాం..
#1 సత్తెకాలపు సత్తెయ్య
శోభన్ బాబు హీరోగా 1969 లో వచ్చిన సత్తెకాలపు సత్తెయ్య చిత్రానికి ఐఎండిబి లో 2 .5 రేటింగ్ వచ్చింది.

#2 పరమవీరచక్ర
బాలయ్య హీరోగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన పరమవీరచక్ర సినిమాకి 2 .1 రేటింగ్ వచ్చింది.

#3 ఒక్కమగాడు
బాలయ్య హీరోగా వైవిఎస్ చౌదరి తెరకెక్కించిన ఒక్క మగాడు సినిమా 1.8 రేటింగ్ సాధించింది.

#4 విజయేంద్రవర్మ
బాలకృష్ణ హీరోగా స్వర్ణ సుబ్బారావు తెరకెక్కించిన విజయేంద్ర వర్మ సినిమాకి కూడా 2 రేటింగ్ వచ్చింది.

#5 మహారథి
పి వాసు దర్శకత్వం లో బాలయ్య హీరోగా వచ్చిన మహారధి సినిమాకి కూడా 2 రేటింగ్ వచ్చింది.

#6 లైగర్
విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన లైగర్ చిత్రానికి ఐఎండిబి లో 2 రేటింగ్ వచ్చింది.

#7 మస్త్
శివాజీ హీరోగా వచ్చిన మస్త్ మూవీ కి కూడా ఐఎండిబి లో 1 .7 రేటింగ్ వచ్చింది.

#8 రగిలే గుండెలు
1985 లో మోహన్ బాబు హీరోగా చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం రగిలే గుండెలు కి ఐఎండిబి లో 1 .7 రేటింగ్ వచ్చింది.

#9 వీరభద్ర
బాలకృష్ణ నటించిన ఈ చిత్రానికి రవి కుమార్ చౌదరి దర్శకుడిగా పని చేయగా 2.2 రేటింగ్ దక్కింది.

#10 ప్రేమపంజరం
మోహన్ బాబు, హరీష్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ప్రేమపంజరం చిత్రానికి ఐఎండిబి లో 1 రేటింగ్ వచ్చింది.

#11 అల్లుడు దిద్దిన కాపురం
కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణ, శోభన, మోహన్బాబు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఐఎండిబి లో 1 .4 రేటింగ్ వచ్చింది.

#12 విజయం
రాజా హీరోగా 2003 లో వచ్చిన విజయం మూవీ కి ఐఎండిబి లో 1 .7 రేటింగ్ వచ్చింది.

#13 నరసింహుడు
ఎన్టీఆర్, అమీషా పటేల్, సమీరా రెడ్డి ప్రధాన పాత్రల్లో వచ్చిన నరసింహుడు చిత్రానికి ఐఎండిబి లో 3 రేటింగ్ వచ్చింది.

#14 తుఫాన్
రామ్ చరణ్, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రల్లో వచ్చిన తుఫాన్ చిత్రానికి ఐఎండిబి లో 3 రేటింగ్ వచ్చింది.

#15 సుభాష్ చంద్రబోస్
వెంకటేష్, శ్రేయ జంటగా నటించిన సుభాష్ చంద్రబోస్ చిత్రానికి ఐఎండిబి లో 3 .1 రేటింగ్ వచ్చింది.






మణికందన్, మీరా రఘునాథ్ ప్రధాన పాత్రలలో నటించిన ‘గుడ్ నైట్’ సినిమా ఈ ఏడాది మే 23న తమిళంలో రిలీజ్ అయ్యి, సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రానికి వినాయక్ చంద్రశేఖరన్ ద్రశకత్వం వహించారు. ఇక కథ విషయానికి వస్తే, సాఫ్ట్ వేర్ జాబ్ చేసే మోహన్ కు ఒక సమస్య ఉంటుంది. అతను నిద్రపోయాడంటే గురక రీసౌండ్ వస్తుంది. ఆ గురకకి పక్కింటివాళ్లు సైతం భయపడిపోవాలి. తన గురక వల్ల అందరూ తిడుతుంటారు.
ఒక రోజు ఊహించని పరిస్థితుల్లో అను పరిచయమవుతుంది. అందరితో అంతగా కలవని అను, మోహన్ ను ప్రేమిస్తుంది. కొద్ది రోజులకే వారి పెళ్లి జరుగుతుంది. మొదటిరాత్రి రోజు మోహన్ కు గురక సమస్య ఉందని అనుకు తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? చివరకు భార్యభర్తలు కలిశారా? లేదా అనేదే మిగతా కథ.
హీరోకు సమస్య ఉన్న కథతో టాలీవుడ్ లోనూ సినిమాలు వచ్చాయి. మహానుభావుడు, భలే భలే మాగాడివోయ్ వంటివి. ఆ కోవలో వచ్చిందే గుడ్ నైట్ మూవీ. హీరోకు ఉన్న గురక సమస్యతో ఇంట్లోవారు, పక్కింటివారు ఇలా అందరూ ఇబ్బందులు పడుతుంటారు. గురక సమస్యను హీరోకు పెట్టి, దర్శకుడు వినాయక్ చంద్రశేఖరన్ విజయం సాధించాడు. సినిమా మొదలవగానే హీరోకు గురక ఉందని అర్థమవుతుంది. గురకతో హీరో చుట్టు పక్కల వాళ్ళు పడే ఇబ్బందులను దర్శకుడు చక్కగా చూపించాడు. ఇక వాళ్లు అనే మాటలు నవ్విస్తాయి.


















































డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగువారికి చేరువైన మలయాళీ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’లో విలన్ గా నటిస్తున్నారు. ఆయన నటించిన జనగణమన మూవీ 2022లో థియేటర్లలో రిలీజ్ అయ్యి, విజయం సాధించింది. ఈ మూవీలో సూరజ్ వెంజారమూడు, మమతా మోహన్దాస్ కీలక పాత్రలలో నటించారు.
ఈ మూవీ కథ విషయానికి వస్తే, లెక్చరర్ సభా మరియం (మమతా మోహన్ దాస్)ను అత్యాచారం చేసి, ఆమె బాడీని కాల్చి రోడ్డు పక్కన పడేశారనే వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఆమె పనిచేసిన యూనివర్సిటీ విద్యార్ధులు తమ లెక్చరర్ కు న్యాయం చేయాలని ఆందోళనకు దిగుతారు. సభా మరియం తల్లి న్యాయం కోసం పోరాటం ప్రారంభిస్తుంది. ఈ కేసును చేధించేందుకు ఏసీపీ సజ్జన్(సూరజ్ వెంజనమూడు) వస్తాడు. ఆ క్రమంలో ప్రత్యక్షసాక్షి చెప్పిన సాక్ష్యంతో నలుగురు నిందితులను పట్టుకుంటాడు.
సొసైటీ నుండి నిందితులను చంపేయాలనే డిమాండ్ వస్తుంది. పై నుంచి ప్రెజర్ ఎక్కువ అవడంతో ఏసీపీ సజ్జన్ వారిని మరో స్టేషన్ కు తరిలించే టైమ్ లో నిందితులను ఎన్ కౌంటర్ చేస్తాడు. అయితే ఈ ఎన్ కౌంటర్ పై హ్యూమన్ రైట్స్ కమీషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కేసు పెడుతుంది. ఈ కేసులో లాయర్ అరవింద్ స్వామినాథన్ (పృథ్వీరాజ్ సుకుమారన్) ఏసీపీ సజ్జన్ కు వ్యతిరేకంగా కేసు వాదిస్తాడు. ఆ తరువాత ఏం జరిగింది? అసలు అరవిందన్ ఎవరు? ఎందుకు ఎన్ కౌంటర్ చేశారు? సభా మరియం ఎలా చనిపోయింది? అనేది మిగిలిన కథ.
జన గణ మన మూవీలో ఎన్ని పాత్రలున్నప్పటికీ ప్రధమార్ధంలో ఏసీపీ సజ్జన్, ద్వితీయార్థం అంతా పృథ్వీరాజ్ తమ నటనతో ఆడియెన్స్ ని కట్టిపడేస్తారు. సభా మరియంగా మమతా మోహన్ దాస్ బాగా నటించింది. రోజూ చూసే వార్తల్లోని మరో యాంగిల్ ను ఆవిష్కరించేలా ఈ చిత్రాన్ని దర్శకుడు డిజో జోస్ ఆంటోని తెరకెక్కించారు.