కోలీవుడ్ ఇండస్ట్రీలో ‘గుడ్ నైట్’ అనే మూవీ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. మూవీ హిట్ కావడానికి భారీ సెట్టింగ్స్, హంగు, ఆర్భాటాలు ఉండాల్సిన అవసరం లేదని, ఆడియెన్స్ ని ఎంటర్టైన్ చేసే స్టోరీ, కథనం ఉంటే సరిపోతుందని ఈ మూవీ మరోసారి నిరూపించింది.
ఈ చిత్రం భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. ఈ మూవీ ‘గురక’ అనే పాయింట్ తో తెరకెక్కింది. తాజాగా ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. హాట్స్టార్లో తెలుగులో కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
మణికందన్, మీరా రఘునాథ్ ప్రధాన పాత్రలలో నటించిన ‘గుడ్ నైట్’ సినిమా ఈ ఏడాది మే 23న తమిళంలో రిలీజ్ అయ్యి, సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రానికి వినాయక్ చంద్రశేఖరన్ ద్రశకత్వం వహించారు. ఇక కథ విషయానికి వస్తే, సాఫ్ట్ వేర్ జాబ్ చేసే మోహన్ కు ఒక సమస్య ఉంటుంది. అతను నిద్రపోయాడంటే గురక రీసౌండ్ వస్తుంది. ఆ గురకకి పక్కింటివాళ్లు సైతం భయపడిపోవాలి. తన గురక వల్ల అందరూ తిడుతుంటారు.
ఒక రోజు ఊహించని పరిస్థితుల్లో అను పరిచయమవుతుంది. అందరితో అంతగా కలవని అను, మోహన్ ను ప్రేమిస్తుంది. కొద్ది రోజులకే వారి పెళ్లి జరుగుతుంది. మొదటిరాత్రి రోజు మోహన్ కు గురక సమస్య ఉందని అనుకు తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? చివరకు భార్యభర్తలు కలిశారా? లేదా అనేదే మిగతా కథ.
హీరోకు సమస్య ఉన్న కథతో టాలీవుడ్ లోనూ సినిమాలు వచ్చాయి. మహానుభావుడు, భలే భలే మాగాడివోయ్ వంటివి. ఆ కోవలో వచ్చిందే గుడ్ నైట్ మూవీ. హీరోకు ఉన్న గురక సమస్యతో ఇంట్లోవారు, పక్కింటివారు ఇలా అందరూ ఇబ్బందులు పడుతుంటారు. గురక సమస్యను హీరోకు పెట్టి, దర్శకుడు వినాయక్ చంద్రశేఖరన్ విజయం సాధించాడు. సినిమా మొదలవగానే హీరోకు గురక ఉందని అర్థమవుతుంది. గురకతో హీరో చుట్టు పక్కల వాళ్ళు పడే ఇబ్బందులను దర్శకుడు చక్కగా చూపించాడు. ఇక వాళ్లు అనే మాటలు నవ్విస్తాయి.
Also Read: “చిరంజీవి” కూతురు “సుస్మిత” హీరోయిన్ గా నటించిన సినిమా ఏదో తెలుసా..?




















































డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగువారికి చేరువైన మలయాళీ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’లో విలన్ గా నటిస్తున్నారు. ఆయన నటించిన జనగణమన మూవీ 2022లో థియేటర్లలో రిలీజ్ అయ్యి, విజయం సాధించింది. ఈ మూవీలో సూరజ్ వెంజారమూడు, మమతా మోహన్దాస్ కీలక పాత్రలలో నటించారు.
ఈ మూవీ కథ విషయానికి వస్తే, లెక్చరర్ సభా మరియం (మమతా మోహన్ దాస్)ను అత్యాచారం చేసి, ఆమె బాడీని కాల్చి రోడ్డు పక్కన పడేశారనే వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఆమె పనిచేసిన యూనివర్సిటీ విద్యార్ధులు తమ లెక్చరర్ కు న్యాయం చేయాలని ఆందోళనకు దిగుతారు. సభా మరియం తల్లి న్యాయం కోసం పోరాటం ప్రారంభిస్తుంది. ఈ కేసును చేధించేందుకు ఏసీపీ సజ్జన్(సూరజ్ వెంజనమూడు) వస్తాడు. ఆ క్రమంలో ప్రత్యక్షసాక్షి చెప్పిన సాక్ష్యంతో నలుగురు నిందితులను పట్టుకుంటాడు.
సొసైటీ నుండి నిందితులను చంపేయాలనే డిమాండ్ వస్తుంది. పై నుంచి ప్రెజర్ ఎక్కువ అవడంతో ఏసీపీ సజ్జన్ వారిని మరో స్టేషన్ కు తరిలించే టైమ్ లో నిందితులను ఎన్ కౌంటర్ చేస్తాడు. అయితే ఈ ఎన్ కౌంటర్ పై హ్యూమన్ రైట్స్ కమీషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కేసు పెడుతుంది. ఈ కేసులో లాయర్ అరవింద్ స్వామినాథన్ (పృథ్వీరాజ్ సుకుమారన్) ఏసీపీ సజ్జన్ కు వ్యతిరేకంగా కేసు వాదిస్తాడు. ఆ తరువాత ఏం జరిగింది? అసలు అరవిందన్ ఎవరు? ఎందుకు ఎన్ కౌంటర్ చేశారు? సభా మరియం ఎలా చనిపోయింది? అనేది మిగిలిన కథ.
జన గణ మన మూవీలో ఎన్ని పాత్రలున్నప్పటికీ ప్రధమార్ధంలో ఏసీపీ సజ్జన్, ద్వితీయార్థం అంతా పృథ్వీరాజ్ తమ నటనతో ఆడియెన్స్ ని కట్టిపడేస్తారు. సభా మరియంగా మమతా మోహన్ దాస్ బాగా నటించింది. రోజూ చూసే వార్తల్లోని మరో యాంగిల్ ను ఆవిష్కరించేలా ఈ చిత్రాన్ని దర్శకుడు డిజో జోస్ ఆంటోని తెరకెక్కించారు.





























