ఒకప్పుటి కాలంలో ఆడపిల్లలు పద్నాలుగు లేదా పదిహేను సంవత్సరాలకి మెచ్యూర్ అయ్యేవారు. కానీ ప్రస్తుతం తొమ్మిది, మెచ్యూర్ పదేళ్లకే అవుతున్నారు. ఎక్కడో ఒక చోట కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ మార్పు కనపడుతోంది.
చిన్న వయసులోనే మెచ్యూర్ కావడం వల్ల ఆడపిల్లలను ఎమోషనల్గా ఇబ్బంది పెట్టడమే కాకుండా, కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆడపిల్లలు చిన్న వయసులోనే మెచ్యూర్ అవ్వడానికి కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
నేటి తరంలో ఆడపిల్లలు చిన్న వయసులోనే, తొందరగా మెచ్యూర్ అవుతున్న విషయం తెలిసిందే. అలా కావడానికి అనేక కారణాలు ఉన్నాయి. సాధారణంగా ఆడపిల్లల తల్లులు ఏ వయసులో రజస్వల అవుతారో, వారి పిల్లలు కూడా దాదాపు అదే ఏజ్ లో మెచ్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. అధిక బరువు ఉన్న ఆడపిల్లలు, తక్కువ బరువు ఉన్నవారి కన్నా త్వరగా మెచ్యూర్ అవుతారు. జంక్ ఫుడ్ ఎక్కువగా తినే పిల్లలు, పాలు, మాంసం, ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తినే పిల్లలు కూడా చిన్నవయసులో మెచ్యూర్ అవుతారని పరిశోధనలు చెప్తున్నాయి.
సుమన్ టీవిలో యోగా ట్రైనర్ సాహితీయోగ ఆడపిల్లలు చిన్న వయసులోనే మెచ్యుర్ అవ్వడానికి గల కారణం గురించి వివరించారు. ఆమె మాట్లాడుతూ, ఇటీవల కాలంలో ఆడపిల్లలు చిన్న వయసులోనే అది కూడా తొమ్మిది, పది సంవత్సరాలకే మెచ్యూర్ అవడానికి ముఖ్య కారణం డీ విటమిన్ డెఫిషియన్సీ అని తెలిపింది. శరీరంలో విటమిన్ డీ లోపం ఏర్పడినపుడు చాలా సివియర్ పెయిన్స్ వస్తాయి.
ఒక్కోసారి ఆ పెయిన్ వల్ల కదలలేని స్థితి కూడా రావచ్చు అని అన్నారు. విటమిన్ డీ లోపం ఉందని తెలిసినపుడు ప్రతిరోజూ ఉదయం 8 గంటల కన్నా ముందు పదిహేను నిముషాల పాటు ఎండలో ఉండాలని, అలాగే సాయంత్రం 5 నుండి 6 గంటల మధ్యలో ఎండలో పదిహేను నిముషాల పాటు నడవడం లాంటివి చేయడం వల్ల శరీరానికి కావాల్సిన డీ విటమిన్ అందుతుందని తెలిపారు.
https://www.instagram.com/reel/Cu_2s6atMNe/?igshid=NjZiM2M3MzIxNA%3D%3D
Also Read: నెలసరి ఆగిపోయే ముందు మహిళలలో కనిపించే లక్షణాలు ఏమిటో తెలుసా..?





పీరియడ్స్ అనేది ప్రతి స్త్రీ జీవితంలో ఒక భాగం. మోనో పాజ్ ప్రతి మహిళ ఎదుర్కొనే సమస్య. రుతుక్రమం అనేది గతి తప్పుతుంది. అమ్మాయి రజస్వల అయినప్పుడు మొదలైన రుతుక్రమం ఆగిపోతుంది. దీన్ని మెనోపాజ్ అంటారు. అలాగే పన్నెండు నెలల పాటు నెలసరి రావడం నిలిచిపోతే దాన్నే మెనోపాజ్ గా చెబుతారు. ఈ దశ మొదలయ్యే ముందు మహిళలలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవి కూడా మహిళలందరిలో ఒకేలా ఉండవు.
మెనోపాజ్ ముందు మహిళల్లో వచ్చే లక్షణాలు, ఏమిటంటే, చిన్న విషయాలకే ఎక్కువగా కోపం, చిరాకు, ఇరిటేషన్ లాంటివి వస్తుంటాయి. జుట్టు రాలటం, మతిమరుపు, నిద్రపట్టకపోవటం, తలనొప్పి, ఒంట్లో వేడి ఆవిర్లు రావటం. చర్మంలో అనేక మార్పులు జరుగుతుంటాయి. చర్మం సాగినట్టుగా అవుతుంది. ముడుతలు కూడా వస్తాయి. స్కిన్ కాంతి తగ్గిపోతుంది. బరువు పెరగుతారు. ఇలా ఆఖరికి రుతు చక్రాలు పూర్తిగా ఆగిపోతాయి.
ఈ సమయంలో తమకి ఎదురయ్యే సమస్యలను మహిళలు పైకి చెప్పలేరు. ఇక వాటిని భరించలేక తమలో తామే సతమతమవుతూ ఉంటారు. హార్మోన్ల ఉత్పత్తిలో వచ్చే మార్పుల వల్ల మెనోపాజ్ స్టేజ్ లో మహిళలు మానసిక ఒత్తిడికి ఎక్కువగా గురవుతుంటారు. ఈ సమయంలో బరువు పెరగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ రొమ్ము క్యాన్సర్, గుండె జబ్బులు లాంటివి వచ్చే అవకాశం పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. వివరాల కోసం ఈ వీడియో చూడండి.
ఇక ఈ బొడ్డు తాడు రక్తాన్ని భద్రపరిచే సంస్థలు వేరు ధరలను కలిగి ఉన్నాయి. అయితే బొడ్డు తాడు రక్తాన్ని ఎన్ని సంవత్సరాల పాటు భద్రపరుస్తారనే విషయం కూడా ధరను నిర్ణయిస్తుంది. ఉదాహరణకు 25 సంవత్సరాల పాటు బొడ్డు తాడు రక్తాన్ని భద్రపరచడం కోసం స్టెమ్ సైట్ అనే సంస్థ 55 వేల రూపాయలు తీసుకుంటోంది. ఇక 75 సంవత్సరాల పాటు అయితే, ధర 70 వేల రూపాయలు వరకూ ఉంటుంది. అదనంగా ట్రీట్మెంట్ కోసం ఇన్సూరెన్స్ తీసుకునే అవకాశం ఉంది.







వర్షాకాలంలో ఎక్కువగా కండ్ల కలక వ్యాధి ఇబ్బంది కలిగిస్తుంది. ఈ వ్యాధి నాలుగు రకాలుగా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. బాక్టీరియా లేదా వైరస్, ఏదైనా ఫిజికల్ గాయం వల్ల లేదా ఎలర్జిక్ రియాక్షన్ వల్ల కూడా వస్తుంది. వర్షాకాలంలో బాక్టీరియా, వైరస్ లు పెరగడానికి అనువైన తేమతో కూడిన వాతావరణం ఉంటుంది. దీనివల్ల ఇవి వేగంగా విస్తరిస్తాయి. కండ్లకలకను ఐ ఫ్లూ లేదా పింక్ ఐ అని వైద్య పరిభాషలో పిలుస్తారు.
ప్రస్తుతం వేగంగా కండ్ల కలక విస్తరిస్తున్న నేపథ్యంలో కంటి ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరం అని డాక్టర్లు చెబుతున్నారు. ఇది అంటువ్యాధి కాబట్టి ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తుంది. ఈ కండ్ల కలక లక్షణాలు అందరిలో ఒకేలాగా ఉండక పోవచ్చు.
ఒక్కొక్కరిలో ఒక్కొలాంటి లక్షణాలు ఉంటాయి. అయితే అందరిలో కనిపించే కామన్ గా ఉండే లక్షణం అంటే జిగటగా ఉండే డిశ్చార్జ్ తో కళ్ళు ఎర్రగా మారుతాయి. కళ్ళు దురదగా అనిపించడం, కళ్ల నుంచి నీరు కారడం, లైట్ వెలుగును చూడలేకపోవడం, కళ్ళు తెరవలేకపోవడం, కళ్ల మంట, జ్వరం, గొంతునొప్పి వంటి లక్షణాలు కండ్ల కలక సోకినవారిలో కనిపిస్తాయి.
తీసుకోవలసిన జాగ్రత్తలు:
మరీ ఎత్తుగా లేకుండా, తక్కువ ఎత్తులో ఉండే తలగడను ఎంచుకోవాలి. పెద్ద తలగడ పెట్టుకోవడం వల్ల ప్రారంభంలో ఏమి తెలియకున్న కొద్ది రోజులు గడిచిన తరువాత మెడ నొప్పి మొదలవుతుంది. దానిని నిర్లక్ష్యం చేసినట్లయితే దీర్ఘకాలికంగా ఈ నొప్పి బాధించే అవకాశం ఉంది. ఉదయం నిద్రలేచిన వెంటనే వెన్ను నొప్పిగా అనిపిస్తే వెంటనే దిండు తీసేసి నిద్రపోవాలని చెబుతున్నారు. ఎత్తుగా ఉండే తలగడ ఉపయోగించడం వల్ల వెన్నెముక వంగిపోయి ప్రమాదం ఉందని అంటున్నారు.
అలా జరిగినపుడు డిస్క్ల మధ్య దూరం పెరిగిపోతుంది. దాంతో వెన్నునొప్పి వస్తుందట. చాలా మంది నిద్ర పోయేటప్పుడు దిండులో ముఖాన్ని పెట్టుకుని నిద్రపోతారు. దీనివల్ల శ్వాసకు ఇబ్బంది ఏర్పడుతుంది. ముఖ చర్మం ఉపరితలం పై రంధ్రాలలో గాలికి ప్రవేశం ఉండదు. దాంతో ముఖం పై జిడ్డు ఏర్పడుతుంది. అది బ్లాక్ హెడ్స్ కి దారి తీస్తుంది.
ఎత్తయిన తలగడ పెట్టుకోవడం వల్ల తలకి రక్త ప్రసరణ సరిగ్గా జరగదని, ఫలితంగా జుట్టుకు అవసరమైన పోషణ లభించదట. దానివల్ల జుట్టు రాలే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా బాడిలోని కొన్ని భాగాలకి రక్త ప్రసరణ సరిగ్గా జరుగక వారికి తరచుగా తిమ్మిర్ల సమస్యలు వస్తాయని అంటున్నారు. అందువల్ల తక్కువ ఎత్తుగా, మెత్తగా ఉండే తలగడను ఉపయోగించాలి. ఇలా చేయడంతో నిద్ర చక్కగా పడుతుంది. ఆరోగ్యంగా ఉంటారు.