మన ఇతిహాసాలు పురాణాలు నిజమని అలాగే మన సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచంలో అతి ప్రాచీనమైనవని ఎప్పటినుండో ఆస్తికులు చెబుతూ వస్తున్నారు. కానీ వీటిని నాస్తికులు ఎప్పటికప్పుడు కొట్టిపారేస్తూ ఉండేవారు. ఇక తాజాగా భారతదేశ ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా ప్రపంచవ్యాప్తంగా కొన్ని సాక్ష్యాలు లభిస్తున్నాయి. అలాంటి వాటిలో శ్రీలంకకు భారత్ కు మధ్య ఉన్న రామసేతు కావచ్చు.

గుజరాత్ సమీపంలోని అరేబియా సీలో 150 అడుగులు లోతులో తారసపడే నగరం కావచ్చు.ఇక కృష్ణాష్టమి సందర్భంగా గతంలో గుజరాత్ రాష్ట్రంలోని జామ్ నగర్ వద్ద ఉన్న అరేబియా సముద్రంలో దాదాపు 150 అడుగుల లోతున ఓ నగరం బయటపడింది.

దీన్ని ప్రజలు శ్రీకృష్ణుడు ద్వారకగా పేర్కొంటున్నారు. ఇక వాటిమీద పరిశోధనలు చేసిన పరిశోధకులు కూడా గతంలో ఇది తొమ్మిది వేల ఏళ్ళ క్రితం నాటి నగరంగా పేర్కొన్నారు. తాజాగా మరోమారు కృష్ణాష్టమి సమయంలో ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి వాటి పై మీరు కూడా ఓ లుక్ వేయండి.











తిరుమలలో 7వ కిలో మీటర్ ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తోంది. చర్చలకు దారితీస్తోంది. దానికి కారణం తిరుమల నడకదారిలో చిన్నారులపై చిరుత పులి దాడి చేయడం. రెండు సంఘటనలు జులై, ఆగస్ట్ నెలలో జరిగాయి. మొదటి సంఘటనలో జులై 23న బాలుడు కౌశిక్ చిరుత దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. బాలుడి అరుపులకు భక్తులు వెళ్లడంతో చిరుత విడిచిపెట్టి వెళ్ళింది. ఆ బాలుడు చికిత్స తీసుకున్న తరువాత కోలుకున్నాడు.
ఇదే ప్రాంతంలో ఆ తరువాత ఆగస్ట్ 11న కుటుంబంతో శ్రీవారి దర్శనం కోసం వచ్చిన చిన్నారి లక్షిత చిరుత దాడి చేయగా ప్రాణాలు కోల్పోయింది. ఆ తరువాత ఫారెస్ట్ అధికారులు చిరుతలను బంధించారు. టీటిడి అధికారులు దర్శనంలో కోసం నడకదారిలో వచ్చే భక్తుల భద్రత కోసం తగు చర్యలు చేపట్టారు. ఇక ఇదే ప్రాంతంలో 1980లో దారుణమైన సంఘటన జరిగినట్టు తెలుస్తోంది.
తిరుమలలోని ఘాట్ రోడ్ 7 వ కిలోమీటర్ వద్ద ఒక మహిళను దారుణంగా హత్య చేశారట. ఆ మహిళ హత్య వల్ల కలిగే నష్ట నివారణ కోసం అక్కడ ఒక ఆంజనేయ విగ్రహాన్ని స్థాపించారు అప్పటి ఈవో పీవోఆర్కే ప్రసాద్. అప్పుడు మహిళా హత్య, ఇప్పుడు చిరుతపులి దాడి రెండు కూడా ఇదే 7వ కిలో మీటర్ సమీపంలోనే జరిగాయి.

సోదర సోదరీమణుల ప్రేమ, అనుబంధానికి గుర్తుగా రక్షా బంధన్ పండుగను జరుపుకుంటారు. రాఖీ పౌర్ణమి నాడు అక్కాచెల్లెల్లు తమ అన్నదమ్ములకు రాఖీ కట్టి, వారి ఆశీర్వాదం తీసుకుంటారు. అయితే ఈ ఏడాది వచ్చిన పౌర్ణమి తిథి ఆగస్ట్ 30వ తారీఖు 10 గంటల 58 నిముషాల నుండి 31 వ తారీఖు ఉదయం 7 గంటల 5 నిముషాల వరకు ఉంది.. రాఖీని మంచి ముహూర్తంలో కట్టడం వల్ల సోదరుడికి మంచి జరుగుతుందని, భద్రకాలంలో రాఖీని అస్సలు కట్టకూడదని చెబుతున్నారు.
భద్రకాలంలో రాఖీ కడితే ఆ సోదరుడు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని పండితులు చెబుతున్నారు. శాస్త్రాల ప్రకారం, భద్రకాలంలో సోదరుల చేతికి సోదరీమణులు రాఖీ కట్టకూడదని, భద్ర కాలం పూర్తి అయిన తర్వాతే రాఖీ కట్టాలని అంటున్నారు. భద్ర కాలం ఆగస్టు 30 బుధవారం ఉదయం 10:58 గంటలకు మొదలై రాత్రి 9:01 వరకు ఉంటుంది. అందువల్ల ఈ సమయంలో సోదరులకు రాఖీ కట్టడం మంచిది కాదని పండితులు సూచిస్తున్నారు.
రాఖీ పండుగను రాత్రి9:02 గంటల నుంచి 12 వరకు జరుపుకోవచ్చని అంటున్నారు. అదే సమయంలో ఆగస్ట్ 31 రాఖీ కట్టేందుకు శుభ ముహూర్తమని పలువురు పండితులు చెబుతున్నారు. ఆగస్ట్ 31రోజు ఉదయం 5 గంటల 58 నిముషాల నుండి 7 గంటల 5 నిముషాల వరకు రాఖీ కట్టవచ్చని చెబుతున్నారు.





ముందుగా పసుపుతో గణపతికిపూజా చేసి, ఆ తరువాత ఆ కలశం ముందు లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టి, వరలక్ష్మీ దేవతను ఆవాహన చేయాలి. వరలక్ష్మీ కీర్తిస్తూ షోడశోపచారాలు, అష్ణోత్తరశత నామాలతో అర్చన చేయాలి. అనంతరం దీప, దూప, నైవేద్యాలను తాంబూలాలని వరలక్ష్మీ దేవికి సమర్పించాలి. ఆ తరువాత కర్పూర నీరాజనం, మరియు మంత్రపుష్పం సమర్పించాలి.


ఆదిపురుష్ సినిమా జూన్ 16న ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆడియెన్స్ ను ఆకట్టుకోలేక పోయింది. ఆడియెన్స్ తో పాటు, ప్రభాస్ ఫ్యాన్స్, సినీ, రాజకీయ ప్రముఖులు సైతం దర్శకుడు ఓం రౌత్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విమర్శలు, వివాదాలు, కోర్టులో కేసులు వేసే వరకు వెళ్ళింది. రామాయణంను మార్చి చూపించారని, రావణాసురుడి క్యారెక్టర్ ను తప్పుగా చూపించారని, హనుమంతుడితో మాస డైలాగ్స్ చెప్పించారని, పేర్లు మార్చారని ఇలా ఎన్నోవివాదాలు వచ్చాయి.
తాజాగా కోరాలో “ఆది పురుష్ సినిమాలో లక్ష్మణుడిపేరు శేషు అని పెట్టారు. దీని గురించి వివరించగలరా?” అనే ప్రశ్నను అడుగగా
ఆ పామే లక్ష్మణునిగా జన్మించింది. అందుకే ఈ సినిమాలో లక్ష్మణుని పూర్వ జన్మ పేరుతో శేషు అని పిలిచాడు రాముడు. ఇంకా మహావిష్ణువు యొక్క శంకు, చక్రాలు – భరత, శతృఘ్నులుగా, ఆయన సతీదేవి అయినటువంటి మహాలక్ష్మి దేవి సీతగా జన్మించారు” అని తెలిపారు.