ఒక మనిషికి ఏదైనా సాధించాలి అని తపన ఉంటే చాలు. ఆ తపన ఆ మనిషిని ఎంత దూరం అయినా తీసుకెళ్తుంది. తన పరిస్థితులు ఏవి కూడా ఆ మనిషికి అడ్డం కావు. ఇదే విషయాన్ని చాలా మంది నిరూపించారు. ఇప్పుడు ఒక అమ్మాయి కూడా ఇదే విషయాన్ని నిరూపించండి. వివరాల్లోకి వెళితే, ఐ డ్రీమ్ పోస్ట్ కథనం ప్రకారం, పెద్దపల్లి జిల్లాలో ఉన్న గోదావరిఖనికి చెందిన కూనరపు సిరి అనే అమ్మాయి ఇంటర్లో సీఈసీ గ్రూపులో 927 మార్కులు సాధించింది. సిరి గత ఐదు సంవత్సరాలు నుండి కిడ్నీ సమస్యతో బాధపడుతోంది. 8 నెలల క్రితం రెండు కిడ్నీలు పూర్తిగా ఫెయిల్ అయ్యాయి. వారానికి రెండు రోజులు డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సిరి కుటుంబం ఎన్టీపీసీ కృష్ణనగర్ లో నివసిస్తున్నారు.

Source : idream post
సిరి తల్లిదండ్రులు కూనారపు పోశం, వెంకట లక్ష్మి. సిరి తండ్రి అక్కడ సెంట్రింగ్ పని చేస్తున్నారు. వీళ్ళకి సిరితో పాటు, మరొక కూతురు కూడా ఉంది. సిరి ఇద్దరిలో పెద్ద కూతురు. ఎన్నో ఆసుపత్రులు తిరిగి వైద్యం చేయించాలి అని ప్రయత్నించారు. అయినా కూడా ఫలితం లేకపోయింది. సిరి పరిస్థితిని కాలేజ్ ప్రిన్సిపాల్ తో పాటు అధ్యాపక బృందం తెలుసుకున్నారు. దాంతో ఫోన్ ద్వారా పాఠాలు చెప్పారు. స్నేహితుల ద్వారా సిరికి వాళ్ళు చెప్పే పాఠాలు అందేలాగా చేశారు.
ఏదైనా సబ్జెక్ట్ లో ఏదైనా డౌట్ వస్తే మెసేజ్ ద్వారానే క్లియర్ చేసేవాళ్లు. మరొక పక్క సిరి తల్లిదండ్రులు కూడా సిరికి మద్దతు ఇచ్చారు. సిరి వారంలో రెండు రోజులు డయాలసిస్ చేయించుకుంటూనే పరీక్షలకి ప్రిపేర్ అయ్యింది. దాంతో మొన్న బుధవారం విడుదల అయిన ఫలితాల్లో 927 మార్కులు సాధించింది. ఇంత గొప్ప మార్కులు సాధించడం మాత్రమే కాకుండా, కాలేజ్ టాపర్ కూడా అయ్యింది. కూతురి కిడ్నీ మార్పిడి కోసం వైద్య చికిత్స చేయించడానికి ప్రభుత్వం వారికి మద్దతు చేయాలి అని, అంతే కాకుండా, దాతలు కూడా వారికి సహాయం చేయాలి అంటూ సిరి తండ్రి పోశం కోరారు. పట్టుదలతో ఏదైనా సాధించగలరు అని సిరి నిరూపించింది.
ALSO READ : చెప్పిన మాట నిలబెట్టుకున్న “బర్రెలక్క”… ఎంపీ గా నామినేషన్.! ఆ బలమైన నాయకుడిపై గెలిచేనా.?

















మే 2014న ఇండియాకి 14వ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నరేంద్ర మోడీ పూర్తి పేరు నరేంద్ర దామోదరదాస్ మోడీ. ఆయన గుజరాత్ లో 1950లో జననం సెప్టెంబర్ 17న వాద్నగర్లో జన్మించారు. అక్కడే ఆయన సెకండరీ విద్యను కంప్లీట్ చేశారు. 8 సంవత్సరాల వయసులో ఆర్ఎస్ఎస్తో పరిచయం ఏర్పడింది. మోదీ పాఠశాల నుంచి వచ్చిన వెంటనే వాద్నగర్ స్టేషన్ దగ్గరలో ఉన్న తండ్రి టీ దుకాణానికి వెళ్లేవారు. టీ అమ్మడంలో తండ్రికి సహాయం చేసేవారు.
తన కుంటుంబం చిన్నతనంలో నిర్ణయించిన ప్రకారంగా మోడి 18 ఏళ్ల వయస్సులో, 17 ఏళ్ల వయసు ఉన్న జశోదాబెన్ మోడీని వాద్నగర్ కుల సంప్రదాయంలో పెళ్లి చేసుకున్నారు. అయితే వివాహం అయిన వెంటనే ఆమెను, కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడని తెలుస్తోంది. రెండేళ్ల తర్వాత తిరిగి వచ్చిన మోదీ కుటుంబాన్ని కలిశారు. మోడి తల్లి ఒత్తిడితో, జశోదాబెన్ వారి వైవాహిక జీవితాన్ని కొనసాగించడానికి మోడి ఇంటికి వచ్చింది. కానీ మోడి ఈ ఏర్పాటును వ్యతిరేకించాడు.
తన సిద్ధాంతాల ప్రకారమే తన జీవితాన్ని కొనసాగిస్తానని వెల్లడించాడు. అంతే కాకుండా జశోదాబెన్ చదువు కోవాలని ప్రోత్సహించాడు. ఆ తరువాత ఆమెను ఎప్పుడు భార్యగా వెల్లడించలేదు. ఆ తర్వాత 1985లో బీజేపీతో కలిశారు. నాలుగు దశాబ్దాల తర్వాత చట్టబద్ధంగా ఎన్నికల అఫిడవిట్లో వెల్లడించాల్సి రావడం, ఆయన పెళ్లి గురించి గుజరాత్ రాజకీయాలలో గుసగుసలు వినిపించడంతో జశోదాబెన్ ని భార్యగా బహిరంగంగా ఒప్పుకున్నారు. 2014 లో ఎన్నికల అఫిడవిట్లో వివాహ విషయాన్ని ప్రస్తావించడంతో అందరికీ తెలిసింది. జశోదాబెన్ మోడి ఒక రిటైర్డ్ టీచర్.