శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా నటించిన మహా సముద్రం ట్రైలర్ ఇటీవల విడుదల అయ్యింది. ఈ సినిమాలో అదితి రావు హైదరి, అను ఇమాన్యుల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆర్ఎక్స్ 100 సినిమాకి దర్శకత్వం వహించిన అజయ్ భూపతి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.అయితే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో సిద్ధార్థ్ పాల్గొనలేదు.
ఇన్ని సంవత్సరాలు అయినా సరే రెండు తెలుగు రాష్ట్రాల్లో సిద్ధార్థ్ కి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఈవెంట్ కి సిద్ధార్థ్ రాకపోవడంతో చాలా మంది “సిద్ధార్థ్ ఎందుకు రాలేదు?” అని ప్రశ్నించారు. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, సిద్ధార్థ్ ఏదో ఆపరేషన్ కోసం విదేశాలకు వెళ్లారు. దాంతో అభిమానులు అందరూ ఆందోళనకు గురయ్యారు.
ఇవాళ సిద్ధార్థ్ సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటో పోస్ట్ చేసి, మహా సముద్రం డబ్బింగ్ పూర్తి అయినట్టు, అలాగే తన దెబ్బ గురించి కూడా చెప్పారు. వెన్నెముకకి దెబ్బ తగిలింది అని, దాని సర్జరీ కోసం వెళ్ళాను అని చెప్పారు. అలాగే “మేము అందరం కష్టపడి చేసిన సినిమా ప్రేక్షకులతో కలిసి థియేటర్లలో కలిసి చూడడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు చూపించిన ప్రేమకి నాకు చాలా సంతోషంగా అనిపించింది” అని పోస్ట్ షేర్ చేశారు సిద్ధార్థ్.





ఏదేమైనా సినిమా బృందంలోకి ప్రపంచంలో పేరున్న బాక్సర్లలో ఒకరైన మైక్ టైసన్ యాడ్ అవ్వడం, ఈ సినిమాలో విజయ్ దేవరకొండ లుక్ కి సంబంధించిన స్టిల్స్, అవన్నీ కూడా సినిమాపై ఇంకా ఆసక్తిని పెంచుతున్నాయి. సెప్టెంబర్ లో విడుదల కావాల్సిన లైగర్ సినిమా వాయిదా పడి అక్టోబర్ లో విడుదల అవుతుంది అని సమాచారం. ఇది నిజమో కాదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.










