కర్ణాటక లోని మంగళూరులోని క్రిస్టియన్ మేనేజ్మెంట్ ఉన్న ఒక పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామ మందిరం మరియు ప్రధాని నరేంద్ర మోడీ గురించి అవమానకరమైన హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని ఆరోపణలపై ఉపాధ్యాయునిపై నిరసన వ్యక్తం వ్యక్తం చేశారు. పాఠశాల ముందు హిందూ అనుకూల సంఘాలతో కలిసి నిరసన చేపట్టారు. అసలు ఏం జరిగిందంటే మంగళూరులోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ హెచ్ ఆర్ ప్రైమరీ స్కూల్లో ఈ సంఘటన జరిగింది.
హిందూ దేవుళ్లను అవమానించడమే కాకుండా హిందూ పురాణాల గురించి తప్పుగా పిల్లలకు ఒక టీచర్ నేర్పిస్తున్నట్లు విద్యార్థులు ఇచ్చిన సమాచారం విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ ముందు తీవ్ర నిరసన చేపట్టారు.స్థానిక బిజెపి ఎమ్మెల్యే వేద వ్యాస్ కామత్ వీరికి అండగా నిలిచారు. దీంతో పాఠశాల వద్ద తీవ్ర అభివృద్ధి ఉద్రిక్తత నెలకొంది. హిందూ మతానికి వ్యతిరేకంగా విద్యార్థుల మనసులను విషపూరితం చేయటం, ఇతర మతాలకు చెందిన విద్యార్థులను క్రైస్తవ మతంలోకి మార్చటానికి కుట్రలు పన్నుతున్నారని హిందూ సంఘాల నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

అలాగే 2002 గుజరాత్ అల్లర్ల గురించి, గోద్రా ఘటన గురించి తప్పుడు సమాచారం ఇస్తున్నారని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఆ టీచర్ బోధిస్తున్నారని చెప్పారు. రామాయణం, మహాభారతం లాంటి పురాణాలు వట్టి కల్పితాలని చెప్పటం సంచలనంగా మారింది. బజరంగ్దళ్ విహెచ్పి సభ్యులు స్కూల్ యాజమాన్యంతో వాగ్వాదానికి దిగి టీచర్ ని వెంటనే సస్పెండ్ చేయమని డిమాండ్ చేశారు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మంగళూరు డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ విచారణ చేపట్టారు. అయితే పరిస్థితి శృతి మించుతుందని గమనించిన యాజమాన్యం తమ స్పందనను తెలియజేసింది. గత 60 సంవత్సరాలుగా ఇలాంటి సంఘటన ఎప్పుడూ చోటు చేసుకోలేదని, ఈ సంఘట తమ పాఠశాల పై నమ్మకాన్ని పోగొట్టేలా ఉందని అయితే అందరి సహకారంతో మళ్ళీ ఆ నమ్మకాన్ని తిరిగి కల్పిస్తామని స్టేట్మెంట్ ఇచ్చారు.















అయోధ్యలో రామ మందిరంలో బాల రాముడి ప్రాణప్రతిష్ఠ గ్రాండ్ జరిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే దేశంలో తిరుపతి, అనంత పద్మనాభస్వామి దేవాలయం, షిర్డీ లాంటి దేవాలయాలకు భారీగా భక్తులు తరలివస్తుంటారు. దేశంలోనే ఈ దేవాలయాలు అత్యంత ధనిక దేవాలయాలుగా ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. పుణ్యక్షేత్రాలకు ప్రజలు ఎక్కువగా వెళ్తుంటారు. అది కూడా ఫ్యామిలీ అంతా వెళ్తుంది. దీనివల్ల ట్రాన్స్ పోర్ట్, రెస్టారెంట్లు, హోటల్స్ తో పాటు ఇతర బిజినెస్ లకు డిమాండ్ కూడా పెరుగుతుంది.
వివిధ రంగాలకు ఆదాయం పెరగడంతో టాక్స్ ల రూపంలో గవర్నమెంట్స్ కు పెద్ద మొత్తంలో ఆదాయం చేకూరుతుంది. ఇటీవల శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తుల తాకిడితో 2 నెలలకు గాను 357 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. ఇక ఇప్పుడు అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం జరిగిన నేపథ్యంలో ఆధ్యాత్మిక టూరిజం పేరుగుతుందని ఎస్బీఐ రీసెర్చ్ అంచనా వేసింది.
ఎస్బీఐ నివేదిక ప్రకారం, యూపీలో రామ మందిరం నిర్మాణం మరియు అదనపు చర్యల వల్ల 2024-25 లో యూపీ గవర్నమెంట్ కు అదనంగా 25 వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా. ఈ మొత్తం సందర్శకుల రాకతో సమకూరనుంది. దీనివల్ల రోడ్డు, రైలు, వాయురవాణా పెరిగే ఛాన్స్ ఉంది. భక్తుల సేవల గాను హోటల్స్, హాస్పటల్స్ సైతం పెరుగుతాయి. 2027 వరకు మహారాష్ట్రతో పాటుగా ఉత్తర ప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 500 బిలియన్ డాలర్లను అధిగమించి, దేశ జీడీపీలో యూపీ వాటా పది శాతంగా ఉంటుందని తెలిపింది.


అయితే మరణంతో పోరాడిన విజయకాంత్ చివరికి చావు చేతిలో ఓడిపోక తప్పలేదు. అయితే ఈయన మరణం కోలీవుడ్ చిత్ర పరిశ్రమని దిగ్భ్రాంతికి గురి చేసింది. కడసారి చూపు కోసం పెద్ద ఎత్తున సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, అభిమానులు అందరూ వచ్చారు. ఇప్పటికకీ ఈయన సమాధి వద్దకు వందలాది మంది అభిమానులు వచ్చి దర్శించుకుంటున్నారు. అయితే ఈ విషాద సంఘటన నుంచి విజయ్ కాంత్ కుటుంబం ఇంకా బయటపడలేదనే చెప్పాలి.
