అయోధ్యలో రామ మందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ ఎంతో ఘనంగా జరిగింది. ఎంతో మంది ప్రముఖులు ఈ వేడుకకి హాజరు అయ్యారు. రామనామ స్మరణతో అయోధ్య అంతా మారుమ్రోగుతోంది. రామ మందిరం అంతా పూల వర్షం కురిసింది.
నరేంద్ర మోడీ శ్రీరాముడికి పూజలు చేశారు. ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ శ్రీరాముని ప్రతిమని రూపొందించారు. భారతదేశం అంతా కూడా జైశ్రీరామ్ అంటూ ఈ వేడుకని జరుపుకుంటుంది. ఎంతో మంది సోషల్ మీడియా ద్వారా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నో దశాబ్దాల కల ఇప్పుడు నెరవేరింది అని ఆనందపడుతున్నారు. అయితే ఒకపక్క ఇంత జరుగుతుంటే, మరొక పక్క మరొక రకమైన విషయం చర్చనీయాంశం అయ్యింది. తమిళనాడు వాళ్లు మాత్రం ఈ వేడుకలో పాల్గొనట్లేదు అంటూ ఒక విషయం వార్తల్లో నిలిచింది. ట్విట్టర్ లో రావణుడికి మద్దతుగా ట్రెండ్ నడిచింది. ల్యాండ్ ఆఫ్ రావణ, తమిళ్ ప్రైడ్ రావణ అంటూ ఈ ట్రెండ్ ట్విట్టర్ లో నడుస్తోంది. అందుకు కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.

తమిళనాడుకు చెందినవారు రావణుడికి మద్దతు ఇస్తారు. రావణుడిని దైవంగా భావిస్తారు. ఇలా చేయడం వెనుక పలు రకాల కథనాలు ఉన్నాయి. అందులో ఒక కథనం ఏంటి అంటే, రావణ ద గ్రేట్ కింగ్ ఆఫ్ లంక అనే పుస్తకంలో ప్రొఫెసర్ పూర్ణ లింగం పిళ్ళై, రావణుడు ద్రవిడ వంశానికి చెందినవారు అని, అందులోనూ ముఖ్యంగా ఆయన తమిళులు అని పేర్కొన్నారు. ఈ భావం చేత రావణుడిని తమిళనాడుకు చెందినవారు సమర్థిస్తారు అని అంటారు. ఈ విషయంపై ఉన్న మరొక కథనం ఏంటి అంటే తమిళంలో రామాయణాన్ని కంబరామాయణ పేరుతో రాశారు.

ఇందులో రాసిన దాని ప్రకారం, రావణాసురుడు చాలా మంచి రాజు. ఆయన ప్రజలని ఎంతో బాగా చూసుకున్నారు. అలాగే మంచి సంగీత విద్వాంసుడు కూడా. సాక్షాత్తు ఆ పరమశివుడే రావణాసురుడి సంగీతాన్ని మెచ్చారు. ఆయన కొన్ని పొరపాట్లు చేశారు. సీత విషయంలో ఆయన చేసినది సరైన విషయం కాదు. అయితే దీనికి మరొక కోణం కూడా ఉంది అని అంటారు. తన చెల్లెలిని బాధపెట్టారు. కాబట్టి తన సోదరిని బాధ పెట్టిన ఆవేదన కూడా రావణుడికి ఉంది. కానీ మరొక పక్క ఆయన చాలా గొప్ప పరిపాలకుడు. తన ఊరిలో డబ్బుల్లేక ఇబ్బందులు ఎదుర్కొన్న పేదవారికి బంగారు పాత్రలు ఉపయోగించే అంత సౌభాగ్యం

తన రాజ్యం అంతా సంపదలతో, సుఖ సంతోషాలతో నిండిపోయే అంత గొప్పగా పాలించారు. అంతే కాకుండా రావణుడిని సంహరించిన తర్వాత ఒక సందర్భంలో లక్ష్మణుడికి, రాముడు రాజకీయాల గురించి, ఒక రాజు తన రాజ్యంలో ఎలా పాలించాలి అనే విషయం గురించి రావణుడిని చూసి నేర్చుకోమని చెప్తారు అని కూడా అంటారు. స్వచ్ఛమైన పాలని ఒక చిన్న విషం విషయం చుక్క కూడా పాడు చేయగలదు. అదేవిధంగా సీత విషయంలో జరిగిన దాని వల్ల రావణాసురుడు మీద అందరికీ మరొక రకమైన అభిప్రాయం ఏర్పడింది కానీ, రావణాసురుడు చాలా గొప్ప రాజు అని అంటారు.

ఈ కారణంగానే చాలా మంది తమిళులు రావణాసురుడిని ఆరాధిస్తారు. అయితే మరొక పక్క, అందరూ రావణాసురుడిని ఆరాధించరు. అందులోనూ ముఖ్యంగా తమిళనాడుకు చెందిన వాళ్లు అందరూ కూడా రావణుడిని ఏమీ అభిమానించరు. ఇది కేవలం రాజకీయాల వచ్చిన ఒక అపోహ మాత్రమే అనే మరొక కథ కూడా ఉంది. ఇలా ఈ విషయం మీద ఎన్నో రకాల కథనాలు ఉన్నాయి. ప్రస్తుతం అయితే మాత్రం సోషల్ మీడియాలో రావణాసురుడికి తమిళ వాళ్ళు మద్దతు పలుకుతూ ఒక ట్రెండ్ అయితే నడుస్తోంది.
ALSO READ : ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనుకోవడం లేదు.. వైరల్ అవుతున్న నయనతార క్షమాపణ లేఖ!






విజయవాడలోని స్వరాజ్ మైదానంలో 205 అడుగుల ఎత్తు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని, 18.18 ఎకరాల ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం సుమారు రూ.404.35 కోట్ల ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. నిన్న సాయంత్రం జరిగిన అంబేద్కర్ విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ ఆవిష్కరించారు.
ఈరోజు నుండి అంబేద్కర్ విగ్రహ సందర్శనకు పర్మిషన్ ఇచ్చినట్టు ప్రకటించారు. దాంతో ఉదయం నుండే అంబేద్కర్ విగ్రహం సందర్శనకు స్మృతి వనంకు ప్రజలు రావడం ప్రారంభించారు. అయితే అక్కడికి వెళ్ళిన తరువాత పోలీసులు, అధికారులు ప్రజలను అడ్డుకుని, లోపలకు వెళ్లేందుకు పర్మిషన్ లేదని వెనక్కి పంపిస్తున్నారు. ప్రజలు విశాఖ, అమలాపురం వంటి ప్రాంతాల నుండి వచ్చామని చెప్పినా కూడా అధికారులు రెస్పాండ్ కాలేదని తెలుస్తోంది.
స్మృతి వనంలోపలికి ప్రజలను అనుమతించక పోవడానికి, మినీ థియేటర్లో ఐప్యాక్ టీం ఆధ్వర్యంలో మంత్రులతో పార్టీ ప్రోగ్రామ్ షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం. స్మృతివనం దగ్గర రోడ్డు పైన ఆరుగురు మినిస్టర్ల కాన్వాయ్ వెహికిల్స్ ఉన్నాయి. అంబేద్కర్ విగ్రహం సందర్శనకు అనుమతి ప్రకటించి, తీరా అక్కడకు వెళ్ళాక అడ్డుకోవడంతో ప్రజలు ఆగ్రహిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను తిప్పి పంపుతున్నారంటూ అధికారుల పై ప్రజలు మండిపడుతున్నారు. ఐప్యాక్ టీం, పార్టీ కార్యక్రమ షూటింగ్ కోసం దూరం నుండి వచ్చిన ప్రజలను పోలీసులు అనుమతించకపోవడం పై విమర్శలు వస్తున్నాయి.



2010 ఏప్రిల్లో షోయబ్ మాలిక్, సానియా మీర్జాల పెళ్లి హైదరాబాద్లో గ్రాండ్ గా జరిగింది. ఆ సమయంలో వీరి వివాహం పై పెద్ద ఎత్తున్న చర్చలు జరిగాయి. ఈ జంటకు కుమారుడు ఇజాన్ 2018లో జన్మించారు. సానియా, మాలిక్ మధ్య విభేదాలు వచ్చినట్టు రెండు సంవత్సరాలుగా రూమర్స్ వస్తున్నాయి. అయితే ఇజాన్ సానియా దగ్గరే దుబాయ్ లో ఉండగా, షోయబ్ మాలిక్ ఎక్కువగా పాక్ లో ఉంటున్నాడు. విడాకుల పై ఇద్దరు బహిరంగంగా మాట్లాడలేదు.
కానీ నెట్టింట్లో క్రిప్టిక్ పోస్టులు పెడుతుంటారు. ఈ క్రమంలోనే విడాకులు ఇంకా కష్టం అంటూ సానియా పోస్ట్ షేర్ చేసింది. దాంతో విడాకుల విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇంతలోనే సనా జావేద్ను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి షాక్ ఇచ్చాడు. సనా జావేద్ను పాకిస్థాన్ కు చెందిన నటి మరియు మోడల్.
ఆమె 2012లో ‘షెహర్-ఎ-జాత్’ తో బుల్లితెర పై అడుగుపెట్టింది. ఆ తరువాత అనేక సీరియల్స్లో నటించింది. 2017లో డానిష్ మెహ్రునిసా వి లబ్ యు అనే సోషియో-కామెడీ మూవీతో సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చింది. అనేక చిత్రాలలో నటించిన సన ఎన్నో అవార్డులు అందుకుంది. 2020లో సింగర్ ఉమైర్ జస్వాల్ను పెళ్లి చేసుకుంది. 2023లో నవంబర్ 28న అతనికి విడాకులు ఇచ్చింది. తాజాగా షోయబ్ మాలిక్ని రెండవ సారి పెళ్లి చేసుకుంది. మాలిక్, సనా జావేద్ రిలేషన్ లో ఉన్నారని గత ఏడాది నుండి రూమర్లు వస్తున్నాయి.
విగ్రహాం కింది భాగంలో 3 ఫ్లోర్లు కలవు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 4 హాళ్లను నాలుగు వేల చదరపు అడుగుల విస్తీర్ణం చొప్పున నిర్మించారు. వీటిలో ఒక సినిమా హాలు, మూడు హాళ్లలో డిజిటల్ మ్యూజియం ఏర్పాటు చేశారు. మొదటి ఫ్లోర్లో 4 హాళ్లు, రెండవ ఫ్లోర్లో 4 హాళ్లు కలవు. అంబేద్కర్ విగ్రహం మరియు స్మృతివనంకోసం సుమారు 400 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయి. అయితే తెలంగాణలో మాజీ సీఎం కేసిఆర్ 125 అడుగుల ఎత్తు ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని గత ఏప్రిల్ లో ఆవిష్కరించారు. అయితే ఆ ప్రభుత్వం 146 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది.
తాజాగా విజయవాడలోని అంబేద్కర్ స్మృతివనంను టిడిపి దళిత నాయకులు సందర్శించారు. ఈ క్రమంలో తెలంగాణలో అంబేద్కర్ విగ్రహాన్ని రూ.150 కోట్ల రూపాయలలోపే ఏర్పాటు చేశారు. విజయవాడలో అంతే ఎత్తు అంబేద్కర్ విగ్రహాం ఏర్పాటుకు మాత్రం 400 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు అయ్యిందని టీడీపీ ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. నక్కా ఆనంద్ బాబు “తమ ప్రభుత్వం ఉన్నప్పుడే 137 కోట్ల రూపాయలతో స్మృతివనం ఏర్పాటుకోసం పనులను మొదలుపెట్టామని, 26 శాతం వరకు పూర్తి చేశామని అన్నారు. అంబేద్కర్ స్టాచ్యూ పేరుతో దోపిడీకి తెరలేపారని ఆరోపించారు.