తానొకటి తలచినా, దైవం ఒకటి తలచును అన్నట్టు..ముక్కుతో మూలుగుతూ రెండవ విడత లాక్ డౌన్ మరో మూడు రోజుల్లో పూర్తైపోతుంది..హమ్మయ్య హమయ్య రెండు రోజులైతే లాక్ డౌన్ తీసేస్తారు అని హ్యాపీగా ఫీలవుతుంటే లాక్ డౌన్ 33 పిడుగు పడింది. మరోవైపు రోజురోజుకి కేసుల సంఖ్య పెరుగుతోంది..దీంతో అసలేం జరుగుతోందో అర్దం కాని పరిస్థితి..ఈ నేపధ్యంలో సింగపూర్ యూనివర్శిటి చేసిన వ్యాఖ్యలు ఆశాజనకంగా ఉన్నాయి.

మరీ అమెరికా, ఇటలీ స్థాయిలో బీబత్సంగా పెరగకపోయినా మన దగ్గర కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది తప్ప, తగ్గుతున్నట్టుగా అనిపించడంలేదు..కానీ సింగపూర్ యూనివర్సిటీ ఏం చెప్పిందంటే. “ఇండియా ఒక ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్ స్థాయిని దిగ్విజయంగా దాటేసింది..ప్రస్తుతం ఉన్న పరిస్థితి కూడా మే చివరి వారానికి తగ్గుముఖం పడుతుందని, జూన్ మొదటి వారంలోపు 99% తగ్గుతుందని” సింగపూర్ యూనివర్శిటి ఆప్ టెక్నాలజి అండ్ డిజైన్ ఒక నివేదిక ఇచ్చింది. జూలై 25 నాటికి 100 శాతం కరోనా ఫ్రీ దేశంగా భారత్ ఉండనుందని సింగపూర్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్ రీసెర్చర్లు ఆ రిపోర్ట్ లో తెలిపారు.

ఇప్పటికే కరోనాతో అతలాకుతలం అయినా ఇటలీ కొద్దికొద్దిగా కోలుకుంటుంది..అమెరికాలో పరిస్థితి కూడా ఇంతకుముందు ఉన్నంత భయంకరంగా లేదనేది అర్దం అవతోంది..మరోవైపు చైనా, న్యూజిలాండ్,ఆస్ట్రేలియా,వియత్నాం కరోనా ఫ్రీ దేశాలుగా నిలుస్తున్నాయి..మన దేశంలో కూడా ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు కరోనా ఫ్రీ రాష్ట్రాలుగా నిలవగా, కేరళ, తెలంగాణా లాంటి రాష్ట్రాలు కరోనాని కట్టడి చేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి.

సింగపూర్ యూనివర్శిటి ఇచ్చిన నివేధిక ఎంత వరకు నిజం అవుతుందనేది సెకండరీ..కానీ ప్రజల్లో నెలకొన్న భయం ,ఆందోళనలకు కొంత ఉపశమనాన్ని ఇస్తాయి అనేది నిజం . ఇలాంటి కామెంట్స్ సమస్యకి పరిష్కారం కాకపోవచ్చు.. కాని పాజిటివ్ కామెంట్స్ కొంత ధైర్యాన్ని ఇస్తాయి.




ఇకపోతే మన దేశానికి ….పెద్ద మహమ్మారిలా మారింది లాక్ డౌన్ కారణంగా అటు సినీ రంగం..ఇటు టీవీ రంగం కూడా షూటింగ్స్ నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది..తిరిగి ఎప్పుడు ప్రారంభం అవుతాయో తెలియదు..ఇలాంటి వృత్తినే నమ్ముకున్న ఆర్టిస్టుల కష్టాలు అన్ని ఇన్ని కావు..వేళ్ళని ఆదుకోవడనికి ఇంకా ఎవ్వరు ముందు రాలేదు.ఇక బుల్లి తెర సంచలనం ‘జబర్దస్త్’ ఎంత పేరు ని సంపాదించుకుందో అందరికి తెలియనిది కాదు.స్కిట్ ల మీదే ఆధార పడి బ్రతుకుతున్న వారు ఎందరో…వీరిలో ఒకరు అయిన జబర్దస్త్ కమెడియన్ జీవన్ తన రైతు వృత్తినే ఎన్నుకున్నారు.



రైళ్లు ,సబర్బన్ రైళ్ల రద్దు ని మే 17 వరకు కొనసాగించనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే శనివారం ప్రకటించింది కరోనా వైరస్ నివారించే భాగంగా లాక్ డౌన్ ను మరిన్ని రోజులు పొడిగించడం తో రైల్వే శాఖ ఈ మేరకు నిర్ణయం ప్రకటించింది. పార్సిల్ , సరకు రవాణా కి ఎటువంటి ఆటకం ఉండదు అంటూ ప్రకటించింది. రైలు టిక్కెట్ల కోసం స్టేషన్లకు రావొద్దు అంటున్నారు. లాక్ డౌన్ కారణంగా వివిధ ప్రాంతాల్లో చికుక్కున విద్యార్థులు,పర్యాటకులు,వలస కార్మికులు,తీర్థయాత్రికులు, మరే ఇతర కారణాల చేత చిక్కుకున్న ప్రయాణికులు శ్రామిక్ ప్రత్యేక రైళ్ల ద్వారా తమ స్వస్థలాలకు తరలించే ఏర్పాట్లు చేయబోతునన్టు వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టం మేరకు ,కేంద్ర హోమ్ శాఖ మార్గ దర్శకాలనులోబడి శ్రామిక్ ప్రత్యేక రైళ్లను నడుపబోతుననట్టుగా తెలిపింది.ఈ రైళ్లలో ప్రయాణదలచిన వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించవల్సిందిగా సూచించారు.రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి నమోదు చేసుకున్న వారికి మాత్రమే ప్రయాణించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా ప్రకటించింది వ్యక్తులకి టిక్కెట్లను విడివిడిగా ఇవ్వడం కుదరదు బృందాలకు కూడా టికెట్లు ఇవ్వడం సాధ్యపడదు కాబట్టి టిక్కెట్ల కోసం నేరుగా రైల్వే స్టేషన్లకు దయచేసి రావద్దు అని దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి చేస్తున్నారు.


















