కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసే పనిలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే..అయితే మే 3 తరువాత కూడా పొడగించాలని ఇటీవలే ప్రకటించింది..దేశ వ్యాప్తంగా ఇంకో రెండు వారాల పాటు అంటే మే 17 దాఖా పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం మళ్ళీ కొత్త నిర్ణయం తీసుకుంది .దీనికి సంబందించిన ఉత్తరువులు నిన్న జారీ కూడా చేసింది.

దేశమంతా రాత్రి 7 నుంచి ఉదయం 7 దాకా అన్ని నాన్ ఎస్సెన్షియల్ సర్వీసులని బంద్ చేయాలని ఆదేశించింది కానీ జిల్లాల వారీగా రెడ్,ఆరెంజ్,గ్రీన్ జోన్లుగా విభజించి కొన్ని వెసులుబాటులను కల్పించింది.అయితే అన్ని చోట్ల జోన్లతో సంబంధం లేకుండా ఉపాధి హామీ పనులు చేసుకునే అవకాశం కల్పించింది.వీటితో పాటుగా మరికొన్ని ఆర్థిక కార్యకలాపాలకు అనుమతిని ఇచ్చారు.

Rules For Liquor Shops In Green Zones.
ఇకపోతే ప్రజా రవాణా సంస్థలు రైళ్లు,విమాన సర్వీసులు,షాపింగ్ మాల్స్,సినిమా హాళ్లు,కాలేజీలు,హోటళ్లు,రెస్టారెంట్లు, ఇంకా పూర్తి స్థాయిలో బంద్ చేయవలసిందే అని నిర్ణయించింది.కానీ ఆరెంజ్,గ్రీన్ జోన్లలో పరిమిత స్థాయిలోనే ఆయా జిల్లాల్లో రోడ్డు రవాణాకు అనుమతులు ఇచ్చింది. ప్రైవేట్ క్యాబ్స్ లో డ్రైవర్ తో పాటు కేవలం మరో ఇద్దరు మాత్రమే

Rules For Liquor shops in Green zones
ప్రయాణం కొనసాగించాలంటూ అనుమతులను ఇచ్చింది.ఇక గ్రీన్ జోన్స్ విషయానికి వస్తే 50 శాతం సీటింగ్ తో ఆర్టీసీ బస్సులను నడుపుకునేందుకు అవకాశం కల్పించింది..ఇకపోతే రాష్ట్రాల ఆదాయంలో కీలక పాత్ర పోషించే లిక్కర్ …కేవలం గ్రీన్ జోన్లలో వీటితో పాటు పాన్ షాప్ ఓపెన్ చేసుకుందుకు వెసులుబాటు కల్పించింది. కానీ అసలు షరతు ఏంటంటే ఒకేసారి షాప్ దగ్గర అయిదుగురు మించి ఉండటానికి వీలు లేదు.ఒక్కొక్కరు మధ్యన కనీసం రెండు మీటర్ల సామజిక దూరాన్ని పాటించాలని సూచించింది కేంద్ర హోమ్ శాఖ.

రైళ్లు ,సబర్బన్ రైళ్ల రద్దు ని మే 17 వరకు కొనసాగించనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే శనివారం ప్రకటించింది కరోనా వైరస్ నివారించే భాగంగా లాక్ డౌన్ ను మరిన్ని రోజులు పొడిగించడం తో రైల్వే శాఖ ఈ మేరకు నిర్ణయం ప్రకటించింది. పార్సిల్ , సరకు రవాణా కి ఎటువంటి ఆటకం ఉండదు అంటూ ప్రకటించింది. రైలు టిక్కెట్ల కోసం స్టేషన్లకు రావొద్దు అంటున్నారు. లాక్ డౌన్ కారణంగా వివిధ ప్రాంతాల్లో చికుక్కున విద్యార్థులు,పర్యాటకులు,వలస కార్మికులు,తీర్థయాత్రికులు, మరే ఇతర కారణాల చేత చిక్కుకున్న ప్రయాణికులు శ్రామిక్ ప్రత్యేక రైళ్ల ద్వారా తమ స్వస్థలాలకు తరలించే ఏర్పాట్లు చేయబోతునన్టు వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టం మేరకు ,కేంద్ర హోమ్ శాఖ మార్గ దర్శకాలనులోబడి శ్రామిక్ ప్రత్యేక రైళ్లను నడుపబోతుననట్టుగా తెలిపింది.ఈ రైళ్లలో ప్రయాణదలచిన వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించవల్సిందిగా సూచించారు.రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి నమోదు చేసుకున్న వారికి మాత్రమే ప్రయాణించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా ప్రకటించింది వ్యక్తులకి టిక్కెట్లను విడివిడిగా ఇవ్వడం కుదరదు బృందాలకు కూడా టికెట్లు ఇవ్వడం సాధ్యపడదు కాబట్టి టిక్కెట్ల కోసం నేరుగా రైల్వే స్టేషన్లకు దయచేసి రావద్దు అని దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి చేస్తున్నారు.


























