“టిక్ టాక్” ఇటీవల కాలంలో ఈ సోషల్ మీడియా యాప్ ఎదుర్కొన్నన్ని విమర్శలు మరే యాప్ ఎదుర్కొని ఉండదు . టిక్ టాక్ మోజులో పడి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఈ మధ్య కలవరపరిచాయి . చిన్నా పెద్దా తేడా లేకుండా టిక్ టాక్ ని ఎడా పెడా వాడేస్తున్నారు. టిక్ టాక్ ని బ్యాన్ చేయాలనేంతగా విమర్శించారంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో ఊహించుకోండి. ఆల్రెడీ గతంలో ఒకసారి టిక్ టాక్ ని ఆపేసారనుకుంటా , మళ్లీ కోర్టు ఉత్తర్వులతో అందుబాటులోకి వచ్చినట్టుంది . అయితే మొట్టమొదటి సారి టిక్ టాక్ వలన తండ్రి కొడుకులు కలుసుకున్న సంఘటన అందరిని సంతోష పెడుతుంది . అసలింతకి ఆ తండ్రీకొడుకులు ఎలా విడిపోయారు ? వారిని కలపడంలో టిక్ టాక్ ఎలా సాయపడింది చదవండి.

కర్నూలు జిల్లా నంద్యాలలోని హరిజనపేటకు చెందిన నరసింహులు క కూడా అందరిలానే టిక్ టాక్లు చేసేవాడు . సంతోషం వచ్చినా, బాధకలిగిన టిక్టాక్ చేసి ఆ వీడియోని అప్లోడ్ చేసేవాడు. నరసింహులుకి పెళ్లైంది , పిల్లలు. కుటుంబంతో సంతోషంగా గడుపుతున్నప్పటికి ఒక వెలితి ఉండేది . తన తండ్రి కనిపించకుండా పోయి ఆరేళ్లయింది. తండ్రి కోసం అంతా వెతికారు. ఎంత వెతికినా తండ్రి ఆచూకి దొరకకపోవడంతో చనిపోయాడని నిర్దారించుకుని , ప్రతిఏడాది చనిపోయిన వారికి చేసే కార్యక్రమాలన్ని తమ్ముడితో కలిసి చేస్తూ వచ్చాడు.

కానీ ఒకరోజు నరసింహులుకు ఒక ఆలోచన వచ్చింది .అదేంటంటే , కనిపించకుండా పోయిన తన తండ్రి గురించి వీడియో చేయాలనుకున్నాడు. ఆలోచన వచ్చిందే తడవుగా వీడియో చేసి అప్లోడ్ చేశాడు . సంపాదించలేని టైమ్లో తండ్రి దగ్గర ఉన్నాడని ఇప్పుడు సంపాదించే టైంలో తండ్రి దూరమవ్వడం బాధగా ఉందని తండ్రిని గుర్తు చేసుకుంటూ చేసిన ఆ వీడియో సోషల్మీడియాలో చక్కర్లు కొట్టింది. ఇంకేం ఆ వీడియో చూసిన చాలామంది దాన్ని శేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. చివరికి తండ్రి వరకు చేరింది. సరదాగా చేసిన వీడియో తన తండ్రిని కలుపుతుందని కలలో కూడా ఊహించి ఉండడు.

చనిపోయాడని భావించిన అనుపురి పుల్లయ్య గుజరాత్లోని గాంధీ ధామ్టౌన్లోని ఓ బట్టల షాపులు పనిచేస్తున్నాడని తెలిసింది. తండ్రిని కలవడానికి కొడుకులు గుజరాత్ వెళ్లారు. తండ్రిని కలుసుకున్నారు. చనిపోయాడనుకున్న తండ్రి ఆచూకి దొరకడంతో పట్టరాని సంతోషంలో మునిగిపోయాడు నరసింహులు. టిక్ టాక్ తండ్రికొడుకులను కలిపిందని అందరూ సంతోషిస్తున్నారు. పుల్లయ్య కోసం కుటుంబసభ్యులే కాదు , స్థానికులు కూడా ఎదురుచూస్తున్నారు.












పక్కింటోడు, పక్కింటి భార్య, లైన్లు వేయడం, అక్రమ సంబంధాలు, లేచిపోవడాలు మీదే స్కిట్ వేసుకుని కామెడీ పాందిచినప్పుడే ఆ ఛానల్ స్థాయి దిగజారిపోయింది. ఇక ఇలాంటివి బయటకి వచ్చినప్పుడు ఆ షో రేంజ్ తగ్గుతుంది అంటారా? లేకపొతే ఇవన్నీ సహజమే…మనం కామెడీ ఎంజాయ్ చేద్దాం అనుకుంటూ గురువారం రాత్రి తొమ్మిదిన్నర ఎప్పుడు అవుతుందా అనుకుంటూ ఎదురు చూడటం బెటర్ అనుకుంటారా ఆడియన్స్.








ఆకాశమంత పందిరి, భూదేవంత పీట అనేవి కేవలం మాటల్లోనే ఉండేవి. కానీ నిజంగానే ఆకాశమంత పందిరి, భూదేవంత పీట టైపులోనే ఇప్పుడు పెళ్లిళ్లు చేస్తున్నారు. పెళ్లి కార్డు దగ్గరనుండి అన్ని ఆడంబరమే. కేవలం ఒక పెళ్లి కార్డుకే లక్ష ఖర్చుపెట్టిన వాళ్లున్నారు. ఇక పెళ్లిల్లు కోట్లలో ఖర్చు. అలా కోట్లకు కోట్ల ఖర్చుతో సినిమాని తలపించే రేంజ్ లో జరిగినదే గాలి జనార్దన్ రెడ్డి ఇంట పెళ్లి. అయితే ఆ రికార్డ్ను బీట్ చేస్తున్నారట కర్ణాటక ఆరోగ్యమంత్రి శ్రీరాములు. తన కూతురు రక్షిత పెళ్లికి ఇఫ్పటి వరకు ఎవరూ ఖర్చుపెట్టనంత ఖర్చుతో పెళ్లి చేస్తున్నారట. ఇంతకీ ఆ పెళ్లి ఖర్చెంతంటే అక్షరాల ఆరువందల కోట్లు . వరుడు ఎవరో కాదు హైదరాబాద్ కుర్రాడే, బంజారాహిల్స్కు చెందిన పారిశ్రామికవేత్తల కుటుంబంలో వ్యక్తి.

