చిన్నా.. పెద్దా.. వయసు తేడా లేకుండా.. ఆడ, మగా జెండర్ తేడా లేకుండా అందరు కూల్ డ్రింక్స్ ని ఇష్టపడతారు. ఏదైనా పార్టీ ఉందంటే చాలు కూల్ డ్రింక్స్ తప్పనిసరి. కేక్ కట్ చేసినా.. స్నాక్స్ ఎన్ని ఉన్నా ఓ కూల్ డ్రింక్ బాటిల్ కి మాత్రం తప్పకుండా ప్లేస్ ఇస్తాం. ఇక వేసవి వస్తే వీటిదే రాజ్యం. వేసవి కాలంలో వీటి అమ్మకాలు మరింత పెరుగుతాయి.
అయితే సుడాన్ లో గత కొన్ని నెలలుగా అంతర్యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. దీని వల్ల ఈ కూల్ డ్రింక్స్ కంపెనీ లు ఇబ్బందుల్లో పడ్డాయి.. ఎందుకంటే పెప్సీ, కోకాకోలా ఇలా ఏం కూల్ డ్రింక్ అయినా తయారు కావాలంటే ప్రధానంగా వాడే పదార్థం గమ్ అరబిక్. ఇవే కాకుండా కాస్మొటిక్స్, కాండీస్ లో కూడా దీన్ని ప్రధానంగా వాడతారు.

సాఫ్ట్ డ్రింక్స్ తయారీలో ఈ పదార్థం లేకపోతే చాలా కష్టం. డ్రింక్ తయారు చేసేందుకు వాడే పదార్థాలన్నింటిని ఈ గమ్ అరబిక్ కలిపి ఉంచుతుంది. ఫలితంగా అవి రుచిని పొందుతాయి. ఒకవేళ డ్రింక్స్ లో ఈ గమ్ అరబిక్ వాడకపోతే.. పదార్థాలన్ని విడిపోయి.. ఎలాంటి రుచి లేకుండా చప్పగా ఉంటాయి. అయితే ఇది పేరుకు తగ్గట్టుగానే ఒక జిగురు. అకాసియా అనే చెట్టు నుంచి వచ్చే ఒకలాంటి జిగురు.

ఈ చెట్లు సుడాన్లో మాత్రమే ఉన్నాయి. అన్నీ దేశాలు ఇక్కడి నుంచే ఈ పదార్థాన్ని దిగుమతి చేసుకుంటాయి. అయితే ప్రస్తుతం జరుగుతున్న అంతర్యుద్ధం వల్ల త్వరలోనే గమ్ అరబిక్కు తీవ్ర కొరత ఏర్పడే అవకాశం ఉందని కూల్డ్రింక్ కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

కూల్ డ్రింక్ తయారీ కంపెనీలు. తమ ఉత్పత్తుల తయారీకి అంతరాయం కలగకుండా ఉండేలా సూడాన్లో మాత్రమే దొరికే ఈ గమ్ అరబిక్కు పదార్థాన్ని భారీ ఎత్తున సమకూర్చుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి. సూడాన్లోని సాహెల్ ప్రాంతం నుంచి సుమారు 70 శాతం గమ్ అరబిక్ ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతోంది. ఓ నివేదిక ప్రకారం.. మరో 5-6 నెలల్లో గమ్ అరబిక్తో తయారు చేసిన ఉత్పత్తులు అయిపోవచ్చని తెలుస్తోంది.

గమ్ అరబిక్ లేకపోతే పెప్సీ, కోకాకోలా వంటి దిగ్గజ కూల్ డ్రింక్ కంపెనీలు తమ ఉనికికి కాపాడుకోవడం దాదాపు అసాధ్యం అని అంటున్నారు నిపుణులు. ఈ పదార్థానికి ప్రత్యామ్నాయం లేదని చెబుతున్నారు. మరి ఈ అంతర్యుద్ధం ఇలానే కొనసాగితే.. రానున్న రోజుల్లో కూల్ డ్రింక్ ఉత్పత్తిపై భారీ ప్రభావం పడనుంది. ఇది పరోక్షంగా రానున్న కాలంలో ఉత్పత్తుల ధరల పెరుగుదలకు కారణంగా మారే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Also read: కూల్ డ్రింక్స్ ని ఎప్పుడైనా గమనించారా..? పూర్తిగా ఎందుకు ఫిల్ చేయరు..? దీని వెనుక అసలు కారణం ఇదే..!

కవల ఆడపిల్లలు పుట్టారని ఓ తండ్రి భార్యని, పిల్లలను వదిలిపెట్టాడు. దాంతో ఆ ఇద్దరు ఆడ పిల్లలను తాతయ్య, అమ్మమ్మలు చదివించారు. వారి కష్టం వృధా కాలేదు. ఆ ఆడ పిల్లలు బాగా చదువుకుని ఎస్ఎస్సి రిజల్ట్స్ లో 10 జిపిఏ తెచ్చుకున్నారు. కరీంనగర్ జిల్లాలోని శంకరపట్నం మండలంలోని కేశవ పట్నం అనే గ్రామానికి చెందిన రిటైర్ ఉద్యోగి అయిన అల్లంకి వీరేశంకు ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు.
వీరేశం కుమార్తె కవితను పెద్దపల్లి కలెక్టరేట్ లో ఔట్సోర్సింగ్ విభగంలో ఎలక్ట్రానిక్స్ జిల్లా మేనేజర్ గా వర్క్ చేస్తున్నారు. 16 సంవత్సరాల క్రితం కవితను డెలివరీ కోసం ఏడవ నెలలో భర్త పుట్టింటికి పంపించాడు. అయితే కవితకు కవల ఆడపిల్లలు జన్మించడంతో భర్త ఆమెను పుట్టింట్లోనే వదిలేశాడు.
ఇక అప్పటి నుండి కవితను, ఆమె పిల్లలను అమ్మ వనజ, నాన్న వీరేశం చూసుకుంటున్నారు. ఇద్దరు ఆడపిల్లలు శార్వాణి, ప్రజ్ఞాని 5వ తరగతి వరకు ప్రైవేట్ బడిలో , 6 వ తరగతి నుండి మోడల్ స్కూల్లో చదువును కొనసాగించారు. తాజాగా రిలీజ్ అయిన 10 వ తరగతి ఫలితాల్లో శార్వాణి, ప్రజ్ఞాని 10 జిపిఏ తెచ్చుకుని రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా శార్వాణి, ప్రజ్ఞాని మీడియాతో మాట్లాడుతూ తమ అమ్మమ్మ తాతయ్యలు, తమ స్కూల్ ప్రిన్సిపాల్ జ్యోతి ప్రోత్సాహంతో బాగా చదివి 10 జిపిఏ సాధించగలిగామని వెల్లడించారు.




తాజాగా ఈ చిత్రాన్ని చూసిన పరుచూరి గోపాలకృష్ణ ఈ చిత్రం గురించి మాట్లాడారు. ఈ సినిమా రవితేజ బాడీ లాంగ్వేజ్కు సెట్ అయ్యే మూవీ కాదని ఆయన అన్నారు. ఈ మూవీకి మూలం బెంగాలీ చిత్రం అని కొందరు చెప్పారని, దాని పేరుని టైటిల్ కార్డుల్లో వేస్తే, కథ క్రెడిట్స్ రైటర్ కి ఇచ్చినట్లు ఉండేదని అన్నారు. ఒక వ్యాధి చికిత్స కోసం వాడిన మెడిసిన్ వల్ల హీరో తండ్రి మెంటల్ కండిషన్ పాడైపోయి తన చెల్లిని చంపడం, ఆ దృశ్యాన్ని చూసి అతని తల్లి మరణిస్తుంది.
అనారోగ్యంతో ఉన్న తండ్రిని జాగ్రత్తగా చూసుకుంటూ, తన ఫ్యామిలీ ఇలా అవడానికి కారణమైన వారిని హీరో అంతం చేయడమే ‘రావణాసుర’ స్టోరీ. ఈ చిత్రం పగ, ప్రతీకారం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. అయితే ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో ఇప్పటి వరకు చాలా చిత్రాలు వచ్చాయి. అవి సక్సెస్ అయ్యాయి. అయితే ఈ మూవీ ప్లాప్ గా నిలిచింది.
రవితేజ సినిమా అనగానే అద్భుతంగా నటించే మాస్ మహారాజ్ను ఆడియెన్స్ ఊహించుకుంటారు. అలాగే ఆయన మూవీ అనగానే కామెడీ, ఫైట్స్, డైలాగ్స్, యాక్టింగ్ ఇలా అన్నీంటిని చూడాలని ఆడియెన్స్ థియేటర్కు వెళతారు. ఇక నా దృష్టిలో అయితే రవితేజ బాడీ లాంగ్వేజ్కు సెట్ అయ్యే క్యారెక్టర్ కాదు. అలాగే ఈ మూవీ కట్స్ చాలా ఎక్కువ అవడం వల్ల ప్రేక్షకుడు ఒక సీన్ లో ఫీల్, నెక్స్ట్ సీన్ లో మారుతుంది. ఫీల్ కొనసాగకపోవడం ఆ మూవీకి ప్రమాదకరం అని అన్నారు.
కట్స్తో పాటుగా ఎక్కువగా హత్యల సీన్స్ ఉన్నాయి. వరుసగా హత్యలు జరిగినప్పుడు పోలీసులు నిందితుడిని పట్టుకకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటి సందర్భంలో హంతకుడు పోలీసుల నుంచి తప్పించుకుంటూ,వారికి దొరకకుండా వివిధ కోణాల్లో హత్యలు చేస్తుంటారు. కానీ ఈ మూవీలో జరిగే హత్యలన్నీ ఒకే విధంగా చూపించారు. అంతే కాకుండా హత్యలు చేసి కూడా పోలీసుల నుండి తప్పించుకోవచ్చు అనే మెసేజ్ ఆడియెన్స్ కి వెళ్ళే ఛాన్స్ ఉంది.
ఇంతకు ముందు వచ్చిన ఇలాంటి సినిమాల్లో నిందితుడిని చివరికి పోలీసులు పట్టుకున్నట్టు చూపించారు. ఈ చిత్రంలో అలా చూపించలేదు. ఫ్యామిలీతో కలిసి చూసేందుకు అనుకూలంగా లేవు అని ఆయన తన అభిప్రాయాన్ని తెలిపారు.
ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలలో భాగంగా ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ నేతృత్వంలో తమ స్వగ్రామం అయిన నిమ్మకూరులో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీటిలో పాల్గొన్న బాలయ్య మాట్లాడుతూ తెలుగువారి హృదయాలలో ఎన్టీఆర్ శాశ్వతంగా నిలిచిపోయారని అన్నారు. ఎన్టీఆర్ కు జన్మనిచ్చిన భూమి అయిన నిమ్మకూరు గ్రామాన్ని పర్యాటక స్థలంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. తమ నాయనమ్మ కట్టించిన ఒక దాబాను కూడా ఎన్టీఆర్ కి అంకితమిస్తున్నామని తెలిపారు.
అన్నగారు అని తెలుగువారు అప్యాయంగా పిలుచుకునే ఎన్టీఆర్ పుట్టిన ఇల్లు ఇప్పటికి నిమ్మకూరులో అలాగే ఉంది. ఆ ఇంట్లో ఆయనకు సంబంధించిన ఫోటోలు, కొన్ని వస్తువులు ఉన్నాయి. ఇక ఈ ఇంటి బాగోగులను హరికృష్ణ కుటుంబ సభ్యులు చూసుకుంటున్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కాకముందే నటుడిగా ఉన్న సమయంలోనే స్వగ్రామం కోసం తన వంతు కృషి చేశారని స్థానికులు తెలిపారు. తన పలుకుబడిని ఉపయోగించి రోడ్డు వేయించారని, వంతెన కట్టించారని అక్కడివారు అన్నారు. ఇక ముఖ్యమంత్రి అయిన తరువాత రెసిడెన్షియల్ స్కూల్, దేవాలయం, హాస్పటల్ కట్టించారని చెప్పారు.
రెసిడెన్షియల్ విద్యాసంస్థల వల్ల నిమ్మకూరుకు మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పటికి కూడా ఈ స్కూల్ లో వందల మంది విద్యార్ధులు చదువుతున్నారు. రెసిడెన్షియల్ స్కూల్ ఇంచార్జ్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఈ స్కూల్ లో చదివిన వారిలో డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఎఎస్, ఐపీఎస్, ఇస్రో పనిచేస్తున్నవారు కూడా ఉన్నారని తెలిపారు. మహిళల శిక్షణ మరియు ఉపాధి కోసం నిమ్మకూరులో నైపుణ్యాభివృద్ధి మరియు మహిళా సాధికారత కేంద్రం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పథకాలతో పాటు, ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
ఎన్టీఆర్ తన కుమారుడు హరికృష్ణ నిమ్మకూరులోనే చదివించారు. హరికృష్ణతో కలిసి చదువుకున్నవారు ఇప్పటికి ఇక్కడ ఉన్నారు. అలాగే హరికృష్ణ కుటుంబ సభ్యులు తరుచుగా ఇక్కడికి వస్తుంటారు. శతజయంతి ఉత్సవాలలో భాగంగా బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు నిమ్మకూరులో ఎన్టీఆర్ కి నివాళులు అర్పించిన విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ కూడా నిమ్మకూరులో స్థలం కొన్నట్టు తెలుస్తోంది.
ఎన్టీఆర్ హయాంలోనే బందర్ కాలువ వంతెన, వాటర్ ట్యాంక్, రోడ్డు మంజూరు చేయించారని, పనులన్నీ కూడా ఏడాదిలోనే పూర్తి అయ్యాయని స్థానికులు అప్పటి సంగతులను వెల్లడించారు. ఇలా నందమూరి తారక రామారావు గారు తనకు జన్మనిచ్చిన గ్రామం అభివృద్ధికి ఎంతో కృషి చేశారు.

సైంటిస్టులు చెప్తున్న దాని ప్రకారంగా బెంగళూరులో ఏప్రిల్ 25 మధ్యాహ్నం 12 గంటల 17 నిముషాలకు ‘ది ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్’ క్యాంపస్లో అరవై నుంచి నూట ఇరవై సెకండ్ల పాటు పొడవాటి వస్తువుల యొక్క నీడ కనిపించలేదు. ఈ అరుదైన దృశ్యాన్ని ఎంతో మంది చూశారు. అయితే ఇలాంటి దృశ్యాన్ని చూసే అవకాశం హైదరాబాద్ వాసులకు కలగబోతుందట.
బెంగుళూరులో ఏప్రిల్ 25న జీరో షాడో డే ఏర్పడినపుడు సుమారు 3 నిమిషాల పాటు నీడ కనిపించలేదు. బెంగుళురు వాసులు ఈ అద్భుతమైన దృశ్యాన్ని ఆస్వాదించారు. జీరో షాడో డే చూసే అరుదైన అవకాశం హైదరాబాద్ వాసులకు మే 9న మధ్యాహ్నం 12 గంటల 12 నిముషాలకు కలగనుంది. సాధారణంగా అయితే కర్కాటక రాశి, మకర రాశి మధ్యన ఉండే ప్రాంతాలలో ఈ జీరో షాడో ఏర్పడుతుంది. దానివల్ల ఈ ప్రాంతాలలో ఉండే ప్రజలకు, ఉత్తరాయణం, దక్షిణాయనంలోనూ సూర్యుడి క్షీణత అక్కడ ఉండే అక్షాంశానికి ఈక్వల్ గా ఉంటుంది.
ఆ టైమ్ లో సూర్యుడి కిరణాలు భూమి పైన నిట్ట నిలువుగా ప్రసరిస్తాయి. దానివల్ల నిలువుగా ఉండే ఏ వస్తువులు కానీ, జీవులు నీడను ఏర్పచదు. ఇలాంటి సంఘటన సంవత్సరంలో 2 సార్లు సంభవిస్తుంది. రీసెంట్ గా బెంగళూరులో జీరో షాడో డే ఏర్పడింది. మే 9న హైదరాబాద్ లో ఆవిష్కృతం కానుంది. శాస్త్రవేత్తలు హైదరాబాద్లో మే 9న జీరో షాడో డే పగలు 12 గంటల 12 నిముషాలకు ఏర్పడనుందని వెల్లడించారు. గతంలో జీరో షాడో డే 2021లో ఒడిశా, భువనేశ్వర్ లో ఏర్పడింది.
కొరియోగ్రాఫర్ చైతన్య బలవన్మరణానికి ఆర్ధిక ఇబ్బందులే కారణం అని తెలుస్తోంది. అప్పుల బాధను భరించలేక, ఆ ఒత్తిడిని తట్టుకోలేక ప్రాణం తీసుకుంటున్నట్లు మరణానికి ముందు చైతన్య సెల్ఫీ వీడియోను విడుదల చేశాడు. ఆ వీడియోలో తన బలవన్మరణానికి కారణాలను వెల్లడించాడు. కొరియోగ్రాఫర్గా మంచి భవిష్యత్ ఉన్న డాన్స్ మాస్టర్ చైతన్య ఇలా అర్ధాంతరంగా కన్నుమూయడం అందరినీ కలిచివేసింది.
చైతన్య మరణం పై పలువురు టెలివిజన్ ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్త పరుస్తున్నారు. ఈ క్రమంలో చైతన్య మాస్టర్ మరణం పై డ్యాన్సర్ కండక్టర్ ఝాన్సీ తాజాగా స్పందించారు. ఆయన మరణం పై విచారం వ్యక్తం చేసింది. చైతన్య తీసుకున్న ఈ తొందరపాటు నిర్ణయంతో ఆయన ఫ్యామిలీ అంతా బాధపడుతోంది. చైతన్య డబ్బులు ఇవ్వవలసిన వారితో కూర్చుని తన పరిస్థితి వివరించినట్లయితే ఇలా జరిగి ఉండేది కాదేమో అని అన్నారు.
అందరూ చైతన్యతో కలిసి జర్నీ చేసినవారే. అందులోనూ కళాకారులు వేధించే అంత కఠినమైనవారు కాదు. ఆయన ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడో, చైతన్య తోటివారికి సహాయం చేసేవాడని తెలిపింది. నాలుగు రోజుల క్రితమే డాన్స్ మాస్టర్ చైతన్యను కలిసి ఢీ డ్యాన్స్ షోలో తనకు ఛాన్స్ ఇవ్వమని అడిగానని, దానికి ఆయన నెక్స్ట్ సీజన్ లో తప్పకుండా అవకాశం ఇస్తానని చెప్పారు. ఆయన తన కింద ఉన్న డాన్సర్లకు కూడా చాలా గౌరవం ఇస్తారని డ్యాన్సర్ ఝాన్సీ తెలిపారు.

















