మనలో ఎంతో మందికి పర్యాటక విదేశీ ప్రదేశాలు చూడాలని ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. కానీ సరైన ఆదాయం లేకనో, మనకుండే బాధ్యతలు వలనో అనుకున్న పని చేయలేకపపోతుంటాం. విదేశాల చూసి రావడం అనేది కేవలం డబ్బున్న వాళ్ళకు మాత్రమే జరుగుతుంది అంటుంటాం.కానీ ఇక్కడ ఒక ఆవిడ అనుకుంటే సాధ్యం కానిది ఏమీ లేదు అనేది నిరూపించింది. పేదరికంలోను రూపాయి రూపాయి కూడా పెట్టుకుంటూ పదేళ్లలో 11 దేశాలు చుట్టి వచ్చింది. ప్రపంచం మొత్తం చూసి రావడమే తన లక్ష్యం అంటుంది. ఈమె కథ ఎందరికో స్ఫూర్తిగా నిలవాలని కోరుకుందాం.
ఆమె పేరు మొళిజాయ్. కేరళలోని ఎర్నాకుళం జిల్లా చిత్రపుళం ప్రాంతానికి చెందిన మొళికి ప్రపంచవ్యాప్తంగా పర్యాటక ప్రదేశాలు చూడాలనేది ఆమె కోరిక . చిన్న వయసులోనే జాయ్ అనే వ్యక్తితో వివాహం అయింది మొళికి. కిరాణా దుకాణం నడపడంలో సాయం చేస్తుండేది. కిరాణా దుకాణం ద్వారా వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో జాయ్ కూలిగా మారాడు.

పెళ్లయిన పదేళ్లకే భర్త అనారోగ్యంతో అందించడంతో కుటుంబ బాధ్యతలు మొత్తం మొళిపైన వేసుకుంది. తనకు పుట్టిన ఇద్దరు పిల్లలను చదివించి ప్రయోజకులను చేసింది. కొడుకు ఉద్యోగరీత్యా విదేశాలలో స్థిరపడ్డాడు. కూతురికి పెళ్లి చేసి తన బాధ్యతలను తీర్చుకుంది మొళి. కిరాణా దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తుంది. చిన్నతనంలో చదివించడానికే కష్టపడే తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక తోటి విద్యార్థులతో విహార యాత్రకు వెళ్లే అవకాశం కూడా దక్కలేదు. పిల్లల బాధ్యత తీరిన తర్వాత కేరళ నుంచి తన మొదటి పర్యటన మొదలు పెట్టి ఇప్పటి వరకు ఆమె పర్యటన కొనసాగిస్తుంది.

కిరాణా దుకాణం నడుపుతూనే రూపాయికి రూపాయి పొదుపు చేసి మధురై, ఊటీ, కొడైక్కెనాల్, మైసూర్ వంటివి వెళ్లి వచ్చింది. ఇక్కడ తో నా కోరిక తీరలేదు. ప్రపంచం మొత్తం చూసిరావాలనే కోరిక మరంత ఎక్కువ అయింది అంటుంది మొళి. తన స్నేహితురాలు మేరీ విదేశీ పర్యటనకు వెళ్తున్నాను నువ్వు వస్తావా అని అడిగిన వెంటనే ఓకే చెప్పేసిందట. 2012 విమానం ఎక్కాను.
అలా పది రోజులు దేశం దాటి ఐరోపా పర్యటనకు వెళ్లాను. ఐదు పదుల వయసులోనే ఫ్రాన్స్, ఇటలీ, స్విట్జర్లాండ్, అమెరికా తదితర దేశాలను చూసి వచ్చాను. తనతో పాటు వచ్చిన వారు షాపింగ్ చేస్తూ వుంటే, తను మాత్రం చాక్లెట్లు కొనుక్కుంటే డబ్బును పొదుపుగా వినియోగించుకుంటూ ప్రయాణం కొనసాగించేవారు అని చెప్పుకొచ్చారు మొళి. 2012 లో మొదలుపెట్టిన ఆమె ప్రయాణం ఇప్పటి వరకు కొనసాగుతునేవుంది.




తాజాగా ఈ చిత్రాన్ని చూసిన పరుచూరి గోపాలకృష్ణ ఈ చిత్రం గురించి మాట్లాడారు. ఈ సినిమా రవితేజ బాడీ లాంగ్వేజ్కు సెట్ అయ్యే మూవీ కాదని ఆయన అన్నారు. ఈ మూవీకి మూలం బెంగాలీ చిత్రం అని కొందరు చెప్పారని, దాని పేరుని టైటిల్ కార్డుల్లో వేస్తే, కథ క్రెడిట్స్ రైటర్ కి ఇచ్చినట్లు ఉండేదని అన్నారు. ఒక వ్యాధి చికిత్స కోసం వాడిన మెడిసిన్ వల్ల హీరో తండ్రి మెంటల్ కండిషన్ పాడైపోయి తన చెల్లిని చంపడం, ఆ దృశ్యాన్ని చూసి అతని తల్లి మరణిస్తుంది.
అనారోగ్యంతో ఉన్న తండ్రిని జాగ్రత్తగా చూసుకుంటూ, తన ఫ్యామిలీ ఇలా అవడానికి కారణమైన వారిని హీరో అంతం చేయడమే ‘రావణాసుర’ స్టోరీ. ఈ చిత్రం పగ, ప్రతీకారం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. అయితే ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో ఇప్పటి వరకు చాలా చిత్రాలు వచ్చాయి. అవి సక్సెస్ అయ్యాయి. అయితే ఈ మూవీ ప్లాప్ గా నిలిచింది.
రవితేజ సినిమా అనగానే అద్భుతంగా నటించే మాస్ మహారాజ్ను ఆడియెన్స్ ఊహించుకుంటారు. అలాగే ఆయన మూవీ అనగానే కామెడీ, ఫైట్స్, డైలాగ్స్, యాక్టింగ్ ఇలా అన్నీంటిని చూడాలని ఆడియెన్స్ థియేటర్కు వెళతారు. ఇక నా దృష్టిలో అయితే రవితేజ బాడీ లాంగ్వేజ్కు సెట్ అయ్యే క్యారెక్టర్ కాదు. అలాగే ఈ మూవీ కట్స్ చాలా ఎక్కువ అవడం వల్ల ప్రేక్షకుడు ఒక సీన్ లో ఫీల్, నెక్స్ట్ సీన్ లో మారుతుంది. ఫీల్ కొనసాగకపోవడం ఆ మూవీకి ప్రమాదకరం అని అన్నారు.
కట్స్తో పాటుగా ఎక్కువగా హత్యల సీన్స్ ఉన్నాయి. వరుసగా హత్యలు జరిగినప్పుడు పోలీసులు నిందితుడిని పట్టుకకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటి సందర్భంలో హంతకుడు పోలీసుల నుంచి తప్పించుకుంటూ,వారికి దొరకకుండా వివిధ కోణాల్లో హత్యలు చేస్తుంటారు. కానీ ఈ మూవీలో జరిగే హత్యలన్నీ ఒకే విధంగా చూపించారు. అంతే కాకుండా హత్యలు చేసి కూడా పోలీసుల నుండి తప్పించుకోవచ్చు అనే మెసేజ్ ఆడియెన్స్ కి వెళ్ళే ఛాన్స్ ఉంది.
ఇంతకు ముందు వచ్చిన ఇలాంటి సినిమాల్లో నిందితుడిని చివరికి పోలీసులు పట్టుకున్నట్టు చూపించారు. ఈ చిత్రంలో అలా చూపించలేదు. ఫ్యామిలీతో కలిసి చూసేందుకు అనుకూలంగా లేవు అని ఆయన తన అభిప్రాయాన్ని తెలిపారు.
ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలలో భాగంగా ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ నేతృత్వంలో తమ స్వగ్రామం అయిన నిమ్మకూరులో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీటిలో పాల్గొన్న బాలయ్య మాట్లాడుతూ తెలుగువారి హృదయాలలో ఎన్టీఆర్ శాశ్వతంగా నిలిచిపోయారని అన్నారు. ఎన్టీఆర్ కు జన్మనిచ్చిన భూమి అయిన నిమ్మకూరు గ్రామాన్ని పర్యాటక స్థలంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. తమ నాయనమ్మ కట్టించిన ఒక దాబాను కూడా ఎన్టీఆర్ కి అంకితమిస్తున్నామని తెలిపారు.
అన్నగారు అని తెలుగువారు అప్యాయంగా పిలుచుకునే ఎన్టీఆర్ పుట్టిన ఇల్లు ఇప్పటికి నిమ్మకూరులో అలాగే ఉంది. ఆ ఇంట్లో ఆయనకు సంబంధించిన ఫోటోలు, కొన్ని వస్తువులు ఉన్నాయి. ఇక ఈ ఇంటి బాగోగులను హరికృష్ణ కుటుంబ సభ్యులు చూసుకుంటున్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కాకముందే నటుడిగా ఉన్న సమయంలోనే స్వగ్రామం కోసం తన వంతు కృషి చేశారని స్థానికులు తెలిపారు. తన పలుకుబడిని ఉపయోగించి రోడ్డు వేయించారని, వంతెన కట్టించారని అక్కడివారు అన్నారు. ఇక ముఖ్యమంత్రి అయిన తరువాత రెసిడెన్షియల్ స్కూల్, దేవాలయం, హాస్పటల్ కట్టించారని చెప్పారు.
రెసిడెన్షియల్ విద్యాసంస్థల వల్ల నిమ్మకూరుకు మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పటికి కూడా ఈ స్కూల్ లో వందల మంది విద్యార్ధులు చదువుతున్నారు. రెసిడెన్షియల్ స్కూల్ ఇంచార్జ్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఈ స్కూల్ లో చదివిన వారిలో డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఎఎస్, ఐపీఎస్, ఇస్రో పనిచేస్తున్నవారు కూడా ఉన్నారని తెలిపారు. మహిళల శిక్షణ మరియు ఉపాధి కోసం నిమ్మకూరులో నైపుణ్యాభివృద్ధి మరియు మహిళా సాధికారత కేంద్రం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పథకాలతో పాటు, ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
ఎన్టీఆర్ తన కుమారుడు హరికృష్ణ నిమ్మకూరులోనే చదివించారు. హరికృష్ణతో కలిసి చదువుకున్నవారు ఇప్పటికి ఇక్కడ ఉన్నారు. అలాగే హరికృష్ణ కుటుంబ సభ్యులు తరుచుగా ఇక్కడికి వస్తుంటారు. శతజయంతి ఉత్సవాలలో భాగంగా బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు నిమ్మకూరులో ఎన్టీఆర్ కి నివాళులు అర్పించిన విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ కూడా నిమ్మకూరులో స్థలం కొన్నట్టు తెలుస్తోంది.
ఎన్టీఆర్ హయాంలోనే బందర్ కాలువ వంతెన, వాటర్ ట్యాంక్, రోడ్డు మంజూరు చేయించారని, పనులన్నీ కూడా ఏడాదిలోనే పూర్తి అయ్యాయని స్థానికులు అప్పటి సంగతులను వెల్లడించారు. ఇలా నందమూరి తారక రామారావు గారు తనకు జన్మనిచ్చిన గ్రామం అభివృద్ధికి ఎంతో కృషి చేశారు.

సైంటిస్టులు చెప్తున్న దాని ప్రకారంగా బెంగళూరులో ఏప్రిల్ 25 మధ్యాహ్నం 12 గంటల 17 నిముషాలకు ‘ది ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్’ క్యాంపస్లో అరవై నుంచి నూట ఇరవై సెకండ్ల పాటు పొడవాటి వస్తువుల యొక్క నీడ కనిపించలేదు. ఈ అరుదైన దృశ్యాన్ని ఎంతో మంది చూశారు. అయితే ఇలాంటి దృశ్యాన్ని చూసే అవకాశం హైదరాబాద్ వాసులకు కలగబోతుందట.
బెంగుళూరులో ఏప్రిల్ 25న జీరో షాడో డే ఏర్పడినపుడు సుమారు 3 నిమిషాల పాటు నీడ కనిపించలేదు. బెంగుళురు వాసులు ఈ అద్భుతమైన దృశ్యాన్ని ఆస్వాదించారు. జీరో షాడో డే చూసే అరుదైన అవకాశం హైదరాబాద్ వాసులకు మే 9న మధ్యాహ్నం 12 గంటల 12 నిముషాలకు కలగనుంది. సాధారణంగా అయితే కర్కాటక రాశి, మకర రాశి మధ్యన ఉండే ప్రాంతాలలో ఈ జీరో షాడో ఏర్పడుతుంది. దానివల్ల ఈ ప్రాంతాలలో ఉండే ప్రజలకు, ఉత్తరాయణం, దక్షిణాయనంలోనూ సూర్యుడి క్షీణత అక్కడ ఉండే అక్షాంశానికి ఈక్వల్ గా ఉంటుంది.
ఆ టైమ్ లో సూర్యుడి కిరణాలు భూమి పైన నిట్ట నిలువుగా ప్రసరిస్తాయి. దానివల్ల నిలువుగా ఉండే ఏ వస్తువులు కానీ, జీవులు నీడను ఏర్పచదు. ఇలాంటి సంఘటన సంవత్సరంలో 2 సార్లు సంభవిస్తుంది. రీసెంట్ గా బెంగళూరులో జీరో షాడో డే ఏర్పడింది. మే 9న హైదరాబాద్ లో ఆవిష్కృతం కానుంది. శాస్త్రవేత్తలు హైదరాబాద్లో మే 9న జీరో షాడో డే పగలు 12 గంటల 12 నిముషాలకు ఏర్పడనుందని వెల్లడించారు. గతంలో జీరో షాడో డే 2021లో ఒడిశా, భువనేశ్వర్ లో ఏర్పడింది.
కొరియోగ్రాఫర్ చైతన్య బలవన్మరణానికి ఆర్ధిక ఇబ్బందులే కారణం అని తెలుస్తోంది. అప్పుల బాధను భరించలేక, ఆ ఒత్తిడిని తట్టుకోలేక ప్రాణం తీసుకుంటున్నట్లు మరణానికి ముందు చైతన్య సెల్ఫీ వీడియోను విడుదల చేశాడు. ఆ వీడియోలో తన బలవన్మరణానికి కారణాలను వెల్లడించాడు. కొరియోగ్రాఫర్గా మంచి భవిష్యత్ ఉన్న డాన్స్ మాస్టర్ చైతన్య ఇలా అర్ధాంతరంగా కన్నుమూయడం అందరినీ కలిచివేసింది.
చైతన్య మరణం పై పలువురు టెలివిజన్ ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్త పరుస్తున్నారు. ఈ క్రమంలో చైతన్య మాస్టర్ మరణం పై డ్యాన్సర్ కండక్టర్ ఝాన్సీ తాజాగా స్పందించారు. ఆయన మరణం పై విచారం వ్యక్తం చేసింది. చైతన్య తీసుకున్న ఈ తొందరపాటు నిర్ణయంతో ఆయన ఫ్యామిలీ అంతా బాధపడుతోంది. చైతన్య డబ్బులు ఇవ్వవలసిన వారితో కూర్చుని తన పరిస్థితి వివరించినట్లయితే ఇలా జరిగి ఉండేది కాదేమో అని అన్నారు.
అందరూ చైతన్యతో కలిసి జర్నీ చేసినవారే. అందులోనూ కళాకారులు వేధించే అంత కఠినమైనవారు కాదు. ఆయన ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడో, చైతన్య తోటివారికి సహాయం చేసేవాడని తెలిపింది. నాలుగు రోజుల క్రితమే డాన్స్ మాస్టర్ చైతన్యను కలిసి ఢీ డ్యాన్స్ షోలో తనకు ఛాన్స్ ఇవ్వమని అడిగానని, దానికి ఆయన నెక్స్ట్ సీజన్ లో తప్పకుండా అవకాశం ఇస్తానని చెప్పారు. ఆయన తన కింద ఉన్న డాన్సర్లకు కూడా చాలా గౌరవం ఇస్తారని డ్యాన్సర్ ఝాన్సీ తెలిపారు.





















వివాహం చేసుకునే యువతుల మొదటి ఛాయిస్ కూడా ఇటువంటి అబ్బాయిలే. అమ్మాయిలే కాకుండా వారి తల్లి దండ్రులు తమ కుమార్తెలకి సాఫ్ట్వేర్ జాబ్ చేసే అబ్బాయిల సంబంధం వైపే మొగ్గు చూపుతున్నారు. అయితే ఓ తండ్రి మాత్రం బీటెక్ చదివిన అమ్మాయిని పాప్ కార్న్ బండి నడిపే కుర్రాడికిచ్చి పెళ్లి చేశాడు. ఆశ్చర్యంగా, నమ్మశక్యంగా లేకుండా ఉన్నప్పటికి ఇది వాస్తవం. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
రాజమండ్రికి చెందిన సుధీర్ అనే యువకుడు నగరంలోని గాంధీ పార్కుకి వెళ్ళే రోడ్డు పక్కనే పాప్ కార్న్ బండి నడుపుతూ ఫ్యామిలిని పోషిస్తున్నాడు. పాప్ కార్న్తో మాత్రమే కాకుండా రకరకాల స్నాక్స్ను కూడా బండి పై అమ్ముతుంటాడు. ఆ బండి వద్ద దొరికేవి రుచిగా ఉండటంతో ఎప్పుడూ కస్టమర్లతో ఆ బండి దగ్గర రద్దీగా ఉంటుంది. అయితే సుధీర్ బీటెక్ ట్రిపుల్ ఈ పూర్తి చేశాడు. సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ ఇప్పిస్తామని అంటే నమ్మి 10 లక్షలు అప్పు తెచ్చి కట్టాడు.
ఆ తర్వాత మోసపోయానని తెలుసుకున్న సుధీర్ చేసిన అప్పులు తీర్చాలని, తన ఫ్యామిలిని కూడా పోషించాలని అనుకున్నాడు. అలా పాప్ కార్న్ బండి పెట్టుకుని 7-8 ఏళ్లగా నడుపుతూ సగం అప్పులను తీర్చాడు. ప్రస్తుతం అతని బిజినెస్ సాగుతోంది. కుటుంబ పోషణలోను ఎలాంటి ఇబ్బంది లేదు. వయసు పెరుగుతోందని సుధీర్ కి పెళ్లి చేశారు. పాప్ కార్న్ బండి నడిపేవాడికి పిల్లనిస్తారా అనుకున్నారు. అయితే సుధీర్ కి బీటెక్ చదివిన యువతితో పెళ్లి జరిగింది. ఆ పెళ్లి జరిపించింది ఆ అమ్మయి తండ్రే కావడం విశేషం.
అమ్మయి పెళ్లి చేసుకోవడానికి సందేహించిన కుమార్తెను ఒప్పించి మరి పెళ్లి చేశాడు ఆ తండ్రి. జాబ్ చేసేవాడి కంటే కష్టపడి పనిచేసేవాడే బాగా చూసుకుంటాడు. ఆ అబ్బాయితో నీ లైఫ్ బాగుంటుందమ్మా’ అని ఆ తండ్రి కూతురిని ఒప్పించాడు. ఆ అమ్మాయి తండ్రి డిగ్రీ పూర్తి చేశారంట. కొంత కాలం జాబ్ కోసం ప్రయత్నించి, జాబ్ రాకపోవడంతో ఆటో నడపటం ప్రారంభించాడు. సాఫ్ట్ వేర్ జాబ్ చేయాలనుకున్న సుధీర్ ఆఖరికి పాప్ కార్న్ బండి పెట్టుకొని, కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అప్పులు తీరిన తరువాత తన బిజినెస్ ను పెంచుకునే ఆలోచనలో సుధీర్ ఉన్నాడు.