అమెరికాలో జరిగిన దుండగుల కాల్పుల్లో తెలుగు విద్యార్ధి దారుణ చంపబడ్డాడు. అగ్రరాజ్యంలోని ఓహియోలో షెల్ గ్యాస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తుండగా దుండగులు జరిపిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వీరా సాయేశ్ మరణించాడు.
వివరాలలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరుకు చెందిన వీరా సాయేశ్ 2021లో ఎమ్మెస్ చేయడం కోసం అమెరికా వెళ్ళాడు. అతను ఓహియో స్టేట్ పిన్స్ యూనివర్సిటీలో చదువుతున్నాడు. సాయేశ్ పార్ట్టైం జాబ్ కోసం గ్యాస్ స్టేషన్లో చేరాడు.
జాబ్ చేస్తూ చదువుకుంటూ, ఇప్పుడిప్పుడే తన ఫ్యామిలికి అండగా ఉంటున్నాడు. అతను ఇపుడు చివరి సెమిస్టర్ చదువుతున్నాడు. ఇంకో 10 రోజుల్లో సాయేశ్ ఎమ్మెస్ పూర్తి అవబోతుంది. ఈనేపథ్యంలో అతను ఇంటికి వెళ్ళడానికి కూడా ఏర్పాట్లు చేసుకున్నాడు. కానీ బుధవారం అర్దరాత్రి 12.50 గంటలకు గ్యాస్ స్టేషన్లో అతను విధులు నిర్వహిస్తున్న సమయంలో అక్కడికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు సాయేశ్ పై కాల్పులు జరిపి అతని దగ్గర ఉన్న డబ్బును ఎత్తుకెళ్లారు. తీవ్రంగా గాయపడిన సాయేశ్ ను సిబ్బంది ఓస్థానిక ఆసుపత్రికి తరలించారు.
సాయేశ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతు కన్నుమూశాడు. త్వరలోనే ఇంటికి వస్తా అని చెప్పిన సాయేశ్, అంతలోనే కన్నుమూయడంతో ఆ ఫ్యామిలిలో విషాదం నెలకొన్నది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన వీరా సాయేశ్ హెచ్-1బీ వీసాను కూడా తీసుకున్నాడు. అతను అందరితో చాలా కలివిడిగా ఉండేవాడని, ఎవరైనా అడిగితే లేదనకుండా సాయం చేసేవాడని అతని స్నేహితులు వెల్లడించారు. కాగా పోలీసులు కాల్పులు జరిపిన నిందితుల ఫొటోలను విడుదల చేశారు.
అతని స్నేహితులలో ఒకరు మాట్లాడుతూ అంత్యక్రియల కోసం సాయేశ్ మృతదేహాన్ని ఇండియాకి పంపుతున్నామని, దాని కోసం ఆర్ధిక సహాయం అవసరం అని చెప్పారు. డబ్బును సేకరించడం కోసం వారు GoFundMe ని క్రియేట్ చేశారు. వారు మాట్లాడుతూ ”డబ్బు సాయేశ్ ని తిరిగి తీసుకురాదని, కానీ అతని కుటుంబం కోసం మేము చేయగలిగేది ఇదే ” అని తెలిపారు.
Also Read: “నిజామాబాద్” హాస్పిటల్ లో పేషంట్ ని ఈడ్చుకెళ్లడంపై స్పందించిన సూపరింటెండెంట్..! ఏం అన్నారంటే..?





దర్శి గ్రామంలో పిఆర్ డిపార్ట్మెంట్ లో సూరె వెంకటరామిరెడ్డి సీనియర్ సహాయకుడిగా పని చేస్తున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం ఆయన అనారోగ్య బారిన పడడంతో, వైద్య పరీక్షలు చేయగా కాలేయ వ్యాధి ఉన్నట్లు తెలిసింది. ఆ వ్యాధితో బాధ పడుతున్న ఆయన చికిత్స చేయించుకోవడం కోసం హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ హాస్పటల్ లో చేరారు. అక్కడ వైద్యులు టెస్ట్ చేసి, తప్పనిసరిగా కాలేయ మార్పిడి చేయాలని వెంకటరామిరెడ్డి ఫ్యామిలీకి చెప్పారు.
వెంకటరామిరెడ్డి కుమార్తె హర్షిత తన తండ్రి వ్యాధితో బాధపడుతుండటం చూడలేక డాక్టర్లను ట్రీట్మెంట్ గురించి సంప్రదించారు. వెంకటరామిరెడ్డి కుమార్తె హర్షిత తన తండ్రి ఆ వ్యాధితో బాధపడుతుండటం చూడలేక డాక్టర్లను ట్రీట్మెంట్ గురించి సంప్రదించారు. వైద్యులు కాలేయ మార్పిడి గురించి చెప్పగానే తన కాలేయంలోని కొంత భాగాన్ని ఇవ్వడానికి ఆమె ముందుకొచ్చింది. దాని కోసం భర్త ప్రకాశ్ రెడ్డిని కూడా ఒప్పించింది.
హర్షిత కోరిక మేరకు, ప్రకాశ్ రెడ్డి కూడా కాలేయ మార్పిడికి ఒప్పుకున్నాడు. దాంతో హర్షిత వెంకటరామిరెడ్డికి తన కాలేయంలోని కొంత భాగాన్ని ఇచ్చింది. కాలేయ మార్పిడిని డాక్టర్లు విజయవంతంగా పూర్తి చేశారు. దాంతో వెంకటరామిరెడ్డి ఆరోగ్యవంతుడిగా మారారు. తన తండ్రిని కాపాడడం కోసం కాలేయ దానం చేసిన హర్షిత పై ప్రశంసలు, అభినదనలు వెల్లువెత్తాయి.

సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవడంతో నిజామాబాద్ జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ ఈ సంఘటన పై స్పందించారు. అది జరిగి 15 రోజులు అవ్వుతుందని, మీడియాలో వచ్చేవరకు తెలియదని, 10 సెకండ్స్ మాత్రమే అలా లాక్కెళ్లరని, సిబ్బంది చూసి వెంటనే అలర్ట్ అయ్యారని తెలిపారు. దానికి సంబంధించిన విజువల్స్ తమ దగ్గర ఉన్నాయని తెలిపారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.


తాజాగా ఈ చిత్రం పగతో పదిహేనేళ్ళ పాటు కనీసం ఒకరి ముఖం ఒకరు చూసుకొని దాయాదుల ఫ్యామిలీని కలిపింది సంగారెడ్డి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సంగారెడ్డి జిల్లాలో మాసన్ పల్లి చెందిన ఎనిమిది నాయి బ్రాహ్మణ కుటుంబాలు ఊర్లో ఉండే సమయంలో ఇంటి స్థలాల, భూ తగాదాలతో ఏర్పడిన పగతో దూరంగా ఉండే వారు. అయితే వారి పరిస్థితులు బాలేక కొంతమంది హైదరాబాద్ నగరానికి వలస వెళ్లారు. అక్కడే బ్రతుకుతూ ఎవరికి వారు ఉండేవారు. పెద్దవాళ్లే కాకుండా పిల్లలు కూడా పగతో, కక్షతో దూరంగా ఉండేవారు.
ఈక్రమంలో ఇటీవల విడుదలైన బలగం సినిమాను చూశారు. ఈ చితంలో గ్రామీణ ప్రాంతాల్లోని పరిస్థితుల గురించి తీసిన విషయం అందరికి తెలిసిందే. వీరంతా ఈ చిత్రంలోని సన్నివేశాలను చూసి చలించి, ఇ న్నేళ్ళు అర్ధం లేని పగ పెంచుకుని తప్పు చేశామని తెలుసుకున్నారు. అంతా కలసి హైదరాబాద్లో నుండి తమ సొంతూరు మాసన్ పల్లికి సోమావారం వెళ్లారు. దాయాదుల కుటుంబాల వారంతా కలసి ఉండాలని నిర్ణయించుకున్నారు. మంగళవారం నాడు అందరూ విందు చేసుకున్నారు. బలగం మూవీ తీసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ క్రమంలో కృష్ణ తండ్రి లచ్చు మంగళవారం నాడు మిర్చి పంటను అమ్మడం కోసం కేసముద్రంకు వెళ్లాడు. అతని తల్లి పొలానికి, తమ్ముడు టెన్త్ క్లాస్ పరీక్షలు తాయడం కోసం వెళ్లాడు. ఆ సమయంలో కృష్ణ ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. అయితే తనకు ఎంబీబీఎస్ సీట్ రాదేమో అని మనస్తాపం చెందిన కృష్ణ, తన కల నెరవేరకుంటే బతికున్న లాభం లేదనుకుని తన తల్లిదండ్రులకు క్షమాపణ చెప్తూ లెటర్ రాసి పెట్టి, ఇంట్లోని ఫ్యానుకు ఉరేసుకొని ప్రాణం తీసుకున్నాడు.
మధ్యాహ్నం ఇంటికి వచ్చిన అతని తాత తలుపులు తెరవగా ఫ్యానుకు ఉరేసుకొని కృష్ణ కనిపించాడు. ఆయన వెంటనే ఆ విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపాడు. దాంతో ఇంటికి తిరిగి వచ్చిన తల్లిదండ్రులు తమ కుమారుడిని అలా చూసి కన్నీరు మున్నీరుగా విలిపించారు. ఎదిగాడు అనుకున్న కొడుకు ఇలా అర్ధాంతరంగా కన్నుమూయడంతో రోధింస్తున్నారు. పోలీసులు ఈ ఘటన పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఈమధ్య కాలంలో చిన్న కారణాలకే బలవన్మరణానికి పాల్పడుతున్నారు. పరీక్షలు ఫెయిల్ అయ్యామనో, అమ్మ తిట్టిందనో, నాన్న ఫోన్ కొనివ్వట్లేదనో, ఇలాంటి చిన్న చిన్న వాటికే విలువైన తమ ప్రాణాలను తీసుకుంటున్నారు. సమస్యలు వచ్చినపుడు వాటిని ధైర్యంగా ఎదుర్కొవాల్సిన సమయంలో వాటికి ఆందోళన చెంది బలవన్మరణానికి పాల్పడడం అందరిని కలవరపాటుకు దూరి అయ్యేలా చేస్తోంది.
కానీ సత్యనాగు ఆమె తండ్రిని తన చదువు కోసం కాకుండా ఆ డబ్బుతో మందులు కొనుక్కోమని తండ్రికి ఎంతగానో చెప్పేది. దానికి ఆమె తండ్రి నువ్వు చదువుకుంటే కుటుంబంలో అందరం బాగుంటామని, నాకేం కాదని కూతురికి చెప్పేవాడు. కానీ సత్యనాగు తనని చదివించాలనే ఉద్దేశ్యంతోనే తన తండ్రి ఆరోగ్యాన్ని లెక్కచేయడం లేదని బాధపడింది.



