2017 నుంచి దాదాపు ఆరేళ్లు కార్తీక దీపం సీరియల్ నిరంతరాయంగా ప్రసారం అయ్యి.. జాతీయ స్థాయిలో నెంబర్ సీరియల్గా అనేక రికార్డుల్ని క్రియేట్ చేసి.. బుల్లితెర బాహుబలిగా అవతరించింది. ఇంతటి టీఆర్పీల పెద్ద పెద్ద సినిమాలకూ దక్కలేదేమో. ఇంట్లో ముసలవ్వ నుంచి పిల్లాడి వరకూ.. ఈ సీరియల్ కనెక్ట్ అయింది. మగాళ్లలోనూ ఈ సీరియల్ కు ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సీరియల్ లో నటించిన నటీనటులకు సినిమా స్టార్లకు ఉన్నంత ఫాలోయింగ్ ఉంది.
అయితే తాజాగా ఈ సీరియల్ ముగిసిన విషయం మనకు తెలిసిందే. అయితే పదిహేను వందలకు పైగా ఎపిసోడ్స్ ముగిసిన తర్వాత ఈ సీరియల్ కి ఒక ముగింపు ఇచ్చారు మేకర్స్. కానీ దీనికి పార్ట్ 2 ఉంటుందని కూడా వార్తలు వస్తున్నాయి. అసలు ఈ సంగతి పక్కన పెడితే కార్తీక దీపం సీరియల్ కి విపరీతమైన ఫాలోయింగ్ ఉందన్న విషయం మనకి తెల్సిందే. సీరియల్స్ కేవలం ఆడవాళ్లకే పరిమితం అన్న మాట ఎప్పటిదో.. ఈ సీరియల్ కి మగాళ్లలో కూడా సూపర్ ఫాన్స్ ఉన్నారన్న విషయాన్ని ఈ సంఘటన నిరూపించింది.

తనని కార్తీకదీపం సీరియల్ చూడకుండా అడ్డుకుంటున్నాడని ఒక వ్యక్తి వేలు కొరికేసాడు ఒక అభిమాని. దీంతో అందరూ ఖంగు తిన్నారు. జనాలను షాక్ కి గురిచేసిన ఈ ఘటన వరంగల్లో జరిగింది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేట గ్రామానికి చెందిన గట్టు మొగిలి అనే వ్యక్తి కార్తీకదీపం చివరి ఎపిసోడ్ ని ఆసక్తిగా చూస్తుండగా వెంకటయ్య అనే వ్యక్తి వచ్చి మద్యం కావాలని అడిగాడు. మొగిలి తాను ఇవ్వను అని చెప్పి సీరియల్ చూడటం లో మునిగిపోయాడు. కానీ వెంకటయ్య వదలకుండా విసిగించటం తో వెంకటయ్య కుడిచెయ్యి చూపుడు వేలిని కొరికేశాడు మొగిలి.

కార్తీక దీపం సీరియల్ చూడకుండా విసిగించడంతో కోపమొచ్చి వేలుకొరికేశానని ఒప్పుకున్నాడు నిందితుడు. దీంతో కేసు నమోదు చేశారు పోలీసులు. కేవలం ఆడవాళ్ళకే టీవీ సీరియళ్ల పిచ్చి ఉంటుందన్నది అపోహేనని ఈ ఘటనతో తేలిపోయింది. తనని సీరియల్ చుడనివ్వకుండా చేయడంతో వేలు కొరికి పరారయ్యాడు మొగిలి. చివరికి పోలీసులు పట్టుకోవడం తో నేరం ఒప్పుకున్నాడు. పోలీసులు ఐపీసీ 290, 324 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.


















ఇంకొందరు ఇంట్లో ఉన్నా కొన్నిసార్లు రెస్టారెంట్స్ నుంచి ఆహారాన్ని ఆర్డర్ చేసుకుని తింటున్నారు. వేలకు వేలు బిల్లులు అయినా కూడా కొందరు లగ్జరీ కోసం బయటకు వెళ్లి తింటుంటారు. కాగా, డిల్లీలోని లజపత్ నగర్ లో ఉండే లజీజ్ రెస్టారెంట్ 1985 డిసెంబర్ 20 నాటి బిల్లును సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ బిల్లును చూసిన వారు షాక్ అవుతున్నారు.
ఇంతకీ ఆ పోస్ట్ లో ఏముందంటే, అది ఒక రెస్టారెంట్ బిల్లు, అందులో ఓ కస్టమర్ ఒక ప్లేట్ దాల్ మఖనీ,షాహిపన్నీర్, రైతా మరియు కొన్ని చపాతీలు ఆర్డర్ చేసారు. అయితే మొదటి రెండు వంటకాలకు(దాల్ మఖనీ, షాహిపన్నీర్) 8 రూపాయలు, మిగతా రెండింటికీ 5, 6 రూపాయలు. ఆశ్చర్యానికి గురి చేసేటు వంటి విషయం మొత్తం బిల్లు కేవలం 26 రూపాయలు. అంటే అప్పట్లో బిల్లులు చాలా తక్కువ. ప్రస్తుత ధరతో పోలిస్తే ఒక చిప్స్ ప్యాకెట్ రేటుకి సమానం అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ పోస్ట్ 2013 ఆగస్టు 12న ఫేస్ బుక్ లో షేర్ చేశారు. ఆ పోస్ట్ ఇప్పుడు వైరలయ్యింది.