పెళ్లి అనగానే ఎంత హడావుడి, బంధు మిత్రులు సందడి, పెద్ద ఎత్తున భోజనాలు, పట్టుచీరలు, ఆభరణాల ధగధగలు.. అబ్బో లక్షల్లో ఖర్చు. జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే కాబట్టి చాలామంది తమ పెళ్లి వేడుక ప్రత్యేకంగా ఉండాలనుకుంటారు. మధ్యతరగతి వారే ఇలా అనుకుంటే.. మైనింగ్ కింగ్ గా పేరు సంపాదించిన గాలి జనార్ధన్ రెడ్డి తన కుమార్తె పెళ్లి అంగరంగవైభవం గా జరిపించారు.
కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి కూతురు బ్రహ్మణి వివాహం నవంబర్ 6, 2016లో జరిగింది. ఈ వివాహానికి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు మాజీ మంత్రి. 50 వేల మందికిపైగా అతిథులు ఈ పెళ్లికి హాజరయ్యారు. 5 రోజుల రోజుల పాటు ఈ వివాహ వేడుకలు జరిగాయి. ఇన్విటేషన్ కార్డు నుంచి భారీ సెట్టింగ్స్ వరకు దేశవ్యాప్తంగా ఈ పెళ్లి వైరల్ అయ్యింది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడం తో ఈ పెళ్లి విషయం మరోసారి వైరల్ హైలైట్ అయ్యింది.

గాలి బ్రాహ్మణి వివాహ ఆహ్వాన పత్రిక గా డిజిటల్ ఇన్విటేషన్ కార్డుని అతిథులకు పంపారు. ఈ పెళ్లి కార్డులపై ఎల్సీడీ స్క్రీన్స్ ప్లే చేశారు. ఈ స్క్రీన్ ఒక బాక్స్లో ఉంటుంది. అందులో రెడ్డీ కుటుంబ సభ్యులు బంధువులు, అతిథులను ఆహ్వానిస్తున్న వీడియో ఉంది. పెళ్లికి వచ్చిన అతిథులను 40 లగ్జరీ బుల్లోక్ కార్ట్స్లోకి ఎక్కించి గేటు నుంచి పెళ్లి మండపానికి తీసుకెళ్లారు.

రూ.150 కోట్లతో విజయ నగర ఆలయం మాదిరిగా పెళ్లి మండపాన్ని పలువురు బాలీవుడ్ ఆర్ట్ డైరెక్టర్లు రూపొదించారు. డైనింగ్ ఏరియాను బెల్లారి గ్రామం మాదిరిగా డిజైన్ చేశారు. అతిథులను పెళ్లి మండపానికి తీసుకొచ్చేందుకు 2000 కార్లు, 15 హెలికాప్టర్లను అద్దెకు తీసుకున్నారు. వారు ఉండడటానికి బెంగళూరులో ఫైవ్ స్టార్, త్రీ స్టార్ హోటళ్లలో 1500 రూమ్స్ బుక్ చేశారు.

అలాగే అతిథులకు టువంటి ఇబ్బందులు, అసౌకర్యం కలగకుండా వుండటం కోసం 1 లక్ష మంది గ్రౌండ్ స్టాఫ్, 2500 మంది సూపర్వైజర్లు, 1000 మంది మేనేజర్లని నియమించారు. ఈ పెళ్ళిలో గాలి జనార్ధన్ రెడ్డి కుమార్తె బ్రాహ్మణి రూ.17 కోట్లు విలువైన కంజివరమ్ శారీ కట్టుకున్నారు. ఈ చీరలో స్వచ్ఛమైన బంగారం దారాలను వినియోగించారు.

పెళ్లి లో ఆమె ధరించిన వజ్రాభరణాల విలువ రూ.90 కోట్లు ఉంటుందని అంచనా. పెళ్లి కుమార్తె మేకప్ కోసం ముంబై నుంచి 50 మంది టాప్ మేకప్ ఆర్టిస్టులను రప్పించారు. దీని కోసం ఏకంగా రూ.30 లక్షలు ఖర్చు చేశారు. వెయ్యి వంటకాలతో మెనూ తయారు చేసారు. దీని కోసమే 100 కోట్లు ఖర్చు అయ్యాయట. మొత్తంగా ఈ వివాహానికి 500 కోట్లు ఖర్చు చేసారని తెలుస్తోంది.

అనుకున్నదే తడవుగా ఇండియాలోని తీర్థయాత్రలకు మాత్రమే కాకుండా, వేరే దేశాలలోని తీర్థయాత్రలకు కూడా రత్నమ్మ తీసుకెళ్తూ ఆమె కోరికను నెరవేరుస్తున్నాడు. ఇక అమ్మ కోరిక నెరవేర్చడం కోసం కృష్ణకుమార్ ఇంతవరకు వివాహం కూడా చేసుకోలేదు. 2018లో తల్లిని స్కూటర్ పై తీసుకొని ప్రయాణం మొదలు పెట్టిన కృష్ణ కుమార్, ఇప్పటి దాకా రత్నమ్మ కు ఎన్నో పుణ్య క్షేత్రాలను, ప్రాంతాలను కూడా చూపించాడు.
అయితే 2020లో కరోనా కారణంగా వీరి తీర్థయాత్రలకు బ్రేక్ వచ్చింది. కరోనా తగ్గడంతో 6 నెలల నుండి మళ్లీ ప్రయాణం కొనసాగిస్తున్నారు. కృష్ణకుమార్ అమ్మకి గైడ్ గా మారి పుణ్యక్షేత్రాల దర్శనం చేయిస్తూ ఆమెను ఆనంద పెడుతున్నాడు. అలా ఇప్పటివరకు స్కూటర్ పై దాదాపు 66 వేల కిలోమీటర్ల వరకు ప్రయాణం చేశారు.
కర్ణాటక ఒడిశా, తమిళనాడు, ఏపీ, చత్తీస్ గడ్, అరుణాచల్ ప్రదేశ్, జార్ఖండ్ మాత్రమే కాకుండా బూటాన్, నేపాల్, మయన్మార్ దేశాలలోని పుణ్య క్షేత్రాలను కూడా సందర్శించారు. తాజాగా తెలంగాణాలోని బాసర సరస్వతి పుణ్య క్షేత్రాన్ని కూడా దర్శించుకున్నారు. ఈ సందర్భంలో కృష్ణ కుమార్ మాట్లాడుతూ తన తల్లి కలను నెరవర్చడం కోసం తీసుకున్న నిర్ణయం చాలా సంతోషాన్ని కలిగించిందని తెలిపారు.
Also Read: 
















డైలీ స్టార్ ఇచ్చిన నివేదిక ప్రకారం, టైమ్ ట్రావెలర్ గా చెప్తున్న వ్యక్తి కాలంతో ట్రావెల్ చేసి 2714 వ సంవత్సరం నుండి తిరిగొచ్చానని తెలిపాడు. అంతే కాకుండా ప్రమాదకరమైన మహమ్మారితో పాటుగా రాబోయే పదేళ్ళలో జరిగబోయే సంఘటనల గురించి కూడా హెచ్చరించాడు. అలాగే ప్రమాదకరమైన మహమ్మారి ఎక్కడ నుండి వస్తుంది. ఎలా వ్యాప్తి చెందుతుందో కూడా వెల్లడించాడు. అతని చెప్తున్న విషయాల ప్రకారంగా 2024లో మంచు కరిగి, దాని కింద ఉన్న హానికర వైరస్ ప్రపంచవ్యాప్తంగా అందరికి వ్యాపిస్తుంది.
ముప్పై ఐదు కోట్ల మందికి పైగా ఈ వైరస్ బాధితులు అవుతారని తెలిపాడు. ఈ ప్రమాదకర వైరస్ అందరిని తీవ్రంగా భయనికి గురి చేస్తుందని తెలిపాడు. ఈ టైమ్ ట్రావెలర్ పేరు ఎనో అలరిక్. @theradianttimetraveller అనే పేరుతో టిక్టాక్ ద్వారా తన వీడియోను షేర్ చేశాడు. ఈ ఏడాది జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఎలియన్స్ ని శోధిస్తుందని తెలిపాడు. ఇది ఎన్నో స్టార్స్ నుండి ఎక్కువ మొత్తంలో ఎనర్జీని గ్రహిస్తుందని, అనంతరం సూర్యుడి నుండి కూడా శక్తిని గ్రహిస్తుందని చెప్పాడు.
ఇవే కాకుండా, ఆశ్చర్యపోయే విషయలు కూడా తెలిపాడు. మనషులు 2025లో అంగారక గ్రహానికి వెళ్తారని, అక్కడ వాళ్ళు చూసే విషయాలు అందరిని ఆశ్చర్యపరుస్తాయని చెప్పుకొచ్చాడు. ఆస్ట్రోనాట్స్ ల్యాండింగ్ అయిన దగ్గర మనుషుల ఎముకలను చూస్తారని చెప్పాడు. మనుషులు భూమి కన్నా ముందు అంగారక గ్రహం పై జీవించినట్లు సాక్ష్యం అని చెప్పి షాక్ కి గురి చేశాడు. ఇంకా అతిపెద్ద సౌర తుఫాన్ 2026లో భూమిని తాకుతుంది. దాంతో అంతర్జాతీయంగా 6 వారాల వరకు విద్యుత్తు అంతరాయం కలుగుతుందని చెప్పుకొచ్చాడు.
Also Read: 



వీరికి పాన్-ఆధార్ లింక్ మినహాయింపు..
ఎలా పాన్ కార్డ్ ను – ఆధార్ నంబర్ తో లింక్ చేయాలి..
ఎస్ ఏం ఎస్ ద్వారా పాన్ కార్డ్ ను ఆధార్ నంబర్ తో లింక్ చేయవచ్చు. దీని కోసం UIDPAN < SPACE > < ఆధార్ నంబర్> <SPACE> < 10 డిజిట్స్ PAN> ఫార్మాట్ లో 567678 నంబర్ కి కానీ, 56161 నంబర్ కి కానీ SMS చేయాలి. ఆఫ్లైన్ లో చేయడానికి దగ్గరలో ఉండే పాన్ సేవ లేదా ఆధార్ సేవ కేంద్రంలో పాన్ కార్డ్ ను ఆధార్ నంబర్ తో లింకు చేస్తారు.

