ఒక మనిషి బయటికి వెళ్ళేటప్పుడు కచ్చితంగా ఉండే వస్తువులలో డబ్బులు ఒకటి. అసలు డబ్బు లేకుండా ప్రపంచమే ముందుకు నడవదు. మనం మనం ఖర్చు పెట్టినా, పెట్టకపోయినా మనకి డబ్బు అవసరం ఉన్నా, లేకపోయినా కానీ మనం ఖచ్చితంగా బయటికి వెళ్ళేటప్పుడు ఎంతో కొంత డబ్బులు మన దగ్గర ఉంచుకుంటాం.

ఒక్క రోజు ఒక మనిషి డబ్బులు లేకుండా బయటకు వెళితే, అక్కడ ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తే ఎలా అనే ఆలోచనే ఉంచుకోవడానికి చాలా కష్టంగా ఉంది. అందుకే ప్రతి మనిషి కచ్చితంగా బయటికి వెళ్ళేటప్పుడు తమ దగ్గర ఎంతో కొంత డబ్బులు పెట్టుకొని వెళ్తారు. అందులోనూ ముఖ్యంగా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో ప్రయాణించే వారి దగ్గర అయితే 50, 10, 20, 100 రూపాయల నోట్లు, అలాగే కొంచెం చిల్లర కచ్చితంగా ఉంటాయి.

అయితే మనం నోట్లని ఉపయోగిస్తాంలే కానీ అంత పరిశీలించి చూడము. ఒక వేళ చూసినా కూడా దాని మీద ఉన్న కొన్నిటికి అర్థం తెలియదు. నోట్లపై ఉండే డిజైన్లు మనమందరం గమనించే ఉంటాం. అయితే ఆ డిజైన్ మనకి కేవలం డిజైన్ మాత్రమే కావచ్చు. కానీ ఆ నోటు మీద ఉండే చిన్న గీతల వెనకాల కూడా అర్థం ఉంటుంది.

అయితే, కరెన్సీ నోటుకి కుడి వైపు, ఎడమ వైపు సన్నని గీతలు ఉంటాయి. ఆ గీతల వెనకాల ఉన్న అర్థం మనలో చాలా మందికి తెలియదు. ఆ గీతలు అంధులకి అర్థం కావడానికి ఉండే లాగా రూపొందించారు. 2000 రూపాయల నోటు మీద 7 గీతలు ఉంటాయి. 500 రూపాయల నోటు మీద 5 గీతలు ఉంటాయి.

200 రూపాయల నోటు మీద అయితే పైన 2 గీతలు, కింద 2 గీతలు మధ్యలో 2 చుక్కలు ఉంటాయి. 100 రూపాయల నోటు మీద 4 గీతలు ఉంటాయి. ఆ లైన్లను తాకి ఆ నోట్ ఎన్ని రూపాయలది అనేది వారు గుర్తిస్తారు. అయితే పాత నోట్లకి కూడా అన్నిటికీ గీతలు కాకపోయినా ఒక పాటర్న్ లాంటిది ఉండేది. ఆ పాటర్న్ ద్వారా ఆ నోటు ఎన్ని రూపాయలది అనేది తెలుసుకుంటారు.
source :









టెక్కలి మండలం నౌపడ ఆర్ఎస్ గ్రామానికి చెందిన ముడాదాన ప్రమీల ఒక రోజు రైలులో కోచింగ్ నిమిత్తం విజయనగరం వెళుతోంది. అదే రైలులో ప్రయాణిస్తున్న కొంకి వెంకటేష్తో ఆమెకు పరిచయం ఏర్పడింది. అతడిది వజ్రపుకొత్తూరు మండలం కొమరల్తాడ గ్రామం. వెంకటేశ్ దిగాల్సిన స్టేషన్ రావడంతో ట్రెయిన్ దిగిపోయాడు. కానీ వెళ్తూ వెళ్తూ తన ఆర్ఆర్బీ కోచింగ్ సెంటర్కు సంబంధించిన ఐడీ కార్డును అక్కడే మర్చిపోయి వెళ్లిపోయాడు.
ఆ కార్డు ప్రమీల కంటపడడంతో, అతడికి అవసరమవుతుందని ఆలోచించి దానిపై ఉన్న ఫోన్ నెంబర్కు ఫోన్ చేసింది. అయితే,ఇక్కడే కథ ప్రారంభమయింది. తాను కావాలనే ఐడీ కార్డు వదిలివెళ్లానని,నిన్ను ప్రేమిస్తున్నానని ప్రమీలకి చెప్పాడు వెంకటేష్.ప్రస్తుతం నేను రాజమండ్రిలో ఉన్నందున ఐడీ కార్డు కోసం తర్వాత వస్తానని చెప్పాడు.
కొత్త కాపురం మొదలు పెట్టారు . పదిహేను రోజుల బాగానే కాపురం చేసిన వెంకటేశ్ , వాళ్లింటికి వెళ్లొస్తానని ఒకరోజు వెళ్లాడు .ఇంటి నుండి వచ్చిన నాటినుండి ప్రమీలను గర్భం తీయించేసుకోవాలని ఒత్తిడి చేశాడు. ఇందుకు ప్రమీల ఒప్పుకోలేదు . దాంతో ఇంటికి రావడం మానేసి , ప్రమీలకి పూర్తిగా ముఖం చాటేశాడు.
ప్రమీల ఎన్నిసార్లు కలవాలని ప్రయత్నించినా కలవకపోగా , కలిసినప్పుడు తక్కువ కులం దానివంటూ దూషించడం మొదలుపెట్టాడు. చేసేదేం లేక , బాధితురాలు తన తల్లితో కలిసి టెక్కలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను వేడుకుంది. తొందరపడి తీసుకునే నిర్ణయాల వల్ల జీవితాలు అల్లకల్లోలం కావడం తప్ప ఫలితం ఉండదు . ఇద్దరూ చదువుకుంటున్నవాళ్లు , వీరిద్దరే తల్లిదండ్రులపై ఆధారాపడాల్సిన పరిస్థితి . ఇప్పుడు కడుపులో బిడ్డ భవిష్యత్ ఏంటి??



































