చిరంజీవి సోదరుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, ఇప్పుడు పవర్ స్టార్ గా గుర్తింపు పొందారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. ఈ మూడు కూడా భారీ బడ్జెట్ తో ఎక్కుతున్నాయి. ఇందులో హరిహర వీరమల్లు, ఓజి సినిమాలు రెండు భాగాలుగా రూపొందుతున్నాయి. కొంత కాలం క్రితం వరకు కూడా పవన్ కళ్యాణ్ ఈ సినిమాల చిత్రీకరణలో పాల్గొన్నారు. కానీ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికలు జరిగిన కారణంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమిగా ఎన్నికల్లో నిలిచారు.

పిఠాపురంలో ఎమ్మెల్యే పదవికి పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. అయితే గత కొంత కాలం నుండి ఒక స్టిక్కర్ వైరల్ అవుతోంది. ఈ స్టిక్కర్ మీద, “పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా” అని రాసి ఉంది. అంటే పవన్ కళ్యాణ్ తాలూకా అని ఇండైరెక్ట్ గా చెబుతున్నారు. ఈ స్టిక్కర్ వైరల్ అయ్యింది. ఎంతో మంది తమ నేమ్ ప్లేట్స్ మీద ఈ స్టిక్కర్ అంటించుకున్నారు. అయితే ఈ స్టిక్కర్ డిజైన్ చేసిన అతని పేరు నల్లా నాయుడు. ఆయన ఒక గ్రాఫిక్ డిజైనర్. అమలాపురంకి చెందిన నల్లా నాయుడు పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని.
దాంతో జూన్ 4వ తేదీ ఎన్నికల ఫలితాలు వచ్చాక తన బైక్ మీద నేమ్ బోర్డుగా ఇది పెట్టి, అప్పుడు అందరూ ఇది చూడాలి అని అనుకున్నారు. ఈ కారణంగానే ఇలాంటి ఒక బోర్డు తయారు చేసుకున్నారు. కానీ ఆ బోర్డు డిజైన్ బయటికి వచ్చేసింది. దాంతో అందరూ ఇలాంటి ఒక బోర్డు తయారు చేసుకోవడం మొదలుపెట్టారు. పిఠాపురంలో చాలా చోట్ల ఈ బోర్డు కనిపిస్తోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా అదే కనిపిస్తోంది. నేమ్ ప్లేట్స్ మీద, ఆటోల మీద, ఇంకా చాలా చోట్ల ఇదే పదం కనిపిస్తోంది. దాంతో ఇప్పుడు ఇది వైరల్ గా మారింది.


ఇండియాలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లలో రాహుల్ గాంధీ ఒకరు. ఆయన వయసు ప్రస్తుతం 53 సంవత్సరాలు. ఇంత వయసు వచ్చినా రాహుల్ గాంధీ పెళ్లి చేసుకోకపోవడంతో ఆయన పెళ్లి చాలా సార్లు చర్చలు జరిగాయి. ఎందుకు చేసుకోలేదు అంటూ అడుగుతూనే ఉన్నారు. దేశంలోని పలువురు ప్రముఖులు, హీరోయిన్లు సైతం రాహుల్ గాంధీని వివాహం చేసుకుంటాం అని ముందుకు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఇంతగా చర్చకు దారితీసిన పెళ్లి గురించి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా సమాధానం చెప్పారు. 2022లో సెప్టెంబర్ 7న రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి భారత్ జోడో యాత్రను ప్రారంభించారు. ఈ యాత్రలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. 137 రోజుల సుదీర్ఘ పాదయాత్రను శ్రీనగర్లోని చారిత్రాత్మక లాల్ చౌక్లో ముగించారు. ఈ యాత్ర 12 రాష్ట్రాలు మరియు రెండు కేంద్రపాలిత ప్రాంతాలలో దాదాపు ఐదు నెలల్లో 4,080 కిలోమీటర్లు సాగింది.
ఆ సమయంలో రాహుల్ గాంధీ పూర్తిగా ప్రజల్లో ఉంటూ సామాన్యులను కలిసి మంచి చెడ్డలు తెలుసుకున్నారు. ఆ క్రమంలో కాలేజ్ స్టూడెంట్స్తో కూడా ముచ్చటించారు. అయితే వారిలో ఒక స్టూడెంట్ పెళ్లి గురించి రాహుల్ గాంధీని అడిగారు. ఆ ప్రశ్నకు ‘తన పనులు మరియు పార్టీ పనుల్లో పూర్తిగా నిమగ్నం అయినందువల్ల వివాహం గురించి ఆలోచించలేదని రాహుల్ గాంధీ వెల్లడించారు.
నారా లోకేష్ మంగళగిరిలో ఉమ్మడి గుంటూరు జిల్లా విద్యార్థులు మరియు యువతతో ఆగస్టు 16న ‘హలో లోకేష్’ పేరుతో ముఖాముఖి కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఉమ్మడి గుంటూరు, విజయవాడ నుండి పెద్ద సంఖ్యలో విద్యార్థులు, మరియు యువత తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో కొందరు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు నారా లోకేష్ జవాబు చెప్పారు.
ఈ క్రమంలోనే ఒక యువతి నారా లోకేష్ ను బ్రాహ్మణితో పెళ్లి విషయల గురించి అడిగింది. ఆమె ప్రశ్నలకు సమాధానం చెప్తూ, నారా లోకేష్ తన భార్య బ్రాహ్మణితో లవ్ స్టోరీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. లోకేష్ మాట్లాడుతూ “తనది బ్రాహ్మణిది లవ్ ఎట్ ఫస్ట్ సైట్’ అని అన్నారు. అయితే ‘ముద్దుల మామయ్య (నందమూరి బాలకృష్ణ) దగ్గర అంత సాహసం చేసేవాడ్ని కాదని వెల్లడించారు.
ఇంట్లో అమ్మానాన్నవాళ్ళు ఒక వెకేషన్ కు వెళ్తే అక్కడ చెప్పారు. ఇలా మేము అనుకుంటున్నాం. నీ అభిప్రాయం ఏంటని అడిగారు. నా అభిప్రాయం మీకు తెలుసు కదా. వాళ్ళు ముందు అలా ప్రతిపాదించారు. 








