ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లాండ్ తో 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్ లో భాగంగా మొదటి టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమిపాలైంది. ఓటమికి భారత జట్టు బ్యాటింగ్, ఫీల్డింగ్ వైఫల్యమే కారణమని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. అయితే రెండో టెస్ట్ మ్యాచ్ ముందు భారత జట్టుకి మరో పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ బ్యాట్స్ మెన్ కె.ఎల్. రాహుల్ ఆల్ రౌండర్ జడేజా కూడా గాయాలు కారణంగా టీం కి దూరమయ్యారు.

ఈ నేపథ్యంలో వైజాగ్ లో జరిగే మ్యాచ్ కి సర్ఫరాజ్ ఖాన్,సౌరభ్ తివారి, వాషింగ్టన్ సుందర్ లకు పిలుపు వచ్చింది. అయితే భారత మేనేజ్మెంట్ ఆఖరి మూడు మ్యాచ్లు కూడా టీం ను ప్రకటించే ఆలోచనలో ఉంది.
అయితే ఈ నేపథ్యంలో ఆఖరి మూడు మ్యాచ్లకు కింగ్ కోహ్లీ రీయంట్రీ ఇస్తాడా లేదా అనేది సందేహంగా మారింది. టీంలో ఎంపికైనప్పటికీ తొలి రెండు మ్యాచ్లకి కోహ్లీ వ్యక్తిగత కారణాలవల్ల దూరంగా ఉన్న విషయం తెలిసిందే.
అయితే కొందరు రోహిత్ తో విభేదాలు కారణంగానే టీం కి దూరమయ్యాడు అని అంటుంటే బీసీసీఐ వాటిని కొట్టి పడేసింది. మరో పక్క తన భార్య అనుష్కకి అనారోగ్యం కారణంగా తన వద్ద ఉండేందుకే కోహ్లీ విరామం తీసుకున్నాడని అభిమానులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఆఖరి మూడు మ్యాచ్లకు కోహ్లీ అందుబాటులోకి రాకపోతే భారత టీమ్ కి తిప్పలు తప్పవని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.

ధోనీ తన ఆటతో ఏ క్రికెటర్ కి సాధ్యం కాని విధంగా పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ అయినప్పటికీ, ధోనీ ఐపీఎల్లో సీఎస్కే కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. ధోనీకి సంబంధించిన ఏ విషయం అయినా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ గా మారుతుంది. తాజాగా ధోనీకి స్వంత అన్న ఉన్నాడని, అతడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడని, ధోని తన అన్నను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అతని గురించి ధోని బయోపిక్ గా వచ్చిన ‘ఎంఎస్ ధోని:ది అన్టోల్డ్ స్టోరీ’ లో కూడా చూపించలేదని అంటున్నారు.
ధోనికి ఒక అన్న ఉన్నాడు. ఆయన పేరు నరేంద్ర సింగ్ ధోని. ధోనీ కన్నా పదేళ్ళు పెద్దవాడు. కొంతకాలం క్రితం ధోని రాంచిలో ఉన్న తన పొలంలో ముగ్గురు వ్యక్తులతో కలసి ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్ గెలిచిన అనంతరం ధోనిని నరేంద్ర కలిశాడని ది క్రిక్టైమ్ తెలిపింది. నెటిజెన్లు చేస్తున్న కామెంట్స్ కు నరేంద్ర సింగ్ ధోని గతంలో ఒక ఇంటర్వ్యూతో ధోనీ ఫ్యాన్స్ జవాబు ఇస్తున్నారు.
ఈ ఇంటర్వ్యూలో నరేంద్ర సింగ్ ధోని మాట్లాడుతూ, ‘మహీ చిన్నతనం, యువకుడిగా కష్టాలు పడ్డ టైమ్ లో నేను ధోనీకి సాయం చేయలేదు. అతను క్రికెటర్ గా ఎదగడంలో నా ప్రమేయం ఏం లేదు. మహీ నాకన్నా పది సంవత్సరాలు చిన్నవాడు. తను తొలిసారి బ్యాట్ పట్టుకునే టైమ్ కి రాంచి విడిచి ఉన్నత చదువుల కోసం కుమాన్ యూనివర్సిటీకి వెళ్ళాను. కానీ మహీకి కొన్నింటిలో నైతికంగా అండగా ఉన్నా, వాటన్నిటినీ మూవీలో ఇరికించాల్సిన పని లేదు. నిజానికి ఈ మూవీ మహీ గురించి, అతడి ఫ్యామిలీ గురించి కాదు’’ అని చెప్పుకొచ్చారు.
నరేంద్ర సింగ్ ధోనికి పాలిటిక్స్ అంటే ఆసక్తి అని తెలుస్తోంది. అతను 2013 నుండి సమాజ్వాదీ పార్టీలో కొనసాగుతున్నాడు. దానికి ముందుగా బిజెపిలో ఉండేవారని సమాచారం. నరేంద్ర 2007లో వివాహం చేసుకోగా, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నట్లు నేషనల్ మీడియా కథనాలు తెలుపుతున్నాయి.











కోహ్లీ ప్రస్తుతం భారత జట్టుకు వెన్నెముకగా ఉన్నాడు. రికార్డ్ బ్రేకింగ్లో కూడా నంబర్ వన్ పోటీదారుడుగా కూడా ఉన్నాడు. కోహ్లి 17 కోట్లకు పైగా ఎండార్స్మెంట్ల ద్వారా భారీగా ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు. ధోని రోజుకు 1.5 కోట్లు తీసుకుంటుండగా, కోహ్లీ రోజుకు రూ.2 కోట్లు వసూలు చేస్తాడు. విరాట్ కోహ్లీ ఒక యాడ్ షూట్ కోసం ఒప్పందం చేసుకున్న కంపెనీ వారికి 2 లేదా 3 రోజుల సమయం మాత్రమే ఇస్తాడు. వారు ఆ రోజుల్లోనే యాడ్ చిత్రీకరణ, ప్రెస్ మీట్ లాంటివి చేయాలి. ఇక ఆ యాడ్ షూట్ జరిగే సమయంలో కోహ్లి రోజుకి రెండు కోట్లు వసూలు చేస్తాడు.
అంతే కాకుండా కోహ్లీకి ఇంకో రకంగా కూడా సంపాదిస్తున్నాడు. కోహ్లీ ఇన్స్టాగ్రాం ఖాతా ద్వారా కూడా ఆర్జిస్తున్నాడు. వస్తుంది. ఇన్స్టాగ్రాం ఖాతాలో కోహ్లీ 16.7 మిలియన్ల ఫాలోవర్లను కలిగి ఉన్నాడు. కోహ్లీ ఇన్స్టాగ్రాం ఖాతాలో ఏదైనా కంపెనీ బ్రాండ్ గురించి ఒక పోస్ట్ పెట్టాలంటే దాని కోసం రూ.3.2 కోట్ల వరకు వసూల్ చేస్తాడంట. కచ్చితంగా అడిగిన డబ్బు చెల్లిస్తేనే తన ఇన్స్టాగ్రాం ఖాతాలో సదరు కంపెనీకి చెందిన పోస్ట్ ను పెడతాడంట.
క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్తో సమానంగా రోజుకు రూ. 2 కోట్లతో కోహ్లీ దాదాపు 3 రోజుల పాటు ఒప్పందాలు కుదుర్చుకున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం, కోహ్లీ చాలా కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నాడు. కోహ్లీ ఒప్పందం చేసుకున్న బ్రాండ్స్ లో మన్యవర్, సింథోల్ డియో, పెప్సీ, బూస్ట్, రీబాక్, ఫాస్ట్రాక్, హెడ్ & షోల్డర్స్, గోద్రెజ్, నెస్లే ఇండియా లాంటివి ఉన్నాయి. కోహ్లీ కొన్ని కంపెనీలలో పెట్టుబడులు కూడా పెట్టాడని సమాచారం.

ఆమె 2012లో ‘షెహర్-ఎ-జాత్’ తో బుల్లితెర పై అడుగుపెట్టింది. ఆ తరువాత అనేక సీరియల్స్లో నటించింది. 2017లో డానిష్ మెహ్రునిసా వి లబ్ యు అనే సోషియో-కామెడీ మూవీతో సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చింది. అనేక చిత్రాలలో నటించిన సన ఎన్నో అవార్డులు అందుకుంది. 2020లో సింగర్ ఉమైర్ జస్వాల్ను పెళ్లి చేసుకుంది. 2023లో నవంబర్ 28న అతనికి విడాకులు ఇచ్చింది. తాజాగా షోయబ్ మాలిక్ని రెండవ సారి పెళ్లి చేసుకుంది. మాలిక్, సనా జావేద్ రిలేషన్ లో ఉన్నారని గత ఏడాది నుండి రూమర్లు వస్తున్నాయి.