కాలేజ్ లైఫ్ నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలు అన్నీ కూడా ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఇదే బాటలో మరొక సినిమా వచ్చింది. ప్రముఖ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగ వంశీ సోదరి నిర్మాతగా పరిచయం అవుతూ మ్యాడ్ అనే సినిమా రూపొందించారు. ఈ సినిమా ఇవాళ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
- చిత్రం : మ్యాడ్
- నటీనటులు : రామ్ నితిన్, నార్నే నితిన్, సంగీత్ శోభన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అననతిక సనీల్ కుమార్, గోపికా ఉద్యన్.
- నిర్మాత : సూర్యదేవర నాగ వంశీ
- దర్శకత్వం : కళ్యాణ్ శంకర్
- సంగీతం : భీమ్స్ సిసిరోలియో
- విడుదల తేదీ : అక్టోబర్ 6, 2023

స్టోరీ :
ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో మనోజ్ (రామ్ నితిన్), అశోక్ (నార్నే నితిన్), దామోదర్ అలియాస్ డిడి (సంగీత్ శోభన్) చేరుతారు. వారి పేర్లలో మొదటి అక్షరం కలిపి MAD అని వారి గ్రూప్ కి పేరు పెట్టుకుంటారు. వారితో పాటు లడ్డు (విష్ణు) కూడా కాలేజీలో చేరుతాడు. వీరిలో మనోజ్ శృతితో ప్రేమలో పడతాడు. అశోక్ జెన్నీ అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. దామోదర్ ని వెన్నెల అనే అమ్మాయి ప్రేమిస్తుంది. వీరి కాలేజ్ లైఫ్ ఎలా గడిచింది? అక్కడ వీరు ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? వీరి జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయి? కాలేజీలో వీళ్లు ఎలాంటి పనులు చేశారు? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

రివ్యూ :
సాధారణంగా కాలేజీ లైఫ్ అనే కాన్సెప్ట్ మీద సాగే సినిమాలు చాలా వచ్చాయి. కొంత మంది కాలేజీలో జాయిన్ అవ్వడం, ఆ తర్వాత వాళ్లు ఫ్రెండ్స్ అవ్వడం, వాళ్లకి సీనియర్స్ నుండి వచ్చే ఇబ్బందులు, అక్కడ జరిగే సరదా సంఘటనలు. ఇదే కాన్సెప్ట్ మీద చాలా సినిమాలు వచ్చాయి. వస్తూనే ఉంటాయి. కానీ సినిమా ప్రజెంటేషన్ ని బట్టి సినిమా రిజల్ట్ మారుతుంది. ఇంక ఈ సినిమా విషయానికి వస్తే సినిమా మొత్తం కూడా కామెడీ హైలైట్ అయ్యేలాగా స్టోరీ రాసుకున్నారు.

చాలా వరకు ఆ కామెడీ కూడా బాగా వర్క్ అవుట్ అయ్యింది. కథ అందరికీ తెలిసిన కథ. దీని గురించి పెద్ద గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. కానీ ఎక్కడ బోర్ కొట్టించకుండా టేకింగ్ ఉండేలాగా చూసుకున్నారు. ఇంక పెర్ఫార్మన్స్ విషయానికొస్తే సినిమాలో ఉన్న నటీనటులు అందరూ కూడా బాగానే చేశారు. కానీ సినిమాకి మాత్రం లడ్డు పాత్ర పోషించిన విష్ణు అనే నటుడి పర్ఫార్మెన్స్ హైలైట్ అయ్యింది. చాలా వరకు కామెడీ కూడా ఈ పాత్ర ద్వారానే జనరేట్ అవుతుంది.

పాటలు కూడా సినిమాకి తగ్గట్టుగా ఉన్నాయి. కాలేజ్ పాప అనే పాట తప్ప మిగిలిన పాటలు పెద్దగా గుర్తుపెట్టుకునే అంతగా లేవు. డైలాగ్స్ బాగున్నాయి. కాకపోతే యూత్ ఫుల్ సినిమా కాబట్టి కొన్ని డైలాగ్స్ చాలా డైరెక్ట్ గా ఉన్నాయి. దాంతో కొన్ని డైలాగ్స్ మాత్రం యూత్ కాని ప్రేక్షకులకి కాస్త ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది.
ప్లస్ పాయింట్స్ :
- నటీనటులు
- కామెడీ
- కాలేజ్ లైఫ్ చూపించిన విధానం
- ఫాస్ట్ గా నడిచే స్క్రీన్ ప్లే
మైనస్ పాయింట్స్:
- తెలిసిన కథ
- ఇబ్బంది కలిగించే కొన్ని డైలాగ్స్
రేటింగ్ :
3/5
ట్యాగ్ లైన్ :
ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఒక మంచి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ సినిమా చూద్దాం అనుకునే వారికి మ్యాడ్ సినిమా ఒక్కసారి చూడగలిగే మంచి కామెడీ సినిమాగా నిలుస్తుంది.
watch trailer :
ALSO READ : “ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే… సినిమా రిలీజ్ అయ్యాక తెలుస్తుంది..!” అంటూ… విజయ్ “లియో” ట్రైలర్పై 15 మీమ్స్..!









#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16


ఇండియన్ క్రికెటర్ యశస్వీ జైస్వాల్ ని ఇంటర్వ్యూ చేసిన యాంకర్ పేరు గరిమా భరద్వాజ్. ఆమె ప్రముఖ జర్నలిస్ట్ మరియు న్యూస్ యాంకర్. యశస్వి జైస్వాల్ ను ఇంటర్వ్యూ చేసిన తర్వాత గరిమా వైరల్గా మారింది. దాంతో ఆమె ఎవరా అని నెట్టింట్లో వెతుకుతున్నారు. ఆమె ప్రస్తుతం ‘ది లలన్టాప్’ అనే పాపులర్ షోలో పని చేస్తుంది.
ఆమె సక్సెస్ ఫుల్ స్పోర్ట్స్ జర్నలిస్ట్. అంతకు ముందు దైనిక్ జాగరణ్, పాఠక్ పత్రిక, ఇండియా న్యూస్లతో పాటు అనేక మీడియా సంస్థలకు పనిచేసింది. గరిమా భరద్వాజ్ 1998లో ఢిల్లీలో జన్మించింది. అక్కడే పెరిగింది. ప్రస్తుతం ఆమె వయసు 25 సంవత్సరాలు. ఆమె మోతీ రామ్ మెమోరియల్ గ్రిల్స్ సీనియర్ స్కూల్ లో ప్రాధమిక విద్యను పూర్తిచేశారు. ఆ తర్వాత ఆమె బాచిలర్స్ ఇన్ జర్నలిజంని గురు గోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ యూనివర్సిటీలో చేశారు. ఆ తర్వాత జర్నలిజం రంగంలోకి అడుగుపెట్టింది.
డిల్లీలో నివసిస్తున్న గరిమా భరద్వాజ్ 2021 ఆగస్ట్ నుండి ‘ది లలన్టాప్’ లో సబ్ ఎడిటర్ గా పనిచేస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే గరిమా భరద్వాజ్ యశస్వీ జైస్వాల్ ను ఇంటర్వ్యూ చేసిన వీడియో వైరల్ అయిన తర్వాత ఆమె ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు ఒక్కసారిగా పెరిగారు. ప్రస్తుతం ఆమెను 50 వేలకు పైగా ఫాలో అవుతున్నారు.
ఎనిమిదేళ్ల చిన్నారి తన నాన్న పై కోపం రావడంతో అతన్ని అమ్మడం కోసం “ఫాదర్ ఆన్ సేల్” నోటీసును వారి ఇంటి డోర్ మీద అంటించింది. ఆ నోటీసులో “తన నాన్నను రెండు లక్షలకు కొనుక్కోవచ్చని, మరిన్ని వివరాల కోసం డోర్ బెల్ కొట్టాలని” చిన్నారి పేర్కొంది.
ఈ నోటీసును చూసిన ఆ చిన్నారి తండ్రి సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో పోస్ట్ చేసారు. అందులో తన విలువ అంత తక్కువ కాదని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ నోటీస్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇక ఎనిమిదేళ్ల పాప తన నాన్నని రెండు లక్షల రూపాయలకు అమ్ముతున్నట్లు రాసిన నోటీసును ఇంటి బయట పెట్టటం చూసి నెటిజెన్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఫన్నీ ఎమోజీలు పెడుతున్నారు.
కొందరు నెటిజెన్లు తండ్రిని అమ్మకానికి పెట్టిన ఎనిమిదేళ్ల చిన్నారి తెలివితేటలకి వివిధ రకాల కామెంట్లు, రియాక్షన్స్ ఇస్తున్నారు. పలువురు నెటిజన్లు చేసిన ఫన్నీ కామెంట్లలో కొన్నిటికి ఆ చిన్నారి తండ్రి సమాధానం కూడా ఇచ్చారు. ఈ రోజు సోషల్ మీడియాలో తాను చూసిన హాస్యాస్పదమైన విషయం ఇదే అని ఒక నెటిజెన్ కామెంట్ చేశారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఈ పోస్ట్ పై స్పందిస్తున్నారు. ఇప్పటి వరకు ఎక్స్ లో ఈ పోస్ట్ ని 29 వేల మందికి పైగా చూశారు. వందల మంది నెటిజెన్లు ఈ పోస్ట్ ను లైక్ చేశారు.
ఒకప్పుడు తెలుగు, తమిళ సినీ ఇండస్ట్రీలలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ ఖుష్బూ. కోలీవుడ్ లో ఏకంగా ఆమెకు అభిమానులు గుడినే కట్టారు. నార్త్ లో పుట్టి, పెరిగిన ఖుష్బూ సౌత్ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా కొన్నేళ్ళ పాటు అలరించారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ, మరో వైపు రాజకీయాలలో రాణిస్తూ, తమిళనాడు పాలిటిక్స్ లో ముఖ్యమైన వ్యక్తిగా మారారు. ఇప్పటికే ఒక నటిగా, ప్రొడ్యూసర్ గా, రాజకీయ నాయకురాలుగా రాణిస్తున్న కుష్బూ రీసెంట్ గా అరుదైన గౌరవం పొందింది.
కేరళ త్రిస్సూర్ లో విష్ణు మాయ దేవాలయంలో ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది చేసే నారీ పూజలో కూర్చునే అవకాశం సీనియర్ నటి కుష్బూకి దక్కింది. కుష్బూని ఆలయకమిటీ ఆహ్వానించగా, కుష్బూ నారీ పూజకు హాజరైంది. ఆలయంలో ఒక పీఠం పై కుష్బూని కూర్చోపెట్టి పూజారులందరు పూజలు చేశారు. ఆ తరువాత కుష్బూకు నైవేద్యాలు ఇచ్చి, దీవించారు. కుష్బూ పూజకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. అందులో “దేవుని ఆశీర్వాదలు అందుకున్నాను.
త్రిస్సూర్లోని విష్ణుమాయ దేవాలయం నారీపూజ కోసం ఆహ్వానించడాన్ని గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను.నారీపూజ కోసం ఎంపికైన వారిని మాత్రమే ఆహ్వానిస్తారు. దైవమే స్వయంగా ఆ వ్యక్తిని ఎన్నుకుంటుందని వారు నమ్ముతారు. నాకు ఇంతటి గౌరవాన్ని కలిగించినందుకు, ఆశీర్వదించినందుకు ఆలయంలోని ప్రతి ఒక్కరికీ నా వినయపూర్వకమైన కృతజ్ఞతలు. ప్రతిరోజూ ప్రార్థించేవారికి, తమను రక్షించే సూపర్ పవర్ ఉందని నమ్మే వారందరికి, ఈ పూజ మంచిని తెస్తుందని ఖచ్చితంగా నమ్ముతున్నాను”. అంటూ రాసుకొచ్చింది. ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.
మహానగరం హైదరాబాద్ లో దేశంలోనే అతి పెద్ద షాపింగ్ మాల్ అందుబాటులోకి వచ్చింది. కూకట్పల్లిలో లులు మాల్ నగరవాసులకు అతిపెద్ద షాపింగ్ స్పాట్గా నిలుస్తోంది. హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో రీసెంట్ గా మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం అయిన ఈ మాల్ స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. ఓపెనింగ్ రోజు ఈ మాల్ కి విపరీతమైన ప్రచారం లభించింది. నెట్టింట్లో కూడా ఈ మాల్ పై విపరీతంగా చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో నగర వాసులు ఒక్కసారైనా ఈ మాల్ ను సందర్శించాలనుకుంటారు. దీనికి తోడు 3 రోజుల సెలవుల రావడంతో పెద్ద సంఖ్యలో లులు మాల్ ను సందర్శిస్తున్నారు. ఈ మాల్ కు వచ్చే జనాల వల్ల కూకట్ పల్లిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. శనివారం నాడు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కాగా, ఆదివారం నాడు వీకెండ్ కావడంతో మాల్ కు జనం ఒక్కసారిగా వేల సంఖ్యలో పోటెత్తారు. మాల్ లోపల జనాలు నిండిపోయి ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఎక్కడ చూసినా జనాలే ఎస్కలేటర్లు, బిల్లింగ్ కౌంటర్లు ఇలా అన్నీ చోట్ల పూర్తిగా జనాలతో మాల్ నిండిపోయింది.
ఈ రద్దీలో కొంతమంది మాల్ లో అందినంతవరకు దోచుకున్నారు. ఆహార పదార్థాలను సీసీ కెమెరాల కళ్లుగప్పి మరీ దోచేశారు. మాల్లో ఉన్న ఆహార పదార్థాలన్నిటిని కస్టమర్లు తినేశారు. బిస్కెట్లు, సమోసాలు, ఫ్రూట్స్, కూల్ డ్రింక్స్, ఏది చేతికి దొరికితే దానిని తినేశారు. కొంతమంది సగం తినేసి సగం మాల్ లో నచ్చినట్టు విసిరి పడేశారు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలు చూసిన నెటిజెన్లు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్ లో నగర వాసులు మన పరువును అంతర్జాతీయ స్థాయిలో తీసారని కామెంట్లు చేస్తున్నారు.









2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
రణ్బీర్ కపూర్, రష్మిక మందన జంటగా నటిస్తున్న మూవీ యానిమల్. కొన్ని రోజులుగా ఈ మూవీలోను కీలక పాత్రలకు సంబంధించిన పోస్టర్లను మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. రణ్బీర్ కపూర్ పుట్టినరోజు (సెప్టెంబర్ 28) సందర్భంగా ఈ మూవీ టీజర్ను మూవీయూనిట్ రిలీజ్ చేసింది. ఆ పోస్టర్లకి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రంలో లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న హీరో రణ్బీర్ కపూర్ ను ‘యానిమల్’ లా వయలెంట్గా చూపించారు.
టీజర్ను చూస్తే, తండ్రీ కుమారుల మధ్య ఎమోషన్ కనిపిస్తోంది. అయితే ఒక టిపికల్ స్టోరీలా అనిపిస్తుంది. ఈ మూవీలో విలన్ ఎవరు అనే విషయం మాత్రం అంత స్పష్టంగా తెలియలేదు. రణ్ బీర్ కపూర్ కొన్ని చోట్ల చాలా కూల్గా, కొన్ని చోట్ల చాలా వయలెంట్గా కనిపించాడు. రణ్ బీర్ కపూర్ చెప్పిన డైలాగ్స్ మూవీ పై ఆసక్తిని పెంచేస్తున్నాయి.
యానిమల్ టీజర్ విజువల్స్, సంగీతం, బిజీఎం ఇలా ప్రతిదీ అందరినీ ఆశ్చర్య పడేలా చేస్తున్నాయి. అంతర్జాతీయ స్టాండర్డ్లో ‘యానిమల్’ మూవీ ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే, యానిమల్ టీజర్ పై సోషల్ మీడియాలో పలు మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అవి ఏమిటో మీరు చూసేయండి..
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
watch video :