వరకట్నం కోసం వేదింపులు ఎదుర్కొని ఇబ్బంది పడినవారు ఉన్నారు.వేదింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నవాళ్ళు కూడా ఈ ప్రపంచంలో చాలామందే ఉన్నారు.అయితే కట్టుకున్న భార్య అదనపు కట్నం తీసుకురాలేదని ఎలా ఐన భార్యను అంతమొందించాలనుకున్నాడు ఓ భర్త .అయితే పోలీస్ కేసు తనమీదకి రాకుండా పాముతో కరిపించి చంపేశాడు ఓ కసాయి భర్త.వివరాల్లోకి వెళ్తే..

కేరళలో కొల్లం జిల్లాలోని అంచల్ కు చెందిన సూరజ్,ఉత్ర భార్యాభర్తలు.అయితే వీరికి సంవత్సరం వయసున్న కుమారుడు కూడా ఉన్నాడు.చాలా కాలం నుండి వీరి కుటుంబం సంతోషంగానే ఉంది.కానీ ఈమధ్యకాలంలో ఉత్ర ను అదనపు కట్నం తీసుకురావాల్సిందిగా కోరాడు భర్త సూరజ్.అయితే ఉత్ర మరియు తన కుటుంబం దగ్గర నుండి సరైన రెస్పాన్స్ రాకపోవడంతో ఇంకా ఉత్ర కట్నం తీసుకురాలేదని గ్రహించాడు సూరజ్.కాబట్టి ఉత్ర అడ్డు తొలగించుకోవాలి అని నిర్ణయించుకున్నాడు.అందుకోసం పక్క ప్రణాళిక రచించాడు సూరజ్.

representative image
పాములు పట్టే వాడికి కొంత డబ్బు ఇచ్చి పామును ఉత్ర నిద్రపోతుండగా తన మీదకు వదిలాడు.అయితే పాము కాటు వేసిన తర్వాత ఆ విషయం గ్రహించిన ఉత్ర పక్కింటి వారి సహకారంతో ఆసుపత్రి కి వెళ్లి ప్రాణాలు కాపాడుకుంది.అయితే ఉత్ర తర్వాత తన పుట్టింటికి వెళ్ళిపోయింది.మళ్ళీ కొంత కాలం తర్వాత సూరజ్ దగ్గరకి వచ్చింది.అయితే మళ్ళీ పాముతో కురిపించాడు సూరజ్.అయితే ఈసారి ఉత్ర ఆసుపత్రి కి వెళ్లేలోపే చనిపోయింది.రెండుసార్లు ఇదేవిధంగా జరగడంతో ఉత్ర ఇంట్లో వాళ్ళు పోలీసులను ఆశ్రయించారు.పోలీస్ లు అరా తియ్యగా తన సోదరుడు ఆస్థి కోసమే ఇలా చేసి ఉంటాడడని మొదట్లో దబాయించిన సూరజ్ తర్వాత పోలీసులు తమ స్టైల్ లో అడిగేటప్పటికీ నిజాన్ని ఒప్పుకున్నాడు సూరజ్.అదనపు కట్నం కోసమే ఇలా చేసానని పోలిసుల దర్యాప్ట్టులో వెల్లడించాడు సూరజ్.





















బీహార్లోని దర్భాంగ్ కి చెందిన మోహన్ పాశ్వాన్ పొట్టకూటి కోసం ఢిల్లిలోని గురుగ్రామ్ కి వచ్చాడు.. అక్కడే కిరాయికి ఆటోరిక్షా తీసుకుని నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు.లాక్ డౌన్ కారణంగా పనులు లేవు, కిరాయి కట్టలేదనే ఆటోరిక్షా కూడా లాక్కుపోయాడు ఓనర్.. ఏ పని చేయలేని పరిస్థితుల్లో ఇంటి అద్దె కట్టలేక అక్కడే ఉండి పస్తులుండే కంటే ఊరికి వెళ్లిపోవడం బెటర్ అనుకున్నాడు..చేతిలో ఉన్న 1000రూపాయల్లో 500తో ఒక పాత సైకిల్ కొన్నాడు..తండ్రిని వెనుక కూర్చొబెట్టుకుని జ్యోతి ప్రయాణం ప్రారంభించింది.



