మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి నవంబర్ ఒకటో తారీఖున ఇటలీలో జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మెగా ఫ్యామిలీ అంతా ఇటలీకి పైనమయ్యారు. మూడు రోజులు పాటు జరిగే ఈవెంట్ లో అందరూ సరదాగా గడపనున్నారు. హల్దీ ఫంక్షన్, వెడ్డింగ్ సెర్మని, మెహందీ ఫంక్షన్ అంటూ ఈవెంట్లను చేయనున్నారు.
ఇప్పటికే ఇటలీలో పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న లావణ్య-వరుణ్ ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. అయితే వీరిద్దరి పెళ్లి కారణంగా మూడు సినిమాలు ఆగిపోయాయి అన్న వార్త వినిపిస్తుంది. అసలు ఏంటా సినిమాలు? ఎందుకు ఆగాయి?

వరుణ్ తేజ్ పెళ్లి కారణంగా రామ్ చరణ్ ఇటలీ వెళ్ళాడు. వారం రోజులపాటు అక్కడే ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తాడు. అయితే నెక్స్ట్ మూవీ గేమ్ చేంజర్ షూటింగ్ కూడా ఇదే టైంలో జరగాల్సి ఉంది కానీ చరణ్ లేకపోవడంతో షూటింగ్ క్యాన్సిల్ అయింది. శంకర్ కూడా ఇండియన్ 2 షూటింగ్ కి కొంత గ్యాప్ ఇచ్చి గేమ్ చేంజర్ షుటింగ్ కోసం హైదరాబాద్ రావాలని అనుకున్నాడు. రామ్ చరణ్ లేని కారణంగా గేమ్ చేంజెర్ మరో నెల రోజులు లేట్ అవుతుంది.

ఇక అల్లు అర్జున్ కూడా పుష్ప2 సినిమాకి బ్రేక్ ఇచ్చి వరుణ్ తేజ్ పెళ్లి కోసం ఇటలీ వెళ్ళాడు. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా అల్లు అర్జున్ లేని కారణంగా వాయిదా పడింది.ఇక పవన్ కళ్యాణ్ కూడా తన కుటుంబంతో ఇటలీలోనే ఉండగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజి సినిమా కూడా బ్రేక్ పడినట్లు సమాచారం.మళ్లీ వీరందరూ పెళ్లి తర్వాత హైదరాబాద్ తిరిగి వచ్చాకే షూటింగు ప్రారంభం కానున్నాయి.
Also Read: OG సినిమాలో ఇంకో హీరోనా… ఎవరతను?



ఇప్పుడు 2024 ఎన్నికలు సమీపించడంతో పవన్ కళ్యాణ్ జనసేన విజయకేతనం బలంగా ఉండే విధంగా అసెంబ్లీలో ఉండి పని చేయాలనే ఆత్రుతతో కసిగా కనిపిస్తున్నారు. తాజాగా టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో తెలుగుదేశంతో పొత్తు ప్రకటించి అధికార వైసీపీకి పెద్ద షాక్ నే ఇచ్చారు.ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చుట్టూరా తిరుగుతున్నాయి.
తాజాగా ఆయన జనసేన నాయకులతో మంగళగిరిలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ… తెలుగుదేశంతో మనం కలిసి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది, కేవలం జనాధారనతోనే ఇంతవరకు జనసేన నడిచిందని అన్నారు. ఆరున్నర లక్షల మంది క్రియాశీలక సభ్యులు ఉన్నారని, ప్రజల భవిష్యత్తును బంగారమయం చేసే విధంగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు.
వచ్చే ఎన్నికల్లో వైసిపి పోవాలి, జనసేన-టిడిపి ప్రభుత్వం ఏర్పడే విధంగా ముందుకు వెళ్దాం అన్నారు. “సీఎం స్థానం వద్దని నేను ఎప్పుడూ చెప్పలేదు.కానీ దానికోసం వెంపర్లాడను, నాకు సీఎంగా అవకాశం వస్తే తప్పకుండా తీసుకుంటాం. ప్రజల కోసం ఆదర్శ పాలన అందిద్దామని” పవన్ అన్నారు. పవన్ కళ్యాణ్ ఈ ప్రకటనతో జనసేన నాయకుల్లోనూ, జనసైనికుల్లోనూ ఫుల్ జోష్ వచ్చింది.









మెగా ఫ్యామిలీ హీరోలు పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ ఇద్దరు కలిసి నటించిన ‘బ్రో’ మూవీ కోసం అటు మెగాఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూశారు. తమిళంలో విజయం సాధించిన ‘వినోదయ సీతమ్’ మూవీకి రీమేక్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ మూవీని నిర్మించింది. థమన్ ఈ మూవీకి సంగీతాన్ని అందించాడు.
జులై 28న రిలీజ్ అయిన ఈ చిత్రానికి తొలి రోజు రూ. 30.05 కోట్ల భారీ కలెక్షన్స్ సంపాదించింది. కానీ రెండవ రోజు కొంచెం కలెక్షన్స్ వసూళ్లు తగ్గినట్టుగా తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రెండవ రోజు రూ.27 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. రిలీజ్ అయిన రెండు రోజుల్లోనే ఈ సినిమా రూ. 50 కోట్ల క్లబ్లో జాయిన్ అయ్యింది. ఇక ఆదివారం కలెక్షన్స్ పెరుగుతాయని అంతా అనుకున్నారు.
అయితే తెలుగు స్టేట్స్ లో రూ. 11 – 11.50 కోట్ల షేర్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 13 – 14 కోట్ల షేర్ రాబట్టిందని తెలుస్తోంది. మూడు రోజుల్లో బ్రో మూవీ రూ. 56 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీ విజయం సాధించాలంటే ఇంకా రూ. 42 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించాలని తెలుస్తోంది.
ఈమధ్యకాలంలో పవన్ కళ్యాణ్ ‘బద్రి’ సినిమా సమయంలో ఇచ్చిన ఒక ఇంటర్వూ సోషల్ మీడియాలో షికారు చేసింది. తాజాగా 1998లో పవర్ స్టార్ ఇంటర్యూకి న్యూస్ సామాజిక మాధ్యమాల్లో తిరుగుతోంది. అయితే పవన్ ఈ ఇంటర్యూలో పర్సనల్ మరియు వృత్తిపరమైన విషయాల గురించి కూడా చెప్పాడు. అందులో మీ మొదటి స్నేహితురాలు ఎవరని అడిగితే ఆరోజుల్లో నాతో మాట్లాడటానికి ఏ అమ్మాయి కూడా ఆసక్తి చూపించేవారు కాదని, నాలో స్పెషల్ ఏం లేదని ఆయన తెలిపాడు. ఇంకా చెప్తూ చిన్నప్పుడు ఒక ఫ్రెండ్ అయస్కాంత ముక్కలు తెలీకుండా తీసుకున్న విషయం చెప్పాడు.
కానీ అప్పుడు చేసినదానికి ఇప్పటికీ కూడా ఆ రోజు అలా చేయకుండా ఉండాల్సింది అని బాధ పడుతూనే ఉన్నానని చెప్పుకొచ్చాడు. దేవదాసు సినిమాలోని అంతా భ్రాంతియేనా సాంగ్ , దాని సాహిత్యం, ట్యూన్ అంటే చాలా ఇష్టమనీ, ఆ ఇంటర్వూలో ఇంట్రెస్టింగ్ విషయాలను పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆ ఇంటర్వూ వచ్చిన న్యూస్ పేపర్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను 2023 సమ్మర్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.


