టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణ ఫ్యామిలీ నుండి వచ్చిన రోహిత్ శర్మ భారత జట్టుకు సారధి అయ్యే స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం కోట్ల రూపాయలు సంపాదిస్తూ, లగ్జరీ జీవితాన్ని గడుపుతున్నారు.
అయితే రోహిత్ శర్మ వ్యక్తిగత విషయాల గురించి అంతగా బయటికి చెప్పారు. రోహిత్ కి సొంత తమ్ముడు ఉన్నారు. అయితే ఈ విషయం ఎక్కువ మందికి తెలియదు. హిట్మ్యాన్ తమ్ముడు ఏం చేస్తున్నాడు? అతను ఎలాంటి జీవితం గడుపుతున్నాడో ఇప్పుడు చూద్దాం..
రోహిత్ శర్మ మహారాష్ట్రలో నాగ్పూర్లోని బన్సోడ్లో 1987 ఏప్రిల్ 30న జన్మించారు. తండ్రి గురునాథ్ శర్మ, తల్లి పూర్ణిమ శర్మ. తల్లి విశాఖపట్నంకు చెందిన వారు. రోహిత్ తరువాత మరో కొడుకు జన్మించాడు. అతని పేరు విశాల్ శర్మ. తండ్రి రవాణా సంస్థ స్టోర్హౌస్లో కేర్టేకర్గా చేసేవారు. అయితే శర్మ తండ్రికి ఆదాయం తక్కువకావడంతో శర్మ బోరివలిలో ఉన్న తాత, మేనమామల దగ్గర పెరిగారు. వారాంతాలలో మాత్రమే డోంబివిలిలోని ఒకే గది ఉన్న ఇంట్లో నివసించే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళేవాడు.
ఆ సమయంలోనే విశాల్తో ఆడుకునేవాడు. అన్నదమ్ములిద్దరు క్రికెట్ ఆడేవారు. ఈ క్రమంలో రోహిత్ టాలెంట్ చూసిన అతని అంకుల్ రోహిత్ పేరును క్రికెట్ క్యాంపులో రిజిస్టర్ చేయించాడు. అలా 14ఏళ్ళకే క్రికెట్లో అడుగుపెట్టిన రోహిత్ శర్మ తన ప్రతిభతో అంచెలంచెలుగా ఎదుగుతూ ‘హిట్మ్యాన్’ పేరు తెచ్చుకున్నాడు. మొదట్లో టీమిండియా కీలక ఆటగాడిగా ఉన్న రోహిత్ ప్రస్తుతం కెప్టెన్గా కొనసాగుతున్నాడు.
ముంబైలో భార్యా, కుమార్తెతో లగ్జరీ ప్రాంతంలో నివసిస్తున్న రోహిత్, తల్లిదండ్రులు మరియు సోదరుడి కోసం వారింటి కొంచెం దూరంలో మరోక గృహాన్ని కొనుగోలు చేశాడు.ఇంటికి పెద్ద కుమారుడిగా ఫ్యామిలీ బాధ్యతలను చూసుకుంటున్నాడు. తమ్ముడు విశాల్కు అండగా నిలిచాడు. ఎక్కడో జాబ్ వెతుక్కోవాల్సిన పని లేకుండా తాను ప్రారంభించిన క్రికెట్ అకాడమీలను చూసుకునే బాధ్యతను విశాల్కు అప్పగించాడు. ప్రస్తుతం విశాల్ శర్మ భారత్, సింగపూర్లలోని రోహిత్ క్రికెట్ అకాడమీలకు ఆపరేషన్స్ హెడ్గా పనిచేస్తున్నాడు.
Also Read: విరాట్ కోహ్లీ ఫ్యామిలీ గురించి మీకు తెలుసా.? ఆయన అన్నా వదినను ఎప్పుడైనా చూసారా…?

1. ఉప్పెన:
2. వాల్తేరు వీరయ్య:
3. దేవర:
4. తండేల్:
5. ఓజీ: 
2000 సంవత్సరంలో మమ్ముట్టి హీరోగా నటించిన మలయాళ మూవీ ‘అరయన్నంగళ్ వీడు’ తో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ సినిమాలో ఆమె నటనకు గాను ఉత్తమ సహాయ నటిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును అందుకున్నారు. ఆ తరువాత పరదేశి సినిమాకు గాను ఉత్తమ సహాయ నటి అవార్డ్ అందుకున్నారు. మలయాళంలో సాధించిన విజయంతో ఆమెకు కన్నడ సినిమాలలో ఆఫర్స్ వచ్చాయి.
ఇప్పటివరకు లక్ష్మి దాదాపు 40 మలయాళ చిత్రాల్లో నటించింది. మమ్ముట్టి, మోహన్లాల్, సురేశ్ గోపి, జయరామ్ వంటి సూపర్ స్టార్లందరితో నటించి స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. సైరా నరసింహ రెడ్డి మూవీలో కూడా నటించారు. ఆ తరువాత ఆమె టెలివిజన్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి, మలయాళ, తమిళ భాషలలో పలు సీరియల్స్ లో కూడా నటించారు. తెలుగులో 2014 లో ఇటీవీలో ప్రసారం అయిన శ్రీవేంకటేశ్వర కల్యాణం సీరియల్ లో శ్రీదేవిగా నటించారు. ఆమెకు నటనతో పాటు క్లాసికల్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఇప్పటికే వేలాది ప్రదర్శనలు ఇచ్చారు.

మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న మూవీ గుంటూరు కారం. ఈ మూవీ జనవరి 12 న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ కు అటు అభిమానుల నుండి ఇటు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. నెట్టింట్లో వైరల్ గా మారింది. అయితే ట్రైలర్ చూసిన చాలామంది మరో సినిమాతో పోలుస్తున్నారు. కొందరు కీర్తికిరీటాలు అనే నవలతో పోలుస్తున్నారు.
ట్రైలర్ లో చూపించిన దాని ప్రకారంగా, వసుంధర (రమ్యకృష్ణ), ఆమె పెద్ద కుమారుడు రమణ (మహేశ్బాబు)ను చిన్నతనంలోనే విడిచిపెడుతుంది. వారిద్దరి మధ్య సంబంధాలు తెగిపోవడంతో రమణ అనాథగా పెరుగుతాడు. కొన్నేళ్ల అనంతరం ఊహించని పరిస్థితులలో తల్లి కొడుకులు కలుస్తారు. ఆమెకు ఎదురైన ప్రాబ్లమ్స్ ని రమణ తీరుస్తాడా? ఇద్దరికీ నిజం తెలిసిందా? అనేది కథ. దాదాపు ఇలాంటి కాన్సెప్ట్తోనే 2005లో మలయాళ మూవీ రిలీజ్ అయ్యింది. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి హీరోగా వచ్చిన మూవీ పేరు ‘రాజమాణిక్యం’. హీరో రాజమాణిక్యాన్ని తండ్రి చనిపోవడంతో చిన్నతనంలోనే, తల్లి ముత్తులక్ష్మి విడిచిపెడుతుంది.
బిజినెస్ మెన్ రాజారత్నం పిళ్లైని వివాహం చేసుకుంటుంది. అయితే తల్లిని వెతుకుతూ రాజమాణిక్యం రాజారత్నం ఇంటికి వెళ్తాడు. కానీ ముత్తు లక్ష్మి అతన్ని కొడుకుగా ఒప్పుకోదు. రాజారత్నంకు ఈ నిజం తెలియడంతో రాజమాణిక్యంను ఆదరస్తాడు. కమర్షియల్ మూవీగా తెరకెక్కిన ఈ మూవీ ఆ సమయంలో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ సాధించింది. 2008 దాకా మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. గుంటూరు కారం ట్రైలర్ లో దాదాపు మమ్ముట్టి మూవీ షేడ్స్ కనిపిస్తున్నాయి. ఆ స్టోరీనేనా? కాదా అనేది తెలియాలి అంటే జనవరి 12 దాకా వేచి చూడాల్సిందే.
అయోధ్యలో శ్రీ రాముడి ప్రాణప్రతిష్టకు శుభముహూర్తం ఆసన్నమైంది. రామ భక్తులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న తరుణం కొన్ని రోజుల్లోరాబోతుంది. అయోధ్య రామ మందిరంను దర్శించుకోవడానికి భక్తులు ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. రామయ్యకు చాలా మంది భక్తులు భారీగా కానుకలను సమర్పించుకుంటున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రామయ్యకు బంగారు పాదుకలు సమర్పించడానికి చల్లా శ్రీనివాస శాస్త్రి పాదయాత్ర మొదలు పెట్టారు.
శ్రీనివాస శాస్త్రి హైదరాబాద్కు చెందినవారు. అయోధ్య భాగ్యనగర సీతారామ ఫౌండర్ కూడా. రాముడు అయోధ్య నుండి లంకకు నడుచుకుంటూ వెళ్లిన మార్గంలో శ్రీనివాస శాస్త్రి నడుస్తున్నారు. రామేశ్వరంలో మొదలైన ఈ పాదయాత్ర, అరణ్య వాసంలో రాముడు తిరిగిన ప్రాంతాల గుండా వెళ్తున్నారు. దారిలో కంచి, శృంగేరీ, పూరీ, ద్వారకా పీఠాధీశుల ఆశీస్సులు తీసుకుని అయోధ్య వైపుగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.
64 ఏళ్ళ వయసు ఉన్న శ్రీనివాస శాస్త్రి తలపై బంగారు పాదుకలు పెట్టుకుని అయోధ్యకు ఎనిమిది వేల కిలోమీటర్ల నడుస్తూ, భక్తిని చాటుకుంటున్నారు. రామ మందిర నిర్మాణం కోసం ఇప్పటికే ఐదు లక్షల ఇటుకలను దానం చేశారు. శ్రీనివాస్ శాస్త్రి మాట్లాడుతూ. తన తండ్రి రామ భక్తుడని, అయోధ్యలో రామ మందిర నిర్మాణం చూడాలనేది తన కల అని ఎప్పుడు చెప్పేవారు. తండ్రి కలను నెరవేర్చడం కోసం బంగారు పాదుకలతో పాదయాత్ర చేస్తూ, అయోధ్యకు వెళుతున్నానని చెప్పుకొచ్చారు.

నటుడు, బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ శివాజీ, వాసుకీ ఆనంద్ సాయి లీడ్ రోల్స్ లో నటించిన ’90స్’ వెబ్ సిరీస్ జనవరి 4న ఈటీవీ విన్ లో రిలీజ్ అయ్యింది. మధ్యతరగతి జీవితాల పై తెరకెక్కిన ఈ సిరీస్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇందులో నటించిన వారంతా తమ పాత్రలలో చక్కగా నటించారు. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే శివాజీ చిన్న కొడుకు ఆదిత్యగా నటించిన బాల నటుడికి మరింత గుర్తింపు లభించింది.
ఆ అబ్బాయి పేరు రోహన్ రాయ్. రోహన్ సీరియల్స్, సినిమాలలో నటిస్తున్నాడు. కళ్యాణ వైభోగమే సీరియల్ ద్వారా బిల్లితెర పై ఎంట్రీ ఇచ్చాడు. ఈ సీరియల్ కోసం ఆడిషన్స్ కి తల్లితో పాటుగా వెళ్ళగా ‘చారు కేశ’ అనే పాత్రకు ఎంపిక అయ్యాడు. ఈ పాత్రలో నటించి గుర్తింపు పొందాడు. ఆ తర్వాత టాలీవుడ్ కూడా అడుగుపెట్టాడు. అలా రామ్ చరణ్, బోయపాటి కాంబోలో తెరకెక్కిన ‘వినయ విధేయ రామ’మూవీలో కనిపించాడు.
రోహన్ రాయ్ సినిమాలు, సీరియళ్లలో నటిస్తూ బిజీగా మారాడు. ఇక ’90స్’ వెబ్ సిరీస్ తో డిజిటల్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఈ సిరీస్ లో చదువు ఎక్కని ఆదిత్య క్యారెక్టర్ లో అద్భుతంగా నటించాడు. అమాయకత్వంతో కనిపిస్తూ, కామెడీతో నవ్విస్తూ, కొన్ని సీన్స్ లో కంటతడి పెట్టించాడు. రోహన్ పై ఆడియెన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.


ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో రూపొందుతోన్న దేవర మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, విలన్ గా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. ఆచార్య మూవీతో డిజాస్టర్ అందుకున్న కొరటాల ఈ మూవీతో హిట్ కొట్టాలనుకుంటున్నాడు. తాజాగా రిలీజ్ అయిన దేవర గ్లింప్స్ ఆకట్టుకుంటోంది.
కొరటాల నుండి ఇప్పుటి వరకు వచ్చిన సినిమాలు అన్నీ సోషల్ మెసేజ్ టైప్ లో ఉంటాయి. కానీ దేవర మాత్రమే మొత్తం మాస్ ఉంది. స్టోరీ చెప్పకుండా దేవర ప్రపంచాన్ని మాత్రమే పరిచయం చేశారు. ఓడలతో పాటు రక్తంతో నిండిన సముద్రం, నెవ్వర్ బిఫోర్ అనే విధంగా మాస్ పాత్రలో ఎన్టీఆర్ ఊచకోత కోసాడు. ఓ షాట్ లో ఆఫ్ మూన్ ఉండగా, నెక్స్ట్ షాట్ లో ఇంకో హాఫ్ మూన్ బ్లడ్ తో కలిసి ఫుల్ మూన్ గా కనిపిస్తుంది. ఈ షాట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.
తాజాగా రిలీజ్ చేసిన గ్లింప్స్తో ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషిగా ఉన్నారు. ఆర్ఆర్ఆర్ మూవీతో ఎన్టీఆర్ యాక్టింగ్ రేంజ్ ఏంటో పాన్ ఇండియా లెవెల్ లో అందరికి తెలిసింది. ఇప్పుడు దేవరతో ఎన్టీఆర్ రేంజ్ ఇంకా ఎక్కువ పెరుగుతుందని అంటున్నారు. ఇప్పటి వరకు యంగ్ టైగర్ ట్యాగ్ తో ఉన్న ఎన్టీఆర్, ఈ మూవీతో “మేన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్” ట్యాగ్ తో ప్రేక్షకుల ముందుకి రానున్నారు.