గుప్పెడంత మనసు సీరియల్ బుల్లితెర ఆడియెన్స్ ను ఎంతగానో అలరిస్తున్న సీరియల్. జగతి మేడమ్, రిషి, వసుధార, మహేంద్ర వంటి పాత్రలతో, వారి మధ్య ఉండే ఎమోషనల్ సీన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న ఈ సీరియల్ లో కొద్ది రోజులుగా ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఇస్తున్నారు.
జగతి మేడమ్ రిషి, వసుధారాలకు పెళ్లి జరిపించి, కన్నుమూసిన విషయం తెలిసిందే. ఇప్పుడు జగతి మేడమ్ స్థానంలోకి ఎవరు వస్తారు ? గుప్పెడంత మనసు సీరియల్ లో కొత్త ట్విస్ట్ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
జగతి కన్నుమూయడంతో ఆమెనే తలుచుకుంటూ మహేంద్ర తాగి రోడ్డు పక్కన పడిపోతాడు. ఆ విషయం వేరేవాళ్ల ద్వారా తెలుసుకున్న రిషి, వసుధార మహేంద్ర గగగరికి వెళ్తారు. చెట్టుకింద ఉన్న మహేంద్రను అలా చూసి బాధపడుతూ, ఇంటికి తీసుకొని వస్తారు. అది చూసిన దేవయాని మహేంద్ర పై కోప్పడుతుంది. దాంతో ఫణీంద్ర భార్యపై ఫైర్ అవుతాడు.
తరువాతి రోజు ఫణీంద్ర, జగతి లేదనే బాధలో ఉండి, చేసే పనులు, బాధ్యతల్ని పట్టించుకోకపోతే తమనే నమ్మకున్న విద్యార్ధులు, ఉద్యోగుల జీవితాలు ఇబ్బందిలో పడతాయని రిషితో అంటాడు. ఇవన్నీ తొలగిపోవాలంటే ఎండీ సీట్లో నువ్వే కూర్చోవాలని రిషిని, దేవయాని, శైలేంద్రల ముందే రిక్వస్ట్ చేస్తాడు. దానికి చేయలేనని రిషి చెప్తాడు. వసు కలుగజేసుకుని, మీ పైన పడిన నింద గురించే కదా, కానీ దాని గురించి ఇకపై ఆలోచించాల్సిన అవసరం లేదు సార్. దాన్ని గురించి బాధ పడాల్సిన అవసరం లేదు అని అంటుంది.
రిషి ఏం చెప్తున్నావు వసుధారా అని అడుగుతాడు. వసుధార మాటలు అర్ధం కానీ శైలేంద్ర, దేవయానీలు షాకింగ్గా చూస్తారు. వసుధార మాట్లాడుతూ, తాను, ఫణీంద్ర సార్ కలిసి ఎస్ఐ గారిని మరియు మినిస్టర్ గారిని కలిసి, సమస్యను సాల్వ్ చేశామని చెప్తుంది. ఇక రిషిని ఎండీ సీట్లో చూడాలని ఫణీంద్ర, వసుధార బలంగా కోరుకుంటున్నారు కాబట్టి తరువాతి ఎపిసోడ్లో దేవయాని, శైలేంద్రల షాక్ ఇస్తూ రిషి ఎండీ సీట్ ని స్వీకరిస్తాడో చూడాలి.
Also Read: చనిపోతూ షాక్ ఇచ్చిన గుప్పెడంత మనసు “జగతి మేడమ్”..! ఈ ట్విస్ట్ ఏంటి..?

ఈ కేసులో ముఖ్యంగా సెక్షన్ 17A చుట్టూ వాదనలు జరిగాయి. చంద్రబాబు తరుపున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ హరీశ్ సాల్వే 17A సెక్షన్కు చెందిన వివిధ అంశాలు, గతంలో కొన్ని కేసుల్లో ఇచ్చిన తీర్పుల గురించి ధర్మాసనం ముందు ఉంచారు. వాటిలో రఫేల్ కొనుగోళ్ల విషయంలో యశ్వంత్ సిన్హా వేసిన పిటిషన్, అలాగే రఫేల్ కేసులో ఇచ్చిన తీర్పును కూడా కోర్టు ముందు ఉంచారు. రఫేల్ కొనుగోళ్ల పై 2019లో యశ్వంత్ సిన్హా వేసిన రివ్యూ పిటిషన్లను జస్టిస్ కేఎం జోసెఫ్ డిస్మిస్ చేసిన విషయాన్ని కోర్టుకు గుర్తుచేశారు.
బుల్లర్ కేసుతో పాటు పలు కేసులలో తీర్పులను వివరించిన సాల్వే, స్కిల్ కేసులో చంద్రబాబు నాయుడు పై రిజిస్టర్ అయిన ఎఫ్ఐఆర్ చట్టబద్ధం కాదని అన్నారు. ఈ కేసులో బుల్లర్ కేసులో ఇచ్చిన తీర్పును పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నానని ధర్మాసనాన్ని సాల్వే కోరారు. చంద్రబాబు పై రిజిస్టర్ అయిన ఎఫ్ఐఆర్ ను తాను సవాల్ చేస్తున్నట్టుగా వెల్లడించారు. దానిలో ఎక్కడా చంద్రబాబు నాయుడు పేరు లేదని సాల్వే వాదించారు. ఆ తరువాత ఏపీ సీఐడీ తరఫున లాయర్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.
రోహత్గీ వాదిస్తూ, 2018కి ముందు కొంతవరకు విచారణ జరిగి ఆగిపోయిందని, అంతేకాని విచారణ జరగలేదని కాదని వాదించారు. హైకోర్టులో విచారణ పూర్తి అయ్యాక పత్రాలు ఇచ్చామని, దానిని లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదన్నారు. 2018 చట్ట సవరణ చేసిన అనంతరం చంద్రబాబును ఎఫ్ఐఆర్లో చేర్చితే, దానిని రాజకీయ ప్రతీకార చర్యగా వ్యవహరించకూడదని అన్నారు.
చంద్రబాబు మీద తగిన ఆధారాలు లభించిన అనంతరం 2021లో కేసు రిజిస్టర్ చేశారని, ఈ కేసులో ఆయనను ఎప్పుడు చేర్చినా కూడా విచారణ కొనసాగుతున్నట్లుగా పరిగణించాలని కోర్టులో వాదించారు. ఇక నేరం ఎప్పుడు జరిగిందో, అప్పుడు ఉన్న చట్టం ప్రకారంగానే విచారణ చేయాలని సుప్రీం కోర్టు ముందుకు తీసుకెళ్లారు. తదుపరి విచారణను సుప్రీం కోర్టు శుక్రవారంకు వాయిదా వేసింది.
ఏం చేయవచ్చు..
ఏం చేయకూడదు..
విజయ్ దళపతి, లోకేశ్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కిన లియో సినిమా అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా త్రిష నటిస్తోంది. ప్రియా ఆనంద్, అర్జున్ సర్జా, సంజయ్ దత్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ తో దూసుకెళ్తోంది.
ఇక ట్రైలర్ చూసిన తరువాత ఈ మూవీ హాలివుడ్ మూవీ రీమేక్ అని కొందరు, లేదు తెలుగు మూవీకి రీమేక్ అని మరికొందరు నెట్టింట్లో కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసిందని మేకర్స్ ప్రకటించారు.
సెన్సార్ బోర్డు సభ్యులు ఈ మూవీకి 13 కట్స్ చెప్పినట్టుగా సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్ తో స్పష్టత వచ్చింది. అందులో ఒకొక్క కట్ లో కొన్ని పదాలను మరియు కొన్ని సీన్లను కూడా ప్రస్తావించారు. సెన్సార్ మెంబర్స్ సూచనల మేరకు మొత్తం 47 సెకన్ల నిడివిని తగ్గించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది.
స్రవంతి చొక్కారపు యూట్యూబ్ ఛానల్ యాంకర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టింది. జెమినిలో కొన్ని రోజులు యాంకర్ గా చేసి పాపులర్ అయ్యింది. ‘పుష్ప’ మూవీ విడుదల సమయంలో పుష్ప యూనిట్ ఇంటర్వ్యూ చేసి స్రవంతి క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తరువాత మల్లెమాల సంస్థ షోస్ లో స్రవంతి సందడి చేసింది. దీనివల్ల ఆమెకు ‘బిగ్ బాస్’ లో పాల్గొనే ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తోంది. బిగ్ బాస్ ఓటీటీ సీజన్లో స్రవంతి చొక్కారపు ఎంట్రీ ఇచ్చింది.
బిగ్ బాస్ షోతో ఆమె క్రేజ్ పెరిగిపోయింది. అఖిల్, అజయ్ లతో ఉంటూ వార్తల్లో నిలిచేది. స్రవంతి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తరచూ ఆమెకు సంబంధించిన గ్లామర్ ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ ఖలో షేర్ చేస్తూ, నెటిజన్లను ఆకట్టుకుంటుంది. రీసెంట్ గా స్రవంతి చొక్కారపు సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోలను పంచుకుంది. వీటిని చూసిన నెటిజెన్లు తమదైన రీతిలో కామెంట్లు చేస్తున్నారు.
ఒక నెటిజెన్ మాత్రం “నీ వయసుకి మరియు నువ్వు వేసే వేషాలకి ఏమైనా సంబంధం ఉందా?” అంటూ కామెంట్ చేశాడు. ఈ కామెంట్ పెట్టిన వ్యక్తికి స్రవంతి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఆ తరువాత ఆ వ్యక్తి తన కామెంట్లను డిలీట్ చేశాడు. దానికి కూడా స్రవంతి “ఏంట్రా నాన్న భయమేసిందా కామెంట్స్ అన్ని డిలీట్ చేసేశావు” అంటూ కామెంట్ చేసింది.
హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీలో రామ్ కార్తిక్, సీనియర్ నరేష్, పవిత్రా లోకేష్, సాయికుమార్ బబ్లూ వంటివారు కీలక పాత్రలలో నటించారు. ఈ చిత్రానికి విప్లవ్ కోనేటి దర్శకత్వం వహించారు. ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే, అనాధ అయిన హేమంత్ (రామ్ కార్తీక్) తన స్నేహితుడితో కలిసి ఒక కాఫీ షాప్ ని నడిపిస్తుంటాడు. ఆ షాప్ కి చైత్ర (హెబ్బా పటేల్) తరచు కూకీస్ తీసుకువస్తుంది. ఈ క్రమంలో హేమంత్ చైత్రను ప్రేమిస్తాడు. ఆ విషయాన్ని చైత్రకు చెప్తాడు.
అయితే ఆమె హేమంత్ లవ్ ని రిజెక్ట్ చేస్తుంది. దాంతో హేమంత్ ఆమె జ్ఞాపకాలను మర్చిపోవడానికి ఆ ఊరు వదిలి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. ఆ సమయంలో హేమంత్ ను తనుకూడా ప్రేమిస్తున్నట్టుగా చైత్ర చెప్తుంది. కానీ తాను అతన్ని పెళ్లి చేసుకోలేనని, ఎందుకంటే త్వరలో తాను, తన కుటుంబం అంతా ఒకేసారి ఆ-త్మ-హ-త్య చేసుకోబోతున్నామని చెప్తుంది. విషయం విని హేమంత్ షాక్ అవుతాడు. చైత్ర మరియు ఆమె కుటుంబం మొత్తం ఎందుకు సూ-సై-డ్ చేసుకోవాలని అనుకున్నారు? చైత్ర చెప్పింది విన్న హేమంత్ ఏం చేసాడు? చివరికి ఏం జరిగింది? అనేది మిగిలిన స్టోరీ.
దర్శకుడు ఎంచుకున్న స్టోరీ లైన్ ను తెరపై చూపించడంలో చాలావరకు సక్సెస్ అయ్యారు. హెబ్బా పటేల్ చైత్ర పాత్రకు న్యాయం చేసింది. హీరోగా నటించిన రామ్ కార్తిక్ తన పరిధి మేరకు నటించాడు. సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడేవారు ఈ మూవీని చూడవచ్చు.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన మాజీ సీఎం చంద్రబాబు నాయుడు 30 రోజులుగా జైల్లో ఉన్నారు. ఈ కేసులో సెప్టెంబరు 10న అరెస్ట్ అయిన చంద్రబాబు, రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అక్టోబరు 5న మూడవసారి ఆయనకు ఏసీబీ కోర్టు రిమాండ్ ను పొడిగించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు దాఖలు చేసిన 3 ముందస్తు బెయిల్ పిటిషన్లు ఏసీబీ కోర్టు కొట్టివేసింది.
ఫైబర్నెట్, అమరావతి రింగ్ రోడ్డు, అంగళ్లు కేసుల్లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు A-24గా, అమరావతి రింగ్ రోడ్డు కేసులో A-1 గా, అంగళ్లు అల్లర్ల కేసులో చంద్రబాబు A1గా ఉన్నారు. అయితే సీఐడీ అధికారులు చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని కోరుతూ వేసిన పిటిషన్ను కూడా ఏసీబీ కోర్టు తిరస్కరించింది.
మరో వైపు స్కిల్ డెవలప్మెంట్ కేసులో సీఐడీ తన పై రిజిస్టర్ చేసిన కేసును కొట్టివేయాలని చంద్రబాబు తరపున దాఖలు అయిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ బోస్, జస్టిస్ త్రివేదీ బెంచ్ ముందు సీఐడీ తరపున లాయర్ రోహత్గీ, మాజీ సీఎం చంద్రబాబు తరపున సిద్ధార్థ్ లూథ్రా, హరీష్ సాల్వే, మనుషేక్ సింగ్ సింఘ్వీ వాదించారు. 17ఏ చుట్టూనే వాదనలు జరుగుతున్నాయి. రాజకీయల వల్ల కక్ష సాధింపుకు పాల్పడకుండానే సెక్షన్ 17ఏను తీసుకొచ్చారని లాయర్ హరీశ్ సాల్వే వాదిస్తున్నారు.
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఖుషి మూవీ. గతనేల రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ప్రమోషన్స్ లో భాగంగా రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్, ట్రైలర్లకు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇక విజయ్ దేవరకొండ, సమంత చేసిన డ్యాన్స్ కు ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షోతోనే సూపర్ హిట్ టాక్ అందుకుంది. ఈ మూవీకి భారీ ఓపెనింగ్ కలెక్షన్స్ కు వచ్చాయి.
ఇటీవలే ఓటీటీలో ఈ మూవీ రిలీజ్ అయ్యింది. ఒక ఓటీటీలో పలుమార్లు చూసిన నెటిజెన్లు ఆ మూవీలోనీ పొరపాట్లను గమనించి సోషల్ మీడియాలో షేర్ చేయడం, దానిని చూసిన నెటిజెన్లు కామెంట్లు పెట్టడం ఇటీవల కాలంలో సాధారణం అయ్యింది. వీటిలో కొన్ని వైరల్ గాను మారుతున్నాయి.
ప్రస్తుతం ఖుషీలో కూడా ఇలాంటి మిస్టేక్ ను గమనించిన ఒక యూజర్, దానికి సంబంధించిన వీడియో క్లిప్ ను షేర్ చేశారు. అందులో విజయ్ దేవరకొండ బైక్ నడుపుతుండగా సమంత వెనకాల కుర్చుని ఉన్నారు. విజయ్ దేవరకొండ తమను వెంబడిస్తున్న బైక్ ఎడమ వైపు పట్టుకుని పైకి లేపాడు. ఆ వీడియోను ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసి, బైక్ కి లెఫ్ట్ సైడ్ కూడా యాక్సిలరేటర్ ఉంటాయా అని క్యాప్షన్ ఇచ్చారు. దీనిపై నెటిజెన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ అరెస్ట్ విషయంలో చంద్రబాబు నాయుడుకు మద్దతు తెలుపకపోవడంతో సామాజిక మధ్యమాలలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ వర్సెస్ టీడిపి కార్యకర్తలు మధ్య వార్ జరుగుతోంది. ఈ క్రమంలోనే టీడిపి అభిమాని ఒకరు ఎన్టీఆర్ కు స్వయంగా కాల్ చేసి, ఎన్టీఆర్ చిత్రాల గురించి వార్నింగ్ ఇచ్చారనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అయితే ఎంతమంది ఎన్నిరకాలుగా విమర్శలు చేసినప్పటికీ, ఎన్టీఆర్ ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై స్పందించలేదు. ఇలా ఎన్టీఆర్ చంద్రబాబు విషయంలో స్పందించకపోవడం వెనుక చాలా కారణాలు ఉన్నాయని అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర మూవీ షూటింగ్ వర్క్ లో బిజీగా ఉన్నారు. ఈ మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ నటిస్తోంది. బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నారు.
భారతీయ జైళ్ళలో ఎలాంటి ఆహారం ఇస్తారనే విషయాన్ని కోరాలో అడగగా, ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ జైలులో ఎలాంటి ఆహారం పెడతారనే విషయం గురించి వివరించారు. అదే విధంగా ఒక వ్యక్తి తెలంగాణలో చంచల్ గూడ జైలులో ఎలాంటి ఆహారం పెడతారో గురించి ఈ విధంగా చెప్పుకొచ్చారు.
