కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమిళ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా తనకంటూ ప్రత్యక ఇమేజ్ సొంతం చేసుకున్న విజయ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. తమిళంలోనే కాకుండా విజయ్ కు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్నారు.
విజయ్ దళపతి ప్రస్తుతం సంచలన దర్శకుడు లోకేష్ కనకరాజన్ డైరెక్షన్ లో లియో అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఆ చిత్రం సెట్స్ పై ఉంది. ఇటీవల ‘తలపతి 68’ చిత్రాన్ని ప్రకటిస్తూ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలోసినిమాలో నటించే విలన్ గురించి క్లూ ఇచ్చారు. మరి విలన్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
విజయ్ దళపతి కొత్త సినిమాల కోసం కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తుంటారు. ఏడాది మొదట్లోనే వారసుడు మూవీతో దక్షిణాది ఆడియెన్స్ అలరించిన విజయ్, ప్రస్తుతం లియో సినిమాతో బిజీగా ఉన్నారు. విక్రమ్ దర్శకుడు లోకేష్ కనకరాజన్ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. హిట్ పెయిర్ గా పాపులర్ అయిన ఈ జంట 17 ఏళ్ల తర్వాత మరోసారి జత కడుతున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ లియో చిత్రం పై హైప్ ను పెంచింది.
విజయ్ ఒక వైపు లియో మూవీ షూటింగ్ లో పాల్గోంటూనే, మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘తలపతి 68’ అనే వర్కింగ్ టైటిల్ తో సినిమాని ప్రకటిస్తూ ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించనున్నాడు. ఈ వీడియోలో మూవీకి సంబంధించిన విషయాలను పజిల్స్ తో చూపించారు.
అందులో విలన్ ఎవరో క్లూ ఇచ్చారు. ఒక ట్విట్టర్ ఖాతాలో ఆ పజిల్ క్లిపింగ్ ను ఇచ్చి, విలన్ ఎవరో గెస్ చేయమని అంటే ఎక్కువగా ఎస్ జే ఎస్ అక్షరాలకు రౌండప్ చేసి ఎస్ జే సూర్య ఈమూవీలో విలన్ అని కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ మరియు ఎస్ జే సూర్య ఇంతకు ముందు కూడా నటించారు.
Also Read: హీరోయిన్ శ్రీలీల “చైల్డ్ ఆర్టిస్ట్” గా నటించారా..? ఏ సినిమాలో అంటే..?

తాజాగా రిలీజ్ అయిన రెండవ ట్రైలర్ ను చూస్తే సినిమా ఎలా ఉండబోతుందో తెలుస్తోంది. ఈ మూవీ రిలీజ్ తేదీ దగ్గరకి వస్తుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ వేగిరం చేసింది. అయితే హనుమాన్ సీతా దేవి జాడ కోసం వెళ్తున్నప్పుడు శ్రీరాముడు తన ఉంగరాన్ని ఆనవాలుగా ఇస్తాడు. లంకలో సీతాదేవిని కలిసిన హనుమంతుడు రాముడి ఉంగరాన్ని చూపించి రామదూతగా పరిచయం చేసుకుంటాడు.
సీతాదేవిని రాముడి దగ్గరికి తీసుకెళ్తానని చెప్పగా, సీతాదేవి వారించి శ్రీ రాముడు రావణున్ని జయించి తనని తీసుకెళ్లాలని చెప్తుంది. తన ఆనవాలుగా చూడామణి హనుమంతుడికి ఇస్తుంది. ఇదే రామాయణంలో కనిపిస్తుంది. కానీ ఆదిపురుష్ ట్రైలర్ లో సీతాదేవి ఆంజనేయుడికి చూడామణి కాకుండా గాజులు ఇవ్వడం కనిపిస్తుంది.
ఆంజనేయుడు ఆ గాజును శ్రీ రాముడి చేతిలో పెట్టడం కూడా ట్రైలర్లలో కనిపిస్తుంది. అయితే రాముడికి సీతమ్మ ఆనవాలుగా చేతిగాజు ఇచ్చినట్టుగా చూపించారు. ఏ ఆధారాలతో ఓంరౌత్ చూడామణి కాకుండా చేతిగాజును ఈ చిత్రంలో చూపించారో మరి. ఈ మూవీ రిలీజ్ అయితే ఇంకా ఎన్ని విషయాలను ఇలా చూపించారో తెలుస్తుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ చేసే సందడి మామూలుగా ఉండదు. మహేష్ నటిస్తున్న చిత్రం టైటిల్ ప్రకటనకు మందు నెల రోజుల నుండి ఎక్కడ చూసినా ఆమూవీ గురించే వినిపించింది. నాలుగైదు టైటిల్స్ కూడా ప్రచారంలోకి వచ్చాయి. ఫైనల్ గా వాటిలో నుండి ఒకటి గుంటూరు కారం పేరును మేకర్స్ ఫిక్స్ చేశారు. ఇక టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేసిన రోజు సూపర్ స్టార్ ఫ్యాన్స్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు.
గ్లింప్స్ లో మహేష్ ను మాస్ స్టైల్ లో చూసి అభిమానులు ఫుల్ ఖుషి అయ్యారు. ఈ గ్లింప్స్ 24 గంటల్లో 25 మిలియన్ల వ్యూస్ తో యూట్యూబ్ లో రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈ టైటిల్ ఎందుకు పెట్టారని చర్చ మొదలైంది. దానిని నెటిజన్లు డికోడ్ చేశారట. మహేష్బాబును షార్ట్గా GSSMB అని అంటుంటారు.
ఇక మహేష్ బాబు నటిస్తున్న సినిమాతో పాటు వరుస 5 చిత్రాలను తీసుకుంటే, G అంటే గుంటూరు కారం అని, S అంటే సర్కారు వారి పాట అని, S అంటే సరిలేరు నీకెవ్వరు అని, M అంటే మహర్షి అని, B అంటే భరత్ అనే నేను అని లాస్ట్ ఐదు చిత్రాల తొలి అక్షరాలు కలిపితే GSSMB అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దాంతో ఈ విషయం వైరల్ గా మారాయి.
మెగాస్టార్ చిరంజీవి ‘భోళాశంకర్’ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై చేయాలి. అయితే మూవీ ప్రారంభం అవుతుండగా కేఎస్ రామారావుకు సంబంధించిన క్రియేటివ్ కమర్షియల్స్ నిర్మాణ సంస్థ కూడా ఈమూవీలో భాగం అయ్యింది. దాంతో మూవీ పోస్టర్ల పై రెండు ప్రొడక్షన్ హౌస్ ల పేర్లు కనిపించాయి. కొన్నేళ్ళ నుండి పెద్ద చిత్రాల ప్రొడక్షన్ కి దూరంగా ఉన్న ఈ సంస్థ ఎందుకు వచ్చిందనే వార్తలు వచ్చాయి. దానికి సమాధానం రాలేదు.
తాజాగా వచ్చిన భోళా శంకర్ పోస్టర్లో సిసి సంస్థ పేరు కనిపించలేదు. దానిపై మళ్లీ కొంతమంది అడిగారు. ఈ సారి ఆ నిర్మాణ సంస్థ సన్నిహితుల నుండి సమాధానం వచ్చింది. వాస్తవానికి ఈ చిత్రాన్ని 2 ప్రొడక్షన్ హౌస్ ల ద్వారానే చేయాలని మొదట అనుకున్నారట. కానీ ఈ సంవత్సరం క్రియేటివ్ కమర్షియల్స్ సంస్థకు చాలా ప్రత్యేకం. బ్యానర్ పెట్టి 50 సంవత్సరాలు పూర్తి అయ్యింది. సినిమాల్లోకి వచ్చి 40 సంవత్సరాలు పూర్తి అయ్యింది. ఈ నేపథ్యంలో ముఖ్యమైన ఈ ఏడాది మరో బ్యానర్తో కలసి ఎందుకు సినిమా చేయడం.
డైరెక్ట్ గా మెగాస్టార్ చిరంజీవితో ఈ సంవత్సరం మూవీ చేసి 50వ ఏడాదిని ప్రత్యేకం చేసుకుందామని భావించారట. అందువల్లనే ఈ మూవీ పోస్టర్లో ఆ సంస్థ పేరు కనిపించలేదని అంటున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి, క్రియేటివ్ కమర్షియల్స్ కాబినేషన్ లో ఇప్పటివరకు 5 చిత్రాలు వచ్చాయి. చివరిగా 1991లో రిలీజ్ అయిన ‘స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్’ అనే మూవీని చేశారు. మళ్ళీ సినిమా చేస్తే 22 సంవత్సరాల తరువాత చేసినట్లు అవుతుంది.
ఆదిపురుష్ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఆడియెన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ తాజాగా ప్రకటన చేసింది. ఆదిపురుష్ థియేటర్లలో ఆ ఒక్క టిక్కెట్ అంటే సీట్ హనుమాన్ కోసం వదిలేస్తారట. ఎందుకంటే రామాయణ పారాయణం, శ్రీరాముడి కథను కానీ ప్రదర్శించినపుడు అక్కడికి హనుమాన్ వస్తాడని భక్తుల నమ్మకం. అందువల్ల ఆ ఒక్క సీటూ అంజనేయుడి కోసం ఉంచేస్తారట.
ఇక థియేటర్ ఫుల్ అయిన ఆ ఒక్క సీటు ఖాళీగా ఉంటే అందరి దృష్టి ఆ ఒక్క సీటు పైనే ఉంటుంది. ఇక ఈ క్రమంలో ఆ సీట్ లో అంజనేయుడి ప్రతిమ ఉంచినట్లయితే ఆడియెన్స్ అందరు భక్తి మూడ్ లోకి వెళ్తారు. అలా హనుమాన్ తో కలిసి సినిమా చూసే ఛాన్స్ అంటే మూవీకి పబ్లిసిటీ మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.
1995 జూన్ 16న రిలీజ్ అయిన ‘అమ్మెరు’ మూవీ సమయంలో కూడా ఇలాంటిది చేశారు. కానీ అది మూవీ యూనిట్ ప్లాన్ చేయలేదు. ప్రేక్షకులు, థియేటర్ యాజమాన్యాలు కలిసి చేశారు. ఆ మూవీ ప్రదర్శింపబడుతున్న సమయంలో హారతులు పట్టారు. అలాగే థియేటర్ల బయట చిన్న దేవాలయాన్ని కూడా పెట్టారు. పూజలు, ప్రసాదాలు, హుండీల లాంటివి ఏర్పాటు చేశారు. అమ్మెరు మూవీ అప్పటికే హిట్ అయినా వీటి వల్ల ఆ మూవీ వసూళ్లు మరింతగా పెరిగాయి.
రెండి సంవత్సరాలకు ఒకసారి ఐసీసీ నిర్వహించే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ జూన్ 7న (బుధవారం) నుండి మొదలవనుంది. ఈ మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ లోని ‘ఓవల్’ గ్రౌండ్ సిద్ధమైంది. రోహిత్ శర్మ సారథ్యంలో టీం ఇండియా జట్టు ఆస్ట్రేలియాతో తలపడనుంది. మరి ఈ ఓవల్లో ‘గద’ అందుకునే జట్టు ఏది అని అందరు చూస్తున్నారు. క్రికెట్ ప్రపంచంలో ప్రస్తుతం టీ20 దే హవా నడుస్తోంది. జెంటిల్మన్ గేమ్కు అసలు రూపం అంటే టెస్ట్. ఈ టెస్ట్ మ్యాచ్ లకు పాపులారిటీ తీసుకురావడం కోసం ఐసీసీ చేసిన ఆలోచనే డబ్ల్యూటీసీ. ఇది 2019-21లో మొదలైంది.
ఇప్పుడు జరుగబోయేది డబ్ల్యూటీసీలో రెండో సీజన్. గెలిచిన జట్టుకు అందచేసే గదను ఇంగ్లండ్ లోని థామస్ లైట్ తయారు చేసింది. క్రికెట్లో ముఖ్యమైన బంతిని కేంద్ర బిందువుగా చేసి, గదను తయారు చేసింది. దీనికి బంగారు పూత ఉన్న బంతిని అమర్చింది. బంతి అమరిక టెస్ట్ క్రికెట్ అంతర్జాతీయ స్థాయిని తెలుపుతుంది. గద యొక్క హ్యాండిల్ క్రికెట్ స్టంప్ ను సూచిస్తుంది. హ్యాండిల్ కి రిబ్బన్ ఉన్నగెలుపుకు చిహ్నంగా భావిస్తారు.
ఈ గదను ముందుగా డిజైన్ చేసింది మాత్రం ట్రోఫీ డిజైనింగ్ కంపెనీ ట్రెవర్ బ్రౌన్. గద రూపకల్పనకు ప్రేరణ ఇచ్చింది ఏమిటనేది బ్రౌన్ తెలిపారు. ‘ఉత్కంఠభరిత మ్యాచ్లో గెలిచిన వెంటనే ఒక ప్లేయర్ స్టంప్ను తీసుకొని దానిని సంతోషంగా ఊపడం నన్ను ఆకర్షించింది. ఆ విధంగా గద ఐడియా వచ్చింది’ అని అన్నారు.
ప్రభాస్ కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా ఛత్రపతి. ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, జక్కన్న కాంబినేషన్ లో వచ్చిన తొలి సినిమా కూడా ఇదే. ఈ చిత్రంలో హీరోయిన్ గా శ్రియ నటించింది. అయితే ఈ మూవీని రాజమౌళి ముందుగా మాస్ మహారాజ రవితేజతో చేయాలని భావించడట.
అయితే సంవత్సరానికి నాలుగైదు చిత్రాలు చేసే రవితేజ డేట్స్ ఇతర సినిమాలకి ఇవ్వడంతో డేట్స్ లేక ఈ సినిమాని ప్రభాస్ తో చేయాలని రాజమౌళి అనుకున్నాడు. కానీ ప్రభాస్ దగ్గరకి వెళ్ళడానికి కాస్త ఆలోచించాడట. దానికి కారణం గతంలో రాజమౌళి ప్రభాస్ స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి చిత్రాలను రిజెక్ట్ చేసాడు. ఈ మూవీని కూడా రిజెక్ట్ చేస్తాడేమో అని అనుకున్నాడట.
అయితే ఒకరోజు ప్రభాస్ పుట్టినరోజు పార్టీకి తెలుగు స్టార్ హీరోలు, నిర్మాతలను కూడా ఆహ్వానించాడట. ఆ ఆహ్వానం తనకు కూడా రావడంతో రాజమౌళి పార్టీకి వెళ్ళినపుడు, తన దగ్గర ఒక కథ ఉందని, వింటావా అని ప్రభాస్ ని అడగాడట. తరువాతి రోజు చెప్పమని అన్నాడంట. రాజమౌళి తరువాతి రోజే ప్రభాస్ ఇంటికి వెళ్లి కథ చెప్పడం, ప్రభాస్ కి నచ్చడంతో ఒకే చెప్పారంట.
టాలీవుడ్ చిత్రాలలో నటించి హీరోగా మంచి ఇమేజ్ ఏర్పరుచుకున్న సిద్ధార్థ్ కొంతకాలం తెలుగు ఇండస్ట్రీకి దూరం అయ్యారు. 2021 లో శర్వానంద్ తో కలిసి మహాసముద్రం మూవీ ద్వారా ఆడియెన్స్ ముందుకు వచ్చారు. అయితే ఆ చిత్రం ప్లాప్ అయ్యింది. ఆ మూవీ పై సిద్ధార్థ్ హిట్ అవుతుందని చాలా నమ్మకంగా మాట్లాడాడు. మహాసముద్రం ప్రీరిలీజ్ ఈవెంట్ లో కానీ ఆమూవీ ఆశించినట్లుగా విజయం సాధించలేకపోయింది.
తాజాగా ఈ చిత్రం ప్లాప్ అవడం పై ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పుకొచ్చాడు. ఇప్పటికీ ‘మహా సముద్రం’ నా ఫేవరెట్ సినిమా. కానీ ఆ మూవీ జనాలకి కనెక్ట్ కాలేదు. హీరో ఫ్రెండ్ లవర్ ను పెళ్లి చేసుకోవడం ఆడియెన్స్ కి నచ్చలేదు, అందువల్లే ప్రేక్షకులు కనెక్ట్ కాలేదు. అలా అని ఈ చిత్రం చెడ్డ మూవీ కాదు. దర్శకుడు అజయ్ భూపతితో వర్క్ చేయడానికి ఇప్పటికీ నేను రెడీగా ఉన్నాను.
అతను గ్రేట్ టెక్నీషియన్. ఆర్.ఎక్స్ 100 మూవీని మించిన చిత్రాలు అజయ్ నుండి చాలా వస్తాయని అన్నారు. కొంతమంది నాతో ఈ మూవీ మరో 10 సంవత్సరాల తరవాత రావాల్సింది అంటూ ఉంటారు. ఆ మాటలు విన్నప్పుడు నాకు నవ్వాలో, ఏడ్వాలో తెలియదని చెప్పుకొచ్చారు.
ప్రతిరోజూ లక్షలాది మంది రైళ్లలో ప్రయాణం చేస్తుంటారు. ప్రయాణించే సమయంలో కానీ, వాటి కోసం వేచి చూసే సమయంలో కానీ రైల్వే స్టేషన్ లో కనిపించే రైళ్ల పై చాలా రకాల గుర్తులు కనిపిస్తుంటాయి. వాటిలో ఎక్కువగా రైలు వెనకాల ఉండే ఎక్స్ గుర్తును దాదాపు అందరు చూసే ఉంటారు. ఈ గుర్తు రైలు చివరి బోగి పై చాలా పెద్దగా రాసి ఉంటుంది. అందువల్ల తేలికగా కనిపిస్తుంది.
నిజానికి ఈ పెద్దగా రాసిన ఎక్స్ గుర్తు ఎల్లప్పుడూ ట్రైన్ ఆఖరి బోగీ పై రాస్తారు. దీని అర్థం ఏమిటంటే ఆ గుర్తు ఉన్న బోగీ ఆ రైలు యొక్క ఆఖరి పెట్టె. ఇక ప్యాసింజర్ ట్రైన్ చివరి పెట్టెలో ఎక్స్ మాత్రమే కాకుండా ఎల్వి అనే గుర్తు లేదా అక్షరాలు కూడా ఉంటాయి. ఎల్వి అనగా లాస్ట్ వెహికల్ అని అర్ధం. ఈ రెండు గుర్తులు ముఖ్యంగా రైల్వే ఉద్యోగులకు మరియు అధికారులకు సంబంధించినవి.
ఒకవేళ రైలు చివరి బోగీ మీద ఎక్స్ లేదా ఎల్వి గుర్తు కనిపించకపోతే రైల్వే ఉద్యోగి లేదా అధికారి వెంటనే అలర్ట్ అయ్యి ఆ విషయన్ని సమీప కంట్రోల్ రూమ్కు సమాచారం చేరవేస్తాడు. ఈ రెండు గుర్తులు రైలు చివరి బోగీ పై కనిపించకపోతే ఆ రైలు యొక్క చివరి బోగీ లేదా రైలు కొంత భాగం ఆ ట్రైన్ నుండి వేరు అయ్యిందని అర్ధం.
సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఆదిపురుష్ హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రంలో ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తున్నారు. సీతాదేవిగా బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్, రావణసురుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. తానాజీ డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాని ఈ నెల 16న తెలుగు, మలయాళం, కన్నడ, తమిళ, హిందీ భాషల్లోలలో చాలా గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.
ఈ క్రమంలో ఆదిపురుష్ మూవీ బడ్జెట్ దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. బిజినెస్ గురించి చూసినట్లయితే ఇప్పటివరకు ఈ మూవీకి శాటిలైట్, మరియు డిజిటల్ రైట్స్ అన్ని భాషలకు 250 కోట్లు వచ్చాయట. అయితే ఈ చిత్రం మ్యూజిక్ రైట్స్ ను మాత్రం అమ్మలేదని సమాచారం. ఇక తెలుగు రాష్ట్రాలలో ముందుగా యువి క్రియేషన్స్ విడుదల చేస్తుందని అనుకున్నా, ఆ తరువాత పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ 185 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.