ఒక మూవీని నిర్మించడం అనేది ప్రొడ్యూసర్ కు ఒక యజ్ఞం వంటిది. నిర్మాత తన సినిమా కోసం ఆస్తులన్నీ తాకట్టు పెట్టడం లేదంటే ఎక్కువ వడ్డీలకు అప్పులు తీసుకురావడం వంటివి చేస్తుంటారు. అయితే ఆ మూవీ విజయం సాధించి, మంచి వసూళ్లు వస్తేనే ఇండస్ట్రీలో కొనసాగడం సాధ్యం అవుతుంది. లేదంటే నష్టాలతో నడిబజారున పడుతారు. అలా నష్టాలతో దివాళా తీసిన ప్రొడ్యూసర్స్ ఉన్నారు.
సినీ రంగంలో స్థిరపడాలంటే ఎన్నో సాహసాలు చేయాల్సి వస్తుంది. తాజాగా హీరో రానా దగ్గుబాటి బాహుబలి సినిమాలను నిర్మించడం కోసం ఆర్కా మీడియా డబ్బు విషయంలో ఎలాంటి రిస్కులు చేసిందో వెల్లడించారు. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం బాహుబలి దేశవ్యాప్తంగా ఎలాంటి సంచలన విజయం సాధించిందో అందరికి తెలిసిన విషయమే. ఈ మూవీ భారతీయ సినీ ఇండస్ట్రీ తీరుతెన్నులను ఒక్కసారిగా మార్చివేసింది. సినీ హిస్టరీలో ఈ చిత్రం మైలురాయిగా నిలిచిపోయింది.
అయితే ఈ చిత్రాలకు ఊహించని స్థాయిలో ఖర్చు అయ్యింది. ఈ మూవీ కోసం ప్రొడ్యూసర్స్ 400 కోట్లు అప్పు చేశారని ఇటీవల రానా చెప్పుకొచ్చారు. 3, 4 ఏళ్ల క్రితం చిత్రాలకు డబ్బులు పెట్టాలంటే ప్రొడ్యూసర్ తన ఇంటి నుంచి, లేదా బ్యాంకులలో ఆస్తులను తనఖా పెట్టి డబ్బులు వడ్డీకి తీసుకొచ్చేవారని రానా అన్నారు. గతంలో 24-28 శాతం వడ్డీ కట్టేవాళ్లమని చెప్పారు.
బాహుబలి 1,2 చిత్రాల కోసం 300-400 కోట్లు 24 శాతం వడ్డీకి అప్పుగా తీసుకువచ్చారని రానా అన్నారు. బాహుబలి 1 సమయంలో చాలా ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నామని చెప్పారు. ఆ సమయంలో నిర్మాతలు 180 కోట్ల రూపాయలు 24 శాతం వడ్డీకి అప్పు చేశారని చెప్పుకొచ్చారు. బాహుబలి ఆడకపోతే ఆ కండిషన్ ను ఊహించుకోవడం కూడా కష్టమని రానా అన్నారు.
Also Read: “గుంటూరు కారం” వీడియోలో మహేష్ బాబుతో పాటు ఉన్న… మరొక హీరోని గుర్తుపట్టారా..? అస్సలు గమనించలేదే..?

ప్రభాస్, కృతి సనన్ లు సీతారాములుగా నటిస్తున్న ‘ఆదిపురుష్’ సినిమాని తానాజీ సినిమా దర్శకుడు ఓం రౌత్ దాదాపు 550 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఓం రౌత్ తో కలిసి టి సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని నిర్మించాయి. జూన్ 16న రిలీజ్ కాబోతున్నఈ చిత్రం ప్రీ రిలీజ్ డీల్స్ ఇప్పటికే పూర్తి అయ్యాయి. మొత్తం ఐదు భాషలలో ఈ మూవీ పై 550 కోట్ల బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. బాలీవుడ్ లో ఇప్పటిదాకా ఇదే అతిపెద్ద ప్రీ రిలీజ్ బిజినెస్ అని సమాచారం.
ఈ మూవీ డిజిటల్ శాటిలైట్ రైట్స్ కి 250 కోట్లు ఇప్పటికే ప్రొడ్యూసర్ కి వచ్చాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తెలుగులో 185 కోట్లకి రైట్స్ ని తీసుకుంది. హిందీ, ఓవర్సీస్ మరియు ఇతర భాషలలో టి-సిరీస్ భూషణ్ కుమార్ సొంతంగా విడుదల చేస్తున్నారు. ఇక ఈ మూవీ మ్యూజిక్ రైట్స్ మాత్రం టి-సిరీస్ అమ్మలేదని తెలుస్తోంది. తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో ఏరియా వైజ్ గా ఫ్యాన్సీ రేటుకి లోకల్ డిస్టిబ్యూటర్స్ రైట్స్ ని తీసుకున్నారు.
మొత్తంగా చూసుకుంటే ఆదిపురుష్ పై 550 కోట్ల బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. ఈ సినిమా బడ్జెట్ లో దాదాపు 350 కోట్లు భూషణ్ కుమార్ పెట్టారు. ఇక డిజిటల్ శాటిలైట్ రైట్స్ తోనే 75 శాతం వరకు బడ్జెట్ రికవరీ అయ్యింది. అందువల్ల పాజిటివ్ టాక్ తో ఒక వారం ఆడితే, ప్రొడ్యూసర్స్ కి లాభాలు రావడం ఖాయం అంటున్నారు ట్రేడ్ నిపుణులు.
సాఫీగా సాగిపోతున్న రైలు ప్రయాణంలో తమ రైలు పట్టాలు తప్పిందని ప్రయాణికులు తెలుసుకునేలోగా ట్రైన్స్ ఢీ కొని కొందరిని మృత్యువు కబళించింది. కొందరు స్పాట్లోనే, మరికొందరు బోగీల్లో ఇరుక్కుపోయి ప్రాణాలు విడిచారు. ప్రమదస్థలం భయనకంగా మారింది. కోచ్లు 30 వరకు నుజ్జునుజ్జయ్యాయి. యాక్సిడెంట్ జరిగిన విధానానికి మృతదేహాలు చెల్లాచెదురు అయిపోయాయి. బోగీల్లో చిక్కుకున్న బాధితుల హాహాకారాలతో ఆ ప్రాంతం దద్దరిల్లి పోయింది. అయితే ఈ ఇంత ఘోర ప్రమాదం జరగడానికి గల కారణం బయటకు వచ్చింది.
ఇప్పటిదాకా యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్, కోరమండల్ ట్రైన్ ను ఢీకొడితే, అది వెళ్ళి గూడ్స్ ఢీకొట్టినట్టు అధికారులు చెప్పారు. అయితే అది నిజం కాదని తేలింది. జరిగిన యాక్సిడెంట్ కు సిగ్నలింగ్ మరియు టెలికమ్యూనికేషన్ ఫెయిల్యూరే కారణం. వేగంగా వస్తున్న కోరమాండల్ ట్రైన్ కి దారి ఇవ్వడం కోసం ఆ ట్రాక్ పైన ఉన్న గూుడ్స్ ని రైల్వే అధికారులు లూప్ లోకి పంపారు. అయితే 110కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న కోరమాండల్ ట్రైన్ బహెనాగ్ రైల్వే స్టేషన్ కు వచ్చాన తరువాత సిగ్నలింగ్ లోపం వల్ల గూడ్స్ ఉన్న లూప్ లైన్లో కి వెళ్లింది.
కానీ సిగ్నల్ ప్యానెల్ లో ఆ ట్రైన్ మెయిన్ లైన్ లోనే వెళ్తున్నట్టు చూపించింది. దాంతో మెయిన్ లైన్ వెళ్తుందనుకుని లూప్ లైన్లో వెళ్లి ఆ ట్రాక్ మీద ఉన్న గూడ్స్ ట్రైన్ ని ఢీకొట్టింది. దాంతో కోరమాండల్ భోగీలు కొన్ని గూడ్స్ భోగీల మీద ఎక్కాయి. కోరమాండల్ భోగీలు కొన్ని పక్కనే ఉన్న వేరే ట్రాక్ పై పడ్డాయి. కాసేపటికి పక్క ట్రాక్ పైకి వచ్చిన యశ్వంత్ పూర్ ట్రైన్ ట్రాక్ పై పడిన కోరమాండల్ భోగీలను ఢీకొట్టింది.|
కోరమాండల్ ట్రైన్ గూడ్స్ ని ఢీకొని 16 నిముషాలు అయినా అటువైపు వస్తుున్న యశ్వంత్ పూర్ ట్రైన్ ను మరో స్టేషన్ లో ఆపలేదు. శుక్రవారం నాడు మొత్తం సిగ్నలింగ్ వ్యవస్థ కుప్పకూలింది. ఈ ఘోరప్రమాదానికి కారణం సిగ్నల్ మరియు టెలి కమ్యూనికేషన్ టెక్నికల్ సమస్య అని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఇదంతా 15 నిముషాల వ్యవధిలోనే జరిగిందని తెలుస్తోంది.
క్రికెట్ లో ప్రస్తుతం ఉన్న రూల్స్ బ్యాటర్స్ కు అనుకూలించే విధంగా ఉన్నాయి. అయితే టి20 ఫార్మాట్ లో బౌలింగ్ చేయాలంటే అంత తేలిక కాదు. బౌలింగ్ చేయాలంటే దడ పుడుతుంది. కొందరు బౌలర్లు మాత్రం వైవిధ్యమైన బాల్స్ తో బ్యాటర్స్ ను కట్టడి చేస్తుంటారు. బౌలింగ్ లో వైవిధ్యాన్ని చూపిస్తేనే బౌలర్లు క్రికెట్ లో నిలదొక్కుకోగలరు. అది వైవిధ్యాన్ని ప్రదర్శించలేక 2021 ఐపీఎల్ లో సంచలనం సృష్టించిన ఉమ్రాన్ మాలిక్ 16 వ సీజన్ లో రాణించ లేకపోయాడు.
కశ్మీర్ ఎక్స్ప్రెస్ పేరుగాంచిన 24 ఏళ్ల ఉమ్రాన్ మాలిక్ 2021 ఐపీఎల్ లో మొదటిసారి ఎంట్రీ ఇచ్చాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరుపున నెట్ బౌలర్ గా ఆడాడు. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయడంతో ఉమ్రాన్ టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యాడు. 2021లో ఆడింది తక్కువ మ్యాచ్ లే అయినా అందరి దృష్టిని ఆకర్షించాడు.
2022లో ఐపీఎల్ లో మరోసారి టాక్ ఆఫ్ ద లీగ్ అయ్యాడు. ఉమ్రాన్ క్రమం తప్పకుండా అదే వేగంతో బౌలింగ్ చేస్తుండడంతో అతడిని టీమిండియాకు సెలెక్ట్ చేశారు. ఆ సమయంలో ఉమ్రాన్ మాలిక్ పై ప్రశంసలు కురిసాయి. కానీ ఉమ్రాన్ టీమిండియా తరఫున రాణించలేదు. ఇక తాజాగా జరిగిన ఐపీఎల్ సీజన్ లో నిరాశపరిచాడు. 16వ సీజన్ లో ఎనిమిది మ్యాచ్ లు ఆడిన ఉమ్రాన్ తీసింది 5 వికెట్లు మాత్రమే. 10.85 ఎకానమీతో రన్స్ ఇచ్చాడు.
దాంతో హైదరాబాద్ జట్టు ఉమ్రాన్ ని పక్కన పెట్టింది. ఉమ్రాన్ ప్రతి బాల్ ను 150 కిలో మీటర్ల వేగంతో వేస్తున్నాడు. కానీ వైవిధ్యాన్ని ప్రదర్శించడం లేదు. దాంతో ప్రత్యర్ధులు ఉమ్రాన్ పేస్ ను వాడి రన్స్ చేస్తున్నారు. వేగం ఉన్నా ఉమ్రాన్ బౌలింగ్ తో టీంకు నష్టం జరుగుతోంది. ఇలాగే ఉంటే ఉమ్రాన్ భారత జట్టుకు ఎంపిక అవ్వడం కష్టం అంటున్నారు.
ద మోస్ట్ అవేటెడ్ మూవీగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం గుంటూరు కారం. తాజాగా విడుదల అయిన గ్లింప్స్ సూపర్ స్టార్ ఫ్యాన్స్కు మంచి కిక్కిస్తోంది. బీడీ తాగుతూ, కర్ర తిప్పుతూ, ఊర మాసు లెవెల్ లో ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు స్వాగ్ ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. ఈ వీడియో ప్రస్తుతం యూట్యూబ్ను షేక్ చేస్తోంది.
రిలీజ్ అయ్యి 24 గంటలు కాకముందే 20 మిలియన్ల వ్యూస్ పొంది, రికార్డుల దిశగా మహేష్ ‘గుంటూరు కారం’ గ్లింప్స్ దూసుకెళుతోంది. అయితే ఈ వీడియోలో మరో నటుడు కూడా ఉన్నారంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొందరికి ఈ విషయంలో అతడు మూవీలోని ఎమ్ ఎస్ నారాయణ పాపులర్ డైలాగ్ గుర్తుకువస్తోంది.
ఎందుకంటే ఈ వీడియోలో త్రివిక్రమ్ మరో యాక్టర్ ను చూపించి, చూపించనట్టుగా చూపించారని నెటిజెన్లు అంటున్నారు. ఆ నటుడు ఎవరో కాదు జగపతిబాబు. ఒకప్పుడు ఫ్యామిలి హీరోగా అలరించిన, ఆయన సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా రాణిస్తున్నారు. ఈ చిత్రంలో తాను భయంకరమైన విలన్ గా నటిస్తున్నట్టు ఇటీవల ఆయనే ఒక ఇంటర్వ్యూలో కూడా వెల్లడించాడు. ఇక గుంటూరు కారం గ్లింప్స్ జగపతిబాబు ఉన్నారని అంటున్నారు.
ఈ గ్లింప్స్ లో 27 సెకన్ల వద్ద మహేశ్తో పాటుగా జగపతిబాబు కనిపించాడు. కానీ అది బ్లర్ ఎఫెక్ట్లో ఉంది. మహేష్ సిగరెట్ వెలిగిస్తున్నపుడు, కాలుస్తున్నప్పుడు పక్కనే జగపతిబాబు ఉన్నారు. వీడియోను ఆపి చూస్తే జగపతిబాబు అని తెలుస్తుంది. అలాగే గాల్లోకి జీప్ లేచినపుడు చెవులు మూసుకున్న వ్యక్తి జగపతిబాబు అని తెలుస్తోందని నెటిజెన్లు అంటున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం గుంటూరుకారం. తాజాగా రిలీజ్ అయిన ఈ మూవీ గ్లింప్స్ యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది. సోషల్ మీడియాలో దీని గూర్చి చర్చ జరుగుతోంది. ఈ వీడియోకి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక మహేష్ చాలా ఏళ్ల తరువాత మాస్ లుక్ లో కనిపించడంతో అభిమానులు ఇలాంటి గ్లిమ్స్ రిలీజ్ చేసినందుకు మేకర్స్ కు కృతఙ్ఞతలు చెప్తున్నారు.
అయితే తాజాగా మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మూవీకి హీరోగా త్రివిక్రమ్ ముందుగా ఎంచుకుంది మహేష్ బాబుని కాదంట. త్రివిక్రమ్ చేయాలనుకున్నది జూనియర్ ఎన్టీఆర్ తో అంట. ఆర్ఆర్ఆర్ మూవీ తరువాత తారక్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయాల్సింది. త్రివిక్రమ్ చెప్పిన స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేయమని చెప్పడం, త్రివిక్రమ్ మార్పులు చేసినప్పటికీ ఎన్టీఆర్ కి నచ్చలేదంట.
దాంతో ఆ కథకు మహేష్ బాబు తగిన విధంగా అదనంగా కొన్ని సన్నివేశాలను రాసి మహేష్ బాబుతో గుంటూరు కారం గా తీస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ మూవీలో హీరోయిన్లుగా పూజ హెగ్డే, శ్రీలీల నటిస్తున్నారు. సీనియర్ హీరో జగపతిబాబు విలన్గా చేస్తున్నాడు.
1. అంబటి రాయుడు:
2. కరుణ్ నాయర్:
3. వసీం జాఫర్:
4. ఇర్ఫాన్ పఠాన్:
5 . దినేష్ కార్తీక్:
అప్పటికే జట్టులో సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ లాంటి టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఉన్నారు. దాంతో కార్తీక్ ఎక్కువగా అవకాశాలు రాలేదు. ఇక ధోనీ ఉండడం వల్ల అతను వికెట్ కీపర్గాను రెండవ స్థానంలో ఉండేవాడు. ఎంతో ప్రతిభ ఉన్నా దినేష్ కార్తీక్ భారత అత్యంత దురదృష్టకర క్రికెటర్లలో ఒకరిగా నిలిచాడు.
తొలివలపు అనే మూవీతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన స్నేహ, ఆ తరువాత ప్రియమైన నీకు, హనుమాన్ జంక్షన్, వెంకీ, సంక్రాంతి, శ్రీరామదాసు, సన్నాఫ్ సత్యమూర్తి వంటి ఎన్నో చిత్రాలలో నటించి గుర్తింపును సొంతం చేసుకుంది. ఇప్పటికీ స్నేహకు ఆడియెన్స్ లో క్రేజ్ ఎక్కువగానే ఉంది. ఇండస్ట్రీలో కొనసాగుతూ తన వయసుకు తగ్గ క్యారెక్టర్ లో నటిస్తూ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటుంది. స్నేహ తమిళ నటుడు ప్రసన్న ను పెళ్లి చేసుకుంది. ఈ జంటకి పాప మరియు బాబు ఉన్నారు.
ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నటి స్నేహ మాట్లాడుతూ తన తల్లిదండ్రులకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు అని అన్నారు. కుమార్తెలలో తాను చివరి దానినని, తన బామ్మ తనకు బదులు కుమారుడు పుట్టాలని కోరుకుందని తెలిపింది. కూతురు పుట్టేసారికి ఆమె తన ముఖాన్ని 3 రోజుల వరకు చూడడానికి కూడా ఇష్టపడలేదని స్నేహా చెప్పుకొచ్చింది.
బాల్యంలో తాగే నీళ్లు పక్కనే ఉన్నా సోదరులకు వాటిని తామే ఇవ్వాల్సి వచ్చేదని, అదేం పద్దతి అని అడిగితే మేము మగవాళ్ళం అని, ఆడపిల్లలు కాబట్టి ఇంటి పనులు మీరే చేయాలని చెప్పేవారని అన్నారు. తన పెద్ద అన్నయ్య ముఖ్యంగా తనను చాలా ఇబ్బందులకు గురి చేసేవాడని, పనులు అన్ని తననే చేయమని ఆర్డర్ వేసేవాడని స్నేహ వెల్లడించారు.
ఇప్పటికే ఈ సినిమా పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. గతంలో రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ సినిమా పై మరింత ఆసక్తిని పెంచింది. సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంతా వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్న టైటిల్ తో పాటుగా ఈ మూవీ నుండి ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. దీనిని చూస్తుంటే మూవీ దుమ్ము లేపడం పక్కా అన్నట్టుగా ఉంది. మహేష్ బాబు మాస్ స్ట్రైక్ బాక్సాఫీస్ ని ఈసారి గట్టిగానే ఢీ కొట్టేట్టు ఉందని అంటున్నారు. గుంటూరు మిర్చి కారం ఎంత ఘాటు ఉంటుందో గ్లింప్స్ తో శాంపిల్ చూపించారు.
పోకిరి మూవీలో సిగరెట్ తాగుతూ కనిపించిన ప్రిన్స్, ఈ మూవీలో మళ్ళీ సిగరెట్ తో ఊర మాస్ గా కనిపించారని ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు. ఈ గ్లింప్స్ లో ఫైట్ సీన్ కనిపించింది. అయితే తాజా వినిపిస్తున్న టాక్ ప్రకారం ఆ ఫైట్ ఎపిసోడే ఈ సినిమాకు మేజర్ హైలైట్ కానుందని తెలుస్తోంది.
ఈ చిత్రాన్నిఎస్ రాధాకృష్ణ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తుండగా, శ్రీలీల కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి జనవరి 13న రిలీజ్ చేయనున్నారు.
‘ది కేరళ స్టోరీ’ సినిమా ఇప్పటికి థియేటర్లలో విజయవంతంగా నడుస్తూ, బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ ను రాబడుతోంది. అయితే తాజాగా అందుటున్న సమాచారం మేరకు ఈ మూవీ జూన్ 23 నుండి జీ5 ఓటీటీలో ప్రసారం అవనున్నట్లు తెలుస్తోంది. జీ5లో ఈ చిత్రం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం, హిందీలో కూడా స్ట్రీమింగ్ అవనుంది.
ఈ చిత్రానికి డైరెక్టర్ సుదీప్తో సేన్ దర్శకత్వం వహించారు. హీరోయిన్ అదా శర్మ ఈ మూవీలో లీడ్ రోల్ లో నటించింది. సిద్ధి ఇద్నానీ, యోగితా బిహానీ, సోనియా బలానీ ఇతర ముఖ్య పాత్రలను పోషించారు. మే 5న వివాదాల మధ్య ఈ సినిమా రిలీజ్ అయ్యింది. కేరళ రాష్ట్రంలో అమాయకులైన యువతులను లవ్ జిహాద్ పేరిట మతమార్పిడి చేసి, ఆ యువతులను ఐఎస్ఐఎస్ క్యాంపుల్లోకి పంపించి టెర్రరిస్టులుగా మారుస్తున్నారనే స్టోరీతో ఈ చిత్రాన్ని రూపొందించారు.
దాంతో ఈ చిత్రానికి తీవ్రమైన వ్యతిరేకత ఎదురైంది. ఈ చిత్రం పై కొన్ని రాష్ట్రాలలో బ్యాన్ విధించగా, ఈ చిత్రం పై ఎంతోమంది కేసులు కూడా పెట్టారు. ఎన్ని అడ్డంకులు ఎదురైన చివరికి బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ చిత్రం. అదా శర్మ ఎన్నో చిత్రాలలో నటించినా రాని గుర్తింపు ఈ చిత్రంతో సంపాదించింది.