మన హిందూ పంచాంగం ప్రకారం శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి రోజున రాఖీ పౌర్ణిమ జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఈ తిధి రెండు రోజులు రావడంతో చాలా ప్రదేశాల్లో ఈ పండుగను 30న జరుపుకుంటే మరికొన్ని చోట్ల 31న జరుపుకున్నారు. ఈ పవిత్రమైన పర్వదినాన సోదరి తన సోదరుల క్షేమంగా ఉండాలని, అన్ని విషయాల్లో విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ వారి కుడి చేతి మణికట్టుకు రాఖీ కడతారు.
అలాగే అన్నదమ్ములు తమ అక్కాచెల్లెళ్లకు మంచి బహుమతులు ఇచ్చి వారు జీవితంలో ఎల్లవేళలా ఆనందంగా ఉండాలి అని ఆశీర్వదిస్తారు.
Also Read: సీనియర్ ఎన్టీఆర్ నుండి తారక్ వరకు…ఈ 12 మంది టాలీవుడ్ జంటల “పెళ్లిపత్రికలు” ఓ లుక్ వేయండి.!

మామూలుగా రాఖీ పండుగ రోజున రక్షాబంధన్ కట్టడం వరకు మాత్రమే చాలామందికి తెలిసిన విషయం. అయితే ఈ పండుగ పూర్తయిన తరువాత చేతికి కట్టిన రాఖిని సోదరుడు ఏ సమయంలో తీయాలి ……ఎప్పుడు తీయాలి ఎన్ని రోజులపాటు …….అలాగే చేతికి ఉంచుకోవాలి……ఇలాంటి విషయాలపై చాలామందికి అవగాహన లేదు. రాఖీ చేతికి కట్టడానికి మంచి సమయం , విధి విధానాల అవసరం ఎంత ఉంటుందో అలాగే చేతికి కట్టిన రాఖీ తీయడానికి కూడా నిర్దేశిత సమయం పాటించవలసిన కొన్ని పద్ధతులు ఉన్నాయి. మరి ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం

మన గ్రంథాల ప్రకారం చాలా వరకు రాఖీ కట్టించుకోవడానికి నిర్దిష్ట సమయం అంటూ పాటించాల్సిన అవసరం లేదు. అది వారి వీలును బట్టి పరిస్థితిని బట్టి రాఖీ పౌర్ణమి రోజు ఉదయం నుంచి సాయంత్రం లోపు ఎప్పుడైనా కట్టవచ్చు. కానీ కొన్ని ప్రదేశాల్లో మాత్రం కట్టిన రాఖీని విప్పడానికి ఎన్నో నియమ నిబంధనలు ఉన్నాయి. మహారాష్ట్రలో రక్షాబంధన్ రోజు నుంచి 15 రోజులపాటు సోదరుడు తన చేతి కి కట్టించుకున్న రాఖీని ధరించి తీరాలి. ఆ తరువాత మహారాష్ట్రీయులు పోలా అనే పండుగను జరుపుకుంటారు. మరియు అదే శుభసమయానికి మరాఠీ రైతులు లార్డ్ మార్బోట్ దేవ్ ను ,ఎద్దులను ప్రార్థిస్తారు.

కొన్ని ప్రదేశాల్లో రాఖీని వారం రోజులపాటు ఉంచుకొని తర్వాత మంచి సమయం చూసి తీసేస్తారు. మరికొందరైతే తమ వీలుని పట్టి ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు లేదా వచ్చే సంవత్సరం వరకు తమ సోదరి గుర్తుగా రాఖీని అలాగే చేతికి ధరించి ఉంటారు. మరికొన్ని ప్రదేశాలలో సోదరుడికి రాఖీ కట్టేంతవరకు సోదరి ఉపవాసాన్ని పాటిస్తుంది. ఇలా వివిధ ప్రాంతాల్లో వివిధ పద్ధతుల్లో జరుపుకున్నప్పటికీ రాఖీ పండుగ ముఖ్య ఉద్దేశం మాత్రం అన్నా చెల్లెలు మధ్య ప్రేమ మరియు అనుబంధం.
Also Read: బాలయ్యకి చెల్లెలి పాత్ర ఇచ్చారని కన్నీరు పెట్టుకున్న నటి లయ.. ఎందుకో తెలుసా??






గత వారం యోగి మూవీని రీరిలీజ్ చేశారు. థియేటర్లు ఈ మూవీలోని ‘ఓరోరి యోగి’ పాటకు ఓ రేంజ్ లో ఊగిపోయాయి. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో ఈ ట్యూన్ ఒరిజినల్ కన్నడ పాట కూడా నెట్టింట్లో ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చింది. దాంతో తెలుగు సాంగ్ నే ఒరిజినల్ సాంగ్ అని అనుకున్నారు. తెలుగు పాటను కన్నడ సినిమా వాళ్ళు కాపీ చేశారనుకున్నారు.
అయితే ఆ సాంగ్ కన్నడలోనే ముందుగా వచ్చింది. కన్నడలో స్టార్ హీరో శివ రాజ్ కుమార్ హీరోగా నటించిన ‘జోగి’ మూవీ 2005 లో రిలీజ్ అయ్యి, బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ సినిమాలోని లవ్ సాంగ్ ట్యూన్నే తెలుగువాళ్ళు కాపీ చేశారు. కన్నడలో మూవీలో హీరోహీరోయిన్ల మధ్య వచ్చిన మంచి లవ్ సాంగ్ ను తెలుగులో ఐటం సాంగ్గా తెరకెక్కించారు.
ఇంత మంచి సాంగ్ ను ఐటం సాంగ్గా మార్చారు కదరా? అని నెటిజెన్లు ఈ పాట పై ట్రోల్స్ చేస్తున్నారు. దీనిపై మీమ్స్ కూడా ట్రెండ్ అవుతున్నాయి. కన్నడ ఒరిజినల్ పాట ప్రస్తుతం తెలుగు పాట కన్నా ఎక్కువగానెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. అంతటా కన్నడ సాంగ్ నే వినిపిస్తోంది. ఈ సాంగ్ పై తీసిన రీల్స్, షార్ట్స్ తో కన్నడ పాట ట్రెండింగ్ లోకి వచ్చింది.

చంద్రయాన్-3 వల్ల ఇండియాకి కలిగే మరిన్ని ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..చంద్రయాన్ 3 సుమారు 41 రోజుల పాటు భూమి నుండి చంద్రుడి వైపు ప్రయాణించి ల్యాండర్ మాడ్యూల్ ‘విక్రమ్’ ఆగస్టు 23 సాయంత్రం 6.04 గంటలకు జాబిల్లి పై అడుగుపెట్టింది. చందమామ పై అడుగిడాలనే భారత్ ఎన్నో ఏళ్ల కల సాకారం అయ్యింది. చంద్రయాన్-3 వల్ల దేశానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి.



‘వివాహ భోజనంబు’ డైరెక్టర్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా అనిల్ సుంకర సమర్పణలో ‘ఎకె ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై రాజేష్ దండా నిర్మించారు. ఇటీవల ఓటీటీలో రిలీజ్ అయిన ఈ మూవీ అక్కడ కూడా రికార్డులను బ్రేక్ చేస్తోంది. ఈ మూవీ మొదటి నుండి క్లైమాక్స్ వరకు ఫన్ ఉంటుంది. ఇక క్లైమాక్స్ సైతం కన్విన్సింగ్ గా ఉంటుంది. ఇటీవల కాలంలో ఇంత ఫన్ ఉన్న మూవీ రాలేదని చెప్పవచ్చు. శ్రీవిష్ణు, నరేష్ ఇద్దరు పోటీపడి నటించారు.





