సినిమాల్లో గుర్తింపు సంపాదించుకున్న లావణ్య త్రిపాఠి నటించిన సిరీస్ మిస్ పర్ఫెక్ట్ ఇవాళ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. బిగ్ బాస్ తెలుగు ద్వారా పేరు సంపాదించుకున్న అభిజిత్ ఇందులో హీరోగా నటించారు. అలాగే ఇంకా ఎంతో మంది ప్రముఖులు ఈ సిరీస్ లో ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
- వెబ్ సిరీస్ : మిస్ పర్ఫెక్ట్
- నటీనటులు : లావణ్య త్రిపాఠి, అభిజిత్ దుడ్డాల, అభిజ్ఞ వూతలూరు, ఝాన్సీ, హర్ష వర్ధన్, మహేష్ విట్టా, హర్ష్ రోషన్.
- నిర్మాత : సుప్రియ యార్లగడ్డ
- దర్శకత్వం : విశ్వక్ ఖండేరావు
- సంగీతం : ప్రశాంత్ ఆర్ విహారి
- స్ట్రీమ్ అవుతున్న ప్లాట్ఫామ్: డిస్నీ ప్లస్ హాట్స్టార్
- ఎపిసోడ్స్ సంఖ్య : 8
- విడుదల తేదీ : ఫిబ్రవరి 2, 2024

స్టోరీ :
లావణ్య రావు (లావణ్య త్రిపాఠి), ఢిల్లీలో ఒక మేనేజ్మెంట్ కన్సల్టెంట్. తన ఉద్యోగంలో భాగంగా హైదరాబాద్ కి వస్తుంది. లావణ్య కి క్లీనింగ్ అంటే చాలా ఇష్టం. తను ఉన్న ప్రతి చోట శుభ్రంగా ఉండాలి అనుకుంటుంది. ఒక రకంగా చెప్పాలి అంటే లావణ్యకి ఓసిడి ఉంటుంది. లావణ్య ఇంట్లో పని చేసే మనిషి జ్యోతి (అభిజ్ఞ వూతలూరు). అదే అపార్ట్మెంట్ లో ఇంకొక ఫ్లాట్ లో ఉంటాడు రోహిత్ (అభిజిత్). లావణ్య హైదరాబాద్ లో ఉన్న తర్వాత కోవిడ్ కారణంగా లాక్ డౌన్ ఉంటుంది.

లావణ్య, రోహిత్ ఒకటే కంపెనీలో పని చేస్తూ ఉంటారు. కానీ ఇద్దరికీ పరిచయం ఉండదు. ఒక రకంగా లావణ్య రోహిత్ కి పై ఆఫీసర్ గా పని చేస్తూ ఉంటుంది. అయితే కోవిడ్ లాక్ డౌన్ కారణంగా జ్యోతి పనికి రాలేకపోతున్నాను అనే విషయాన్ని రోహిత్ కి చెప్పమని లావణ్యకి చెప్తుంది. దాంతో రోహిత్ ఫ్లాట్ కి వెళ్ళిన లావణ్య, అతని ఫ్లాట్ చిందరవందరగా ఉండడం చూసి క్లీన్ చేస్తుంది. ఇది చూసిన రోహిత్, లావణ్యని పని మనిషి అని అనుకుంటాడు.

అయితే నిజం చెబుదాం అని లావణ్య ఒకపక్క ప్రయత్నిస్తూనే, మరొక పక్కన లక్ష్మీ అనే పేరు మార్చుకొని రోహిత్ ఇంటికి వెళ్లి పనిచేస్తుంది. ఆ తర్వాత లక్ష్మితో రోహిత్ ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? రోహిత్ కి నిజం తెలిసిందా? జ్యోతి ఏం చేసింది? లావణ్య అసలు విషయం చెప్పిందా? ఇదంతా తెలియాలి అంటే మీరు సిరీస్ చూడాల్సిందే.

రివ్యూ :
ఈమధ్య సినిమాలతో పాటు సమానంగా వెబ్ సిరీస్ కి డిమాండ్ పెరిగిపోయింది. కంటెంట్ బాగుంటే అందులో ఉన్న తారాగణంతో సంబంధం లేకుండా వెబ్ సిరీస్ కి మంచి ఆదరణ లభిస్తోంది. దాంతో పెద్ద పెద్ద హీరోలు, హీరోయిన్లు కూడా ఇలాంటి వెబ్ సిరీస్ లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇంక ఈ సిరీస్ విషయానికి వస్తే సరదాగా సాగిపోతుంది. ఎనిమిది ఎపిసోడ్లు ఉన్న సిరీస్ ని బోర్ కొట్టకుండా తీశారు. బ్రేక్ తీసుకోకుండా వరుసగా అన్ని ఎపిసోడ్లు చూసేయొచ్చు.

ఎపిసోడ్ రన్ టైం కూడా తక్కువగానే ఉంది. ఈ సిరీస్ కి దర్శకత్వం వహించిన విశ్వక్ అంతకుముందు స్కైలాబ్ సినిమాకి దర్శకత్వం వహించారు. ఆ సినిమా కూడా ఒక మంచి ప్రయోగాత్మక సినిమాగా నిలిచింది. లాక్ డౌన్ అనే బ్యాక్ డ్రాప్ తీసుకోవడం వల్ల లొకేషన్స్ ఎక్కువగా చూపించలేదు. లిమిటెడ్ లొకేషన్స్ లో బాగా తీశారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. కానీ కొన్ని సీన్స్ మాత్రం అంత పెద్ద కొత్తగా ఏమీ అనిపించవు. కొన్ని చోట్ల కాస్త సాగదీసినట్టు అనిపిస్తాయి.

పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, నటీనటులు అందరూ కూడా తమ పాత్రలకి తగ్గట్టు చేశారు. లావణ్య త్రిపాఠి ఒక కొత్త పాత్రలో కనిపించారు. మిగిలిన వాళ్ళు అందరూ కూడా తమ పాత్రల పరిధి మేరకు నటించారు. అక్కడక్కడ కామెడీ వర్క్ అవుట్ అయ్యింది కానీ, అక్కడక్కడ అంత నవ్వు తెప్పించదు. ఈ సీన్స్ విషయంలో ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
- స్టోరీ పాయింట్
- నవ్వు తెప్పించే కొన్ని కామెడీ సీన్స్
- నిర్మాణ విలువలు
- స్టైలింగ్
మైనస్ పాయింట్స్:
- కొత్తదనం లేని కథనం
- కాస్త సాగదీసినట్టు అనిపించే కొన్ని సీన్స్
రేటింగ్ :
3/5
ట్యాగ్ లైన్ :
పెద్ద కొత్త కథ ఏమి కాకపోయినా కూడా చూస్తున్న ప్రేక్షకులని బోర్ కొట్టకుండా కూర్చోబెడుతుంది. సరదాగా కొంచెం సేపు నవ్వుకుందాం అని అనుకునే వారికి ఈ సిరీస్ తప్పకుండా ఆకట్టుకునే అవకాశం ఉంది. ఇటీవల వచ్చిన తెలుగు సిరీస్ లో ఒక మంచి కామెడీ సీరీస్ గా మిస్ పర్ఫెక్ట్ సిరీస్ నిలుస్తుంది.
watch trailer :
ALSO READ : ఈ 8 మంది “తెలుగు” టాప్ హీరోలతో నటించిన… ఒకే ఒక్క “హీరోయిన్” ఎవరో తెలుసా.?

సంచలన దర్శకుడు లోకేశ్ కనగరాజ్ నిర్మాతగా మారి తీసిన తమిళ చిత్రం ఫైట్ క్లబ్. ఈ చిత్రంలో విజయ్ కుమార్, మోనీషా మోహన్ మీనన్ జంటగా నటించారు. ఏ రహమత్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. గత ఏడాది డిసెంబర్ 15వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ హిట్గా నిలిచింది. 5 కోట్ల రూపాయల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా 20 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను, 9 కోట్ల రూపాయలకు కు పైగా షేర్ ను వసూలు చేసింది. జనవరి 27 నుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, నార్త్ చెన్నై ప్రాంతంలో సెల్వ (విజయ్ కుమార్) అనే యువకుడు ఫుట్బాల్ ప్లేయర్ కావాలని కలలు కంటాడు. అయితే ఆ ప్రాంతంలో పిల్లలు స్కూల్ కి వెళ్ళకుండా గూండాలు మరియు డ్రగ్ పెడలర్స్ గా మారుతుంటారు. అక్కడి పరిస్థితులను మార్చాలనుకునే బెంజిమన్(కార్తికేయన్ సంతానం), సెల్వ ఫుట్బాల్ ప్లేయర్ ఎదగడానికి సహకరిస్తుంటాడు. రౌడీ కిర్బా (శంకర్ థాస్) బెంజీని అతని బ్రదర్ జోసెఫ్ (అవినాష్ రఘుదేవన్)తోనే హత్య చేయిస్తాడు. ఆ తరువాత పోలీసులు జోసెఫ్ ను జైలుకు పంపిస్తారు. బెంజి మరణంతో సెల్వ జులాయిగా, రౌడీగా మారతాడు.
రౌడీ కిర్బా రాజకీయ నాయకుడిగా ఎదుగుతాడు. జైలు నుంచి రిలీజ్ అయిన జోసెఫ్ కిర్బా తనను మోసం చేసినట్టు గ్రహిస్తాడు. అతని పై పగ తీర్చుకోవడానికి సెల్వను వాడుకోవాలనుకుంటాడు. ఆ తరువాత ఏం జరిగింది? ఫుట్బాల్ ప్లేయర్ కావాలని కలలు కన్న సెల్వ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయనేది మిగిలిన కథ. యాక్షన్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి ఫైట్ క్లబ్ మంచి ఛాయిస్.




బాలీవుడ్ లో గోల్మాల్, సింగమ్ సిరీస్, సింబ, సూర్యవంశీ వంటి సినిమాలతో భారీ సక్సెస్ అందుకున్న దర్శకుడు రోహిత్ శెట్టి. ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చారు. హీరో సిద్ధార్థ్ మల్హోత్రా కూడా మొదటిసారి వెబ్ సిరీస్ లో నటించాడు. వివేక్ ఒబెరాయ్, శిల్పా శెట్టి, నికితిన్ ధీర్, ముఖేష్ రుషి కీలక పాత్రలలో నటించారు.
ఇక ఈ సిరీస్ కథ విహాయనికి వస్తే, దేశరాజధాని డిల్లీలో వరుసగా బాంబు పేలుళ్లు జరగడంతో ఢిల్లీ పోలీసులు షాక్ అవుతారు. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఫోర్స్ విభాగానికి చెందిన కమిషనర్ అయిన విక్రమ్ బక్షి (వివేక్ ఒబెరాయ్), డిప్యూటీ కమిషనర్ అయిన కబీర్ మాలిక్ (సిద్ధార్థ్ మల్హోత్రా) లకు పేలుళ్లకు బాధ్యులైన టెర్రరిస్టులను పట్టుకునే బాధ్యతను అప్పగిస్తారు. గుజరాత్ ఏటీఎస్ చీఫ్ అయిన తారా శెట్టి (శిల్పా శెట్టి) టెర్రరిస్టులను పట్టుకోవడంలో కబీర్ మరియు విక్రమ్ బక్షికి సహాయం చేస్తుంది. అసలు బాంబు పేలుళ్ల వెనుక ఉన్న సూత్రధారి ఎవరు? జరార్ హైదర్ (మాయాంక్ టాండన్) కు పేలుళ్లకి ఉన్న సంబంధం ఏమిటి? ఈ కేసును కబీర్, విక్రమ్ ఎలా ఛేదించారు అనేది మిగిలిన కథ.
రోహిత్ శెట్టి చిత్రాలలోని హీరోల తరహాలోనే సిద్ధార్థ్ మల్హోత్రా, వివేక్ ఒబెరాయ్ పాత్రలు ఉంటాయి. ఇక పోలీస్ ఆఫీసర్ శిల్పా శెట్టి పాత్ర కూడా అలానే ఉంటుంది. నటీనటులు తమ పాత్రల మేరకు నటించారు. యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారికి ఇండియన్ పోలీస్ ఫోర్స్ ఆకట్టుకుంటుంది. యాక్షన్ సీన్స్ మరియు ఛేజింగ్ సీన్స్ చక్కగా రూపొందించబడ్డాయి.



