ఎన్నో సినిమాల్లో హీరోగా, సహాయ పాత్రల్లో నటించిన నటుడు శివాజీ. శివాజీ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా చాలా ఫేమస్ అయ్యారు. ఇప్పుడు శివాజీ నటించిన కొత్త వెబ్ సిరీస్ 90 స్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈటీవీ యాప్ లో ఇది రిలీజ్ అయ్యింది. ఈ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
- వెబ్ సిరీస్ : 90 స్ (నైంటీస్ )
- నటీనటులు : శివాజీ, వాసుకి ఆనంద్, మౌళి తనూజ్ ప్రశాంత్, రోహన్ రాయ్, వాసంతిక, స్నేహాల్ కామత్.
- నిర్మాత : నవీన్ మేడారం, రాజశేఖర్ మేడారం
- దర్శకత్వం : ఆదిత్య హాసన్
- సంగీతం : సురేష్ బొబ్బిలి
- విడుదల తేదీ : జనవరి 5, 2024 (ఈటీవీ విన్)

స్టోరీ :
చంద్రశేఖర్ (శివాజీ) ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన వాడు. ఆయన భార్య రాణి (వాసుకి ఆనంద్), వారి పిల్లలు రఘు (మౌళి తనూజ్ ప్రశాంత్), దివ్య (వాసంతిక), ఆదిత్య (రోహన్ రాయ్). చంద్రశేఖర్ గవర్నమెంట్ స్కూల్లో లెక్కల మాస్టారుగా చేస్తూ ఉంటాడు. కానీ పిల్లల్ని మాత్రం ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తాడు. ఆదిత్య అంత బాగా చదవడు. రఘు, దివ్య మాత్రం బాగా చదువుతారు. అయితే పదో తరగతిలో రఘుకి జిల్లా ఫస్ట్ ర్యాంకు వస్తుంది అనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? రఘు క్లాస్మేట్ సుచిత్ర (స్నేహాల్ కామత్) రఘుకి ఫ్రెండ్ అయ్యిందా? ఆదిత్య చదువులో మెరుగుపడ్డాడా? చంద్రశేఖర్ ఏం చేశాడు? ఇవన్నీ తెలియాలి అంటే మీరు ఈ సిరీస్ చూడాల్సిందే.

రివ్యూ :
సిరీస్ మొత్తం కూడా పేరుకు తగ్గట్టే 90లో కాలంలో ఉన్నట్టే ఉంటుంది. ఆ కాలంలో వచ్చిన సినిమా రిఫరెన్సెస్, వాళ్ళు వేసుకునే బట్టలు, చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు అవన్నీ కూడా అప్పటికి తగ్గట్టే ఉన్నాయి. సిరీస్ లో నటీనటులు అందరూ కూడా చాలా బాగా నటించారు. కథపరంగా చాలా సింపుల్ గా ఉంటుంది. కానీ దాన్ని ఎక్కడా బోర్ కొట్టకుండా చూపించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఒక మధ్యతరగతి కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఉంటాయో ఈ సిరీస్ లో చూపించారు.

చాలా మంది తప్పకుండా చాలా సీన్స్ కి కనెక్ట్ అవుతారు. కేవలం కుటుంబం గురించి మాత్రమే కాదు, టీనేజ్ లో విద్యార్థులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు? వాళ్ల ఆలోచన తీరు ఎలా మారుతుంది అనేది కూడా ఇందులో చాలా బాగా చూపించారు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అందరూ చాలా బాగా చేశారు. ముఖ్యంగా చాలా సహజంగా చేశారు. చాలా రోజుల తర్వాత శివాజీని తెరపై చూడడం బాగా అనిపిస్తుంది. మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళ పాత్రలకు తగ్గట్టు చేశారు. పాటలు కూడా బాగున్నాయి. కానీ ఫన్ మాత్రం ఇంకా కొంచెం ఉంటే బాగుండేది. కామెడీ సీన్స్ ఇంకా కొంచెం బాగా రాసుకొని ఉంటే తెరపై బాగా కనిపించేది.
ప్లస్ పాయింట్స్ :
- 90ల పరిస్థితులు చూపించిన విధానం
- నటీనటుల పర్ఫార్మెన్స్
- సహజంగా ఉండే డైలాగ్స్
- కొన్ని ఎమోషనల్ సీన్స్
మైనస్ పాయింట్స్:
- తెలిసిపోయే కథనం
- స్లో గా ఉండే కొన్ని సీన్స్
రేటింగ్ :
3.25/5
ట్యాగ్ లైన్ :
సిరీస్ మొత్తం కూడా చాలా నేచురల్ గా ఉంటుంది. కథనం తెలిసిపోయేలాగా ఉన్నా కూడా ఎక్కడా బోర్ కొట్టించకుండా ఉంటుంది. చాలా చోట్ల ప్రేక్షకులు కనెక్ట్ కూడా అవుతారు. ఒక మంచి ఫీల్ గుడ్ వెబ్ సిరీస్ గా 90 స్ సిరీస్ నిలుస్తుంది.
watch trailer :
ALSO READ : హీరో సిద్ధార్థ్ భార్యను ఎప్పుడైనా చూసారా..? ఆమె గురించి మీకు ఈ విషయం తెలుసా..?




ఫీల్ గుడ్ మలయాళ మూవీ ‘హోమ్’ కి రోజిన్ థామస్ దర్శకత్వం వహించారు. ఇంద్రన్స్, మంజు పిళ్లై, శ్రీనాథ్ భాసి, దీపా థామస్, నస్లెన్ కె. గఫూర్, జానీ ఆంటోని, కైనకరి థంకరాజ్ వంటివారు ఈ చిత్రంలో నటించారు. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో 2021లో ఆగస్టు 19న విడుదలైంది.
ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, 60 ఏళ్ల ఒలివర్ ట్విస్ట్ (ఇంద్రాన్స్)ఇద్దరు కొడుకులకు తండ్రి. పెద్ద కొడుకు ఆంటోనీ (శ్రీనాథ్ బాసి), చిన్న కొడుకు చార్లెస్( నస్లెన్ కె. గఫూర్). ఆంటోనీ దర్శకుడు. అతను తీసిన మొదటి మూవీ పెద్ద విజయం సాదిస్తుంది. కానీ కానీ రెండవ మూవీకి స్టోరీ రాయలేక, ఏకాగ్రత కుదరక ఇబ్బందులు పడతాడు. మవతి మూవీ కథ రాసిన తన ఇంట్లోనే రాయాలని భావించి, ఇంటికి వస్తాడు. పెద్ద కొడుకు ఇంటికి రావడంతో ఒలివర్ చాలా సంతోషపడతాడు. తన మిత్రులతో ఆంటోనీ గురించి గొప్పగా చెప్పుకుని ఆనందపడతాడు.
అయితే ఆంటోనీ మాత్రం తన తండ్రి ఒలివర్ తో ఒక్కసారి కూడా ప్రేమగా మాట్లాడడు. ఎల్లప్పుడు ఫోన్ చూస్తూ ఉంటాడు.తండ్రి ఏం మాట్లాడినా ఫోన్ చూసుకుంటూ ఆంటోనీ ‘ఊ ఊ’ అని అంటుంటాడు. అయితే తన కొడకులు ఇద్దరు ఎందుకు ఆ స్మార్ట్ ఫోన్కి బానిసలా మారి, తమ చుట్టూ ఉన్నవాళ్ళను పట్టించుకోవడం లేదని అనుకుంటాడు. ఒలివర్ టెక్నాలజీ గురించి తెలుసుకోవాలని, ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వంటి గురించి తెలుసుకుంటుంటాడు. ఆ తరువాత తండ్రి కొడుకుల మధ్య ఏం జరిగింది? ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి అనేది మిగిలిన స్టోరీ.
భరత్ తమిళ, మలయాళం, హిందీ, తెలుగు భాషలలో హీరోగా, సైడ్ హీరోగా పలు చిత్రాల్లో నటించారు. 2020 లో మలయాళంలో విజయం సాధించిన లవ్ మూవీని అదే టైటిల్ తో భరత్ హీరోగా తమిళంలో రీమేక్ చేశారు. ఈ చిత్రంలో వాణిభోజన్ హీరోయిన్గా నటించింది. ఈ ఏడాది జూలై 28న రిలీజ్ అయిన ఈ మూవీకి ఆర్పీ బాల దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 8 నుండి ఈ రొమాంటిక్ థ్రిల్లర్ ప్రముఖ ఓటీటీ ఆహాలో తెలుగులో స్ట్రీమింగ్ కి వచ్చింది.
ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే, అజయ్, దివ్య ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. వీరి పెళ్లి వద్దని దివ్య తండ్రి వద్దని ఎంతగా చెప్పినా వినకుండా అజయ్ ని పెళ్లి చేసుకుంటుంది. అయితే పెళ్లైన సంవత్సరంలోనే ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభం అవుతాయి. అజయ్ చేస్తున్న బిజినెస్లో నష్టాలు రావడంతో, మద్యానికి బానిస అవుతాడు. అదే సమయంలో దివ్య గర్భవతి అని తెలుస్తుంది. చెకప్ కోసం దివ్య హాస్పటల్ కి వెళుతుంది.
అజయ్ ఇంట్లోనే తాగుతూ ఉంటాడు. దివ్య కాల్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడు. దాంతో దివ్య అతని పై సీరియస్ అవుతుంది. అతనిలో మార్పు రాదని శాశ్వతంగా అతని నుండి వెళ్లిపోవడానికి సిద్ధం అవుతుంది. అజయ్ ఎంతగా కన్వీన్స్ చేసినా దివ్య అతని మాట వినదు. దాంతో కోపం వచ్చిన అజయ్ దివ్యను నెట్టేస్తాడు. ఆమెకు దెబ్బ బలంగా తగలడంతో అక్కడిక్కడే చనిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అజయ్ లైఫ్ లో ఏలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది మిగిలిన కథ.





నటుడు రాజ్ బి. శెట్టి కన్నడ చిత్రసీమలో ఓ ట్రెండ్ ను సృష్టించారు. ఇండస్ట్రీలో తన మార్క్ ను చూపించారు. శెట్టి నటుడు మాత్రమే కాదు దర్శకుడు మరియు స్క్రీన్ రైటర్ కూడా. ఆయన నటించే చిత్రాలన్నీ వైవిధ్యంగా ఉంటాయి. యుక్ మొత్తే కతి, గరుడ గమన వృషభ వాహన చిత్రాలలో విభిన్నమైన కథలతో ఆడియెన్స్ కు చేరువయ్యారు. రక్షిత్ శెట్టి, రిషభ్ శెట్టిలకి మంచి స్నేహితుడు. ఈ ముగ్గురి నుండి సినిమా వస్తుందంటే కన్నడ ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తుంటారు.
ఈ ఏడాది రాజ్ బి. శెట్టి మరొక డిఫరెంట్ మూవీ ‘టోబి’ తో ఆడియెన్స్ ని పలకరించారు. టోబి మూవీ ఆగస్ట్ 25న రిలీజ్ అయ్యి, హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ మూవీ సోనీ లీవ్ లో తెలుగులోను స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే, టోబీ ఒక విడిచిపెట్టిన పిల్లవాడు. చిన్నతనంలో అనేక వేధింపులకు గురి అవుతాడు. అతనికి పేరు కూడా లేదు. ఆ పిల్లవాడికి ఆశ్రయం ఇచ్చినవారు టోబీ అని పిలుస్తారు.
టోబీ కోపం ఎక్కువగా ఉంటుంది. అతనికి కోపం వచ్చినపుడు చంపేస్తాడు. టోబీతో పాటు అతని కోపం కూడా పెరుగుతుంది. విపరీతమైన కోపం వల్ల అతను పాపులర్ అవుతాడు. అతనికి నచ్చినవారు చెబితేనే ఏదైనా వింటాడు. అయితే కొందరు వ్యక్తిని కొందరు టోబీని స్వార్ధం కోసం వాడుకుంటారు. ఆ విషయం తెలుసుకున్న టోబీ ఏం చేశాడు? వారి పై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అనేది మిగిలిన కథ.
ఈ సిరీస్ కి శరత్ జోతి దర్శకత్వం వహించగా, ప్రభావతి నిర్మించారు. వీరప్పన్ స్వయంగా చెప్పిన విషయాల ఆధారంగా ‘కూసీ మునుసామి వీరప్పన్’ డాక్యుమెంటరీ సిరీస్ ను రూపొందించారు. 1993-1996 కాలంలో వీరప్పన్ ఇంటర్వ్యూ కోసం గోపాల్ అనే విలేకరి అడవిలోకి వెళ్లి, తీసిన వీడియోలు, తన గురించి తానే వీరప్పన్ చెప్పిన దాని ఆధారంగా ఆరు ఎపిసోడ్ లతో ఈ సిరీస్ను తెరకెక్కించారు.
ఇక ఈ సిరీస్ కథ విషయానికి వస్తే, స్వయంగా వీరప్పన్ తన గురించి, తన లైఫ్ గురించి వివరించారు. వేటగాళ్ల ఫ్యామిలిలో కూసే మునిసామి వీరప్పన్ ఐదుగురు పిల్లలలో రెండో అబ్బాయిగా జన్మించాడు. చిన్నవయసులో తన ఆకలిని తీర్చుకోవడానికి కుటుంబ వృత్తి వేటాడడం ప్రారంభించాడు. మొదట్లో ఆకలి తీర్చుకోవడం కోసం వేటాడినా, కాలక్రమేణా దాని వల్ల కోట్ల రూపాయలు సంపాదించాడు. వీరప్పన్ దశాబ్దాల పాటు తమిళనాడు, కర్ణాటక బార్డర్ లోని అడవులను దోచుకున్నాడు.
వీరప్పన్ కనిపించిన గంధపు చెట్టునల్లా అమ్మడం, ఏనుగులను చంపి వాటి దంతాలు కూడా అమ్మడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో వీరప్పన్ వందలాది మందిని చంపేశాడు. అంతేకాకుండా తనకు వ్యతిరేకంగా ఉన్న పోలీసు ఆఫీసర్లను, పోలీస్ ఇన్ఫార్మర్ అనే సందేహం కలిగినా కూడా చంపేశాడు. తను ఇంతగా ఎందుకు మారాడు? వీరప్పన్ జీవితంలోని ముఖ్యమైన సంఘటనలను గురించి తానే స్వయంగా చెప్పాడు. ఆ విషయాలన్ని తెలుసుకోవాలంటే సిరీస్ చూడాల్సిందే..
