మెగాస్టార్ చిరంజీవి ఆంజనేయ స్వామికి పెద్ద భక్తుడని అందరికీ తెలిసిందే. ఇదే విషయం ఆయన చాలాసార్లు ఇంటర్వ్యూలలో కూడా చెప్పుకొచ్చారు. అయితే ఆయన ఎందుకు హనుమంతుడిని అంతగా అభిమానిస్తారు అనే విషయం ఇప్పటివరకు ఎవరికీ పెద్దగా తెలియదు. అయితే హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన చిరంజీవి సినిమా గురించి మాట్లాడుతూ అలాగే తన భక్తి గురించి కూడా ఈ విధంగా చెప్పుకొచ్చారు.

చిన్నప్పుడు నాన్నగారు కమ్యూనిస్టు అవటం వలన దేవుడని పెద్దగా ప్రార్థించే వారు కాదు అమ్మ ఒత్తిడి మేరకు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని అప్పుడప్పుడు దర్శించుకునే వారు. పొన్నూరులో ఏడో తరగతి చదువుకునే సమయంలో ఆంజనేయస్వామి గుడి ఉండేదట. రోజు దండం పెట్టుకొని వచ్చేవాడట చిరంజీవి. ఎనిమిదవ తరగతి బాపట్లలో చదువుకునే సమయంలో కూడా అక్కడ ఆంజనేయస్వామి గుడి ఉండేది ట్యూషన్ కి వెళ్లి వచ్చేటప్పుడు ఆ గుడి వద్ద ప్రసాదం ఇచ్చేవారు.
ఆ ప్రసాదం కోసం వెళ్ళీ వెళ్ళీ ఆంజనేయుడు పై భక్తి ఏర్పడిందని చెప్పుకొచ్చారు చిరంజీవి. మొగల్తూరులో చదువుకునే సమయంలో రోడ్డుపై మిఠాయి కొంటే హనుమంతుడి క్యాలెండర్ బహుమతిగా ఇచ్చారు. ఆ బొమ్మ ఇప్పటికీ ఇంట్లో ఉంది. అలాగే చిరంజీవి పదో తరగతి చదువుకునే సమయంలో తండ్రికి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయింది. అక్కడికి వెళ్ళటం ఇష్టం లేని తన తండ్రి లాంగ్ లీవ్ పెట్టేసారట ఆ సమయంలో ఆయన బాగా ఒత్తిడికి గురవుతుంటే హనుమాన్ చాలీసా చదవమని చిరంజీవి సలహా ఇచ్చారట.

సంశయిస్తూనే హనుమాన్ చాలీసా చదివిన తన తండ్రికి ఉన్న ఊర్లోనే మళ్లీ జాబ్ ట్రాన్స్ఫర్ అయిందట అప్పటినుంచి తన తండ్రికి కూడా హనుమంతుడి మీద భక్తి ఏర్పడిందని చెప్పుకొచ్చారు చిరంజీవి. అలాగే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరాలనుకునే సమయంలో కూడా ఆంజనేయస్వామి బొమ్మ దొరకటం దానిని లాకెట్ గా చేసి మెడలో వేసుకోవడం ఆ తర్వాత అవకాశాలు రావటం ఇలాంటి విషయాలన్నీ చెప్పుకొచ్చారు చిరంజీవి. అలాగే హనుమాన్ మూవీ టైటిల్ కూడా మొదటగా తన నోటి నుంచి వచ్చిందని,నేను ఏదో ఇంటర్వ్యూలో చెప్తే దాన్ని టైటిల్ గా పెట్టుకున్నారు అంటూ చెప్పుకొచ్చారు చిరంజీవి.

హనుమజ్జయంతి రోజున చిరు పోస్ట్ చేసారు…ఈ రోజు హనుమజ్జయంతి. ఆంజనేయస్వామి తో నాకు చాలా అనుబంధం ఉంది…చిన్నప్పటి నుంచి…1962 లో నాకు ఓ లాటరి లో ఈ బొమ్మ వచ్చింది..అప్పటి నుంచి ఇప్పటి దాకా ఆ బొమ్మ నా దగ్గర అలాగే భద్రంగా ఉంది..ఉంది అని చెప్పటం కంటే దాచుకున్నాను అని చెప్పటం కరెక్ట్. కారణం ఏంటో తెలుసా?ఆ రోజు నా చేతిలో ఆ బొమ్మ చూసి మా నాన్న గారు, “ఆ కనుబొమ్మలు, కళ్ళు, ముక్కు అచ్చం నీకు అలానే ఉన్నాయి” అన్నారు. అప్పటి నా ఫోటో..

కొన్ని దశాబ్దాల తరవాత, 2002 లో, బాపుగారు నా ఇంట్లో పెట్టుకునేందుకు నాకు ఇష్టమైన ఆంజనేయస్వామిని చిత్రించి పంపుతాను అన్నారు. నేను అది పాలరాతి మీద reproduce చేయించి పూజ గదిలో పెట్టుకున్నాను. ఈ బొమ్మ నాకు ఇచ్చేటప్పుడు ఆయన ఏమన్నారో తెలుసా …? బాపు గారు చెప్పిన మాట “ఏంటోనండి …బొమ్మని గీస్తుంటే మీ పోలికలే వచ్చాయండి …అలానే ఉంచేసాను …మార్చలేదు ” అన్నారు. చిత్రకారుల ఊహలో స్వామివారి పోలికలు నాకు ఉండటం చిత్రమే. అందరికి హనుమజ్జయంతి శుభాకాంక్షలు.

అక్కినేని నాగార్జున, ఆషికా రంగనాథ్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘నా సామి రంగా’ జనవరి 14కి రిలీజ్ కానుంది. ఈసారి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర పోటీ ఎక్కువగానే ఉంది. గుంటూరు కారం, సైంధవ్, హనుమాన్, సినిమాలతో పాటు డబ్బింగ్ మూవీ అయలాన్ కూడా రిలీజ్ కానుంది. ఈ ఐదు సినిమాలు ఒకటి, రెండు రోజుల తేడాతో రిలీజ్ కానున్నాయి. ‘నా సామి రంగా’ రీమేక్ మూవీ అనే విషయం తెలిసిందే.
మూడేళ్ళ క్రితం మలయాళంలో రిలీజ్ అయ్యి, సూపర్ హిట్ అయిన పొరింజు మరియం జోస్ మూవీని తెలుగులో రీమేక్ చేశారు. అయితే ఈ మూవీ యాంటీ క్లైమాక్స్ మూవీ. నాగార్జున ఇలాంటి స్టోరీని సెలెక్ట్ చేసుకుని రిస్క్ చేస్తున్నారా అనే టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ రీమేక్ అని తెలిసిన వెంటనే చాలామంది మలయాళ మూవీని చూశారు. ఇక మలయాళ మూవీ స్టోరీ, కథనం తెలుగుకి వర్కౌట్ కాదు. ఎందుకంటే మలయాళ మూవీలో హీరో పాత్ర చనిపోవడంతో సినిమా ముగుస్తుంది.
ఈ చిత్రంలో ఆ సీన్ ను ఏమైనా మార్చరా లేదంటే, తెలుగు ప్రేక్షకులు అలాంటి ముగింపును అంతగా ఇష్టపడరు. అలా వచ్చిన సినిమాలు ఎన్నో ప్లాప్ అయ్యాయి. గతంలో నాగార్జున నటించిన ‘స్నేహమంటే ఇదేరా’ మూవీ కూడా సాడ్ ఎండింగ్ ఉంటుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఈ మూవీ అలా కాకూడదని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అంతేకాకుండా ఇటీవల కాలంలో రిలీజ్ అయిన రీమేక్ సినిమాలు తీవ్రంగా నిరాశపరిచాయి. దాంతో నాగార్జున ఇంత రిస్క్ చేయడం అవసరమా అంటున్నారు.



బిగ్ బాస్ షోకి ఎంత పాపులారిటీ క్రేజ్ ఉన్నప్పటికీ, షో చుట్టూ అదే స్థాయిలో వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. రీసెంట్ గా బిగ్ బాస్ సీజన్ 7 ముగిసిన విషయం తెలిసిందే. గ్రాండ్ ఫినాలే తరువాత చోటు చేసుకున్న ఘటనలు, రన్నర్ పై దాడి, విజేత అరెస్ట్ ఎంత సంచలనం సృష్టించాయో తెలిసిందే. తాజాగా సీజన్ 7లో పాల్గొనాలనే ఆశతో యాంకర్ స్వప్న చౌదరి డబ్బు ఇచ్చియానట్టు, కానీ తనకౌ ఛాన్స్ ఇవ్వలేదని ఓ వీడియోని రిలీజ్ చేసింది. ఆ వీడియోలో ఆమె ” నా పేరు స్వప్న చౌదరి అమ్మినేని, యాంకర్ అండ్ యాక్టర్. మిస్టరీ, నమస్తే సేట్ జీ అనే సినిమాల ద్వారా ఇండస్ట్రీకి రావడం జరిగింది.
కొంతమందికి అయితే నేను తెలుసు యాంకర్ స్వప్న గా, యాక్టర్ స్వప్నగా చాలామందికి తెలుసు. నాకు బిగ్ బాస్కి వెళ్లడం అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే, నేను నిద్రపోయినప్పుడు కనే కలలో సైతం బిగ్ బాస్ హౌస్లో ఉన్నట్టే కలకంటాను. బిగ్ బాస్ సీజన్ 1 నుంచి సీజన్ 7 వరకూ చాలా ఇష్టంగా చూశాను. బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్గా పంపిస్తానని చెప్పి, నా దగ్గర నుండి రెండు లక్షల యాబై వేలు తీసుకున్నారు. శని, ఆదివారాల్లో వేసుకునే క్యాస్ట్యూమ్స్కి డబ్బులు కావాలి అని, తమ్మలి రాజు అనే వ్యక్తి రెండున్నర లక్షలు తీసుకున్నారు. అందుకు సంబంధించి బాండ్ పేపర్పై అగ్రిమెంట్ ఇచ్చారు. గత జూన్ లో డబ్బు ఇచ్చాను.
లాస్ట్ మూమెంట్ వరకు నువ్వు కన్ఫామ్ అన్నారు. కానీ వేరే వాళ్ల నేను ట్రై చేస్తానని చెప్తే, అవసరం లేదు. నేనే పంపిస్తానని అన్నారు. డబ్బు ఎందుకని అడిగితే, పీఆర్ రేటింగ్ పెంచుకోవడం కోసం, కాస్ట్యూమ్స్ కి అని చెప్పాడు. డబ్బు తీసుకోవాడమే కాకుండా, నాతో ఫొటో షూట్ చేయించారు. అందుకు రూ. 25 వేల వరకు ఖర్చు అయ్యింది. జూన్లో డబ్బు ఇస్తే, ఇప్పటికి 8 నెలలు అవుతుంది. ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నానంటే బిగ్ బాస్ సీజన్ 7లో ఛాన్స్ రాలేదు కదమ్మా, సీజన్ 8లో పంపిస్తానని చెప్పి డబ్బు ఇవ్వలేదు. కానీ నాకు ఒక అగ్రిమెంట్ అయితే రాసి ఇచ్చారు.
ఇందులో సీజన్ 7 లో పంపలేకపోయాను. డబ్బు మాత్రం డిసెంబర్ వరకు ఇస్తానని రాయడం జరిగింది. ఇందుకోసం ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకుని ఇచ్చాను. జనవరి 6న ఇస్తానని చెప్పాడు. ఆ రోజున కాల్ చేస్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తావా ఇచ్చుకో.. ప్రెస్ మీట్ పెడతావ పెట్టు అని మాట్లాడాడు. బిగ్ బాస్ మేనేజ్మెంట్ వాళ్లు ఇటువంటి చీడ పురుగుల్ని ఎంకరేజ్ చేయవద్దు. ఇలాంటి వ్యక్తులను గమనించండి. బిగ్ బాస్కి పంపిస్తాం అంటూ డబ్బులు తీసుకుని చీట్ చేస్తున్నారు. దయచేసి నాకు సపోర్ట్ చేయండి. సీజన్ 8 లో అయినా నేను వెళ్ళాలి. నా అమౌంట్ నాకు రావాలి” అంటూ స్వప్న చౌదరి తన ఆవేదన వ్యక్తం చేసింది.

మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో అతడు, ఖలేజా లాంటి క్రేజీ చిత్రాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో గుంటూరు కారం మూవీ పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఎస్.రాధాకృష్ణ(చినబాబు) హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ మీద ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ మూవీ నుండి టీజర్, మూడు పాటలు, పోస్టర్ లు రిలీజ్ అయ్యాయి.
ఆదివారం నాడు సుదర్శన్ థియేటర్లో ఫ్యాన్స్ మధ్య గుంటూరు కారం ట్రైలర్ విడుదల చేశారు. ఆ తరువాత కొద్దిసేపటికే యూట్యూబ్ లోనూ విడుదల అయ్యింది. రెండు నిమిషాల, 47 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ మహేష్ పాత్రను, బాడీ లాంగ్వేజ్ హైలెట్ అయ్యే విధంగా చూపించారు. మహేష్ స్క్రీన్ ప్రెజెన్స్ తో ఫిదా చేశాడు. మహేష్ డైలాగ్స్ ఆడియెన్స్ ని ఆకట్టుకున్నాయి. ఇక హీరోయిన్లు శ్రీలీల , మీనాక్షిల గ్లామర్ సైతం ఆకట్టుకుంది. ట్రైలర్ ప్రారంభంలో ప్రెస్ మీట్ లో రమ్యకృష్ణను ఒక జర్నలిస్ట్ ప్రశ్నలు అడుగుతున్నట్టుగా కనిపించింది.
అతని వాయిస్ త్రివిక్రమ్ వాయిస్ లా ఉంది. దాంతో ఈ మూవీలో త్రివిక్రమ్ కనిపించే ఛాన్స్ ఉందమో అని టాక్. అంతే కాకుండా మహేష్ పాత్ర చిన్నప్పుడు నిప్పు రవ్వ కంట్లో పడినట్టుగా కనిపించింది. ఒకవేళ మహేష్ కంటికి సమస్య ఏదైనా ఉందన్నట్టుగా చూపిస్తారేమో, రెండు సీన్స్ లో మహేష్ కన్ను ఒకటి మూసి చూడడం కనిపించింది. ప్రొడ్యూసర్ నాగవంశీ ఓ ఫైట్ సీన్ లో ఇద్దరు సూపర్ స్టార్లు ఉన్న ఫీల్ ను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు అంటూ ఇప్పటికే హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మూవీలో సర్ ప్రైజ్ ఎంట్రీ ఉంటుందా అంటూ చర్చ జరుగుతోంది.























