ప్రముఖ యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల కొడుకు రోషన్ హీరోగా పరిచయం అవుతూ వచ్చిన బబుల్గమ్ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి రవికాంత్ పేరేపు దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
- చిత్రం : బబుల్గమ్
- నటీనటులు : రోషన్ కనకాల, మానస చౌదరి, వైవా హర్ష, అను హాసన్.
- నిర్మాత : మహేశ్వరి మూవీస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
- దర్శకుడు : రవికాంత్ పేరేపు
- సంగీతం : శ్రీ చరణ్ పాకాల
- విడుదల తేదీ : డిసెంబర్ 29, 2023

స్టోరీ:
ఆదిత్య అలియాస్ ఆది (రోషన్ కనకాల) హైదరాబాద్ లో నివసించే ఒక సాధారణమైన కుటుంబానికి చెందిన అబ్బాయి. ఎప్పటికైనా సరే ఆదికి డీజే అయ్యి గుర్తింపు తెచ్చుకోవాలి అనే ఆశయం ఉంటుంది. దాని కోసం ఒక ప్రముఖ డీజే దగ్గర అసిస్టెంట్ గా చేరతాడు. మరొక పక్క జాన్వి అలియాస్ జాను (మానస చౌదరి) చదువుల కోసం అమెరికాకి వెళ్దాం అనుకుంటుంది. అంతలోపు టైం పాస్ కోసం ఇక్కడ ఆదిని ఇష్టపడుతున్నాను అని చెప్తుంది. కానీ ఆది మాత్రం జానుని నిజంగానే ఇష్టపడతాడు. జాను కూడా తెలియకుండా ఆదితో ప్రేమలో పడిపోతుంది.

అయితే ఒక రోజు జాను ఒక పార్టీలో తన మాజీ బాయ్ ఫ్రెండ్ తో క్లోజ్ గా ఉంటుంది. ఇది చూసిన ఆది బాధపడుతూ ఉన్నప్పుడు జాను స్నేహితురాలు ధరణి వచ్చి ఆదితో క్లోజ్ గా మూవ్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది. ఇదంతా చూసిన జాను కోపం తెచ్చుకొని ఆదిని తిడుతుంది. తాను లేకపోతే అసలు ఆదికి ఈ స్టేటస్ అంతా వచ్చేది కాదు అన్నట్టు మాట్లాడుతుంది. దాంతో ఆదికి కోపం వస్తుంది. అప్పుడు ఆది ఏం చేశాడు? జానుకి బుద్ధి చెప్పాడా? తాను అనుకున్నట్టుగానే పెద్ద డీజే అయ్యాడా? వీరి ప్రేమ కథ ఏం అయ్యింది? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

రివ్యూ:
ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి, ఒక రిచ్ అమ్మాయి, వాళ్ళు అనుకోకుండా కలవడం, ఆ తర్వాత ప్రేమించుకోవడం, గొడవలు అవ్వడం. ఇలాంటి టెంప్లేట్ ఉన్న సినిమాలు మనం చాలా చూశాం. అసలు ఒక రకంగా చెప్పాలి అంటే ఇది చాలా సంవత్సరాల నుండి వస్తున్న ఒక కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ని చాలా మంది దర్శకులు తమ స్టైల్ లో మార్చి తీశారు. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ మీద మరొక సినిమా వచ్చింది. బబుల్గమ్ సినిమా కథ పరంగా చూస్తే చాలా తెలిసిన కథ ఉన్న సినిమా. సినిమా చూస్తూ ఉంటే నెక్స్ట్ ఏమవుతుంది అనేది ఎవరైనా చెప్పేస్తారు.

కానీ ఈ తరానికి తగ్గట్టు కొన్ని మార్పులు చేశారు అంతే. దర్శకుడు రవికాంత్ అంతకుముందు క్షణం, కృష్ణ అండ్ హిస్ లీల సినిమాలకి దర్శకత్వం వహించారు. క్షణం సినిమా సైలెంట్ గా వచ్చి హిట్ అయితే, కృష్ణ అండ్ హిస్ లీల సినిమా ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా అని గుర్తింపు తెచ్చుకుంది. ఈ రెండు సినిమాలతో పోల్చి చూస్తే ఇప్పుడు వచ్చిన బబుల్గమ్ సినిమాలో కాన్సెప్ట్ కొంచెం వీక్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. క్లైమాక్స్ మాత్రం కాస్త కన్ఫ్యూజింగ్ గా అనిపిస్తుంది.

కానీ మిగిలిన సినిమా అంతా చాలా చోట్ల సాగదీసినట్టు అనిపిస్తుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మొదటి సినిమా అయినా కూడా రోషన్ కనకాల చాలా బాగా చేశారు. అతని పర్ఫార్మెన్స్ చూస్తూ ఉంటే సినిమా కోసం కష్టపడ్డారు అని అర్థం అవుతూ ఉంటుంది. హీరోయిన్ మానస చౌదరి గ్లామరస్ గా కనిపించారు. కానీ పర్ఫార్మెన్స్ పరంగా మాత్రం ఇంకా కొంచెం మెరుగుపరుచుకోవాల్సి ఉంది. హీరో స్నేహితుడుగా వైవా హర్ష కూడా కామెడీ చేశారు.

సినిమాకి హైలైట్ అయిన మరొక పాత్ర హీరో తండ్రి పాత్ర. ఈ పాత్రలో నటించిన చైతు జొన్నలగడ్డ కూడా చాలా బాగా నటించారు. శ్రీ చరణ్ పాకాల అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా స్లోగా నడుస్తుంది. కామెడీ అక్కడక్కడ వర్కౌట్ అయ్యింది. అయినా కూడా చాలా చోట్ల సాగదీసినట్టు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ చాలా బెటర్ గా ఉంది. అయినా కూడా చాలా తెలిసిపోయే కథ కావడంతో ప్రేక్షకులకి నెక్స్ట్ ఏమవుతుంది అనేది అర్థం అవుతుంది. కథనం విషయంలో ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్:
- నటీనటుల పర్ఫార్మెన్స్
- పాటలు
- క్లైమాక్స్
- కొన్ని కామెడీ సీన్స్
మైనస్ పాయింట్స్:
- బాగా తెలిసిన కథ
- సాగదీసినట్టుగా ఉన్న సీన్స్
రేటింగ్ :
2.5/5
ట్యాగ్ లైన్:
పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా, దర్శకుడు ముందు సినిమాలతో పోల్చకుండా, అసలు రోషన్ కనకాల ఎలా చేశాడు అని చూద్దాం అనుకునే వారికి, రొటీన్ కథ అయినా పర్వాలేదు, సాగదీసినట్టుగా ఉన్నా పర్వాలేదు. అసలు టేకింగ్ ఎలా ఉంది అని తెలుసుకుందామని అనుకునే వారికి బబుల్గమ్ సినిమా ఒక్కసారి చూడగలిగే యావరేజ్ సినిమాగా నిలుస్తుంది.
watch trailer :
ALSO READ : 17 ఏళ్ళ క్రితం వచ్చిన సినిమా ఇప్పుడు ఎందుకు ట్రెండ్ అవుతుంది.. ఆ ఇద్దరే కారణమా..?







ఈ సినిమాలో దినేష్ తేజ్ హీరోగా, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ హీరోయిన్స్ గా నటించారు. ఈ చిత్రాన్ని కొమ్మాలపాటి సాయి సుధాకర్ విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించారు. ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే, గణేష్ (దినేష్ తేజ్) విశాఖపట్నం దగ్గరలో ఉన్న పల్లెటూరికి చెందిన మిడిల్ క్లాస్ యువకుడు. అతనికి సినిమాలంటే పిచ్చి. ఎప్పటి కైనా దర్శకుడు కావాలని కలలు కంటుంటాడు. గణేష్ జీవితంలోకి ఆ ఊరి అమ్మాయి దివ్య (పాయల్ రాధాకృష్ణ) ఎంట్రీ ఇస్తుంది. ఇద్దరు ప్రేమలో పడతారు.
కానీ వారి లవ్ కు దివ్య అమ్మ కనకమ్మ (ఝాన్సీ) అడ్డుగా నిలుస్తుంది. ఆమె అప్పటికే దివ్యకు కాళీ (శత్రు) తో పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతుంది. విషయం తెలిసిన దివ్య, గణేష్ దగ్గరికి వెళ్ళి పెళ్లి గురించి చెప్పి ఎలాగైనా ఆపమని కోరుతుంది. కానీ దర్శకుడు కావాలనుకున్న గణేష్ కు ఏం చేయాలో అర్ధం కాదు. పెళ్లి కన్నా కెరీర్ ముఖ్యమని సినిమా ఛాన్స్ కోసం హైదరాబాద్ వెళతాడు.
సలార్ మూవీ హిట్ తో పాపులర్ అయిన నటినటులలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు శ్రియా రెడ్డి. ఆమె సలార్ లో రాజమన్నార్ కుమార్తె, రాధా రామ మన్నార్ క్యారెక్టర్ లో అద్బుతంగా నటించి మెప్పించారు. ఈ మూవీ ముందు కోలీవుడ్ లో మాత్రమే పాపులర్ అయిన శ్రియా రెడ్డి, ఈ మూవీ రిలీజ్ అయ్యాక దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. పాన్ ఇండియా స్టేటస్ పొందారు.
తన నటనతో అందర్నీ ఆమె వైపుకు తిప్పుకున్నారు. దాంతో ఆమె గురించి తెలుసుకోవ డానికి నెట్టింట్లో ఆరా తీస్తున్నారు.ఈ క్రమంలో ఆమె నటించిన తిమిరి తెలుగులో పొగరు సినిమా ట్రెండింగ్ లోకి వచ్చింది. ఈ చిత్రం 2006 లో రిలీజ్ అయ్యింది. కోలీవుడ్ స్టార్ విశాల్ ఈ మూవీలో హీరోగా నటించారు. రీమాసేన్ హీరోయిన్ గా నటించగా, ఈశ్వరి పాత్రలో శ్రియా రెడ్డి నటించారు. ఈ చిత్రలో ఈశ్వరిగా శ్రియా రెడ్డి తన నటనతో గుర్తింపు తెచ్చుకున్నారు.
ఈశ్వరి పాత్రలో ఒదిగిపోయి, హీరోతో పోటీ పడి నటించారు. ఈ మూవీ ట్రెండింగ్ లోకి రావడానికి మరో కారణం జైలర్ సినిమాలో విలన్ గా నటించిన వినాయకన్. పొగరు సినిమాలో వినాయకన్ నటించాడు. ఈశ్వరి పాత్రకు సహకరించే పాత్రలో మాయిగా వినాయకన్ నటించారు. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ, వీరిద్దరు సలార్, జైలర్ చిత్రాలతో పాపులర్ అయ్యారు.
ప్రభాస్, శృతిహాసన్ జంటగా నటించిన సలార్ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటించాడు. జగపతిబాబు, శ్రీయా రెడ్డి, ఈశ్వరి రావు, బాబీ సింహా, ప్రమోద్ పంజు ఇతర కిలక పాత్రలలో నటించారు. ఈ చిత్రం తొలి షోతోనే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని, భారీ కలెక్షన్స్ సాధిస్తోంది. ఈ చిత్రమలో నటించిన నటీనటులు దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. అలాంటివారిలో ప్రమోద్ పంజు ఒకరు.
సలార్ లో వరద రాజమన్నార్ తమ్ముడు బాచి మన్నార్ పాత్రలో నటించి, మెప్పించాడు. ప్రమోద్ పంజు కన్నడంలో పాపులర్ యాక్టర్. 1990లో జనవరి 10న జన్మించాడు. మాండ్య జిల్లాకు చెందినవాడు. ప్రమోద్ పంజు మద్దూరులోని సెయింట్ ఆన్స్ ఉన్నత పాఠశాలలో చదువును పూర్తి చేశాడు. సురానా కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. 2015 లో శాండల్ వుడ్ లో అడుగుపెట్టాడు.
ప్రమోద్ నటించిన మొదటి సినిమా గీతా బ్యాంగిల్ స్టోర్లో 11 సెప్టెంబర్ 2015న విడుదలైంది. ఆ తర్వాత 2019లో కన్నడ చిత్రం ప్రీమియర్ పద్మినిలో నటించాడు. మట్టే ఉద్భవ, అతను బుల్లితెర పై చుక్కి, పునర్వివాహ వంటి సీరియల్స్ లో నటించి, పాపులర్ అయ్యాడు. ప్రమోద్ మహాదేవి సీరియల్లో శివుడిగా నటించాడు. ఈ ఏడాది సలార్ పార్ట్ 1 లో నటించి, మరింత పాపులర్ అయ్యారు.