శ్రీలీల ఇప్పుడు ఈ పేరు టాలీవుడ్ లో ఒక సెన్సేషన్. పెళ్లి సందడి చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంటర్ అయిన శ్రీ లీల ఇప్పుడు మోస్ట్ బిజిఎస్ట్ హీరోయిన్ గా మారిపోయింది. టాలీవుడ్ లో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి హీరో సినిమాలను శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది.
తన డాన్స్ మూమెంట్లతో క్రేజీ క్రేజీ ఎక్స్ప్రెషన్లతో యూత్ లో బాగా పాపులర్ అయింది. ప్రతి డైరెక్టర్ హీరోకి ఫస్ట్ ఛాయిస్ శ్రీ లీల అనే రేంజ్ కి వెళ్ళింది.

ప్రస్తుతం శ్రీ లీల నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాలో కీలకమైన పాత్రలో నటించింది. ట్రైలర్లో బాలకృష్ణకి శ్రీ లీలకి మధ్య ఉన్న అనుబంధం ఆకట్టుకునే విధంగా ఉంది. భగవంత్ కేసరి ట్రైలర్ లాంచ్ లో బాలయ్య తన నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ గా శ్రీ లీల యాక్ట్ చేస్తే బాగుండు అని ప్రకటించారు అంటేనే తెలుస్తుంది శ్రీ లీలకు ఉన్న క్రేజ్.

భగవంత్ కేసరి సినిమా దసరా రేస్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ జెట్ స్పీడులో చేస్తున్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. బాలయ్యను నెవర్ సీన్ బిఫోర్ అవతార్ లో ప్రెసెంట్ చేసినట్లు తెలిపారు. బాలయ్య శ్రీలీల మధ్య రిలేషన్ కూడా బాగా ఎస్టాబ్లిష్ అయింది అని టాక్. ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ అనిల్ రావుపూడి ఒక సీక్రెట్ రివీల్ చేశారు.శ్రీలీలకి తనకి మధ్య ఉన్న అనుబంధం కేవలం డైరెక్టర్ హీరోయిన్ మాత్రమే కాదు అని… అంతకుమించి అని అన్నారు.

శ్రీలీల తల్లి అయిన డా.స్వర్ణ అనిల్ రావిపూడికి దూరపు వరసలో అక్క అవుతుంది అంట.అనిల్ రావిపూడి శ్రీలీల తల్లి స్వర్ణ ఒంగోలులోని ఒకే ప్రాంతం నుండి వచ్చినట్టు తెలిపారు . ఈ విషయం భగవంత్ కేసరి సినిమాకి పనిచేస్తున్నప్పుడు తమకి తెలిసిందని అనిల్ రావిపూడి అన్నారు. ఆ లెక్కన చూస్తే శ్రిలీల తనకి మేనకోడలు వరుసవుతుందని తెలిపారు. సెట్స్ లో అందరి ముందు డైరెక్టర్ గారు అని పిలిచే శ్రీలీల ఎవ్వరూ లేనప్పుడు మాత్రం “మామా” అని పిలుస్తుందని రివిల్ చేశారు.హాలిడేస్ లో శ్రీలీల తన అమ్మమ్మ ఇంటికి వెళ్తూ ఉంటానని తెలియజేసింది.

సంగీత దర్శకుడిగా, నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా, డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా, మల్టీటాలెంటెడ్ స్కిల్స్ ఉన్నవ్యక్తి విజయ్ ఆంటోనీ. బిచ్చగాడు సినిమాలతో తెలుగులో కూడా అభిమానులను సంపాదించుకున్నాడు. ఆయన లేటెస్ట్ తమిళ మూవీ రత్తం అక్టోబర్ 6న రిలీజ్ అయ్యింది. ఈ చిత్రంలో నందితాశ్వేత, మహిమా నంబియార్, రమ్య నంబీశన్ కీలక పాత్రలలో నటించారు.
ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే, స్టోరీ పరంగా రత్తం కొంచెం డిఫరెంట్ లైన్. కోల్కతాలో గుర్రాల కాపరిగా పని చేస్తుంటాడు రంజిత్(విజయ్ ఆంటోనీ). గతంలో తనకు మీడియా గురువు అయిన రత్నం పాండియన్ (నిళల్ గళ్ రవి) కుమారుడు హ-త్య-కు గురవుతాడు. గురువు ఈ కేసును సాల్వ్ చేసేపనిని రంజిత్ కు అప్పగిస్తాడు. రంజిత్ చెన్నైకి వచ్చి ఆయన సంస్థలోనే జాయిన్ అవుతాడు.
మధుమిత(నందిత దాస్) దగ్గర అప్రెంటీస్ గా చేరి, ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టగా, అలాంటి హత్యలే రాష్ట్రంలో చాలా జరిగాయనే విషయం తెలుస్తుంది. మరి ఈ హ-త్య-ల వెనుక ఉన్న వ్యక్తి ఎవరు? ఎలాంటి ఆధారాలు లేకుండా దొరకకుండా చేస్తున్నది ఎవరు? ఈ మ-ర్డ-ర్స్ ఎందుకు చేస్తున్నారు? ఈ కేసును ఛేదించే క్రమంలో రంజిత్కు ఎటువంటి పరిణామాలు ఎదురయ్యాయి? రంజిత్ జర్నలిజం వృత్తికి ఎందుకు దూరంగా వెళ్ళాడు అనేది మిగిలిన కథ.
మైండ్గేమ్తో హీరో మరియు విలన్ ఒకరి పై ఒకరు వేసే ఎత్తులతో ఈ చిత్రం సాగుతుంది. ఈ మూవీలో ఇన్వేస్టిగేటివ్ జర్నలిస్ట్ రంజిత్కుమార్ గా విజయ్ ఆంటోనీ సీరియస్ పాత్రలో మెప్పించాడు. మహిమా నంబియార్ నటన ఆకట్టుకుంటుంది. రత్తం మూవీ ఒక విభిన్నమైన క్రైమ్ థ్రిల్లర్. కథతో పాటుగా విలన్ క్యారెక్టర్ కొత్తగా అనిపిస్తుంది. ఓపికగా చూడగలిగిన వారికి కొత్త అనుభూతిని ఇస్తుంది.

బుల్లితెర సెలెబ్రిటీలు శ్రీవాణి, విక్రమాదిత్య జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఈ జంట ‘మీ కడపునిండా’ అనే రెస్టారెంట్ను మొదలుపెట్టారు. ఈ రెస్టారెంట్ ఓపెనింగ్ కు ఏపీ మంత్రి రోజాను ఆహ్వానించారు. రోజా చేతుల మీదుగా ఈ రెస్టారెంట్ను ప్రారంభించారు. చాలా రోజులుగా బుల్లితెరకు దూరంగా ఉన్న రోజా, అక్కడికి వచ్చిన టెలివిజన్ సెలెబ్రిటీలతో సరదాగా ముచ్చటించారు. మీడియాతో కూడా మాట్లాడిన ఆమె వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం తెలిపారు.
రోజా మాట్లాడుతూ తనకు ఇష్టమైన వంటకాలు, డైట్ ప్లాన్ గురించి వెల్లడించారు. తనకు నాన్ వెజ్ ఎక్కువ ఇష్టమని, రొయ్యల ఇగురు, కీమల ఉండలు, పీతల ఫ్రై, చేపల పులుసు చాలా ఇష్టమని తెలిపారు. ఇక తన డైట్ ప్లాన్ గురించి కూడా చెప్పుకొచ్చారు. ప్రతి రోజూ ఉదయం ఓట్స్, దానిలో డ్రై ఫ్రూట్స్, ఆపిల్స్ కలిపి తింటానని తెలిపారు. ఇక మధ్యాహ్న భోజనంలో మాత్రం నాన్ వెజ్ తప్పనిసరని అన్నారు. కార్తీకమాసం లేదా దేవాలయానికి వెళ్లిన సమయంలో మాత్రం నాన్ వెజ్ తీసుకోనని తెలిపారు.
డిన్నర్ సమయంలో ఇడ్లీ లేదా దోశ లాంటి అల్పాహారాన్ని తీసుకుంటానని చెప్పుకొచ్చారు. విక్రమాదిత్య, శ్రీవాణి, కొత్త రెస్టారెంట్ ఓపెనింగ్ వేడుకలో టెలివిజన్ నటినటులు సందడి చేశారు. వీరిద్దరూ పలు సీరియల్స్, రియాల్టీ షోలు, ఈవెంట్లు, వారి సొంత యూట్యూబ్ ఛానెల్ ద్వారా అలరిస్తూ, బాగా సంపాదిస్తున్నారు. తాజాగా మొదలుపెట్టిన ఫుడ్ బిజినెస్లోనూ విజయం సాధించాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ప్రముఖ హాస్యనటుడు అలీ సినిమాలతో పాటుగా, బుల్లితెర పై పలు షోలలో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. ఆయన తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో నటించి, పాపులర్ అయ్యారు. పలు టెలివిజన్ షోలకు హోస్ట్ గా చేసిన అలీ పారితోషికం కూడా భారీగానే ఉందనే విషయం తెలిసిందే. ఆయన సతీమణి జుబేదా కూడా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు.
యూట్యూబ్ లో సొంత ఛానెల్ ప్రారంభించిన జుబేదా తక్కువ కాలంలోనే ఫేమస్ అయ్యారు. తన ఛానెల్ లో ఎక్కువగా వంటల వీడియోలు మరియు హోం టూర్ వీడియోలు అప్ లోడ్ చేస్తుంటారు. నటుడు అలీ, జుబేదా ఇద్దరు తాము సంపాదించిన దాని నుండి కొంత డబ్బుతో సేవా కార్యక్రమాల కూడా చేస్తుంటారు. ఏడు రోజుల క్రితం జుబేదా తన ఛానెల్ లో ఎగ్ ధమ్ బిర్యానీ వంటకాన్ని తయారు చేశారు. వంట పూర్తయ్యాక దానిని ప్యాక్ చేసి, కొంతమంది పేదవారికి పంచిపెట్టారు.
ఈ వీడియోకి ఏకంగా మిలియన్ పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో మరియు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజెన్లు జుబేదా చేసిన మంచి పనికి ఫిదా అవుతున్నారు. ఆమె ఇలాగే పేదలకు సహాయం చేయాలని కామెంట్లు చేస్తున్నారు. చాలా మందికి జుబేదా స్పూర్తిగా నిలిచారని కొందరు నెటిజెనలు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు అలీ కెరీర్ లో మరింత విజయాన్ని సాధించాలని కామెంట్స్ చేస్తున్నారు.
దసరా పండుగ కానుకగా ఆడియెన్స్ కు వినోదాలను పంచడం కోసం తెలుగులో ఆసక్తికర సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ముఖ్యంగా మూడు పెద్ద సినిమాల మధ్య పోటీ ఉండబోతుంది. రెండు తెలుగు చిత్రాలు కాగా, ఒకటి డబ్బింగ్ సినిమా, ముగ్గురు స్టార్ హీరోలే కావడం విశేషం.
నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా భగవంత్ కేసరి. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా, యంగ్ హీరోయిన్ శ్రీలీల కీలక పాత్రలో నటిస్తోంది. బాలీవుడ్ హయివ్ అర్జున్ రామ్ పాల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, పాటలకు ఆడియెన్స్ నుండి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.
1. భగవంత్ కేసరి:
జాతీయ చలనచిత్ర అవార్డులను భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులలో ఒకటిగా పరిగణిస్తారు. మొదటిసారి జాతీయ అవార్డులను 1954లో అందించారు. ఈ అవార్డులను భారతీయ కళలు మరియు సంస్కృతిని కలిగి ఉన్న సినిమాలకు, దేశీయ వ్యక్తులు దర్శకత్వం వహించిన సినిమాలను గౌరవించడానికి మరియు ప్రోత్సహించడం కోసం ఈ అవార్డులు ప్రవేశపెట్టారు.
1973 నుండి ఈ అవార్డు వేడుకలు భారత ప్రభుత్వ డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ద్వారా నిర్వహించబడుతున్నాయి. ప్రతి సంవత్సరం ఈ వేడుకను న్యూఢిల్లీలో నిర్వహిస్తారు. ఈ వేడుకలో విజేతలకు భారత రాష్ట్రపతి అవార్డులను ప్రధానం చేస్తారు. ఈ వేడుక తరువాత నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ను ప్రారంభించడం జరుగుతుంది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో జాతీయ అవార్డులు గెలుచుకున్న సినిమాలను ప్రదర్శిస్తారు.
జాతీయ చలనచిత్ర అవార్డులు రెండు ప్రధాన విభాగాలగా ఉన్నాయి. ఫీచర్ ఫిల్మ్లు మరియు నాన్-ఫీచర్ ఫిల్మ్లు. ఫీచర్ ఫిల్మ్ కేటగిరీ కింద విజేతలను 13 మంది సభ్యులతో కూడిన జ్యూరీ ఎంపిక చేస్తుంది. నాన్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో విజేతలను 5 మంది సభ్యులతో కూడిన జ్యూరీ ఎంపిక చేస్తుంది. జాతీయ అవార్డుకు సెలెక్ట్ కావడం కోసం పలు నియమాలను పాటించాల్సి ఉంటుంది. వీటి ప్రకారం ఎంట్రీకి పంపించే సినిమా జనవరి 1 నుంచి డిసెంబర్ 31 లోపు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ద్వారా సర్టిఫికేట్ పొందాలి.
అప్పుడే ఈ పోటీలో పాల్గొనే అర్హత ఉంటుంది. ఈ పోటీలోకి వచ్చే సినిమాలు ఇండియాలోనే నిర్మించబడాలి. సినిమాకు విదేశీ సంస్థ సహ-నిర్మాతగా ఉంటే, మరో 6 షరతులను నెరవేర్చాల్సి ఉంటుంది. అన్ని షరతులను పూర్తి చేసిన తర్వాత, సినిమా ఎంట్రీ లిస్ట్ కి అర్హత పొందింది. పోటీలో పాల్గొనే సినిమాకి భారతీయుడు దర్శకత్వం వహించి ఉండాలి. సినిమా పోటీలో ఎంట్రీ పొందడానికి ఇది ముఖ్యమైనది.
కోలీవుడ్ సంచలన దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెలుగు ఆడియెన్స్ కు ఖైదీ మూవీతో పరిచయం అయ్యారు. ఆ తరువాత మాస్టర్, విక్రమ్ సినిమాలతో పెద్ద సంఖ్యలో అభిమానులు అయ్యారు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ ఫ్రాంచైజీలో వచ్చే సినిమాల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే లోకేష్ దర్శకత్వం వహించిన మొదటి సినిమా కార్తీ నటించిన ఖైదీ మూవీ అని చాలామంది అనుకుంటారు. అయితే ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన మొదటి సినిమా మానగరం. ఈ చిత్రం 2017 లో తమిళంలో రిలీజ్ అయ్యి, విజయం సాధించింది.
ఆ సినిమానే తెలుగులో ‘నగరం’ పేరుతో రిలీజ్ చేశారు. ఈ మూవీలో తెలుగు యంగ్ హీరో సందీప్ కిషన్, రెజీనా కసాండ్రా, శ్రీ నటించారు. ఈ మూవీ కథ విషయానికి వస్తే, శ్రీ అనే యువకుడు జాబ్ కోసం నెల్లూరు నుంచి చెన్నైకి వస్తాడు. ఒక సాఫ్ట్వేర్ సంస్థకి అతనికి జాబ్ వస్తుంది. రెజీనా అదే కంపెనీలో హెచ్ఆర్. ఆమె క్లాస్మేట్ అయిన సందీప్ కిషన్ లవ్ చేస్తున్న అంటూ వెంటపడుతుంటాడు. రెజీనాకు అతనంటే ప్రేమ ఉన్నా, బాధ్యత లేకుండా ప్రవర్తిస్తుండడం ఆమెకు నచ్చదు. సందీప్ తో గోడవపడిన కొందరు సందీప్ అనుకొని శ్రీని కొడతారు.
అయితే ఆ గొడవలో అతని ఒరిజినల్ సర్టిఫికేట్స్ పోతాయి. అతను జాబ్ లో చేరాలంటే సర్టిఫికేట్స్ అవసరం. ఇది ఇలా ఉంటే, ఆ నగరంలో కొందరు గూండాలు ఒక అబ్బాయిని కిడ్నాప్ చేయాల్సింది. పొరపాటునా ఆ ప్రాంత డాన్ పీకేపీ(మధుసూదన్) అబ్బాయిని కిడ్నాప్ చేస్తారు. ఆ నగరానికి క్యాబ్ డ్రైవర్ గా పనిచేయడం కోసం వచ్చిన చార్లే పీకేపీకి సంబంధించిన కారును రెంట్ కు తీసుకుంటాడు. సందీప్ కి రౌడీలతో ఉన్న గొడవ ఏమిటి? శ్రీ సర్టిఫికేట్స్ దొరికాయా? రెజీనా, సందీప్ ల ప్రేమ ఫలిస్తుందా? చివరికి ఏం జరిగింది? అనేది మిగిలిన కథ.


ఈరోజు ఎపిసోడ్ లో డిన్నర్ చేయడానికి అందరూ కూర్చుంటారు. ఆ సమయంలోనే మహేంద్ర బాగా తాగి, తులుతూ ఇంటికి వస్తాడు. కింద పడిపోబోతుంటే, రిషి పరుగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకుంటాడు. ధరణీ, వసు, శైలేంద్ర, ఫణేంద్ర అక్కడికి వెళతారు. మహేంద్ర రిషీతో నువ్వు న్నాను పడి పోనివ్వవు అని తెలుసు నాన్నా, నువ్వు ఉన్నావనే నాకు ధైర్యం నాన్నా అంటూ మాట్లాడుతూ ఉంటాడు. రిషి, మహేంద్రను లోపలికి రమ్మని పిలుస్తాడు. దానికి మహేంద్ర ఇంటికి రాకూడదని అనుకున్నాను.
కానీ నువ్వు నా గురించి రోడ్డు పైన వెతుకుతుంటావు ఉంటావు. అందుకే నువ్వు బాధపడతావని ఇంటికి వచ్చాను నాన్నా అంటూ కన్నీరు పెట్టుకుంటాడు. తండ్రిని అలా చూసి రిషి బాధపడుతాడు. వసు, ధరణీ, ఫణేంద్ర బాధ పడుతుంటే, దేవయానికి శైలేంద్ర సైగ చేస్తాడు. దాంతో దేవయాని మహేంద్ర తాగి ఇంటికి వచ్చినందుకు మండిపడుతుంది. తన మాటలతో మహేంద్రని దేవయాని అవమానిస్తుంది. జగతి సమయం అయిపోవడంతో, వెళ్ళిపోయింది.
4 రోజులు ఏడ్చి, ఆ విషయాన్ని మర్చిపోయి, పనులు చేసుకోవాలి. కానీ రోజు తాగి ఇంటికి వస్తుంటే, ఎలా ఉంటుంది. బాధ ఉంటే, తాగి తందనాలు ఆడాలా? అని కోపంగా దేవయాని అనడంతో రిషికి చాలా కోపం వస్తుంది. దేవయాని కోపంగా ఇక ఈ ఇంట్లో ఉండలేను,ఈ దారణం రోజు చూడలేను అని అంటుంది. దాంతో కోపంగా ఉన్న రిషి పెద్దమ్మా మీరు బయటకు వెళ్లనవసరం లేదు. మేమే వెళ్తాం అంటూ రిషి తండ్రిని, భార్యని తీసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోతాడు.