మమ్ముట్టి నటించిన ‘యాత్ర’ మూవీ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ మూవీని మహి వీ రాఘవ్ తెరకెక్కించారు. ఈ సినిమాలో వైఎస్సార్గా నటించిన మమ్ముట్టి నటనకు తెలుగు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. తాజాగా యాత్ర 2 మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది.
ఈ మూవీలో జగన్ పాత్రలో కోలీవుడ్ హీరో జీవా నటిస్తున్నారు. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న వ్యూహంలో జగన్ పాత్రలో తమిళ నటుడు అజ్మల్ నటించారు. అయితే జగన్ గా నటించిన ఈ ఇద్దరు హీరోలు కలిసి ఒక సినిమాలో నటించారు. ఆ సినిమా ఏమిటో ఇప్పుడు చూద్దాం..
‘యాత్ర 2’ సినిమా నుంచి తాజాగా వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి, వై.ఎస్.జగన్ ల క్యారెక్టర్లకు సంబంధించిన ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డిగా మలయాళం మెగా స్టార్ మమ్ముట్టి, వై.ఎస్.జగన్ గా కోలీవుడ్ హీరో జీవా నటించనున్నారు. ఈ పోస్టర్లో మమ్ముట్టి, జీవా ఇద్దరు ఇన్టెన్స్ లుక్స్తో కనిపిస్తున్నారు.
మరో వైపు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ సీఏం వైఎస్ జగన్ లైఫ్ లో జరిగిన పలు సంఘటనల ఆధారంగా మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీకి వ్యూహం అనే టైటిల్ పెట్టారు. తాజాగా ఈ మూవీ సీక్వెల్ ను ప్రకటించాడు. ఈ సీక్వెల్కు శపథం అనే పేరు ఖరారు చేస్తూ, ఒకే పోస్టర్ లో వ్యూహం, శపథం చిత్రాల రిలీజ్ డేట్స్ ను ప్రకటించారు. ఈ సినిమాలలో జగన్ క్యారెక్టర్ లో తమిళ హీరో అజ్మల్ నటిస్తున్నారు.
ఇది ఇలా ఉంటే, ఈ రెండు సినిమాలలో జగన్ పాత్రలలో నటిస్తున్న ఈ ఇద్దరు కోలీవుడ్ హీరోలు ఒక మూవీలో కలిసి నటించారు. ఆ సినిమా పేరు రంగం. ఈ సినిమాకి కె. వి. ఆనంద్ దర్శకత్వం వహించారు. కార్తీక నాయర్ హీరోయిన్ గా నటించింది. జీవా, అజ్మల్ ఇద్దరు ఫ్రెండ్స్ గా నటించారు.
Also Read: “ఉపాసన కొణిదల” ఆహార నియమాలు ఇంత కఠినంగా ఉంటాయా..? ఒక రోజులో ఏం తింటారంటే..?

ప్రేమ విమానం సినిమాలో సంగీత్ శోభన్, శాన్వీ మేఘన జంటగా నటించారు. అనసూయ భరద్వాజ్, ‘వెన్నెల’ కిశోర్, అనిరుధ్ నామా, దేవాన్ష్ నామా ఇతర పాత్రలలో నటించారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, రెండు గ్రామాలలో 1990 బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ. ఒక గ్రామంలో శాంతమ్మ(అనసూయ) తన భర్త నాగరాజు(రవివర్మ), పిల్లలు రామ్ (దేవాన్ష్ నామా) లక్ష్మణ్ అలియాస్ లచ్చు (అనిరుథ్ నామా)లతో కలిసి చిన్న గుడిసెలో జీవిస్తూ ఉంటుంది. అప్పులతో వారి కుటుంబం చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది.
అయితే శాంతమ్మ చిన్న కొడుకు లచ్చుకు విమానం ఎక్కాలనే కోరిక ఉంటుంది. తన కోరికను తండ్రికి చెబితే, నాగరాజు పంట చేతికివచ్చిన తర్వాత విమానం ఎక్కిస్తాను అని చెప్తాడు. కానీ కొన్నిరోజులకే అప్పుల బాధ తట్టుకోలేక ఉరేసుకొని చనిపోతాడు. శాంతమ్మ కూలి పనులు చేస్తూ, పిల్లలను పోషించుకుంటుంది.
ఇంకో గ్రామంలో మణి (సంగీత్ శోభన్) తండ్రి (గోపరాజు రమణ)తో కలిసి కిరాణా కొట్టు నడుపుతూ జీవిస్తుంటారు. మణి ఆ గ్రామ సర్పంచ్ కూతురు అభిత (శాన్వీ మేఘన)ను ప్రేమిస్తాడు. ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. ఇద్దరు తమ పెళ్ళికి పెద్దవాళ్ళు ఒప్పుకోరని లేచిపోతారు. ఈ క్రమంలో ఈ జంట ఎలాంటి ఇబ్బందులు పడుతుంది? విమానం ఎక్కాలనే కోరికతో శాంతమ్మ పిల్లలు ఏం చేశారు? చివరికి ఏం జరిగింది అనేది మిగిలిన కథ.






రజాకార్ సినిమాను యాటా సత్యనారాయణ తెరకెక్కిస్తుండగా, బిజీపీ నేత గూడూరు నారాయణ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలంగాణలో ఎలెక్షన్స్ దగ్గర పడుతున్న వేళ ఈ చిత్రం కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చిందని అంటున్నారు. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా, హైదరాబాద్కు రాలేదంటూ ఈ టీజర్ ప్రారంభం అయ్యింది. హైదరాబాద్ సంస్థానంలో రజాకర్లు హిందువులను ఇస్లాంలోకి మార్పించి, ముస్లిం రాజ్యంగా చేయాలనే ఉద్దేశ్యంతో చేసిన దారుణాలను, అరాచకాలను తెరకెక్కించినట్టుగా చూపించారు.
ఈ టీజర్ చూసిన మత పెద్దలు, నెటిజన్లు, రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ టీజర్ మొత్తంలో రజాకార్ల పేరుతో ముస్లింలనే లక్ష్యంగా చేస్తూ, వారిని చెడ్డగా చూపించేందుకు ప్రయత్నం చేశారని అంటున్నారు.చరిత్రను వక్రీకరించి కొందరు ఈ మూవీని తీశారని ఆరోపిస్తున్నారు. ఈ విషయం పై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. స్వార్థ రాజకీయా ప్రయోజనాల కోసం, తెలంగాణలో మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారని కేటీఆర్ అన్నారు.
సీపీఎం పార్టీ లీడర్లు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా బీజేపీ లీడర్ల సారథ్యంలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాని బ్యాన్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పేదలు మరియు భూస్వాముల మధ్య జరిగిన సాయుధ పోరాటానికి, కొందరు కులం, మతం రంగును అద్దుతున్నారని, ఎలక్షన్స్ సమయంలో ఇలాంటి చిత్రాలు రిలీజ్ అయితే ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్య విభేదాలు ఏర్పడతాయని, అందుకే ఈ చిత్రాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు.
రోజా అసలు పేరు శ్రీ లతారెడ్డి. 1972లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలో నవంబర్ 17న జన్మించారు. ఆ తరువాత కాలంలో వారి కుటుంబం హైదరాబాద్ కు వచ్చారు. రోజా తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్లో డిగ్రీని పొందారు. ఆమె ఇండస్ట్రీలో రాకముందు కూచిపూడి నాట్యంలో శిక్షణ తీసుకున్నారు.
రోజా 1991 లో ప్రేమ తపస్సు అనే తెలుగు సినిమా ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తరువాత సర్పయాగం మూవీలో నటించింది. 1992 లో ఆర్ కె. సెల్వమణి దర్శకత్వంలో చెంబరుతి అనే మూవీ ద్వారా కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రాలు విజయం సాధించడంతో ఆమెకు వరుస సినిమాలలో నటించి, తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగారు.
తెలుగులో సూపర్ స్టార్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున, జగపతిబాబు, వినోద్ కుమర్, శ్రీకాంత్ వంటి హీరోలతో నటించింది. రజినికాంత్, శరత్ కుమార్, సత్యరాజ్, విజయ్ కాంత్, అర్జున్ సర్జా, మమ్ముట్టి, ప్రభుదేవా వంటి వారితో నటించి మెప్పించింది. 1991 నుండి 2002 వరకు హీరోయిన్ గా నటించింది. 2002 లో ఆగస్ట్ 21న కోలీవుడ్ దర్శకుడు ఆర్ కె. సెల్వమణిని వివాహం చేసుకుంది. ఈ జంటకి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. రోజా, సెల్వమణి వెడ్డింగ్ ఫోటోలను మీరు చూసేయండి..
2.


రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్ హీరోహీరోయిన్లుగా నటించిన కన్నడ సినిమా సప్త సాగర దాచే ఎల్లో. మ్యూజికల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని సప్త సాగరాలు దాటి పేరుతో తెలుగులోకి డబ్ చేసి, రిలీజ్ చేశారు. డైరెక్టర్ హేమంత్ రావు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ మూవీ రెండు పార్టులుగా రూపొందించారు. రెండవ పార్ట్ అక్టోబర్ 27న రిలీజ్ కానుంది. ఆ మూవీ టీజర్ ను ఇటీవలే రిలీజ్ చేశారు.
సెప్టెంబర్ 22 న రిలీజ్ అయిన సప్త సాగరాలు దాటి మూవీకి ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో మను, ప్రియ ప్రేమించుకుంటారు. పెళ్లి చేసుకోవాలనుకున్న సమయంలో మను జైలుకు వెళ్తాడు. అప్పుడు ఆమె ఎన్ని సంవత్సరాలైన అయిన హీరో కోసం వేచి చేస్తా అని చెప్తుంది.
కానీ సెకండ్ పార్ట్ లో మాత్రం వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. హీరోయిన్ హీరో కోసం ఎదురుచూస్తా అని చెప్పే డైలాగ్ కు సంబంధించిన వీడియోని ఒక యూజర్ ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ‘మరి వెయిట్ చేసిందా’ అంటూ షేర్ చేశారు. ఆమె ముందు హీరో కోసం ఎదురుచూస్తా అని చెప్పి, ఆ తర్వాత పెళ్లి చేసుకుందని నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.










