తమిళ్ నుండి తెలుగుకి డబ్ అయిన సినిమాలతో ఫేమస్ అయిన హీరో జయం రవి. స్వతహాగా తెలుగు వాడు అయిన జయం రవి, తమిళ్ లో సినిమాలు చేసి అక్కడ గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పుడు జయం రవి హీరోగా నటించిన ఇరైవన్ సినిమా తెలుగులో గాడ్ పేరుతో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
- చిత్రం : గాడ్
- నటీనటులు : జయం రవి, నయనతార, నరైన్.
- నిర్మాత : సుధన్ సుందరం, జయరామ్ .జి
- దర్శకత్వం : I. అహ్మద్
- సంగీతం : యువన్ శంకర్ రాజా
- విడుదల తేదీ : అక్టోబర్ 13, 2023

స్టోరీ :
అర్జున్ (జయం రవి) ఒక అసిస్టెంట్ పోలీస్ కమిషనర్. దేనికి భయపడడు. అర్జున్ కి సొంత కుటుంబం అంటూ లేదు. అందుకే తనతో పాటు పని చేసే తన స్నేహితుడు అయిన ఆండ్రూ (నరైన్) కుటుంబాన్ని తన కుటుంబంగా భావిస్తూ ఉంటాడు. అర్జున్ ఆండ్రూ సోదరి అయిన ప్రియ (నయనతార) తో ప్రేమలో పడతాడు. కానీ తన వ్యక్తిత్వం వల్ల తాను ఎప్పుడు చనిపోతానో తెలియదు అనే ఉద్దేశంతో ప్రియకి తన ప్రేమను వ్యక్త పరచకుండా దూరంగా ఉంటూ ఉంటాడు. ఒక సమయంలో స్మైలీ కి-ల్ల-ర్ బ్రహ్మ (రాహుల్ బోస్) కేస్ వీళ్ళ దగ్గరికి వస్తుంది.

ఇతన్ని పట్టుకునే క్రమంలో ఆండ్రూ తన ప్రాణాలని కోల్పోతాడు. ఆండ్రూ లేకపోవడంతో అక్కడ పని చేయను అని చెప్పి అర్జున్ కూడా తన జాబ్ వదిలేసి ఒక కాఫీ షాప్ పెట్టుకుంటాడు. అరెస్ట్ అయిన బ్రహ్మ జైలు నుండి తప్పించుకుంటాడు. అంతే కాకుండా అర్జున్ కి సన్నిహితులు అయిన అమ్మాయిలని ఈ సారి టార్గెట్ చేస్తాడు. ఇప్పుడు అర్జున్ ఏం చేశాడు? ఆ అమ్మాయిలని ఎలా కాపాడాడు? అసలు బ్రహ్మ ఇలా ఎందుకు చేస్తున్నాడు? తాను ప్రేమించిన ప్రియని అర్జున్ కలిశాడా? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

రివ్యూ :
సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ అనేది ఒక స్పెషల్ కేటగిరి. సాధారణంగా ప్రతి సినిమాకి తమ బుర్రని అంత పెద్దగా పదును పెట్టని ప్రేక్షకులు ఇలాంటి సినిమాలకి మాత్రం ప్రతి చిన్న విషయాన్ని కూడా తెలివిగా ఆలోచిస్తూ సినిమా చూస్తారు. కాబట్టి ఇలాంటి ఒక కాన్సెప్ట్ మీద ఒక డైరెక్టర్ సినిమా తీస్తున్నారు అంటే ఒక రకంగా రిస్క్ చేస్తున్నట్టే అర్థం. ఎందుకంటే కాస్త అటు ఇటు అయినా కూడా లాజిక్ మిస్ అయ్యి ప్రేక్షకులు ఈజీగా కనిపెట్టేస్తున్నారు. దాంతో సినిమాని ట్రోల్ కూడా చేస్తారు.

అయితే ఇప్పుడు ఈ సినిమా కూడా అలా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లోనే వచ్చింది. తమిళ్ లో ఈ సినిమా చంద్రముఖి 2 తో పాటు రిలీజ్ అయ్యింది. సస్పెన్స్ థ్రిల్లర్ అనే కాన్సెప్ట్ మీద తమిళ్ లో చాలా సినిమాలు వచ్చాయి. ఇది కూడా అలాంటి ఒక సినిమా. ఇంక ఈ సినిమా విషయానికి వస్తే సినిమా కాన్సెప్ట్ తెలిసిన కాన్సెప్ట్. ధైర్యంగా ఉండే ఒక హీరో. కానీ కొంత మంది మనుషులతో ఎమోషనల్ కనెక్షన్ ఉండడం. తర్వాత కొన్ని కారణాల వల్ల వాళ్లే దూరం అవ్వడం.

అప్పుడు హీరో అలా దూరం చేసిన వారిని పట్టుకోవడం. ఇదంతా మనం ఎప్పటి నుండో చూస్తున్న కాన్సెప్ట్. కాకపోతే ఈ సినిమా టేకింగ్ పరంగా మాత్రం కాస్త కొత్తగా ఉండేలాగా చూసుకున్నారు. జయం రవి పాయింట్ అఫ్ వ్యూ నుండి ఈ సినిమా మనకు చూపించారు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే జయం రవి పోలీస్ పాత్రలో బాగా నటించారు. కానీ సినిమాకి హైలైట్ అయ్యింది మాత్రం విలన్ పాత్రలో నటించిన రాహుల్ బోస్ నటన. అంతే కాకుండా మరొక విలన్ పాత్రలో నటించిన ఆ నటుడు కూడా తన పాత్రకి తగ్గట్టు నటించారు.

నయనతార పాత్ర గురించి కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. చాలా సినిమాల్లో ఉండే ఒక మామూలు హీరోయిన్ పాత్ర ఇది. తన పాత్ర పరిధి మేరకు నయనతార నటించారు. ముఖ్య పాత్రలో నటించిన నరైన్ కూడా తన పాత్రకి తగ్గట్టు నటించారు. పాటలు కూడా అంత గొప్పగా ఏమీ లేవు. కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుంది.

హరి కే వేదాంత్ అందించిన సినిమాటోగ్రఫీ డార్క్ థీమ్ తో ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చూస్తున్నాం అనే ఫీల్ వచ్చేలా చేసింది. సినిమా డబ్బింగ్ విషయంలో కూడా ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేదేమో అనిపించింది. దర్శకుడు ఎంత సేపు అమ్మాయిలు చనిపోయారు అనే విషయాన్ని చూపించాడు కానీ, అసలు ఆ కేసులన్నిటిని ఎలా ఇన్వెస్టిగేట్ చేశారు అనే విషయాన్ని ఇంకా బాగా చూపించి ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది.

అంతే కాకుండా విలన్ బ్యాక్ స్టోరీ కూడా ఇంకా కొంచెం బాగా రాసుకొని ఉండాల్సింది. అతను అసలు ఇలాంటి పనులు చేయడానికి కారణం ఏంటి అనే విషయాన్ని ఇంకా బలంగా చూపించాల్సింది. సెకండ్ హాఫ్ లో సినిమా కంటెంట్ మీద చాలా జాగ్రత్త తీసుకున్నారు. ఇదే ఫస్ట్ హాఫ్ లో కూడా తీసుకొని ఉంటే బాగుండేది. అలాగే ఎడిటింగ్ విషయంలో కూడా ఇంకా జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
- నటీనటులు
- బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
- సినిమాటోగ్రఫీ
- టేకింగ్ లో కొత్తదనం
మైనస్ పాయింట్స్:
- బలహీనమైన స్క్రీన్ ప్లే
- డబ్బింగ్
- ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్
- ఎడిటింగ్
రేటింగ్ :
2.5/5
ట్యాగ్ లైన్ :
సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ సినిమాలు ఇష్టపడేవారు, మరీ ఎక్కువగా ఆశించకుండా, అసలు కాన్సెప్ట్ ఏంటి? సినిమా టేకింగ్ ఎలా ఉంది? ఇవన్నీ చూద్దాం అనుకునేవారు అయితే, లాజిక్స్ కరెక్ట్ గా లేకపోయినా పర్వాలేదు. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా అయితే చాలు అని అనుకునే వారికి గాడ్ సినిమా ఒక్కసారి చూడగలిగే యావరేజ్ సినిమాగా నిలుస్తుంది.
watch trailer :
ALSO READ : “అరవింద సమేత” సినిమా ఎన్నో సార్లు చూసి ఉంటారు..! కానీ ఈ విషయం గమనించారా..?


ఆ ఊరిలో వర్షాలు పడకపోవడంతో ప్రజలు అనావృష్టితో ఇబ్బందులు పడతుంటారు.ఊరి పెద్ద లందరు ఈ సమస్య తీరాలంటే గంగాలమ్మ జాతర చేయాలని తీర్మానిస్తారు. కానీ జాతర చేసే సమయంలో అడ్డంకి ఏర్పడుతుంది. ఆ సమస్యను ఊరిపెద్దలు ఎలా పరిష్కరించారు? కుమార్,కృష్ణవేణి ప్రేమకు, గంగాలమ్మ జాతరకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి? అనేది మిగిలిన కథ.
స్టోరీ పరంగా కొత్తగా లేదు, హీరోహీరోయిన్ల రొటీన్ ప్రేమకథ. రోషం రాజు పాత్ర కోడి కూర కోసం పడే పాట్లు నవ్వు తెప్పిస్తాయి. చౌడప్ప తన మిత్రుడిని చంపిన తర్వాత స్టోరీ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. మూవీ అంతా ఒకెత్తు అయితే, సినిమా చివర్లోని ట్విస్ట్ మరోక ఎత్తు. అప్పటి దాకా మెల్లగా సాగిన స్టోరీ, కొన్ని క్యారెక్టర్స్,క్లైమాక్స్లో వారు ఇచ్చే ట్విస్టులు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. నూతన నటీనటులైనా, ప్రతీ ఒక్కరు కూడా నటనతో ఆకట్టుకున్నారు. హీరో రవి మహాదాస్యం, హీరోయిన్ విషికా కోట తమ నటనతో ఆకట్టుకున్నారు. రోషమ్ రాజు క్యారెక్టర్ బాగుంది. తనదైన కామెడీతో రోషమ్ రాజు ఆకట్టుకున్నాడు.
ప్లస్ పాయింట్స్ :



టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసిన రోజు నుండి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్ను ఐటీ ఉద్యోగులు దగ్గర నుండి ఇతర రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు కూడా ఖండిస్తూ వచ్చారు. నందమూరి కుటుంభ సభ్యులు కూడా స్పందించారు. అయితే ఈ విషయం పై ఆ కుటుంబంలోని జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఎటువంటి స్పందన రాకవపోవడం అనేది అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ తరుపున ప్రచారం చేసిన తారక్, కొంతకాలం నుండి పార్టీకి దూరంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు అరెస్ట్పై ఎలాంటి ప్రకటన చేయలేదని అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ మౌనంగా ఉండడం పై పార్టీ నాయకుల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు ఎన్టీఆర్ కి మద్ధతుగా మాట్లాడుతున్నారు.
తాజాగా ఈ విషయం పై జూనియర్ ఎన్టీఆర్ ఫ్రెండ్ రాజీవ్ కనకాల స్పందించారు. చంద్రబాబు అరెస్ట్ పై ఎన్టీఆర్ సైలెంట్ గా ఉండడం గురించి అడుగగా, రాజీవ్ కనకాల మాట్లాడుతూ, “ఎన్టీఆర్ స్పందించకపోవడానికి రీజన్ సినిమాలతో బిజీగా ఉండడమే కారణం” అని తాను అనుకుంటున్నట్లుగా తెలిపారు.
“ఆర్ఆర్ఆర్ మూవీ, ఆ తరువాత కరోనా, ఈ విరామంలో ఎన్టీఆర్ కనీసం 4 చిత్రాలు అయినా చేసేవారు. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర మూవీలో నటిస్తున్నారు. చాలా ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ మూవీ మీద దృష్టి పెట్టారని, పూర్తి సమయాన్ని దేవర కోసం కేటాయిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ దృష్టి మొత్తం చిత్రాలపైనే పెట్టాలని అనుకుని ఉండొచ్చని తాను భావిస్తున్నట్టు” గా రాజీవ్ కనకాల తెలిపారు.
టోవినో థామస్-ఐశ్వర్య లక్ష్మి జంటగా నటించిన మాయానది 2017లో మలయాళంలో రిలీజ్ అయిన డిఫరెంట్ ప్రేమ కథ. మొదటి షోతో యావరేజ్ టాక్ తెచ్చుకొంది. కానీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. టోవినో థామస్ ఉత్తమ నటుడు, ఉత్తమ క్రిటిక్స్ అవార్డ్, స్టార్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ అందుకున్నారు. ఈ చిత్రానికి ఆషిక్ అబు దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఆహా ఓటీటీలో అందుబాటులో ఉంది.
ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, మాధవ్ (టోవినో థామస్) తల్లిదండ్రులను చిన్నతనంలోనే కోల్పోయి, ఒంటరిగా జీవిస్తుంటాడు. మాధవ్ డబ్బు కోసం తప్పుడు దారిలో నడుస్తుంటాడు. అయితే ఇంజనీరింగ్ చేస్తున్న సమయంలో కలిసిన అపర్ణ (ఐశ్వర్య లక్ష్మి)ని ప్రేమిస్తాడు. కానీ కొన్ని కారణాల వలన వారు విడిపోతారు. మాధవ్ కొన్ని రోజుల తరువాత ఒక మాఫియా డీలింగ్ సమయంలో అనుకోకుండా పోలీస్ అధికారిని చంపి, అక్కడి నుండి పారిపోతాడు.
ఇక ఆ రోజు నుండి పోలీసులు మాధవ్ కోసం వెతుకుతూ ఉంటారు. దాంతో మాధవ్ తన వద్ద ఉన్న డాలర్స్ ను ఇండియన్ కరెన్సీ లోకి మార్చి, దుబాయ్ వెళ్లి స్థిరపడాలని అనుకుంటాడు. అయితే తనతో పాటుగా తాను ప్రేమించిన అపర్ణను దుబాయ్ తీసుకుని వెళ్లాలని భావిస్తాడు. అయితే అపర్ణ అప్పటికే అతన్ని మర్చిపోయి, హీరోయిన్ గా స్థిరపడడానికి ప్రయత్నిస్తుంటుంది. తనను వెతుకుతున్న పోలీసుల నుండి తప్పించుకుని, మాధవ్ ఎలా అపర్ణను దుబాయ్ తీసుకువెళ్లాడు? ఆ తరువాత ఏం జరిగింది అనేది మిగిలిన కథ.
‘యాత్ర 2’ సినిమా నుంచి తాజాగా వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి, వై.ఎస్.జగన్ ల క్యారెక్టర్లకు సంబంధించిన ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డిగా మలయాళం మెగా స్టార్ మమ్ముట్టి, వై.ఎస్.జగన్ గా కోలీవుడ్ హీరో జీవా నటించనున్నారు. ఈ పోస్టర్లో మమ్ముట్టి, జీవా ఇద్దరు ఇన్టెన్స్ లుక్స్తో కనిపిస్తున్నారు.
మరో వైపు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ సీఏం వైఎస్ జగన్ లైఫ్ లో జరిగిన పలు సంఘటనల ఆధారంగా మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీకి వ్యూహం అనే టైటిల్ పెట్టారు. తాజాగా ఈ మూవీ సీక్వెల్ ను ప్రకటించాడు. ఈ సీక్వెల్కు శపథం అనే పేరు ఖరారు చేస్తూ, ఒకే పోస్టర్ లో వ్యూహం, శపథం చిత్రాల రిలీజ్ డేట్స్ ను ప్రకటించారు. ఈ సినిమాలలో జగన్ క్యారెక్టర్ లో తమిళ హీరో అజ్మల్ నటిస్తున్నారు.
ఇది ఇలా ఉంటే, ఈ రెండు సినిమాలలో జగన్ పాత్రలలో నటిస్తున్న ఈ ఇద్దరు కోలీవుడ్ హీరోలు ఒక మూవీలో కలిసి నటించారు. ఆ సినిమా పేరు రంగం. ఈ సినిమాకి కె. వి. ఆనంద్ దర్శకత్వం వహించారు. కార్తీక నాయర్ హీరోయిన్ గా నటించింది. జీవా, అజ్మల్ ఇద్దరు ఫ్రెండ్స్ గా నటించారు.
ప్రేమ విమానం సినిమాలో సంగీత్ శోభన్, శాన్వీ మేఘన జంటగా నటించారు. అనసూయ భరద్వాజ్, ‘వెన్నెల’ కిశోర్, అనిరుధ్ నామా, దేవాన్ష్ నామా ఇతర పాత్రలలో నటించారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, రెండు గ్రామాలలో 1990 బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ. ఒక గ్రామంలో శాంతమ్మ(అనసూయ) తన భర్త నాగరాజు(రవివర్మ), పిల్లలు రామ్ (దేవాన్ష్ నామా) లక్ష్మణ్ అలియాస్ లచ్చు (అనిరుథ్ నామా)లతో కలిసి చిన్న గుడిసెలో జీవిస్తూ ఉంటుంది. అప్పులతో వారి కుటుంబం చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది.
అయితే శాంతమ్మ చిన్న కొడుకు లచ్చుకు విమానం ఎక్కాలనే కోరిక ఉంటుంది. తన కోరికను తండ్రికి చెబితే, నాగరాజు పంట చేతికివచ్చిన తర్వాత విమానం ఎక్కిస్తాను అని చెప్తాడు. కానీ కొన్నిరోజులకే అప్పుల బాధ తట్టుకోలేక ఉరేసుకొని చనిపోతాడు. శాంతమ్మ కూలి పనులు చేస్తూ, పిల్లలను పోషించుకుంటుంది.
ఇంకో గ్రామంలో మణి (సంగీత్ శోభన్) తండ్రి (గోపరాజు రమణ)తో కలిసి కిరాణా కొట్టు నడుపుతూ జీవిస్తుంటారు. మణి ఆ గ్రామ సర్పంచ్ కూతురు అభిత (శాన్వీ మేఘన)ను ప్రేమిస్తాడు. ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. ఇద్దరు తమ పెళ్ళికి పెద్దవాళ్ళు ఒప్పుకోరని లేచిపోతారు. ఈ క్రమంలో ఈ జంట ఎలాంటి ఇబ్బందులు పడుతుంది? విమానం ఎక్కాలనే కోరికతో శాంతమ్మ పిల్లలు ఏం చేశారు? చివరికి ఏం జరిగింది అనేది మిగిలిన కథ.






రజాకార్ సినిమాను యాటా సత్యనారాయణ తెరకెక్కిస్తుండగా, బిజీపీ నేత గూడూరు నారాయణ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలంగాణలో ఎలెక్షన్స్ దగ్గర పడుతున్న వేళ ఈ చిత్రం కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చిందని అంటున్నారు. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా, హైదరాబాద్కు రాలేదంటూ ఈ టీజర్ ప్రారంభం అయ్యింది. హైదరాబాద్ సంస్థానంలో రజాకర్లు హిందువులను ఇస్లాంలోకి మార్పించి, ముస్లిం రాజ్యంగా చేయాలనే ఉద్దేశ్యంతో చేసిన దారుణాలను, అరాచకాలను తెరకెక్కించినట్టుగా చూపించారు.
ఈ టీజర్ చూసిన మత పెద్దలు, నెటిజన్లు, రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ టీజర్ మొత్తంలో రజాకార్ల పేరుతో ముస్లింలనే లక్ష్యంగా చేస్తూ, వారిని చెడ్డగా చూపించేందుకు ప్రయత్నం చేశారని అంటున్నారు.చరిత్రను వక్రీకరించి కొందరు ఈ మూవీని తీశారని ఆరోపిస్తున్నారు. ఈ విషయం పై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. స్వార్థ రాజకీయా ప్రయోజనాల కోసం, తెలంగాణలో మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారని కేటీఆర్ అన్నారు.
సీపీఎం పార్టీ లీడర్లు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా బీజేపీ లీడర్ల సారథ్యంలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాని బ్యాన్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పేదలు మరియు భూస్వాముల మధ్య జరిగిన సాయుధ పోరాటానికి, కొందరు కులం, మతం రంగును అద్దుతున్నారని, ఎలక్షన్స్ సమయంలో ఇలాంటి చిత్రాలు రిలీజ్ అయితే ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్య విభేదాలు ఏర్పడతాయని, అందుకే ఈ చిత్రాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు.