ఎనర్జిటిక్ స్టార్, రామ్ పోతినేని హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా స్కంద. ఈ సినిమాకి మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. ఈ సినిమా భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 28న గ్రాండ్ గా విడుదల అయ్యింది.
ఈ మూవీ అంచనాలను పూర్తి స్థాయిలో అందుకోలేక, మొదటి షోతోనే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. నెట్టింట్లో ఈ మూవీ పై ట్రోలింగ్ కూడా జరిగింది. దాంతో ఆశించిన రేంజ్ లో వసూళ్లు సాధించలేకపోయింది. అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ ఖరారైనట్టు తెలుస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
స్కంద మూవీలో రామ్ పోతినేని, శ్రీలీల జంటగా నటించారు. శ్రీకాంత్, సాయి మంజ్రేకర్, శరత్ లోహితస్వ, దగ్గుబాటి రాజా, గౌతమి, ఇంద్రజ, పృథ్వీరాజ్ కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్ కి ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. స్కంద మూవీని దర్శకుడు బోయపాటి శ్రీను తన మార్క్ కంప్లీట్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగానే ఉన్నాయి.
హీరో రామ్ పోతినేని మాస్ మరియు యాక్షన్ లుక్తో ఆకట్టుకున్నారు. రామ్, శ్రీలీల డ్యాన్స్ మూవీలో హైలైట్గా నిలిచింది. కానీ స్టోరీ, స్క్రీన్ ప్లే పరంగా ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయాయని టాక్. రివ్యూలు కూడా మిశ్రమంగా రావడంతో స్కంద మూవీ ఆశించిన రేంజ్ లో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ ను వసూల్ చేయలేకపోయిందని తెలుస్తోంది.
ఇది ఇలా ఉంటే స్కంద మూవీ ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+ హాట్స్టార్ కొనుగోలు చేసింది. ఈ క్రమంలోనే అక్టోబర్ 27 నుండి ఈ మూవీ డిస్నీ+ హాట్స్టార్ లో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషలలో స్ట్రీమింగ్కు కానుందని సమాచారం. అయితే ఈ విషయం పై డిస్నీ+ హాట్స్టార్ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

మెగా కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన జూన్ 20న పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. పెళ్లి అయిన చాలా ఏళ్ల తరువాత మెగాఫ్యామిలీలోకి వారసురాలు రావడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పాప వచ్చిన తరువాత జరిగే ప్రతి సందర్భాన్ని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
అయితే ఉపాసన సినిమాల విషయంలో తప్ప మిగితా విషయాల్లో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ మెప్పు పొందుతున్నారు. ముఖ్యంగా ఆమె ఆహారం మరియు ఆరోగ్యానికి సంబంధించి సూచనలు, జాగ్రత్తలు తరచూ సోషల్ మీడియా లో షేర్ చేస్తూనే ఉంటారు. ఉపాసన ఫిట్నెస్, ఆరోగ్యానికి సంబంధించిన ‘బిపాజిటివ్’ అనే మ్యాగజైన్ను సైతం ప్రారంభించారు.
ఉపాసన డైట్ సీక్రెట్స్..

స్టార్ హీరోల సినిమాలలో వారి నటన, ఫైట్స్, డ్యాన్స్ లతో పాటుగా వారు చెప్పే డైలాగ్స్ కూడా ప్రేక్షకులను, ముఖ్యంగా అభిమానులను అలరిస్తాయి. ఒక సినిమాలోని డైలాగ్ ను మరో సినిమాలో అది కూడా ఒక స్టార్ హీరో చెప్పినప్పుడు ఆ డైలాగ్ ఆడియెన్స్ కు మరింతగా గుర్తుంటుంది. ఒకప్పుడు అంతగా పట్టించుకునేవారు కాదు. తెలుసుకునే అవకాశం ఎక్కువగా ఉండేది కాదు.
కానీ ఓటీటీలు, సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత గతంలో వచ్చిన సినిమాలను చూడడం, అవి ఆ తరువాత వచ్చిన చిత్రాలలో చూసినట్టుగా అనిపించగానే, ఆ వీడియోని సోషల మీడియాలో షేర్ చేయడం సాధారణం అయిపోయింది. ఇలాంటి వీడియోని ఒక యూజర్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ప్రభాస్ నటించిన రాఘవేంద్ర మూవీలోని డైలాగ్ కు సంబంధించిన వీడియో అది.
ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఒక యూజర్ రాఘవేంద్ర సినిమాలోని ఒక వీడియో క్లిప్ ను షేర్ చేశారు. ఆ వీడియోలో మురళీమోహన్ ఒక వ్యక్తితో “కరెంట్ తీగ చూడడానికి మామలుగానే ఉంటుంది. ఒక్కసారి దానిమీద చెయ్యి వేస్తే తెలుస్తుంది దాని పవర్ ఏమిటో” అంటూ చెప్తాడు. ఈ మూవీ 2003 లో రిలీజ్ అయ్యింది. అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఊసరవెల్లి సినిమాలో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ కూడా కాస్త అటు ఇటుగా ఇలానే ఉంటుంది. ఈ డైలాగ్ పాపులర్ అయ్యింది. ఈ మూవీ 2011 లో రిలీజ్ అయ్యింది. రాఘవేంద్ర మూవీ నుండి కాపీ చేశారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
తమన్నా భాటియా 1989లో డిసెంబర్ 21న ముంబైలో పుట్టి, పెరిగారు. ఆమె పదమూడు ఏళ్ళ వయస్సులో నటనలో శిక్షణ తీసుకోవడం ప్రారంభించింది. ఎన్నో స్టేజ్ షోలలో నటించింది. 2005 లో చాంద్ సా రోషన్ చెహ్రా అనే హిందీ మూవీ ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ తరువాత 2006లో శ్రీ మూవీ ద్వారా తెలుగు ఇండస్ట్రీలో, కేడితో తమిళ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. 2007లో హ్యాపీ డేస్, కల్లూరి సినిమాలలోని ఆమె పాత్రలకు మంచి గుర్తింపు లభించింది.
ఈ రెండు సినిమాలలో తమన్నా కాలేజీ స్టూడెంట్ గా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలు తమన్నాను టాలీవుడ్ మరియు కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా నిలబెట్టాయి. అప్పటి నుండి ఆమె వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. తెలుగు, తమిళ, హిందీ సినిమాలలో నటిస్తూ, కొన్నేళ్లుగా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. ఆమె తెలుగు, తమిళంలో స్టార్ హీరోలందరి పక్కన హీరోయిన్ గా నటించి, మెప్పించారు.
అయితే ఆమె కెరీర్ లో ఒకేఒక్క హీరో మాత్రమే తమన్నాకు హీరోగా, అన్నగా నటించారు. ఆ హీరో ఎవరంటే సుశాంత్. 2008లో కాళిదాసు మూవీతో సుశాంత్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ మూవీలో హీరోయిన్ గా తమన్నా నటించింది. ఇటీవల రిలీజ్ అయిన మెగాస్టార్ చిరంజీవి మూవీ భోళా శంకర్. ఈ మూవీలో మెగాస్టార్ పక్కన హీరోయిన్ గా తమన్నా నటించింది. అయితే ఈ మూవీలో సుశాంత్, తమన్నాకు అన్నగా నటించారు.
పైన కనిపిస్తున్న అబ్బాయి పేరు రోషన్ కనకాల. అతను స్టార్ యాంకర్ సుమ, యాక్టర్ రాజీవ్ కనకాల కుమారుడు. వారి గురించి బుల్లితెర నుండి వెండి తెర ప్రేక్షకుల వరకు అందరికీ సుపరిచితులే. వారి తనయుడు రోషన్ కనకాల బబుల్గమ్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. హీరోగా ఇదే మొదటి సినిమా అయినా, నటుడుగా రోషన్ కనకాల 2016 లో వచ్చిన నిర్మలా కాన్వెంట్ మూవీ ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఈ చిత్రంలో హీరో ఫ్రెండ్ భాషాగా నటించాడు.
ఆ తరువాత రోషన్ ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లారు. తన స్టడీ పూర్తి అవడంతో, తిరిగి వచ్చిన రోషన్ హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం కోసం శిక్షణ తీసుకున్నారని సమాచారం. ఈ క్రమంలో రవికాంత్ దర్శకత్వంలో బబుల్గమ్ మూవీలో నటించాడు. ఈ మూవీలో హీరోయిన్గా మానస చౌదరీ చేస్తున్నారు. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.
తాజాగా ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. హీరో నాని పాల్గొని మూవీయూనిట్ కు విషెస్ తెలిపారు. ఈ ఈవెంట్ కు హోస్ట్ గా సుమ, గెస్ట్ గా రాజీవ్ కనకాల పాల్గొని సందడి చేశారు. ఈవెంట్లో నాని సుమ, రోషన్ గురించి మాట్లాడిన తీరు ఆకట్టుకుంది. ఈవెంట్లో హీరో రోషన్ కనకాల ఎక్స్పీరియన్స్ ఉన్న హీరోలా మాట్లాడిన విధానం అందరినీ ఆకర్షించింది.



తెలుగు ప్రేక్షకులకు కౌబాయ్, జేమ్స్ బాండ్ అనగానే గుర్తుకువచ్చేది సూపర్ స్టార్ కృష్ణ. ఆయన పలు గుడాచారి సినిమాలలో నటించారు. వాటిలో ప్రత్యేకంగా నిలిచిన మూవీ ఏజెంట్ గోపి. ఈ సినిమాని లెజెండరీ డైరెక్టర్ కె.ఎస్.ఆర్.దాస్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో జయప్రద హీరోయిన్ గా నటించారు. కాంతారావు, ప్రభాకర్ రెడ్డి, రాజనాల వంటి లెజెండరీ నటులు కీలకపాత్రలలో నటించారు. ఏజెంట్ గోపి మొదటి సినిమా స్కోప్ జేమ్స్ బాండ్ సినిమాగా నిలిచింది.
ఇక ఈమూవీ స్టోరీ విషయానికి వస్తే, గోపాల్ కృష్ణ అలియాస్ గోపి (ఘట్టమనేని కృష్ణ) ఒక తెలివైన పోలీస్ ఏజెంట్. 50 కోట్ల విలువైన వజ్రాల దొంగలను కనుగొనే క్రమంలో చాలా మంది పోలీసు అధికారులు చంపబడతారు. దాంతో ఉన్నతాధికారి ఈ పనిని ఏజెంట్ గోపీకి అప్పగిస్తాడు. తనకు అప్పగించిన బాధ్యతలో భాగంగా గోపీ విశాఖపట్నం వెళ్తాడు. అక్కడ ఎస్ఐ రాజారావు (ప్రభాకర్ రెడ్డి) కలుస్తాడు. అతని చెల్లి పేరు లత(జయప్రద) అని తెలుస్తుంది.
లత గోపి ఉన్న హోటల్లో అసిస్టెంట్ మేనేజర్గా పని చేస్తుంది. అనుమానాస్పద రీతిలో వ్యవహరిస్తున్న గోపి గురించి తెలుసుకోవడం కోసం ప్రేమించినట్టుగా నటిస్తుంది. అయితే ఆమె గురించి తెలిసిన గోపి, లతను ఆమె అన్న రాజారావు దగ్గరకు గోపి తీసుకువెళతాడు. కానీ లత అది నిజం కాదని, రాజారావును నమ్మకూడదని అతను మోసగాడని చెప్తుంది. తన అన్నయ్య రాజారావును వజ్రాల కోసం స్మగ్లర్ల గ్యాంగ్ కిడ్నాప్ చేసిందని చెప్తుంది.
ఆ తరువాత అసలైన రాజారావు స్మగ్లర్ల నుండి తప్పించుకుని వచ్చి, స్మగ్లర్ల గుహకు దారిచూపే మ్యాప్ను గోపికి ఇస్తాడు. లత, గోపి, అతని కొలీగ్ చిట్టి(పద్మనాభం) కలిసి గుహను కనుగొంటారు. అయితే వారిని స్మగ్లర్లు పట్టుకుంటారు. గోపి స్మగ్లర్ల డాన్ (రాజనాల)ని కలుస్తాడు. డాన్, అతని గ్యాంగ్ వజ్రాల కోసం ఇదంతా చేయడం లేదని, ప్రపంచ విధ్వంసం కోసం అని గోపి తెలుసుకుంటాడు. ఆ తరువాత గోపి, ఎస్ఐ రాజారావు, లత, చిట్టిల సహాయంతో స్మగ్లర్లను అంతం చేసి ప్రపంచాన్ని కాపాడుతాడు.
అప్పట్లో ఈ మూవీ చాలా పెద్ద హిట్. అసలు ఇలాంటి సినిమా అప్పుడు వచ్చిందంటే చాలా గొప్ప విషయం అని అంటున్నారు. కె.ఎస్.ఆర్.దాస్ అప్పట్లోనే అడ్వాన్స్ టెక్నాలజీకి చెందిన వాటిని ఈ సినిమాలో చూపించారు. హీరో అడివి శేష్ గూడాచారి2 మూవీలో ఏజెంట్ గోపికి నివాళిగా తన క్యారెక్టర్ ను రాసుకున్నారు.
ఇప్పటికే నవదీప్ను ఈ కేసులో సెప్టెంబర్ 23న ఈడీ అధికారులు విచారించారు. అయితే వారు అడిగిన కొన్నింటికి నవదీప్ జవాబులు చెప్పినా, కొన్నింటిని దాటవేశారని తెలుస్తోంది. రామ్చంద్ పదేళ్ల కిందటే తనకు పరిచయమని, అయినప్పటికీ, తాను ఎవరికీ వాటిని ఇవ్వలేదని చెప్పారు. దాంతో 2017లో నమోదైన టాలీవుడ్ మాదకద్రవ్యాల కేసును, మాదాపూర్ మాదకద్రవ్యాల కేసును కలిపి ఈడీ ఈరోజు నవదీప్ని ప్రశ్నిస్తోంది. మాదకద్రవ్యాల కేసులో ఉన్న నైజీరియన్లతో మీకున్న సంబంధం ఏమిటి? వారితో ఆర్ధిక లావాదేవీలను ఎందుకు జరిపారు?
ముగ్గురు నైజీరియన్ల మనీలాండరింగ్ కేసు గురించి ఏం తెలుసు? ఈడీకి మీ అకౌంట్ల అన్ని వివరాలను ఇవ్వగలరా? మీరు మేనేజర్ మరియు డ్రైవర్ అకౌంట్లతో ఏమైనా ట్రాన్సాక్షన్లు చేశారా? రామ్చంద్, కలహర్ రెడ్డితో ఉన్న లావాదేవీల విషయం ఏమిటి? ఈవెంట్లకు సంబంధించిన అన్ని రికార్డులను ఇస్తారా? వంటి ప్రశ్నలను ఈడీ అధికారులు అడిగినట్లుగా తెలుస్తోంది. ఈ విచారణలో కొంతమంది కీలకమైన వారి పేర్లు బయటికి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే విచారణ తరువాత బయటికి వచ్చిన నవదీప్ తనదైన శైలిలో రెస్పాండ్ అయ్యారు.
జగతి కన్నుమూయడంతో ఆమెనే తలుచుకుంటూ మహేంద్ర తాగి రోడ్డు పక్కన పడిపోతాడు. ఆ విషయం వేరేవాళ్ల ద్వారా తెలుసుకున్న రిషి, వసుధార మహేంద్ర గగగరికి వెళ్తారు. చెట్టుకింద ఉన్న మహేంద్రను అలా చూసి బాధపడుతూ, ఇంటికి తీసుకొని వస్తారు. అది చూసిన దేవయాని మహేంద్ర పై కోప్పడుతుంది. దాంతో ఫణీంద్ర భార్యపై ఫైర్ అవుతాడు.
తరువాతి రోజు ఫణీంద్ర, జగతి లేదనే బాధలో ఉండి, చేసే పనులు, బాధ్యతల్ని పట్టించుకోకపోతే తమనే నమ్మకున్న విద్యార్ధులు, ఉద్యోగుల జీవితాలు ఇబ్బందిలో పడతాయని రిషితో అంటాడు. ఇవన్నీ తొలగిపోవాలంటే ఎండీ సీట్లో నువ్వే కూర్చోవాలని రిషిని, దేవయాని, శైలేంద్రల ముందే రిక్వస్ట్ చేస్తాడు. దానికి చేయలేనని రిషి చెప్తాడు. వసు కలుగజేసుకుని, మీ పైన పడిన నింద గురించే కదా, కానీ దాని గురించి ఇకపై ఆలోచించాల్సిన అవసరం లేదు సార్. దాన్ని గురించి బాధ పడాల్సిన అవసరం లేదు అని అంటుంది.
రిషి ఏం చెప్తున్నావు వసుధారా అని అడుగుతాడు. వసుధార మాటలు అర్ధం కానీ శైలేంద్ర, దేవయానీలు షాకింగ్గా చూస్తారు. వసుధార మాట్లాడుతూ, తాను, ఫణీంద్ర సార్ కలిసి ఎస్ఐ గారిని మరియు మినిస్టర్ గారిని కలిసి, సమస్యను సాల్వ్ చేశామని చెప్తుంది. ఇక రిషిని ఎండీ సీట్లో చూడాలని ఫణీంద్ర, వసుధార బలంగా కోరుకుంటున్నారు కాబట్టి తరువాతి ఎపిసోడ్లో దేవయాని, శైలేంద్రల షాక్ ఇస్తూ రిషి ఎండీ సీట్ ని స్వీకరిస్తాడో చూడాలి.