వెండితెర పై సినిమా ఎలాగో, బుల్లితెరపై సీరియల్ అటువంటిదే అని చెప్పవచ్చు. అయితే సినిమా ఎన్ని నెలలు కష్టపడి తీసినా, మొదటి షోతోనే ఆ మూవీ విజయం సాధిస్తుందో లేదో తెలుస్తుంది. అయితే సీరియల్ విషయంలో అలా ఉండదు. ప్రతి వీక్ టీఆర్పీ రేటింగ్ గండం లాంటిదే.
ఇక సీరియల్ డైరెక్టర్ కి షూటింగ్ అంటే యుద్ధంలా ఉంటుందని చెప్పవచ్చు. అందులో నటించే నటినటుల కాల్ షీట్స్ చూసుకోవాలి. రెండు, మూడు ఎపిసోడ్స్ కూడా ఒకే రోజు చిత్రీకరించాల్సి వస్తుంటుంది. ఇన్నింటిని దాటుకుని ఒక డైరెక్టర్ ఒకేసారి రెండు సీరియల్స్ ను తీస్తూ, వాటిని టీఆర్పీలో అగ్రస్థానంలో ఉండేలా చేశారు. మరి ఆ డైరెక్టర్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
గుప్పెడంత మనసు స్టార్ మా లో ప్రసారం అవుతున్న సీరియల్. ఈ సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. రిషి, వసు లవ్ స్టోరీ, తల్లీకొడుకుల సెంటిమెంట్ ఆడియెన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఈ సీరియల్ కు వంద ఎపిసోడ్స్ వరకు కార్తీక దీపం సీరియల్ డైరెక్టర్ కాపుగంటి రాజేంద్ర తెరకెక్కించారు. ఆ తరువాత కుమార్ పంతం డైరెక్ట్ చేస్తున్నారు.
అప్పటి నుంచి ఈ సీరియల్ టాప్ రేటింగ్ లో కొనసాగుతున్న కార్తీక దీపం సీరియల్కి చాలా పోటీ ఇచ్చింది. ఒకానొక సమయంలో గుప్పెడంత మనసు ‘కార్తీక దీపం’ సీరియల్ ను మించుతుందేమో అనేట్టుగా కుమార్ పనిచేశారు. కార్తీక దీపం సీరియల్ కి ఎండ్ కార్డు పడిన తరువాత. అదే టైమ్ లో ప్రసారం అవుతున్న బ్రహ్మముడి సీరియల్ ను అద్భుతంగా కుమార్ తెరకెక్కిస్తున్నారు.
ఈ సీరియల్ గత కొన్ని నెలలుగా టీఆర్పీలో టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. కార్తీక దీపం సీరియల్ ను ఆడియెన్స్ ఎంతగా ఆదరించారో తెలిసిందే. ఆ సీరియల్ ను ప్రేక్షకులకు గుర్తు రాకుండా ఇంట్రెస్టింగ్ గా ఫ్యామిలీ ఎమోషన్స్ బ్రహ్మముడి దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. ఈ సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అతను ప్రముఖ సీరియల్ నటి కిరణ్మయి భర్త. ఆమె ఎన్నో సీరియల్స్ లో నటించింది.
https://www.instagram.com/p/CeIdDNbLw3w/









ఈ ఏడాది విజయ్ దళపతి నటించిన వారసుడు వంటి రొటీన్ కంటెంట్ మూవీ అయినా తెలుగులో మంచి కలెక్షన్స్ సాధించింది. ఈ నేపథ్యంలో త్వరలో రిలీజ్ కాబోయే లియో మూవీ పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ మూవీ రైట్స్ కోసం సితార సంస్థ భారీ మొత్తాన్ని చెల్లించడం టాలీవుడ్ లో సంచలనంగా మారింది. తమిళ స్టార్ విజయ్ దళపతి, లోకేష్ కనకరాజ్ కాంబోలో ఈ మూవీ తెరకెక్కింది.
తాజాగా రిలీజ్ అయిన లియో ట్రైలర్ యూట్యూబ్ లో దూసుకెళ్తోంది. అయితే ఈ ట్రైలర్ లో అర్జున్ సర్జా, సంజయ్ దత్, హీరోయిన్ త్రిషతో పాటు కనిపించిన ఈ వ్యక్తి మరెవరో కాదు కోలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ మరియు నటుడు శాండీ మాస్టర్. అతను తమిళ సినీ ఇండస్ట్రీలో మరియు టెలివిజన్ లో కూడా పనిచేస్తున్నాడు. శాండీ 2005 లో కలైంజర్ టీవీలో ప్రసారమైన పాపులర్ డ్యాన్స్ షో ‘మానాడ మయిలాడ’ సీజన్ 1లో కొరియోగ్రాఫర్గా కెరీర్ను ప్రారంభించాడు.
ఆ షోలో విజేతగా నిలిచాడు. ఆ తరువాత ‘మానాడ మయిలాడ’ వివిధ సీజన్లలో న్యాయనిర్ణేతల ప్యానెల్లో ఒకరిగా పనిచేశారు. 2019లో జరిగిన బిగ్ బాస్ తమిళ వెర్షన్లో కంటెస్టెంట్గా పాల్గొన్న తర్వాత శాండీ మాస్టర్ బాగా పాపులర్ అయ్యారు. స్టార్ హీరోల సినిమాలకి కొరియోగ్రాఫర్ చేస్తూనే సినిమాలలో కూడా నటించడం ప్రారంభించాడు. ‘ఇవనుకు తన్నిల గండం’ అనే తమిళ చిత్రంతో నటుడుగా కెరీర్ మొదలుపెట్టాడు. పలు సినిమాలలో గెస్ట్ రోల్ లో కనిపించిన శాండీ మాస్టర్ లియో మూవీలో నటించాడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శాండీ మాస్టర్ ను ఇన్ స్టాగ్రామ్ లో 2 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.

















#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16


ఉత్తర్ప్రదేశ్ కేడర్ 2011 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ అభిషేక్ సింగ్ నటన మీద ఉన్న ఇష్టంతో సంచలన నిర్ణయం తీసుకుని, ఉద్యోగానికి రిజైన్ చేశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు కూడా ధ్రువీకరించారు. అభిషేక్ సింగ్కు యాక్టింగ్, మోడలింగ్ అంటే చాలా ఆసక్తి ఉండడంతో ఒక వైపు ఐఏఎస్ అధికారిగా ఢిల్లీ సచివాలయంలో ముఖ్యమైనహోదాలో కొనసాగారు. మరో వైపు తనకు ఇష్టం అయిన నటన, మోడలింగ్ రంగాలలో రాణించారు.
అభిషేక్ సింగ్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయిన ‘ఢిల్లీ క్రైమ్ సీజన్- 2’ లో ఇన్వెస్టిగేషన్ అధికారి క్యారెక్టర్ లో నటించి. మంచి గుర్తింపును తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఓటీటీలలో మంచి యాక్టర్ గా పేరు తెచ్చుకుంటూ, మోడల్ గా ఆకట్టుకుంటున్నారు. అభిషేక్ సింగ్ మొదటిసారి నటించిన షాట్ ఫిలిం ‘చార్ పండ్రా’. దీనిని టీ సిరీస్ సంస్థ రూపొందించింది.
ఈ సాంగ్ లో అభిషేక్ ప్రేమికుడిగా అద్భుతంగా నటించి, మెప్పించాడు. ఐఏఎస్ ఆఫీసర్ అయినప్పటికీ ఒక యాక్టర్ గా అద్భుత నటనను కనబరిచినందుకు ఆడియెన్స్ ఆయన నటనకు ఫిదా అయ్యారు. ఈ సాంగ్ రిలీజ్ అయిన 4 రోజులకే యూట్యూబ్ లో ట్రెండింగ్ గా మారింది. ఇక ఇప్పటి వరకు ఆ సాంగ్ కు యూట్యూబ్ లో 560 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అభిషేక్ సింగ్ కు ఇన్స్టాగ్రామ్ లో ఐదు మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
మిర్చి, జనతా గ్యారేజ్, శ్రీమంతుడు, భారత్ అనే నేను వంటి కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ సినిమాలను తెరకెక్కించిన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా, కీలక పాత్రలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నారంటే అటు మెగా ఫ్యాన్స్, ఇటు ఇండస్ట్రీలో రికార్డ్స్ క్రియేట్ చేయడం ఖాయం అని అనుకున్నారు. కొరటాల ఈ మూవీ కోసం ధర్మస్థలి అనే కొత్త ప్రపంచాన్ని కూడా సృష్టించారు.
ఈ మూవీ 2022 మే 20న భారీ అంచనాల మధ్య, గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. అయితే ఫస్ట్ షోతోనే ఈ మూవీ నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. నెటిజెన్లు ఈ మూవీని, దర్శకుడు కొరటాల శివను విపరీతంగా ట్రోల్ చేశారు. చిరంజీవి కెరీర్ లోనే మైనస్ అనే టాక్ కూడా వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అవడంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోయారు. అప్పట్లో అది కూడా పెద్ద చర్చకు దారి తీసింది.
ఈ మూవీలో చిరంజీవి ఆచార్య అనే నక్సల్ నాయకుడుగా నటించాడు. ఆచార్య కార్పెంటర్ వేషంలో ధర్మస్థలికి వస్తాడు. అయితే అక్కడికి ఎళ్లిన తరువాత కొందరు గుడి ముందు తాగుతూ ఉంటే, హీరో గుడి ముందు ఇలాంటివి చెయ్యడం తప్పు అని చెబుతాడు. ఆ ఊరు అంతా గుడిలో పూజలు చేస్తారు. అయితే ఆ తరువాత నిమిషంలో హీరోనే సానా కష్టం వచ్చిందే అని ఐటెం సాంగ్ లో డాన్స్ చేస్తాడు. మరి హీరో చెప్పిన రూల్స్ ను ఆయనే పాటించరా అని నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.

