మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా ఆచార్య. ఈ చిత్రానికి దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహించారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య గత ఏడాది రిలీజ్ అయ్యి, బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది.
విడుదలైన మొదటి షోతోనే డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ పై సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్ జరిగింది. అయితే ఆచార్య మూవీలోని ఒక సీన్ గురించి నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
మిర్చి, జనతా గ్యారేజ్, శ్రీమంతుడు, భారత్ అనే నేను వంటి కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ సినిమాలను తెరకెక్కించిన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా, కీలక పాత్రలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నారంటే అటు మెగా ఫ్యాన్స్, ఇటు ఇండస్ట్రీలో రికార్డ్స్ క్రియేట్ చేయడం ఖాయం అని అనుకున్నారు. కొరటాల ఈ మూవీ కోసం ధర్మస్థలి అనే కొత్త ప్రపంచాన్ని కూడా సృష్టించారు.
ఈ మూవీ 2022 మే 20న భారీ అంచనాల మధ్య, గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. అయితే ఫస్ట్ షోతోనే ఈ మూవీ నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. నెటిజెన్లు ఈ మూవీని, దర్శకుడు కొరటాల శివను విపరీతంగా ట్రోల్ చేశారు. చిరంజీవి కెరీర్ లోనే మైనస్ అనే టాక్ కూడా వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అవడంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోయారు. అప్పట్లో అది కూడా పెద్ద చర్చకు దారి తీసింది.
ఈ మూవీలో చిరంజీవి ఆచార్య అనే నక్సల్ నాయకుడుగా నటించాడు. ఆచార్య కార్పెంటర్ వేషంలో ధర్మస్థలికి వస్తాడు. అయితే అక్కడికి ఎళ్లిన తరువాత కొందరు గుడి ముందు తాగుతూ ఉంటే, హీరో గుడి ముందు ఇలాంటివి చెయ్యడం తప్పు అని చెబుతాడు. ఆ ఊరు అంతా గుడిలో పూజలు చేస్తారు. అయితే ఆ తరువాత నిమిషంలో హీరోనే సానా కష్టం వచ్చిందే అని ఐటెం సాంగ్ లో డాన్స్ చేస్తాడు. మరి హీరో చెప్పిన రూల్స్ ను ఆయనే పాటించరా అని నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: “పుష్ప” సినిమాలో “చంద్రబాబు నాయుడు” గారు ఉన్నారు… ఈ సీన్ లో మీరు గమనించారా..?




కన్నడ స్టార్ రక్షిత్ శెట్టి ‘ఛార్లీ’ సినిమాతో తెలుగు ఆడియెన్స్ చేరువయ్యాడు. అంతకుముందు అతడే శ్రీమన్నారాయణ మూవీతో పరిచయం అయ్యాడు. ఈ సినిమాలు మంచి కలెక్షన్స్ సాధించాయి. ఇక కన్నడ ఇండస్ట్రీలో భారీగా కలెక్షన్స్ సాధించి, లాభాలను అందించాయి. సప్త సాగరదాచే ఎల్లో మూవీ సెప్టెంబర్ 1న రిలీజ్ అయ్యి, సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
రక్షిత్ శెట్టి నటించిన ఈ సినిమాను ‘సప్త సాగరాలు దాటి’ అనే టైటిల్ తో సెప్టెంబర్ 22న తెలుగులో రిలీజ్ చేశారు. ఈ మూవీ తెలుగులో మొదటి రోజు మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీకి రివ్యూలు కూడా పాజిటివ్ గా వచ్చాయి. అయితే దాదాపు ఇదే స్టోరీ లైన్ తో రిలీజ్ అయిన మాస్ మహారాజ రవితేజ మూవీ మాత్రం ఫ్లాప్ అయ్యింది. హరీష్ శంకర్ తొలి సారి దర్శకత్వం వహించిన షాక్ మూవీలో రవితేజ, జ్యోతిక జంటగా నటించారు.
ఈ సినిమాని రామ్ గోపాల్ వర్మ నిర్మించారు. ఈ మూవీ 2006 లో రిలీజ్ అయ్యింది. ఈ మూవీలో కూడా హీరో జైలుకి వెళ్తాడు. నెట్టింట్లో అదే కాన్సెప్ట్ తో వచ్చిన తెలుగు సినిమాని ఫ్లాప్ చేసి, డబ్బింగ్ సినిమాని మాత్రం సూపర్ హిట్ చేసారు అంటూ నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.
విజయ్ సేతుపతి, ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన తమిళ సినిమా “కా పే రణసింగం”. ఈ మూవీని దర్శకుడు పి.విరుమాండి తెరకెక్కించారు. ఈ మూవీ కోలీవుడ్ లో 2020లో అక్టోబర్ 2న రిలీజ్ అయ్యింది. అక్కడ విజయం సాధించడంతో ‘వైఫ్ ఆఫ్ రణసింగం’ టైటిల్ తో తెలుగులో డబ్ చేసి, 2020లో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ జీ5 లో అందుబాటులో ఉంది.
ఇక కథ విషయానికి వస్తే, ఒక చిన్న గ్రామంలో నివసించే రణసింగం(విజయ్ సేతుపతి) కి విప్లవ భావాలు అధికంగా ఉంటాయి. గ్రామంలో ఏలాంటి సమస్య వచ్చినా కూడా రణసింగం ముందుండి పోరాడుతాడు. అతని మంచితనం నచ్చడంతో సీత (ఐశ్యర్వ రాజేష్) ప్రేమిస్తుంది. ఆ తర్వాత వారిద్దరి వివాహం జరుగుతుంది. వారికి పాప పుట్టిన తర్వాత రణసింగం దుబాయ్ కి జాబ్ కోసం వెళ్తాడు.
అయితే అక్కడ రణసింగం పనిచేసే ఫ్యాక్టరీలో జరిగిన గొడవల కారణంగా రణసింగం మరణించాడని చెప్తారు. రణసింగం మృతదేహాన్ని ఇండియాకి రప్పించడం కోసం చేసిన ప్రయత్నం ఫలించదు. ఆ తరువాత సీత ఎలా పోరాడింది? చివరికి ఏం జరిగింది? అనేది మిగతా కథ. నటన విషయానికి వస్తే విజయ్ సేతుపతి కనిపించింది కాసేపే అయినా ఎప్పటిలానే రణసింగం పాత్రలో ఒదిగిపోయాడు. ఈ మూవీలో ముఖ్యమైన పాత్ర ఐశ్యర్వ రాజేష్ ది. ఆమె అద్భుతంగా నటించింది.
ప్రొడ్యూసర్ ఎంఎం రత్నం కుమారుడు రవికృష్ణ, సోనియా అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన మూవీ 7/జి బృందావన్ కాలనీ. ఈ సినిమాని ప్రముఖ ప్రొడ్యూసర్ ఎంఎం రత్నం నిర్మించారు. ఈ మూవీని తెలుగు, తమిళంలో ఒకేసారి రిలీజ్ చేశారు. రెండు చోట్ల ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది.
ఈ సినిమాకి సంగీతం ఇళయరాజా తనయుడు యువన్ శంకర్ రాజా అందించారు. ఈ మూవీలోని సాంగ్స్ ఇప్పటికీ ప్రేక్షకులను ఫిదా చేస్తాయి. ఇటీవలే ఈ మూవీ రీరిలీజ్ అయ్యింది. రీరిలీజ్ లో కూడా ఈ మూవీకి ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. దానికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అయితే తాజాగా ఈ మూవీలో ఒక సీన్ కు సంబంధించిన తెలుగు మరియు తమిళం వీడియోలను ఒక యూజర్ ఇన్ స్టాలో పోస్ట్ చేస్తూ, వీటిలో ఏ వర్షెన్ నచ్చింది అంటూ అడిగారు. తమిళ్ సీన్ లో తండ్రి హీరోతో ఎమోషనల్ గా చెప్తాడు. అయితే తెలుగు సీన్ లో తండ్రి ఫ్రస్టేషన్ తో చెప్తాడు. ఈ రెండింటిలో తెలుగులోనే తండ్రిగా సహజంగా నటించారని నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. తండ్రి పాత్రలో చంద్ర మోహన్ చాలా సహజంగా చేశారని కామెంట్స్ చేస్తున్నారు.
తెలుగు సీరియల్స్లో ప్రస్తుతం ఎక్కువ ప్రాధాన్యత కన్నడ నటీనటులకు ఇస్తున్నారనే విషయం తెలిసిందే. వారికి తెలుగులో నటిస్తే ఎక్కువగా గుర్తింపు, పాపులారిటీ లభిస్తుండడంతో కన్నడ నటీనటులు తెలుగు సీరియల్స్ లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అలా వచ్చిన కన్నడ నటి మేఘనా లోకేష్.
శశిరేఖ పరిణయం సీరియల్ తో తెలుగువారికి పరిచయం అయ్యింది. శశి పాత్రలో నటించిన మేఘనా లోకేష్ అందం, నటన అప్పట్లో బుల్లితెర ఆడియెన్స్ ను మెప్పించింది. ఆ సీరియల్ సక్సెస్ ఫుల్ గా రన్ అయ్యింది. ప్రస్తుతం మేఘనా పలు సీరియల్స్ లో నటిస్తూనే, జీ తెలుగుఛానెల్ ఈవెంట్లు మరియు షోలలో కూడా సందడి చేస్తోంది. బుల్లితెరపై మేఘనాకు ఒకప్పుడు ఉన్న క్రేజ్ కారణంగా సినిమాలలో నటించే అవకాశాలు కూడా వచ్చాయి. ఆమె హీరోయిన్గానూ నటించిది. కానీ విజయం సాధించలేదు.
మేఘనా లోకేష్ తాజాగా ఇన్ స్టా స్టోరీలో ఒక పోస్ట్ షేర్ చేసింది. అందులో మళ్లీ ఈరోజు నాకు చెడు రోజు. ఈ సంవత్సరం నన్ను ఇలా ఎందుకు బాధపెడుతోంది. ఏం అయ్యిందో అని అందరూ ఎక్కువగా ఆలోచించకండి. ప్రస్తుతం ఆ విషయాలను షేర్ చేసుకోలేను. మళ్ళీ ఎప్పుడైనా చెప్తాను. ఇలాంటివి ఈ సంవత్సరం చాలా జరిగాయి. మీతో షేర్ చేసుకోవాలని అనిపించిందని రాసుకొచ్చారు. అయితే ఏం జరిగిందో మాత్రం చెప్పలేదు. దీంతో ఏమైందని ఆమె ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు.
టాలీవుడ్ నుండి కోలీవుడ్ వెళ్ళిన సిద్ధార్థ్ రెండేళ్ల కిందట ‘మహా సముద్రం’ అనే మూవీతో రీఎంట్రీ ఇచ్చారు. కానీ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఆ తరువాత ‘టక్కర్’ అనే మూవీటో వచ్చారు. అది కూడా నిరాశ పరిచింది. ఇప్పుడు సిద్ధార్థ్ కోలీవుడ్ లో రిలీజ్ అయ్యి, అందరి చేత ప్రశంసలు పొందుతున్న సిద్ధార్థ్ సినిమాని తెలుగులో ‘చిన్నా’ పేరుతో అక్టోబర్ 6న రిలీజ్ చేయబోతున్నారు. కోలీవుడ్ లో తెరకెక్కిన చిత్త మూవీని ఎటాకి ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించగా, సిద్ధార్థ్ సమర్పించారు. ఈ సినిమాలో నిమిషా సజయన్, సహస్ర శ్రీ, అంజలి నాయర్ కీలక పాత్రలలో నటించారు.
ఇక సినిమా కథ విషయానికి వస్తే, ఈశ్వరన్ (సిద్ధార్థ్) అన్న చనిపోవడంతో అతని జాబ్ ఈశ్వరన్ కు వస్తుంది. అన్న కూతురిని ఈశ్వరన్ చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. తినడం, స్కూల్ కి తీసుకెళ్లడం దగ్గర నుండి పడుకునే వరకు అన్ని పనులు తనే చేస్తూ ఉంటాడు. అయితే ఆ పాపకి ఒక ఫ్రెండ్ ఉంటుంది. ఆమెతో ఎవరో అసభ్యకరంగా ప్రవర్తిస్తారు. అప్పటినుండి ఆ పాప అదోలా మారిపోతుంది.
అది ఏమిటో తెలుసుకుందామని ఈశ్వరన్ ప్రయత్నిస్తే, ఆ పాపని అతనే ఏదో చేసాడనుకుని అందరూ ఈశ్వరన్ కొడుతారు. అయితే ఈశ్వరన్ ఏ తప్పు చేయలేదని తెలుసుకునే లోపు, ఈశ్వరన్ అన్న కూతురిని ఎవరో ఎత్తుకెళ్తారు. ఆ తరువాత ఏం జరిగింది? ఈశ్వరన్ తన అన్నకూతురిని ఎలా రక్షించాడు? అతను ఏ తప్పు చేయలేదనే విషయం తెలిసిందా? అనేది మిగిలిన కథ.
ఒకప్పుడు తెలుగు, తమిళ సినీ ఇండస్ట్రీలలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ ఖుష్బూ. కోలీవుడ్ లో ఏకంగా ఆమెకు అభిమానులు గుడినే కట్టారు. నార్త్ లో పుట్టి, పెరిగిన ఖుష్బూ సౌత్ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా కొన్నేళ్ళ పాటు అలరించారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ, మరో వైపు రాజకీయాలలో రాణిస్తూ, తమిళనాడు పాలిటిక్స్ లో ముఖ్యమైన వ్యక్తిగా మారారు. ఇప్పటికే ఒక నటిగా, ప్రొడ్యూసర్ గా, రాజకీయ నాయకురాలుగా రాణిస్తున్న కుష్బూ రీసెంట్ గా అరుదైన గౌరవం పొందింది.
కేరళ త్రిస్సూర్ లో విష్ణు మాయ దేవాలయంలో ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది చేసే నారీ పూజలో కూర్చునే అవకాశం సీనియర్ నటి కుష్బూకి దక్కింది. కుష్బూని ఆలయకమిటీ ఆహ్వానించగా, కుష్బూ నారీ పూజకు హాజరైంది. ఆలయంలో ఒక పీఠం పై కుష్బూని కూర్చోపెట్టి పూజారులందరు పూజలు చేశారు. ఆ తరువాత కుష్బూకు నైవేద్యాలు ఇచ్చి, దీవించారు. కుష్బూ పూజకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. అందులో “దేవుని ఆశీర్వాదలు అందుకున్నాను.
త్రిస్సూర్లోని విష్ణుమాయ దేవాలయం నారీపూజ కోసం ఆహ్వానించడాన్ని గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను.నారీపూజ కోసం ఎంపికైన వారిని మాత్రమే ఆహ్వానిస్తారు. దైవమే స్వయంగా ఆ వ్యక్తిని ఎన్నుకుంటుందని వారు నమ్ముతారు. నాకు ఇంతటి గౌరవాన్ని కలిగించినందుకు, ఆశీర్వదించినందుకు ఆలయంలోని ప్రతి ఒక్కరికీ నా వినయపూర్వకమైన కృతజ్ఞతలు. ప్రతిరోజూ ప్రార్థించేవారికి, తమను రక్షించే సూపర్ పవర్ ఉందని నమ్మే వారందరికి, ఈ పూజ మంచిని తెస్తుందని ఖచ్చితంగా నమ్ముతున్నాను”. అంటూ రాసుకొచ్చింది. ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.
ఐఎండీబీ ప్రకారం ప్రభాస్ బెస్ట్ సినిమాలు:
2. . బాహుబలి: ది బిగినింగ్:
3. చత్రపతి:
4. డార్లింగ్:
5. మిర్చి:
2. ఈశ్వర్:
3. సాహో:
4. మున్నా:
5. పౌర్ణమి:
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్లాప్ గా నిలిచింది.ఐఎండీబీ ప్రకారం 5.8 రేటింగ్ను పొందింది.

