రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా రాణిస్తున్నారు. ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి చిత్రాలతో పాన్ ఇండియా హీరోగా ఇమేజ్ సొంతం చేసుకుని, వరుస పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూ కెరీర్ లో దూసుకుపోతున్నారు.
ప్రభాస్ కున్న క్రేజ్ గురించి, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎయిర్ పోర్ట్ లో ప్రభాస్ కనిపించగానే సెల్ఫీల కోసం అభిమానులు పోటీపడుతుంటారు. అయితే తాజాగా ఎయిర్ పోర్ట్ లో ఒక లేడీ ఫ్యాన్ ప్రభాస్ చెంప పై కొట్టిన విజువల్స్ నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత నీల్ తెరకెక్కించిన సలార్ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎక్కడ చూసినా సలార్ గురించిన వార్తలే వినిపిస్తున్నాయి. రిలీజ్ కు రెండు నెలలకు పైగా టైం ఉన్నప్పటికీ ఈ మూవీ గురించి ఇప్పటి నుండే చర్చలు జరుగుతున్నాయి.
ముఖ్యంగా సలార్, షారుక్ ఖాన్ డుంకీ సినిమాల మధ్య క్లాష్ గురించే ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. అభిమానుల మధ్య అప్పుడే ట్రోలింగ్ వార్ మొదలైంది. ఇది ఇలా ఉంటే తాజాగా ప్రభాస్కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో మహిళా అభిమాని ప్రభాస్ చెంప పై కొట్టినట్టుగా కనిపిస్తోంది.
వీడియోలో ప్రభాస్ను చూసి సెల్ఫీ దిగడం కోసం ఎంతో ఉత్సాహంగా ఉన్న మహిళా అభిమాని ప్రభాస్ తో సెల్ఫీ తీసుకున్న తరువాత ప్రభాస్ ముఖం పై ఆ అభిమాని అత్యుత్సాహంతో టచ్ చేసింది, కొట్టలేదు. ఈ వీడియో నిజానికి 2019లో సోషల్ మీడియాలో షేర్ చేశారు. అదే వీడియో ప్రస్తుతం మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
https://www.instagram.com/p/BumBLdvnEqw/?utm_source=ig_embed&ig_rid=773ec599-4422-4917-9bac-c9928c95171f
Also Read: “అమృతం” సీరియల్ లో అప్పుడు చెప్పినట్టే ఇప్పుడు జరిగింది కదా..? విషయం ఏంటంటే..?

గుణ్ణం గంగరాజు రూపొందించిన అమృతం సీరియల్ కు డైరెక్టర్ చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వం వహించారు. ఈ సీరియల్ జెమిని టీవిలో 2001లో నవంబర్ 18న మొదలైంది. 2007 నవంబర్ 18 వరకు 313 ఎపిసోడ్లలో 6 సంవత్సరాల పాటు విజయవంతంగా ప్రసారం చేయబడింది. అప్పట్లో సండే వచ్చిందంటే, రాత్రి టెలివిజన్ లో అమృతం సీరియల్ అలరించేది. ఇంటిల్లిపాది కూర్చుని, అమృతం చూసేవారు.
సీరియల్ సాంగ్ తో మొదలయిన నవ్వులు ఆంజనేయులు (గుండుహనుమంతరావు) ఆలోచనలు, అమృత రావు అమాయకత్వం, ఇంటి ఓనర్ అప్పాజీ వేసే పెనాల్టీలు, సర్వం, ఇలా ప్రతిదీ ఆడియెన్స్ ని పొట్ట చెక్కలయ్యేలా నవ్వించేది. అయితే తాజాగా ఆంజనేయులు పద్దుతో చెప్పిన ఒక డైలాగ్ కు సంబంధించిన వీడియో క్లిప్ నెట్టింట్లో వైరల్ అయ్యింది. అయితే మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా గురించే అప్పుడే చెప్పారు అన్నట్టుగా ఈ వీడియో సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ చేశారు.
ఇటీవల రిలీజ్ అయిన భోళా శంకర్ మూవీ ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే. ఆ మూవీకి మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు విజయం సాధించలేదు. ఈ మూవీ పై నెట్టింట్లో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. మెహర్ రమేష్ ను నమ్మి మూవీలో నటించాడనే టాక్ ఉంది. అదే విషయాన్ని అప్పట్లో ప్రసారం అయిన అమృతంలో ఆంజనేయులు చెప్పినట్టుగా షేర్ చేశారు. ఆ వీడియోలో ‘ఆ బాస్ ఎప్పుడు అంతే ఎవరు ఏం చెప్తే అది నమ్మేస్తాడు భోళా శంకరుడు’ అని ఆంజనేయులు చెప్తాడు.
పెళ్లి దుస్తులతో రెడీ అయ్యి, వచ్చిన రిషీతో జగతి ఒక విషయం చెప్పాలని పిలుస్తుంది. ఏంటమ్మా? అని అడిగిన రిషితో ‘నా తరువాత మహేంద్రకు అన్నీ నువ్వే అవ్వాలి’ అని అంటుంది. ‘మహేంద్రకు ఎల్లప్పుడు నువ్వు తోడు ఉండాలి, ఎప్పుడూ వదిలిపెట్టొద్దు. తోడు ఉండాల్సిన సమయంలో ఎప్పుడు తోడుగా లేను.
ఇక ఇప్పుడు ఉంటానో లేదో తెలియదు. మీ నాన్నకి మంచి భార్యను కాలేకపోయాను. కానీ నువ్వు మాత్రం గొప్ప కుమారుడిగా ఉండి, ఆయనను ఆనందంగా చూసుకో’ అని జగతి ఎమోషనల్ అవుతుంది. అప్పుడు రిషి తప్పక కుండా చూసుకుంటానమ్మా అని చెప్తాడు. ఆ తరువాత రిషి, వసుల వివాహం జరుగుతుంది.
ఇద్దరు దేవయాని వాళ్ల దగ్గర ఆశీర్వాదం తీసుకుని, ఆ తరువాత జగతి దగ్గర ఆశీర్వాదం కోసం మోకాళ్ల మీద కూర్చుంటారు. అప్పుడు జగతి రిషీతో ‘ఇక నుండి మెషన్ ఎడ్యుకేషన్ కూడా మీ చేతుల్లోనే పెడుతున్నాను’ అని చెప్తుంది. అది విని షాక్ అయిన దేవయాని, శైలేంద్రలు కోపంతో చూస్తుంటారు. ఆ తరువాత జగతి ఇద్దరి పై అక్షింతలు వేసి, రిషి తల పై చేయి పెట్టి ఆశీర్వాదిస్తూ, అలానే కన్ను మూస్తుంది.







దేవయాని ముంబయిలో 1974లో జూన్ 22న జన్మించింది. ఆమె తండ్రి కర్నాటకలోని మంగళూరుకు చెందిన కొంకణికి చెందినవారు. తల్లి మలయాళీ. ఆమె 1995 లో ‘దిల్ కా డాక్టర్’ అనే మూవీతో కెరీర్ మొదలుపెట్టింది. అయితే అది మధ్యలోనే ఆగిపోయింది. ఆ తరువాత బెంగాలీ మూవీ ‘షాత్ పొంచోమి’ లో నటించింది. ఆమెకు గురింపు రావడంతో వరుస అవకాశాలు వచ్చాయి. అలా ఆమె తమిళం, తెలుగు, కన్నడ , మలయాళం , హిందీ, బెంగాలీ భాషల్లో పలు చిత్రాలలో నటించింది. దేవయాని కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించింది.
సౌత్ ఇండియాలో ఒక ఎపిసోడ్ లో నటించడానికి గాను లక్షరూపాయల అత్యధిక రెమ్యూనరేషన్ పొందిన తొలి సీరియల్ నటి దేవయాని. 30 ఏళ్ల పాటు సక్సెస్ ఫుల్ గా ఇండస్ట్రీలో కొనసాగిన దేవయాని ఆ తరువాత అవకాశాలు తగ్గాయి. దానికి కారణం కోలీవుడ్ ఇండస్ట్రీలో శరత్కుమార్, అజిత్ వంటి హీరోలతో ఎఫైర్ సాగించినట్లు పలు వార్తలు రావడంతో అక్కడ అవకాశాలు రాలేదని టాక్. 2001లో దేవయాని కోలీవుడ్ డైరెక్టర్ రాజ్కుమార్ను ప్రేమించారు. కానీవారి ప్రేమ దేవయాని తల్లిదండ్రులకు ఇష్టంలేకపోవడంతో ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఒక గుడిలో వివాహం చేసుకుందని తెలుస్తోంది.
దీంతో దేవయాని తల్లిదండ్రులు ఆమె అప్పటి దాకా సంపాదించిన మొత్తం నుండి ఏమి ఇవ్వలేదట. ఆమె చేతిలో డబ్బు లేకపోవడం, వివాహం తరువాత సినిమాల్లో అవకాశాలు రాలేదు. దీంతో ఆమె సీరియల్స్ లో నటించడం మొదలుపెట్టారు. రోజుకు లక్ష రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్న నటిగా నిలిచిన దేవయాని జీవితం మళ్లీ దారిలోకి వచ్చింది. ఈ జంటకి ఇనియ, ప్రియాంక అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే అలా సంపాదించిన డబ్బుతో సినిమా నిర్మాణం మొదలుపెట్టింది.
ఆమె భర్త డైరెక్షన్ లో కొన్ని సినిమాలు తీయగా, అవి ప్లాప్ అయ్యి, డబ్బు అంతా పోయి, అప్పుల పాలయ్యారట. వాటిలో కొంత చెల్లించి రుణాల బాధ నుండి నుండి బయటపడ్డారట. ఆ తరువాత దేవయాని యాక్టింగ్ మానేసి, తమిళనాడులోని అన్నాసాలైలో చర్చ్పార్కు కాన్వెంట్ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తున్నారు. ఆమెకు చిన్నప్పటి నుండి టీచర్ కావాలనే కోరిక ఉండేదని, అందుకే తన పిల్లల స్కూల్ లోనే టీచర్ గా చేస్తున్నానని ఆమె చెప్పినట్టుగా తెలుస్తోంది.
తెలుగు ఇండస్ట్రీలో మాస్ కి కేరాఫ్ అడ్రెస్ అంటే బోయపాటి శ్రీను అని అంటారు. బోయపాటి ఇప్పటి దాకా 9 చిత్రాలు మాస్ ప్రేక్షకులను మెప్పించేలా ఉంటాయి. ఇక స్కంద సినిమాను వాటికి మించిన మాస్ తో తెరకెక్కించాడు. ఇక బోయపాటి చిత్రాలలో లాజిక్ లు ఉండవు. హీరో ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నవారి నైన సులభంగా కొట్టగలడు. ఇక స్కందలో అయితే 2 అడుగులు ముందుకేశాడని అంటున్నారు.
ఈ మూవీలోని యాక్షన్ సీన్స్ కి మాస్ ప్రేక్షకులు ఈలలు వేస్తే, సాధారణ ఆడియెన్స్ కు మాత్రం చాలా సిల్లీగా అనిపించాయి. దీంతో సోషల్ మీడియాలో ఈ మూవీని నెటిజెన్లు విపరీతంగా ట్రోల్ చేశారు. రీలిజ్ అయినప్పటి నుండి ఈ మూవీ నెట్టింట్లో ఏదో ఒక విధంగా హల్చల్ చేస్తూనే ఉంది. స్కంద లాంటి మాస్ సినిమాకు, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి క్లాస్ సినిమాకు కామన్ పాయింట్ ఉంది.
తాజాగా కోతిమీర.కట్ట అనే ఇన్ స్టా ఖాతాలో స్కంద మూవీలోని రామ్, శ్రీలీల, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలోని వెంకటేష్, మహేష్ బాబు ఫోటోలను షేర్ చేస్తూ, ‘కాస్త వీళ్ళ పేర్లు ఏంటో చెప్పండయ్యా’ అంటూ పోస్ట్ చేశారు. ఆ మూవీలో వెంకటేష్, మహేష్ బాబును పెద్దోడు, చిన్నోడు అని పిలుస్తారు. ఇక స్కంద మూవీలో రామ్ ని సీఎం అల్లుడు, శ్రీలీల సీఎం కూతురు, యావరేజ్ అని పిలిచినట్టు తెలుస్తోంది. రెండు సినిమాలలో మెయిన్ క్యారెక్టర్లకు పేర్లు లేవు. ఇక ఈ పోస్ట్ పై నెటిజెన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.



















పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నారికి తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోల రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె స్టార్ హీరోయిన్గా ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలలో నటించింది. తెలుగులోనే కాకుండా తమిళ ఇండస్ట్రీలోనూ వైవిధ్యభరితమైన చిత్రాలలో అక్కడ కూడా స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్