ఇటీవల రిలీజ్ అయిన ‘బేబీ’ సినిమా భారీ వసూళ్లను సంపాదించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా కీలకమైనది.
బస్తీ నుంచి వెళ్లిన హీరోయిన్ రిచ్ లైఫ్, మందు, డ్ర-గ్స్కి అలవాటు జీవితంలో ఏం కోల్పోతుందో అనే విషయాన్ని ఈ సినిమాలో తెలియజేశారు.

అయితే ఈ సినిమాలో కొన్ని సీన్స్ డ్ర-గ్స్ తీసుకోమని ప్రోత్సహించేలా ఉన్నాయని సీపీ సీవీ ఆనంద్ అన్నారు. అయితే బేబీ టీమ్కు సీపీ ఆఫీస్ నుంచి కాల్ వచ్చిందని డైరక్టర్ సాయి రాజేష్ తెలిపారు. కొన్ని డ్ర-గ్స్ సీన్స్ తొలగించాలని లేదా బ్లర్ చేయమని సీపీ ఆఫీస్ వాళ్లు తెలిపారని డైరక్టర్ అన్నారు.

కానీ ఇప్పుడు ఆ సీన్స్ తొలగించలేమని సాయి రాజేష్ అన్నారు. డ్ర-గ్స్ తీసుకోమని సినిమా తీయలేదు. డ్ర-గ్స్ తీసుకుని.. జీవితం పాడుచేసుకోవద్దని ఈ సినిమా తీశామని డైరక్టర్ తెలిపారు. కానీ ఈ సినిమాలో డ్ర-గ్స్ ఏ విధంగా వాడాలో అని సీన్స్ ఉన్నాయని.. ఇలాంటి సీన్లు ఇకపై ఎవరూ కూడా తీయద్దని సినిమా రంగానికి సీవీ ఆనంద్ కోరారు.

ఇంక సినిమా విషయానికి వస్తే, ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయ్యి చాలా మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది. సినిమా రిలీజ్ కి ముందే రిలీజ్ అయిన పాటలు ఆల్రెడీ అప్పటికే చాలా పెద్ద హిట్ అయ్యాయి. దాంతో సినిమా మీద అంచనాలు బాగా పెరిగాయి. ఎమోషనల్ సీన్స్ చాలా బాగా చూపించారు అని దర్శకుడిని అందరూ మెచ్చుకున్నారు.

తెలిసి తెలియక యువత చేసే కొన్ని తప్పుల గురించి, వాటి వల్ల వాళ్లు ఎదుర్కొనే సంఘటనల గురించి ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమాపై విమర్శలు వచ్చినా కానీ అంతకంటే ఎక్కువగా కలెక్షన్స్ కూడా వచ్చాయి. ఎంతోమంది విమర్శకులు ఈ సినిమాని ప్రశంసించారు. హీరో హీరోయిన్ అంటే కేవలం మంచి పనులు మాత్రమే చేస్తారు అని కాకుండా వారు కూడా తప్పులు చేస్తారు అని చూపించిన సినిమాలు చాలా తక్కువ. ఈ సినిమా కూడా అలాంటిదే అని అన్నారు. రియాలిటీ కి చాలా దగ్గరగా ఉంది అని అందరూ అన్నారు.

మెగా కోడలు ఆనే ట్యాగ్ బరువైన బాధ్యతతో కూడినది అని చెప్పవచ్చు. ఆమె ఏం చేసిన మెగాఫ్యాన్స్ ను దృష్టిలో ఉంచుకుని చేయాల్సి ఉంటుంది. అందువల్ల కాబోయే మెగా కోడలు లావణ్యాత్రిపాఠి తన కెరీర్ విషయంలో జాగ్రత్తగా, అడుగులేస్తున్నారు. నిశ్చితార్థం తరువాత లావణ్య సినిమాలు చేయడం తగ్గించుకున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ లో ఒక మూవీ తప్ప ప్రస్తుతం ఆమె చేతిలో సినిమాలు లేవు. అయితే గతంలో ఒక స్టోరీ నచ్చడంతో ఒక వెబ్ సిరీస్ కి లావణ్య ఓకే చెప్పారట. ‘స్కైలాబ్’ మూవీ డైరెక్టర్ విశ్వక్ ఖండేరావ్ ఆ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ వెబ్ సిరీస్ లో హీరోయిన్ పాత్ర బోల్డ్గా ఉంటుందని, ఇంటిమేట్ సీన్స్ కూడా చేయాల్సి ఉంటుందట. దాంతో లావణ్య ఆ వెబ్సిరీస్ మేకర్స్ కి తాను ఆ పాత్ర చేయలేనని, వేరే హీరోయిన్ ను చూసుకోమని చెప్పిందంట. నిశ్చితార్థం తర్వాత మెగా ఫ్యామిలీ కోడల్ని. ఇలాంటి వాటిలో నటించడం సరి కాదని అన్నారట. ఈ క్రమంలోనే సెలెక్టివ్గా కొన్ని మూవీ ఆఫర్లను కూడా రిజెక్ట్ చేసిందని వార్తలు వస్తున్నాయి.
కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మెగా ఫ్యామిలీ సమక్షంలో జూన్లో నిశ్చితార్థం చేసుకున్నారు. అధికారికంగా పెళ్లి ఎక్కడ అనేది అనౌన్స్ చేయకపోయినా, నవంబర్లో ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ జరుగబోతుందని ప్రచారాలు వినిపిస్తున్నాయి. వెడ్డింగ్ తరువాత హైదరాబాద్లో గ్రాండ్ గా రిసెప్షన్ ఉంటుందని టాక్.
గద్వాలకు చెందిన శివ సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యాడు. శివ పాడే సాంగ్స్ కొద్ది రోజులుగా ఇన్ స్టాగ్రామ్ రీల్స్, మీమ్స్, ట్రోల్స్ లో హల్చల్ చేస్తున్నాయి. అతని పాటలను నెటిజెన్లు విపరీతంగా ట్రోల్స్ చేశారు. అలా శివ బాగా పాపులర్ అయ్యాడు. ఆ వ్యక్తిని శ్రీదేవీ డ్రామా కంపెనీ లేటస్ట్ ఎపిసోడ్ కు తీసుకువచ్చారని ప్రోమో ద్వారా తెలుస్తోంది.
అయితే శివతో వేదిక పైన పాట పాడించారు. అతని ప్రతిభను గుర్తించి, అవకాశం ఇచ్చారనుకోవచ్చు. కానీ శివ పాట పాడుతుంటే, ఇంద్రజ, హీరోయిన్ రేఖ, శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోగ్రామ్ లోని మిగతా వారంత పగలబడి మరి నవ్వారు. ఈ ప్రోమో చూసిన నెటిజెన్లు అతన్ని ఈ ప్రోగ్రామ్ కు తీసుకువచ్చి మరీ పరువు తీయడం ఏంటని కామెంట్స్ చేస్తున్నారు.
ఇప్పటివరకు సోషల్ మీడియాలోను వారు మాత్రమే ట్రోల్ చేశారు. ఇక ఇప్పుడు టెలివిజన్ ఆడియెన్స్ ముందుకు తీసుకువచ్చి పరువు తీసేస్తున్నారని అంటున్నారు. పాడుతుంటే అంతగా నవ్విన ఇంద్రజ ఆ తరువాత ‘నీలో పాడగలను అనే ధైర్యం ఉంది. అందుకే ఇక్కడకు దాకా వచ్చావు, అని మాట్లాడింది. కానీ నవ్వే వారిని మాత్రం ఆపలేదని ప్రోమో చూసిన వారు కామెంట్స్ చేస్తున్నారు.



స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబును అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు కక్షపూరితంగా మాజీ సీఎం చంద్రబాబును అరెస్ట్ చేశారని కామెంట్లు చేశారు. నందమూరి కుంటుంబం కూడా చందబాబు అరెస్ట్ ను ఖండించింది. తాజాగా నటి పూనమ్ కౌర్ చంద్రబాబుకు అనుకూలంగా ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.
పూనమ్ కౌర్ “మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుగారు ప్రజల కోసం చాలా సేవ చేశారని, వారి కొరకు అన్నీ త్యాగం చేసిన గొప్ప మనిషి అని, అలాంటి చంద్రబాబు నాయుడిని 73 ఏళ్ల వయస్సులో జైలుకు పంపించడం, బాధ పెట్టడం సరికాదని చెప్పుకొచ్చారు. చంద్రబాబునాయుడు సార్ ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకోవాలని మానవతా దృక్పథంతో విజ్ఞప్తి చేస్తున్నాను.” అని ట్వీట్ లో రాసుకొచ్చారు.
పూనమ్ ట్వీట్ నెట్టింట్లో వైరల్ గా మారడంతో నెటిజన్లు ఈ ట్వీట్ పై కామెంట్స్ చేస్తున్నారు. కొందరు పాజిటివ్ గా కామెంట్స్ చేస్తుండగా, కొందరు నెటిజన్లు నెగిటివ్ గా కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు సటైర్స్ వేస్తున్నారు. పూనమ్ కౌర్ ఫ్యాన్స్ మాత్రం వివాదాల్లో ఇరుక్కోవద్దని సలహాలు ఇస్తున్నారు. ఈ ట్వీట్ నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది.


రజినీకాంత్ , రమ్యకృష్ణ, తమన్నా, వసంత్ రవి, సునీల్ నటించిన జైలర్ మూవీలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ మెగాస్టార్ శివరాజ్ కుమార్, బాలీవుడ్ యాక్టర్ జాకీష్రాఫ్ అతిథి పాత్రలలో నటించారు. ఈ మూవీ తమిళ, తెలుగు బాషలలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తెలుగులో మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి, లాభాలను కురిపించింది. చాలా కాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్న, సూపర్ స్టార్ రజినీకాంత్ కు, నెలన్స్ దిలీప్ కుమర్ కు ఈ మూవీ ఊహించని విజయాన్ని ఇచ్చింది.
థియేటర్లలో బ్లాక్ బస్టర్ అయిన జైలర్ మూవీ రీసెంట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చింది. అక్కడ కూడా రికార్డ్స్ క్రియట్ చేస్తోంది. అయితే ఓటీటీ లో పలుమార్లు ఈ మూవీని చూసిన నెటిజెన్లు ఈ చిత్రంలోని మిస్టేక్స్ ను గమనించారు. వాటిని సోషల్ మీడియాలో మీమ్స్ రూపంలో షేర్ చేస్తున్నారు. మూవీ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో రజినీకాంత్ జైలర్ గా ఉంటాడు. ఆ సమయంలో ఒక ఖైదీ నేను ఏపీ నుండి వచ్చా, ఒక ఫోన్ కొడ్తే చాలు నీ అంతు చూస్తారని రజినీకాంత్ తో అంటాడు.
నాకు చాలా పెద్ద కాంటాక్స్ ఉన్నాయని అంటాడు. దాంతో రజినికాంత్ ఫోన్ ఇచ్చి, కాల్ చేయమని చెప్తాడు. అప్పుడు ఆ ఖైదీ తన మనుషులకి కాల్ చేసాడు. కానీ హీరో వారి కారులో బాంబు పెట్టి పేల్చేస్తాడు. ఆ విషయం తెలిసి ఆ ఖైదీ షాక్ అవుతాడు. అయితే ఖైదీకి ఇచ్చిన ఫోన్ ని తిరిగి తీసుకోడు. మరో సీన్ లో విలన్ పంపించిన రౌడీలు రజినీకాంత్ ఫ్యామిలి పై దాడి చేయడానికి వస్తారు. అప్పుడు రజినీకాంత్ మనవడిని ఒకదగ్గర దాచిపెడతాడు. కానీ అక్కడి నుండి తీసుకొచ్చినట్టు చూపించరు. ఇలా మర్చిపోతే ఎలా రజినీకాంత్ గారు అంటూ నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.




అప్పట్లోనే దాదాపు 45 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసిన ఈ చిత్రం మెగా అభిమానులకు ఎప్పుడు గుర్తుంది పోతుంది. ఈ మూవీలో తమన్నా చిన్నప్పటి క్యారెక్టర్ చేసిన విషికా ఇప్పుడు హీరోయిన్ గా మారిపోయింది.
