వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ తరువాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన మూవీ భోళాశంకర్. ఈ చిత్రానికి మెహర్ రమేశ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్గా నటించగా, కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలిగా కనిపించింది. యంగ్ హీరో సుశాంత్ కీలక పాత్రలో నటించాడు.
భారీ అంచనాల మధ్య ఆగస్టు 11న రిలీజ్ అయిన భోళాశంకర్ మూవీ ప్రేక్షకులను మాత్రమే కాకుండా ఫ్యాన్స్ కూడా తీవ్రంగా నిరాశపరిచింది. తొలి షోకే నెగెటివ్ టాక్ తెచ్చుకుని, బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. కోరాలో ఈ మూవీ గురించి అభిప్రాయం అడుగగా, ఒక యూజర్ ఎలా స్పందించాడో ఇప్పుడు చూద్దాం..
“భోళా శంకర్ సినిమా గురించి మీ అభిప్రాయం ఏమిటి?” అని కోరాలో అడుగగా, దానికి సంతోష్ కుమార్. కె అనే యూజర్ సమాధానం ఇస్తూ, “వాపు చూసి బలుపు అనుకోకూడదు. మంచి పనయింది చిరంజీవి గార్కి, తెలుగు ప్రేక్షకులకి లేదంటే ఇంకెన్నెన్ని మేకులు దించేసే వారు. చిరంజీవి అంటే ఓ బ్రాండ్ ఉండేది. అది చిరంజీవి గారే స్వయంగా చెడగొట్టుకుంటున్నారు. వాల్తేర్ వీరయ్య విజయానికి చాలా కారణాలు ఉన్నాయి. కథ, కథనం ముఖ్యంగా సంగీతం ఇలాంటివి.
ఎప్పుడో ఎన్టీఆర్, ఎన్ ఆర్ లు యంగ్ హీరోయిన్లతో తైతక్కలాడితే అప్పట్లో కొత్త, ఇంకా వేరే దిక్కులేక చూసారు. మనవరాళ్ల వయసు వారితో అది ఇంత మంది యంగ్ స్టర్స్ ఉండగా, ఆ వెకిలి డాన్సులు చేస్తే సీనియర్ అభిమానులమైన మాకే వెగటు పుట్టేస్తుంది. ఇక ఆ వేదాలమే రొడ్డ సినిమా. మళ్ళీ దాన్ని 8 ఏళ్ల తరువాత మ్యూజియం లో నుండి బయటకు తీసి, కళా తపస్వి , కళా సృష్టి కర్త అయిన మెహర్ రమేష్ లాంటి దర్శక దిగ్గజానికి ఇచ్చి తెలుగు ప్రేక్షకుల పైకి వదలడం ఏమి న్యాయమో చిరంజీవి గారు ఆలోచించాలి.
నిజంగా రీమేక్ లు ఇష్టమయితే చిరంజీవి గారి పాత సినిమాలే రీమేక్ చేస్తే బెస్ట్ ఎందుకంటే అవి ఎవర్ గ్రీన్ సబ్జెక్స్. ఇంత ఫ్రస్ట్రేషన్ చూపించిన నేను సినిమా చూసానా అంటే లేదు. ఆ ట్రైలర్ చూస్తేనే తెలిసిపోయింది. ఎంత పొడవాటి బాకు ప్రేక్షకుల హృదయాలను తాక బోతున్నాయో అని. వృద్దాప్యాన్ని హుందాగా అంగీకరించి, కళా తృష్ణ తీర్చుకునే సినిమాలు చేస్తే మంచిది. కాదు ఇంకా మేము ఇరవైల్లోనే ఉన్నాం అనుకుంటే” అంటూ రాసుకొచ్చారు.
Also Read: “బ్రో” మూవీ గురించి… ఈ నెటిజెన్ పోస్ట్ చూస్తే నవ్వాపుకోలేరు..!






యంగ్ హీరో నాగ చైతన్య , తమన్నా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. సుకుమార్ దర్శకత్వం వహించగా, బన్నీవాసు నిర్మించారు. 2011 లో రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ మూవీలోనీ ఐటమ్ సాంగ్ లో నటించిన నటి పేరు మరియం జకారియా. ఈమె ఇరానియన్-స్వీడిష్ నటి. మరియం బాలీవుడ్, తెలుగు, తమిళ సినిమాలలో నటించింది.
మరియం స్వీడన్లో మోడల్గా, డ్యాన్స్ టీచర్గా మరియు కొరియోగ్రాఫర్గా పనిచేశారు. అలాగే స్వీడన్లో ఇండిస్క్ డాన్స్ స్టూడియోను స్థాపించారు. ఆమె బాలీవుడ్ సినిమాలలో నటించడం కోసం 2009లో ముంబైలో అడుగుపెట్టారు. ఆ తరువాత పలు యాడ్స్ లో నటించారు. కోకోకోలా యాడ్ లో ఇమ్రాన్ ఖాన్ తో కలిసి నటించారు. తమిళ దర్శకుడు సుందర్ సి. ఆమె డ్యాన్స్ ను యూట్యూబ్లో చూసి తన మూవీ నగరం (2010)లో ఐటెమ్ సాంగ్ లో ఛాన్స్ ఇచ్చారు.
ఆ తరువాత 100% లవ్ మూవీలో ఆఫర్ రావడంతో “డియ్యాలో డియ్యాలా”లో చేసింది. దాంతో ఆమెకు గుర్తింపు వచ్చింది. ఆ తరువాత అల్లరి నరేష్తో మడత కాజాలో ఒక ప్రధాన పాత్రలో నటించింది. ఆ తరువాత బాలీవుడ్ లో వచ్చిన గ్రాండ్ మస్తి మూవీతో సూపర్ హిట్ ను అందుకున్నారు. ఆమెను ఇన్ స్టాగ్రామ్ లో మిలియన్ మెంబర్స్ ఫాలో అవుతున్నారు. తన డ్యాన్స్ వీడియోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది.
షారుక్ ఖాన్, నయనతార తొలిసారిగా జంటగా నటించిన జవాన్ మూవీ బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అయ్యిందని అంటున్నారు. నార్త్ ఆడియెన్స్ అయితే అట్లీ మేకింగ్, షారుక్ అద్భుతమైన నటనకు ఫిదా అయ్యారు. మొదటిరోజే వరల్డ్ వైడ్ గా రూ.150 కోట్ల వసూళ్లు రాబట్టి పఠాన్ రికార్డ్ ను బ్రేక్ చేశాడు. ఈ సినిమా పై ఆడియెన్స్ తో పాటు పలువురు సినీ సెలబ్రెటీలు బెస్ట్ మూవీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో షారుక్ ఫ్యాన్స్ సంతోషానికి అవధు లేకుండా పోయాయి.
అయితే ఈ మూవీకి అంత రెస్పాన్స్ సౌత్ నుండి రావడం లేదని చెప్పవచ్చు. దానికి కారణం ఇలాంటి సినిమాలను ఇప్పటివరకు దక్షిణాది ఆడియెన్స్ ఎన్నో చూశారు. దాంతో వారికి నాలుగు అయిదు సినిమాలను కలిపి తీసినట్టుగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. కానీ బాలీవుడ్ ఆడియెన్స్ కి మాత్రం ఇది సరికొత్తగా ఉంది. అట్లీ మాస్ స్టైల్ టేకింగ్ లో షారుక్ ను సరికొత్తగా చూపించడంతో ఫ్యాన్స్ థ్రిల్ ఫిల్ అవుతున్నారు.
ఈ మూవీ పఠాన్ లాగే వెయ్యి కోట్ల వసూళ్లను సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే కొందరు ఈ మూవీని తెలుగులో హిట్ అయిన బుల్లితెర సీరియల్ ‘మొగలిరేకులు’ తో పోలుస్తున్నారు. ఆ సీరియల్ నుండి కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కాపీ, చేసారని కామెంట్లు పెడుతున్నారు.
మహాలక్ష్మి, రవీందర్ చంద్రశేఖరన్ను పెళ్లి చేసుకోవడంతో ఆమె అతని డబ్బు కోసమే అని విమర్శించారు. ఆ తరువాత వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు వినిపించాయి. అయితే మహాలక్ష్మీ దంపతులు సోషల్ మీడియా ద్వారా తమ అందమైన ఫొటోలను షేర్ చేస్తూ, విడాకుల రూమర్లకు చెక్ పెట్టారు. ఆ మధ్యన మహాలక్ష్మి రవీందర్ బర్త్ డేను ఘనంగా సెలబ్రేట్ చేసింది.
ఇది ఇలా ఉంటే తాజాగా రవీందర్ చిక్కుల్లో పడ్డాడు. ఒక వ్యాపారవేత్తను మోసం చేశారని, సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ నిర్మాత రవీందర్ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కోలీవుడ్ లో ఈ వార్త సంచలనంగా మారింది. సాలిడ్ వెస్ట్ నుంచి కరెంట్ ను ఉత్పత్తి చేసే ప్లాంట్ పెట్టడం ద్వారా చాలా లాభాలు వస్తాయని రవీందర్ చెన్నై వ్యాపారవేత్త అయిన బాలాజీని నమ్మించాడట. సదరు ప్లాంట్ కోసం డూప్లికేట్ పేపర్స్ ను క్రియేట్ చేసి, బాలాజీని నమ్మించి అందులో పార్ట్నర్ గా చేశాడు. దానికి గాను బాలాజీ నుండి దాదాపు పదహారు కోట్లు తీసుకున్నారని, రవీందర్ పై ఆరోపణలు వచ్చాయి.
ఈ ఒప్పందం తర్వాత రవీందర్ చెప్పినట్లుగా ఏ పని జరగలేదని, బాలాజీ డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగినా, ఎలాంటి స్పందన రవీందర్ నుండి రాలేదట. దాంతో బాలాజీ రవీందర్ పై చర్యలు తీసుకోవాలని చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ లో కంప్లైంట్ ఇచ్చాడు. దాంతో పోలీసులు నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ అరెస్ట్ చేశారు.
బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన రతిక రోస్ అచ్చమైన తెలుగమ్మాయి. తెలంగాణలోని వికారాబాద్ జిల్లాకు చెందిన అమ్మాయి. నటన పై ఆసక్తితో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. కానీ సినిమాలలో అవకాశాల కోసం అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. చాలా చిత్రాలలో చిన్న చిన్న పాత్రలలో నటించింది. కానీ ఆమె అనుకున్న విధంగా లీడ్ రోల్స్ మాత్రం రాలేదు.
రతిక రోస్ 2016లో మొదట స్టాండప్ కమెడియన్ కెరీర్ ను ప్రారంభించింది. అడపాదడపా సినిమాలలో నటిస్తున్నప్పటికి చెప్పుకోదగ్గ క్యారెక్టర్లలో నటించలేదు. బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది అనే మూవీలో ఒక పాత్రను చేసింది. బెల్లంకొండ గణేష్ హీరోగా వచ్చిన ‘నేను స్టూడెంట్ సర్’ మూవీలో పోలీసాఫీసర్గా నటించింది. ఈ పాత్రతో ఆమెకు గుర్తింపు వచ్చింది. ఇక ఇప్పుడు బిగ్ బాస్ లో అడుగుపెట్టింది. ఆ టైమ్ లో ఆమె తనను ప్రియగా పరిచయం చేసుకుంది. ఈటీవీలో ప్రసారం అయిన పటాస్ ఎలాంటి విజయం అందుకుందో తెలిసిందే. ఈ షోలో కామెడియన్స్ కి సినిమాలలో అవకాశాలు వచ్చాయి.
అలా ప్రియ తన స్టాండప్ కామెడీతో ఆడియెన్స్ ని నవ్వించి, పాపులర్ అయ్యింది. ఆ తర్వాత గ్యాప్ తీసుకుని మోడలింగ్ వైపు వెళ్ళింది. అలా ఈ తెలుగు అమ్మాయికి టాలీవుడ్ లో కాకుండా కోలీవుడ్ లో హీరోయిన్గా ఛాన్స్ వచ్చింది. ఆ తరువాత మరో మూవీ చేసింది. కానీ ఆ మూవీ రిలీజ్ కు ముందే ఆగిపోయింది.






షారుక్ ఖాన్ మొదటిసారి సౌత్ దర్శకుడి సినిమాలో హీరోగా నటిస్తుండడం, అది కూడా వరుస హిట్లతో దూసుకెళ్తున్న అట్లీ వంటి దర్శకుడితో కావడంతో ఈ మూవీ ప్రకటించినప్పటి నుండే జవాన్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అట్లీ చిత్రాలు ఎలా ఉంటాయో దక్షణాది ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కథ రొటీన్ అయినా కొంచెం కొత్తగా, మాస్ పల్స్ తో స్టైలిష్గా చూపిస్తుంటాడు. ఈ విషయంలో అట్లీ ఆరితేరిపోయాడని ఆయన తీసిన సినిమాలే చెప్తాయి.
అలా అట్లీ తన స్టైల్లో, అలవాటైన ఎలివేషన్స్, ఎమోషనల్ సన్నివేశాలతో షారుఖ్ ఖాన్ను సరికొత్తగా చూపించాడు. అదే నార్త్ ప్రేక్షకులకు చాలా నచ్చింది. బాలీవుడ్లో ఈ మూవీకి 3, 4, నాలుగున్నర రేటింగ్స్ వచ్చాయి. అయితే తెలుగులో యావరేజ్, తమిళంలో నార్మల్ టాక్ రాగా, బాలీవుడ్లో బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఈ మూవీ పై మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అవి ఏమిటో మీరు చూసేయండి.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.







